మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ భారీ విజయం అందుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.200 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డు క్రియేట్ చేసింది. బుక్ మై షోలో అత్యంత వేగంగా 25 లక్షల టికెట్స్ అమ్ముడైన ఈ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు.
మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.226కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.
‘పరాశక్తి’ మూవీలో కామెడీ ఎలిమెంట్స్ లేవని, అందుకే హిట్ కాలేదని వస్తోన్న కామెంట్స్పై హీరో శివకార్తికేయన్ స్పందించాడు. కామెడీ మూవీలు ఎందుకు తీయడం లేదని ప్రేక్షకులు అడుగుతున్నారని చెప్పాడు. కానీ తన దగ్గరకు దర్శకులు అలాంటి స్క్రిప్ట్లు తీసుకురావడం లేదన్నాడు. ప్రస్తుతం పూర్తిస్థాయి కామెడీ మూవీ కథ కోసం ఎదురుచూస్తున్నానని, త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తానని చెప్పాడు.
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, దర్శకుడు విజయ్ కార్తికేయ కాంబోలో ‘మార్క్’ సినిమా తెరకెక్కింది. 2025 డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జియో హాట్స్టార్లో జనవరి 23 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.
సినీ చరిత్రలో తన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శారదకు అరుదైన గౌరవం లభించింది. మలయాళ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకుగానూ అత్యున్నత సినీ పురస్కారం JC డేనియల్ అవార్డును కేరళ ప్రభుత్వం ప్రకటించింది. JAN 25న జరగనున్న కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె దీన్ని అందుకోనుంది. ఇక ఈ అవార్డు కింద శారదకు రూ.5 లక్షల నగదు, ప్రశంస పత్రం, జ్ఞాపిక అందజేయనున్నారు.
సినీ చరిత్రలో తన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శారదకు అరుదైన గౌరవం లభించింది. మలయాళ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకుగానూ అత్యున్నత సినీ పురస్కారం JC డేనియల్ అవార్డును కేరళ ప్రభుత్వం ప్రకటించింది. JAN 25న జరగనున్న కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె దీన్ని అందుకోనుంది. ఇక ఈ అవార్డు కింద శారదకు రూ.5 లక్షల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేయనున్నారు.
యష్ ‘టాక్సిక్’ టీజర్ వివాదంపై సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. దీనిపై తాను ఎలాంటి స్పష్టత ఇవ్వలేనని అన్నారు. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో చూసే ఎన్నో వీడియోలకు సెన్సార్ సర్టిఫికెట్ ఉండదని, అవి తమ పరిధిలోకి రావని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. OTT కంటెంట్ కూడా తమ దగ్గరికి రావని, వాటికి ధ్రువీకరణ ఉండవని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు క్లబ్లో చేరగా.. తాజాగా 200 కోట్ల క్లబ్లో చేరింది.
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మూవీ కేవలం విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు క్లబ్లో చేరగా.. తాజాగా 200 కోట్ల క్లబ్లో చేరింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘పెద్ది’. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీలోని చికిరి చికిరి పాట రిలీజ్ కాగా మిలియన్ల వ్యూస్తో అదరగొడుతోంది. తాజాగా ఈ పాట ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇక దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమాని ఒకరు రాసిన లేఖ SMలో వైరలవుతోంది. ‘ఓయ్ ప్రసాదు.. ఇదిగో నిన్నే’.. నిన్నేనయ్యా ప్రసాదు.. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా?..ఏడు పదుల వయసులో జనాలు ఆసుపత్రుల చుట్టూ తిరిగితే.. హుక్కు స్టెప్పు అంటూ డ్యాన్సులు వేసి ఎవరిని రెచ్చగొడదామని నీ ప్లాన్’ అంటూ రాసుకొచ్చ...
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ’45’. 2025లో రిలీజైన ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జీ5 వేదికగా జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్ జన్య తెరకెక్కించాడు.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మూవీ ‘అనగనగా ఒకరాజు’. జనవరి 14న రిలీజైన ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘మెగా-158’ సినిమా రాబోతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం బెంగాల్ బ్యాక్డ్రాప్ కథను బాబీ రెడీ చేశాడట. ఇందులో చిరు బెంగాల్ మాఫియా డాన్గా చాలా పవర్ఫుల్ కనిపిస్తారట. ఆయన లుక్ కూడా కొత్తగా ఉంటుందని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.