దర్శకుడు జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అక్కడ మోహన్ లాల్కు ఉన్న భారీ మార్కెట్ దెబ్బతినకుండా ఉండేందుకే ఈ వాయిదా అని టాక్.