గత ప్రభుత్వ హయాంలో భీమ్లా నాయక్ విడుదలైనప్పుడు అందరి సినిమాల టికెట్లు రూ.100ల్లో ఉంటే.. తన సినిమా టికెట్ను రూ.10, రూ.15 చేశారని డిప్యూటి సీఎం, హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ‘అప్పుడు నేను ఒకటే చెప్పాను. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’. ఇది డబ్బు కోసమో.. రికార్డులు కోసమో కాదు.. ఇది ధైర్యం, సాహసం, న్యాయం కోసం’ అని పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో రానా, ప్రకాష్రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్రాజ్, ఆగస్టు 5న విజయ్ దేవరకొండ,13న మంచు లక్ష్మిని ఈడీ విచారించనుంది.
రెండు కిడ్నీలు డ్యామేజ్ కావడంతో టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ మరణించిన విషయం తెలిసిందే. ఎన్నో సినిమాల్లో కామెడీ, విలన్ పాత్రల్లో వెంకట్ మెప్పించాడు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. రోజుకు వెంకట్ రూ.30 వేలు రెమ్యూనరేషన్ తీసుకునేవాడని సన్నిహితులు తెలిపారు. అయినప్పటికీ డబ్బులు పొదుపు చేయకపోవడంతో అతని పరిస్థితి దారుణంగా మారిందని పేర్కొన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హీరోయిన్ రాశీ ఖన్నా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నటిస్తున్నారు. HYDలో జరుగుతున్న షూటింగ్లో పాల్గొన్నారు. DY. CM పవన్ డేట్స్ ఇవ్వడంతో ఈ సినిమా చిత్రీకరణ ముమ్మరంగా సాగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల కూడా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు.
తమిళ నటుడు అథర్వ నటించిన ‘DNA’ సినిమా ‘మై బేబీ’ పేరుతో తెలుగులో రేపు(JUNE 18) విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎల్లుండి(జూలై 19) ఓటీటీ(JIO HOTSTAR)లోకి రానుంది. ఒక్కరోజు గ్యాప్లోనే థియేటర్, OTTలో రిలీజ్ అవుతుండటం గమనార్హం. కాగా, నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ అందుకుంది.
బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావుకు జైలు శిక్ష పడింది. ఈ కేసుపై విచారణ జరిపిన కర్ణాటక కోర్టు.. ఆమెతో పాటు మరో ఇద్దరు నిందితులు తరుణ్ కొండూరు రాజు, సాహిల్ జైన్లకు ఏడాది జైలు శిక్ష విధిస్తు తీర్పునిచ్చింది. అక్రమ రవాణాకు తగిన ఆధారాలు ఉన్నందున ఈ శిక్ష కాలంలో వారికి బెయిల్కు దరఖాస్తు చేసుకునే హక్కును నిరాకరించింది.
‘హరిహర వీరమల్లు’ మూవీ ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత AM రత్నం ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఈ మూవీ కోసం ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వేసి షూట్ చేశాం. హార్బర్ సెట్ ఎంతో సహజంగా ఉంటుంది. 17వ శతాబ్దంలో ఓడరేవులు ఎలా ఉండేవో అలాగే రూపొందించాం. థియేటర్కు వచ్చిన ప్రేక్షకుడు నాటి కాలానికి వెళ్లిన అనుభూతి పొందుతాడు’ అని చెప్పాడు.
దివంగత నటి బి.సరోజా దేవి నేత్రదానం చేశారు. ఐదేళ్ల క్రితం నేత్రదానం చేసేందుకు తన పేరును నమోదు చేసుకున్నారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో ఇటీవల సరోజా దేవి చనిపోయారు. అయితే ఆమె రెండు కార్నియాల పనితీరు బాగుందని, అవసరమైన వారికి త్వరలోనే వాటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తామని నారాయణ నేత్రాలయ వైద్యులు వెల్లడించారు.
మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో భాషాపరమైన వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు ఆర్ మాధవన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ఇన్నేళ్ల నా కెరీర్లో నేనెప్పుడూ భాష కారణంగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. నేను తమిళం, హిందీలో మాట్లాడగలను. కొల్హాపూర్లో చదువుకున్నాను.. కాబట్టి నాకు మరాఠీ కూడా వచ్చు. అందుకే ఎప్పుడూ ఏ సమస్య రాలేదు’ అని చెప్పారు.
కోలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్మ్యాన్ రాజు మృతి చెందారు. హీరో ఆర్య- డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సార్పట్ట’ మూవీ సెట్స్లో కారుతో స్టంట్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని హీరో విశాల్ వెల్లడించారు. రాజు ధైర్యవంతుడని కొనియాడిన విశాల్.. తాను నటించిన చాలా సినిమాల్లో సాహసవంతమైన స్టంట్స్ చేశారని గుర్తు చేసుకున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తోన్న మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ‘నదివే.. నదియే.. నిలవే.. స్వరావే’ అంటూ సాగే ఈ పాటను ఈ నెల 16న రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. దానికి ‘మీ ఆత్మలో ప్రతిధ్వనిస్తోంది’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
తమిళ నటుడు విజయ్ ఆంటోని హీరోగా అరుణ్ ప్రభు తెరకెక్కించిన సినిమా ‘భద్రకాళి’. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు. సెప్టెంబర్ 5న దీన్ని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక విజయ్ చేతిలో టీ గ్లాస్ పట్టుకుని సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీ రెండు పార్ట్లను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 31న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా దీని రన్ టైం లాక్ అయింది. 5:27 గంటల నిడివితో రీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
దర్శకుడు H.వినోద్తో హీరో ధనుష్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ధనుష్కు కథను వినిపించగా.. అతను ఓకే చెప్పాడట. ఇక ఈ సినిమాకు సామ్ సిఎస్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇక దర్శకుడు.. ‘ఖాకీ’, ‘వలిమై’, తెగింపు సినిమాలను తెరకెక్కించగా.. ప్రస్తుతం ‘జననాయగన్’ మూవీతో బిజీగా ఉన్నాడు.
హీరో విజయ్ దేవరకొండ, తన పేరు ముందు అభిమానులు ఉపయోగించిన ‘ది’ (The) ట్యాగ్పై స్పందించారు. గతంలో ఆయన అభిమానులు ‘ది విజయ్ దేవరకొండ’ అని పిలిచేవారు. అయితే ఈ ‘ది’ ట్యాగ్ మితిమీరిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమంటూ వివాదాస్పదమైంది. దీంతో VD ఆ ట్యాగ్ను తొలగించాలని తన అభిమానులకు సూచించారు. ఇతర హీరోలకు ఎవరికీ తగలనన్ని ఎదురుదెబ్బలు తనకు తగిలాయని ఆవేదన వ్యక్తం చే...