HYD: సురవరం ప్రతాపరెడ్డి HYD తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం, భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస ఫణీంద్ర ‘శ్రీ పరాభవ నామ సంవత్సరం’ పంచాంగాన్ని సభలో ప్రవచించారు. ఈ కార్యక్రమంలో వీసీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు పాల్గొన్నారు.