TG: కామారెడ్డి జిల్లా ఘన్పూర్లో కవలలు కీర్తన, కీర్తిలను వివాహం చేసుకున్న కవల సోదరులు విజయ్, వినయ్ల కుటుంబంలో విషాదం నెలకొంది. ఉగాది రోజు వినయ్ మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ట్విన్స్ డే’ రోజున జరిగిన ఈ వివాహం, ఇంతలోనే విషాదాంతం కావడం స్థానికులను కలచివేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.