మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్తో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలుత మూవీ ట్రైలర్ను జూన్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, అహ్మదాబాద్ విమాన ఘటనతో వాయిదా వేశారు. అయితే, తాజాగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని మంచు విష్ణు ‘X’ వేదికగా ప్రకటించాడు.
తమిళ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో H. వినోద్ దర్శకత్వంలో ‘జన నాయగన్’ మూవీ రాబోతుంది. ఈ సినిమా నుంచి గ్లింప్స్ రాబోతుంది. విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 22న స్పెషల్ వీడియోను షేర్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టాలీవుడ్ హీరో గోపీచంద్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబోలో మూవీ రాబోతుంది. ఈ నెల 12న గోపీచంద్ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. మూవీకి సంబంధించిన గ్లింప్స్ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, ‘గోపీచంద్ 33’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా హిస్టారికల్ ఎపిక్ మూవీగా రాబోతుంది.
నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని ఓ సినిమా చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘NBK 111’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ క్రేజీ పోస్టర్ షేర్ చేశారు. కాగా, వీరిద్దరి కాంబోలో గతంలో ‘వీరసింహారెడ్డి’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.
తమిళ హీరో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను నాగార్జున పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఫొటోలు షేర్ చేశారు. అలాగే సినిమా ప్రమోషన్స్ను కూడా త్వరలో ప్రారంభించనున్నారు. కాగా, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’లో దీపిక కీలక పాత్రలో నటించింది. అయితే, సీక్వెల్లో ఆమె ఉండదని వార్తలొస్తున్నాయి. దీపిక ప్లేస్లో యంగ్ హీరోయిన్కి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై మేకర్స్, దీపికా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
బాలీవుడ్లో కొంతకాలంగా రిలీజ్ అవుతోన్న మూవీలు ఆశించిన ఫలితం అందుకోలేకపోతున్నాయి. దీంతో బాలీవుడ్ హీరోలు సౌత్ దర్శకులతో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్, రణ్ బీర్ కపూర్ సౌత్ డైరెక్టర్స్తో మూవీలు చేసి మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు వారి బాటలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ తదితర హీరోలు నడుస్తున్నారు.
నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్ చేశాడు. ‘నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షుకులను థియేటర్లలోకి ఎలా రప్పించాలి అనే విషయం గురించి ఆలోచించాలి. మూవీ విడుదలైన 28 రోజుల్లోపే OTTకి ఇచ్చే ట్రెండ్ కొనసాగితే 4-5 ఏళ్లలో 90% థియేటర్లు మూతబడుతాయి. పెద్ద హీరోలు 2-3 ఏళ్లకు ఒక మూవీ చేస్తూ పోతే ప్రేక్షకులు థియేటర్లకు దూరమైపోతారు’ అని చెప్పాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్తో నెలకొన్న డబ్బు వివాదంలో హీరో విశాల్కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. సదరు సంస్థకు 30% వడ్డీతో రూ.21 కోట్లు చెల్లించాలని అతనికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని.. తిరిగి ఇవ్వలేదని లైకా 2022లో కోర్టును ఆశ్రయించింది.
‘వేదం’ సినిమా విడుదలై నిన్నటితో 15ఏళ్లు పూర్తయింది. ఈ సినిమా ప్రమోషన్స్లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫొటోను పెద్ద హోర్డింగ్ చేసి HYD పంజాగుట్ట సర్కిల్లో పెట్టారట. అయితే అనుష్క అందాన్ని చూస్తూ 40 యాక్సిడెంట్స్ జరిగాయట. దీంతో పోలీసులు GHMC అధికారులతో కలిసి వాటిని తొలగించారట.
దర్శకుడు భరత్ కృష్ణమాచారితో హీరో నిఖిల్ చేస్తోన్న సినిమా ‘స్వయంభూ’. ఇవాళ నిఖిల్ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఈ మూవీ నుంచి అద్భుతమైన పోస్టర్ షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక ఈ పోస్టర్లో నిఖిల్ కత్తి పట్టుకుని.. సంయుక్త విల్లు బాణం పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలపై తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ స్పందించారు. క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. తాను తప్పు చేస్తేనే సారీ చెబుతానని.. లేదంటే చెప్పనని స్పష్టం చేశారు. తాను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతానని వెల్లడించారు. వాటిని గౌరవిస్తానని అన్నారు. ప్రజలు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. తనకు కర్ణాటక, AP, కేరళ పట్ల ఎంతో ప్రేమ ఉందన్నారు.
‘మ్యాడ్’ ఫేమ్ నటి అనంతిక సునీల్ కుమార్ ప్రధాన పాత్రలో ఫణీంద్ర తెరకెక్కించిన సినిమా ‘8 వసంతాలు’. ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ ఏడాది జూన్ 20న ఇది థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఇక ఈ సినిమాలో రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, సంజన తదితరులు కీలక పాత్రలు పోషించారు.
TG: 2014-2023 వరకు విడుదలైన చిత్రాలకు గద్దర్ సినీ అవార్డులను ప్రకటించారు. జ్యూరీ ఛైర్మన్ మురళీ మోహన్ అవార్డుల వివరాలను వెల్లడించారు. 2014 జూన్ 2 తర్వాత సెన్సార్ పూర్తయిన సినిమాలకు అవార్డులు ప్రకటించారు. ఏటా మూడు సినిమాలకు ఉత్తమ చిత్రంగా అవార్డులు ఇస్తున్నట్లు మురళీ మోహన్ వెల్లడించారు. కాగా.. 2014 ఉత్తమ చిత్రం-రన్ రాజా రన్, 2015 బెస్ట్ సినిమా-రుద్రమదేవి ఎంపికయ్యాయి.
తమిళంలో హిట్ అయిన హారర్ థ్రిల్లర్ ‘డీమన్’ తెలుగు OTT వేదిక ఆహాలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఆహా’ పోస్టర్ షేర్ చేసింది. ఇక రమేష్ పళనివేల్ తెరకెక్కించిన ఈ మూవీలో సచిన్ మణి, అపర్ణాతి ప్రధాన పాత్రల్లో నటించగా.. సురుతి పెరియసామి, కుంకి అశ్విన్, రవీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు.