నిర్మాత నాగవంశీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘ఎపిక్’ మూవీ ఈవెంట్లో నాగవంశీ మాట్లాడుతూ.. ‘ఐబొమ్మ రవినే రాబిన్ హుడ్ చేసిన లోకంలో ఉన్నాం మనం’ అంటూ వ్యాఖ్యానించాడు. ‘రవి మాకు రాబిన్ హుడ్ అయిపోయాడు. రూ.50 టికెట్ రేటు పెంచితే, మేము ఏదో తప్పు చేసిన వారిలా అయిపోయాం. ఆ అబ్బాయి హీరో అయిపోయాడు’ అని ఆయన వ్యాఖ్యానించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు SMలో వైరల్ అవుతున్న...
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో నెలకు ఒక సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు. ఈ బ్యానర్లో ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’, ‘ఫన్కీ’, ‘సూర్య 46’, ‘ఎపిక్’ వంటి చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే, హీరో శ్రీవిష్ణు, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టితో కూడా నాగవంశీ చిత్రాలను నిర్మించ...
సమంత, రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటి కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు చేస్తున్నారు. అయితే, పూనమ్ కౌర్ మాత్రం ‘X’ వేదికగా సమంతపై పరోక్షంగా విమర్శలు చేసింది. సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని కూల్చేయడం బాధాకరమని ఆమె పేర్కొంది. ‘బలహీనమైన పురుషులను డబ్బుతో తేలికగా కొనవచ్చు. ఈ అహంకారపూరిత మహిళను ఆమె PR టీమ్ గొప్పగా చూపించడం దారుణం’ అని పేర్కొంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన ‘బేబీ’ చిత్రం సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఇద్దరి కాంబోలో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా, మేకర్స్ ఈ సినిమాకు ‘ఎపిక్’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు ప్రకటించారు.
హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ‘జూటోపియా 2’ సంచలన రికార్డులు సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం 556 మిలియన్ డాలర్ల భారీ కలెక్షన్లు సాధించింది. కేవలం చైనాలోనే ఒక్కరోజులో రూ.925 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టి ఆ దేశంలో ఆల్టైమ్ రికార్డును నమోదు చేసింది. కాగా, ఈ చిత్రాన్ని దాదాపు 150 మిలియన్ డాలర్లతో నిర్మించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన హీరోయిన్గా నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్గా రాశీ ఖన్నా కనిపించనుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని రాశీ ఖన్నా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయబోతున్నారు.
కోయంబత్తూరులోని లింగ భైరవి దేవి సన్నిధిలో ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఒక్కటయ్యారు. ఆలోచనలు, భావోద్వేగాలకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన ప్రక్రియే ‘భూత శుద్ధి వివాహం’. ఇది వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. లింగ భైరవి ఆలయాల్లో ఈ వివాహ క్రతువును నిర్వహిస్తారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై వచ్చే ఏడాది ఆరు చిత్రాలు విడుదల చేయబోతున్నట్లు దిల్ రాజు సోదరుడు శిరీష్ తెలిపాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపాడు. అక్షయ్కుమార్, పవన్ కళ్యాణ్తో కూడా చిత్రాలను నిర్మించబోతున్నట్లు వెల్లడించాడు. కాగా, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ కూడా 2026లో విడుదల కానుంది.
సినీ ఇండస్టీలో విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకోవడం కామన్గా మారింది. ఈ జాబితాలో సీనియర్ NTR, కృష్ణ, నాగార్జున, హరికృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, అమలాపాల్, దిల్ రాజ్, నాగ చైతన్య ఉన్నారు. తాజాగా, ఈ లిస్టులో సమంత కూడా చేరింది. అలాగే, మూడో పెళ్లి చేసుకున్న వారి జాబితాలో పవన్ కళ్యాణ్, నరేశ్, రాధిక ఉన్నారు.
రాజ్ నిడిమోరుతో పెళ్లి వార్తలపై సమంత క్లారిటీ ఇచ్చింది. ఇన్స్టా వేదికగా వారి పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇవాళ ఉదయం తమిళనాడులోని ఈషా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో వారికి వివాహం జరిగిన విషయం తెలిసిందే. కాగా, పెళ్లి వేడుకలో సామ్ ఎరుపు రంగు చీరలో మెరిసింది.
కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు మృణాల్ స్పందించింది. అవన్నీ చూస్తుంటే తనకు నవ్వొస్తోందని, ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరు పుట్టిస్తారో అర్థం కావడం లేదని, వాటిని చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని మృణాల్ క్లారిటీ ఇచ్చింది.
సమంత-రాజ్ నిడిమోరు పెళ్లి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని ఈశా యోగా సెంటర్లో పెళ్లి జరిగిందంటూ.. సమంత ఎర్రచీరలో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. వారిద్దరూ దీనిపై స్పందించలేదు. రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’, ‘సిటడెల్’ ప్రాజెక్టులలో సమంత నటించిన విషయం విధితమే. అయితే ఈ ఫొటోలో పాతవని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.
హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్న రాజ్ నిడిమోరు తిరుపతిలో జన్మించాడు. SUVలో బీటెక్ చేసి.. USలో ఉద్యోగం చేశాడు. కృష్ణ డీకేతో కలిసి ‘రాజ్&డీకే’ ద్వయంగా బాలీవుడ్లో ప్రసిద్ధి చెందారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జి’ సినిమాలతో ఫేమస్ అయ్యారు. అయితే ఫ్యామిలి మ్యాన్ సిజన్-2లో సమంత నటించిన సమయంలో వారి మధ్య ప్రేమ పుట్టినట్లు తెలుస్తోంది. తాజాగా వారు పెళ్లి చేసుకున...
ప్రముఖ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని ఈషా సెంటర్లోని లింగభైరవీ ఆలయంలో ఈ జంట ఒక్కటైంది. కాగా, వారు పెళ్లికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకుంది. దూరపు బంధువు మయాంక్ లైంగిక వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘డ్రగ్స్కు బానిసైన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని, లైంగిక సంబంధం కోసం ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో వేధించాడు’ అని బంధువులు ఆరోపిస్తున్నారు. అచల NOV 22 ఉరేసుకుందని, ఇప్పటికీ మయాంక్పై చర్యలు తీసుకోలేదని ఫైర్ అవుతున్నారు.