యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘రాకాస’. అయితే ఈ సినిమా టీజర్ రాకముందే ఈ సినిమా తాలూకా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేవలం ఓటీటీ హక్కులు గానే ఈ సినిమాకి 10 నుంచి 11 కోట్ల మధ్య డీల్ లాక్ అయ్యిందట. ఇక మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 4న విడుదల […]
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ రోల్ కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ కొంతకాలం క్రితం ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. జూన్ 20న విడుదలైన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ పార్ట్నర్ లాక్ అయింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను సోనీ లీవ్ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. RS ప్రసన్న దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.
T20WC ఫైనల్లో భారత్ విజయంపై ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను మ్యాచ్ చూడకపోతే భారత్ గెలుస్తుందని ముందే చెప్పాను.. అలాగే జరిగింది. నేను లైవ్లో మ్యాచ్ చూస్తే టీమ్ ఇండియాకు అదృష్టం కలిసిరాదనే ఒక సెంటిమెంట్ నాకు ఉంది. అదే కారణంగా ఈ ఫైనల్ మ్యాచ్ను కూడా తాను చూడలేదు’ అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుండగా.. డబ్బింగ్పై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన డైలాగ్లు ఎక్కువగా ఉన్నాయట. అవి అద్భుతంగా ఉన్నట్లు, దానివల్ల ప్రతి డైలాగ్ అద్భుతంగా రావాలి అనే తపనతో డబ్బింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించి చెబుతున్నట్లు సమాచారం.
హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తనపై వస్తున్న ట్రోల్స్పై స్పందించింది. ‘SMలో ట్రోల్స్ అనేది చాలా పెద్ద పదం. గతం గురించి ఆలోచించడం నాకు ఇష్టం లేదు. కానీ, ఇది సినీ ఇండస్ట్రీ. ఇక్కడ ఎవరికైనా ఏదైనా జరగొచ్చు. నేను దాని నుంచే చాలా నేర్చుకున్నాను. సహజంగానే ట్రోల్స్ బాధించినా ఎదగడానికి తోడ్పడతాయి. నేను ఇలాంటి ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకుంటాను’ అని వెల్లడించింది.
TG ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో నటుడు శివాజీకి ‘దండోర’ చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఈ చిత్రంలోని నా నటనకు గద్దర్ అవార్డు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ సినిమా కోసం నాకన్నా దర్శకుడు మురళీకాంత్ చాలా ఎక్కువ కష్టపడ్డాడు. నా అవార్డు అతనికి ఇస్తే నేను ఇంకా సంతోషిస్తాను’ అని చెప్పుకొచ్చాడు.
యంగ్ బ్యూటీ రితికా నాయక్ తన మనసులో మాటను బయటపెట్టింది. ‘అల్లు అర్జున్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అతిపెద్ద కల. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే నేను అస్సలు వదులుకోను. ఆ అవకాశం వస్తే అది చిన్న పాత్ర అయినా సరే, చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ అంటే తనకు అంత ఇష్టమని, ఆయన ఎనర్జీ, డ్యాన్స్ అంటే పడిచస్తానని తెలిపింది.
బాలీవుడ్ నటి సారా అర్జున్ ‘నో టాక్సిటీ.. ఓన్లీ ధురంధర్’ అని పెట్టిన పోస్టుకు నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడటంతో సారా ఇలా పోస్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ సారా అర్జున్కు ‘X’లో ఖాతానే లేదని, ఎవరో అభిమాని క్రియేట్ చేసిన ఖాతా అని ఆమె తండ్రి స్పష్టం చేశాడు.
పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ ఆల్బమ్ తరహా ఐటెం సాంగ్ ఉంటుందని చాలా మంది ఆశిస్తున్నారు. కానీ అలాంటివి ఏమీ లేవని హరీష్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక ఐటెం గర్ల్ వెనకాల పడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని చూపించలేను అని ఇప్పుడు తనకి ఉన్న హోదా దృష్ట్యా అలాంటివి చేయడం సబబు కాదని చెప్పినట్లు సమాచారం.
యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆల్ఫ’. అయితే ఈ సినిమా ఇది వరకే విడుదల కావాల్సి ఉంది కాని మేకర్స్ వాయిదా వేశారు. ఈ మూవీని ఈ ఏడాది జూలై 10న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్గా నటిస్తుండగా.. శర్వరి, అనీల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించినున్నారు.
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో త్రిషను ఉద్దేశించి నటుడు, దర్శకుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై త్రిష కూడా పరోక్షంగా స్పందించడంతో ఆయన మరో పోస్ట్ పెట్టాడు. ‘ఈ విషయంలో జరిగినదంతా తప్పుగా భావించారు. ఇప్పుడు నాకు పశ్చాత్తాపపడటం తప్ప మరో మార్గం లేదు’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ వివాదానికి తెర పడినట్లైంది.
T20 WCలో విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రముఖ నటుడు కమల్హాసన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన మెన్ ఇన్ బ్లూ వరుసగా రెండుసార్లు ICC T20 WC ఛాంపియన్స్గా నిలిచారు. ఇక మహిళల ICC క్రికెట్ వరల్డ్ కప్లో ఛాంపియన్స్గా సత్తా చాటారు. రంజీ ట్రోఫీ నుంచి IPL వరకు.. సాధించిన విజయాలు దేశ క్రీడా వ్యవస్థకు నిదర్శనాలు’ అని అన్నారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. JAN 13న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ OTT సంస్థ జీ5 భారీ ధరలకు సొంతం చేసుకుంది. అయితే MAR 13 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ సినిమాలో డింపుల్ హయాతీ, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.