రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఈ ఫ్రాంచైజీ అమ్మకం ప్రక్రియలో రూ.16,000 కోట్ల(1.7 బిలియన్ డాలర్లు)తో వచ్చిన భారీ బిడ్ను ఆ జట్టు యాజమాన్యం తిరస్కరించింది. ఇంత పెద్ద మొత్తాన్ని కాదనుకోవడంపై క్రీడా నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఎక్కువ నిధులు ఆశించి రాజస్థాన్ రిస్క్ చేస్తోందని వారు విశ్లేషిస్తున్నారు.