గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ‘RC-16’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి ‘పెద్ది’ అని టైటిల్ పెట్టినట్లు పలు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథనాయికగా నటిస్తుండగా.. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
నితిన్ హీరోగా వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న మూవీ ‘ఎల్లమ్మ’. ‘బలగం’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు వేణు నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ఎల్లమ్మ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా సాయిపల్లవి నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆమె స్థానంలో చిత్ర యూనిట్ కీర్తి సురేష్ను సంప్రదించగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
అలనాటి ప్రముఖ నటుడు కత్తి కాంతారావు వర్ధంతి ఇవాళ. ఆయన సూర్యపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో నవంబర్ 16, 1923లో జన్మించారు. కత్తి కాంతారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 400 పైగా సినిమాలలో నటించారు. పౌరాణిక, జానపద చిత్రాలలో కూడా నటించి జానపద నటుడిగానూ పేరుగాంచారు. తెలుగు తెరపై కత్తిసాముతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టేలా అనేక జానపద చిత్రాలలో నటించిన నట ప్రపూర్ణుడు.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. వేసవిలో ఇది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ను గెస్ట్గా తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. HYDలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక తారక్.. కళ్యాణ్ రామ్ పలు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చిన విషయం తెలిసిందే.
TG: రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ చలన చిత్ర పురస్కారాలు అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఫిల్మ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటన జారీ చేసింది. ఈనెల 20 నుంచి 22 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాకు OTTలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత ఒకరు ఈ చిత్రాన్ని ప్రశంసించినట్లు కంగనా తాజాగా తెలిపారు. ఈ మేరకు ‘నిన్న ఎమర్జెన్సీ చూశాను. మీరు చాలా బాగున్నారు.. లవ్’ అని చేతిరాతతో రాసిన లెటర్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అది తనకు చిరునవ్వు తెప్పించిందని పేర్కొన్నారు.
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘మీరు ఎవరి పాత్రలో నటించాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి తమన్నా బదులిస్తూ.. శ్రీదేవి పాత్రలో తెరపై కనిపించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. తాను ఎప్పుడూ శ్రీదేవిని ఆరాధిస్తానని పేర్కొంది. అది తన కలల పాత్ర అని, ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై నిర్మించిన ‘కోర్ట్’ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ‘హిట్’ తరహాలో ‘కోర్ట్’ మూవీని కూడా ఫ్రాంచైజీగా తీర్చిదిద్దాలని నిర్మాత నాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ‘కోర్ట్’ సీక్వెల్స్ కోసం కథలను సిద్ధం చేస్తారని.. ప్రతి సినిమాలో ఒక్కో కేసు గురించి చర్చించనున్నట్లు టాక్ నడుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 1, 2’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ‘పుష్ప 3’ కూడా ఉండనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను 2028లో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత రవి శంకర్ తెలిపారు. ‘రాబిన్హుడ్’ ప్రమోషన్స్లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం బన్నీ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నట్లు ప...
హీరో నాని సమర్పణలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కోర్ట్’. నిన్న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ప్రీమియర్స్తో కలిపి మొదటి రోజే అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించినట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఇది ప్రియదర్శి కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్ అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
స్టార్ హీరోలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఓ పాట చిత్రీకరణ సమయంలో హృతిక్ గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ రష్మిక మందన్నకు కొడవ సామాజికవర్గం మద్దుతుగా నిలిచింది. రష్మికకు భద్రత కల్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు కొడవ సామాజికవర్గం అధ్యక్షుడు నాచప్ప లేఖ రాశారు. హీరోయిన్పై ఎమ్మెల్యే రవి గనిగ నిత్యం విమర్శలు చేస్తునే ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వెంటనే ఆమెకు భద్రత కల్పించాలని కోరారు.
మాచో స్టార్ గోపీచంద్, ఘాజీ ఫేమ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబోలో సరికొత్త మూవీ తెరకెక్కనుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ పూజా కార్యక్రమాలతో ఇవాళ ప్రారంభమైంది. 7వ శతాబ్దపు భారతీయ చారిత్రక సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో గోపీచంద్ ఇదివరకు ఎన్నడూ చూడని అవతారంలో కనిపించనున్నారని పేర్కొన్నారు.
పింక్ సిటీ జైపూర్ వేదికగా ఐఫా అవార్డుల వేడుక ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలో నిన్న OTTలో మంచి ఆదరణ దక్కించుకున్న మూవీలు, సిరీస్లకు అవార్డులు ఇచ్చారు. ఉత్తమ చిత్రంగా అమర్ సింగ్ చంకీలా, ఉత్తమ సిరీస్గా పంచాయత్ సీజన్ 3లు అవార్డులు అందుకున్నాయి. ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే(సెక్టార్ 36), నటిగా కృతి సనన్ (దో పత్తి)గా నిలిచారు.
‘జిగ్రా’ సినిమా పరాజయంపై బాలీవుడ్ నటి అలియా భట్ స్పందించారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దానికి ఆదరణ లభించకపోయినా తాను ఉత్సాహంగానే ఉన్నట్లు చెప్పారు. ఆ సినిమా నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపారు. సినిమా ఫలితాలు తనని ప్రభావితం చేయవు అని, సినీ రంగంలో జయాపజయాలు సహజమని పేర్కొన్నారు.