ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’, దళపతి విజయ్ ‘జన నాయగన్’ ఈనెల 9న విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటివరకు ఆన్లైన్ బుక్సింగ్స్ అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారని SMలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా, జనవరి 8న ‘రాజాసాబ్’ స్పెషల్ ప్రీమియర్లు ఏర్పాటు చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభాస్ ‘రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు చేశారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను చిత్ర నిర్మాతలు సవాల్ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీలులో కోరారు.
మెగాస్టార్ చిరంజీవికి శస్త్ర చికిత్స జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ‘మన శంకరవరప్రసాద్గారు’ నిర్మాత సాహు గారపాటి స్పందించాడు. చిరంజీవికి కాలి నొప్పి సమస్యలు ఏమీ లేవని.. ఇటువంటి నిరాధార వార్తలు నమ్మొద్దని వెల్లడించాడు. రేపు జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్తో పాటు, సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలకు చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ హాజరవుతారని స్పష్టం చేశాడు.
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా ఈనెల 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనవరి 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్లను ఏర్పాటు చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అనుమతుల కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసింది. స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను సింగిల్ స్క్రీన్లో రూ.800, మల్టీప్లెక్స్లో రూ.1000 పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరింది.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘శంబాల’ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. DEC 25న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.20.7 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా మొత్తం బిజినెస్ దాదాపు రూ.5 కోట్లకుపైగా జరగ్గా.. ప్రస్తుతం ఈ చిత్రం లాభాల్లో నడుస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మూవీని యుగంధర్ ముని తెరకెక్కించాడు.
హీరోయిన్లపై యాంకర్, నటి అనసూయ మరో సంచలన పోస్ట్ పెట్టింది. హీరోయిన్ తెరపై కాదు.. సత్యం మాట్లాడే ధైర్యం అని పేర్కొంది. ‘సొంత దారిలో నడిచే శక్తి.. సరైన దాని కోసం నిలబడే గుండె.. అదే నిజమైన హీరోయిన్. మిగతా వాళ్లు కేవలం నటులు మాత్రమే’ అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో అని SMలో చర్చ మొదలైంది.
తమిళ హీరో దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ మూవీ ఈనెల 9న రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమాకు సెన్సార్ కష్టాలు తప్పడం లేదట. రివ్యూ ప్రక్రియ పూర్తయినప్పటికీ, CBFC అధికారికంగా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయలేదని సమాచారం. దీంతో ఈ అంశంపై చిత్ర బృందం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజకీయ కారణాలతో సినిమాకు ఇబ్బంది కలిగిస్తున్నారని TVK పార్టీ ఆరోపిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా మహేష్ కెరీర్లోనే సెన్సేషనల్ హిట్ అందుకుంది. తాజాగా ఈ మూవీ గురించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ కంటిన్యూస్గా 50 రోజుల పాటు షేర్తో రన్ అయినట్లు తెలిపారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. రష్మిక మందన్న కథానాయికగా నటించింది.
నటుడు కార్తీక్ ఆర్యన్ USకు చెందిన కరీనా కుబిలియుట్(18)తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి గోవా వెకేషన్ ఫొటోలు SMలో వైరల్ కావడంతో రూమర్స్కు మరింత బలం చేకూరింది. ఈ డేటింగ్ పుకార్లపై స్పందిస్తూ.. కార్తీక్ ఆమెను అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అయితే కరీనా ఆ పోస్ట్కు బదులుగా ‘నేను అతని గర్ల్ఫ్రెండ్ని కాదు’ అని స్పష్టం చేసింది.
తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, స్టార్ హీరో విజయ్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఈనెల 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గతేడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడిల ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా అమలాపురంలోని వెంకటరమణ థియేటర్లో ఈ మూవీ టికెట్ వేలం వేయగా.. మెగా అభిమాని వెంకట సుబ్బారావు రూ.1.11 లక్షలకు దక్కించుకున్నాడు.
ఈ సంక్రాంతికి పలు చిత్రాలు బరిలో నిలిచాయి. ఆయా మూవీల ప్రమోషన్స్ను మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా జనవరి 7న 4 మూవీల ఈవెంట్స్ ఉన్నాయి. చిరంజీవి ‘MSVG’ ప్రీ-రిలీజ్ ఈవెంట్, రవితేజ ‘BMW’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్(4:05PM), నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్(6:04PM)లు జరగనున్నాయి. అలాగే ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి ప్రమోషనల...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ భాగమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీ ఫ్లాష్బ్యాక్లో అతను కనిపించనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీలో నటి రుక్మిణి వసంత్ భాగమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆమె ‘మెలిసా’ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇక రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ 2026 మార్చి 19న విడుదల కాబోతుంది.
ప్రభాస్ ‘రాజాసాబ్’లోని ‘నాచే నాచే’ పాట తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటను మెయిన్ స్టోరీలో కాకుండా.. కేవలం ఎండ్ క్రెడిట్స్లో మాత్రమే ఉంచుతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై దర్శకుడు మారుతి స్పందించాడు. ఈ పాటను ఎండ్ క్రెడిట్స్లో వాడటం లేదని, ఇది సినిమాలో భాగమేనని చెప్పాడు. ఇక ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది.