బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ ప్రచారం నేపథ్యంలో నటి సమంత ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఓ ఈవెంట్లో రాజ్, సామ్ క్లోజ్గా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ‘గత ఏడాదిన్నరగా కొన్ని బోల్డ్ డెసిషన్లు తీసుకున్నాను’ అని ఆమె పోస్ట్లో రాసింది. దీంతో రాజ్తో తన బంధాన్ని ఆమె బహిరంగంగా ప్రకటించింది అంటూ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘RT76′ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పేరును ఈ సినిమాకు ఖరారు చేసినట్లు సమాచారం. ఈనెల 10న మేకర్స్ అధికారికంగా సినిమా టైటిల్ ప్రకటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
రష్మిక, రక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. ఈ చిత్రం ఇవాళ థియెటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం కేక్ కట్ చేసి సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని మరోసారి రుజువుచేశారని తెలిపాడు.
56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)కి నామినేట్ అయిన వారి జాబితా తాజాగా విడుదలైంది. ఉత్తమ పరిచయ దర్శకుడు విభాగంలో టాలీవుడ్ దర్శకుడు వంశీ నామినేట్ అయ్యాడు. ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాగానూ ఆయన ఎంపికయ్యాడు. అలాగే ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎంపికైంది. ఇక గోవా వేదికగా NOV 20-28 వరకు ఈ వేడుక జరగనుంది.
నటుడు తిరువీర్ నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ ఇవాళ విడుదలైంది. ఆనంద్ అనే యువకుడి ప్రీ వెడ్డింగ్ షూట్ను ఫొటోగ్రాఫర్ రమేష్(తిరువీర్) తీస్తాడు. అయితే ఆ షూట్ మెమొరీ కార్డు పోతుంది. ఈ సమస్య నుంచి రమేష్ ఎలా గట్టెక్కాడు? అనేది దీని కథ. తిరువీర్ నటన, కామెడీ, కథ, కథనం మూవీకి ప్లస్. అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్స్ మైనస్. రేటింగ్: 3/5.
నటీనటులు జయ సూర్య, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘కథనార్’. ఇవాళ అనుష్క బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెప్పారు. ఈ మూవీలో అనుష్క నీల పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ SMలో వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నాడు.
తన జీవితమంతా పాటలమయమని మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అన్నాడు. పాటల్లో జీవం, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని.. తన పాటలు ప్రేక్షకుల హృదయాన్ని తాకుతాయని తెలిపాడు. అయితే ప్రస్తుత కాలంలో వస్తోన్న పాటలు ఎందుకొస్తున్నాయో తెలియట్లేదని చెప్పాడు. మేల్ సింగర్, ఫిమేల్ సింగర్లకు ఒకరు పడింది మరొకరికి తెలియడం లేదని, దర్శకుడికి అసలు ఏం పాట వస్తుందో కూడా తెలియట్లేదని పేర్కొన్నాడు.
నటి రష్మిక మందన్న ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘నీకేం తెలుసు అని అణచివేయబడి.. ఇప్పుడు తనకేం కావాలో తెలిసిన స్త్రీగా ఎదిగిన ప్రతి అమ్మాయికి ఈ ప్రేమలేఖ. నువ్వు ఎంతో దూరం వచ్చావ్.. నిన్ను నువ్వు ప్రేమించు.. నిన్ను చూసి నువ్వు గర్వపడు. ప్రేమ అంటే హద్దులు గీసుకుని బంధీ అవ్వడం కాదు.. స్వేచ్ఛగా జీవించడం.. ఎన్ని గాయాలైనా సరే.. ధైర్యంగా ముందుకు సాగడం’ అని పేర్కొంది.
మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళిల ‘SSMB 29’ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో నటిస్తోన్న పృథీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రాజమౌళి రిలీజ్ చేశాడు. ఆయన అత్యంత శక్తివంతమైన ‘కుంభ’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపాడు. ‘పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరణ చేశాక నేను ఆయన దగ్గరికెళ్లి.. మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో ఒకరని చెప్పాను’ అని పేర్కొన్నాడు.
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఇవాళ తన 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ‘కళాధుర కన్నమ్మ'(1960) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఇప్పటివరకు 230కిపైగా సినిమాలు చేశారు. నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, సింగర్గా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని స్థాపించారు.
మలయాళ స్టార్ మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ అరుదైన ఘనత సాధించింది. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)కి ఎంపికైంది. ఇండియన్ పనోరమా విభాగంలో ఇది ఎంపికైనట్లు మోహన్ లాల్ పోస్ట్ పెట్టాడు. ‘ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా, గౌరవంగా ఉంది. ఇంత గొప్ప గుర్తింపు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపాడు. ఇక గోవా వేదికగా NOV 20-28 వరకు ఈ వేడుక జరగనుంది.
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. పండంటి మగబిడ్డకు కత్రినా జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విక్కీ కౌశల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో సినీ ప్రముఖులు, నెటిజన్లు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, విక్కీ, కత్రినా 2021లో పెళ్లి చేసుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘బ్రో: ది అవతార్’. తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమా గతంలో రిలీజై పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమా సీక్వెల్పై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బ్రో 2’ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందన్నాడు. పవన్ ఎప్పుడు ఒకే అంటే.. అప్పుడే ఇది సెట్స్ మీదకు వెళ్తుందని తెలిపాడు.
స్టార్ హీరో విజయ్ దళపతితో తనకు శత్రుత్వం ఉందని వస్తోన్న వార్తలపై అజిత్ స్పందించాడు. వాటిలో ఎలాంటి నిజం లేదన్నాడు. తామిద్దరి మధ్య కావాలని అపోహలు సృష్టిస్తున్నారని, దాని వల్ల అభిమానులు గొడవపడుతున్నారని చెప్పాడు. తాను ఎప్పుడూ విజయ్కి మంచి జరగాలని కోరుకుంటూనే ఉంటానని తెలిపాడు. అందువల్ల ఇలాంటి వార్తలు సృష్టించేవారు మౌనంగా ఉంటే బాగుంటుందన్నాడు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ చేయనున్నాడట. ఇప్పటికే బన్నీకి దర్శకుడు కథను వినిపించగా.. ఆయన ఇంట్రెస్ట్ చూపించినట్లు సమాచారం. అయితే ‘పుష్ప 2’ సమయంలోనే వీరిద్దరి మధ్య కథ చర్చలు జరిగినట్లు, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు టాక్. ఇది సెట్స్ మీదకు వెళ్లేందుకు రెండేళ్ల టైం పడుతుందట.