‘కన్నప్ప’ మూవీ టీంకు మంచు మనోజ్ క్షమాపణలు చెప్పాడు. ‘భైరవం’ మూవీ ఈవెంట్లో ‘శివయ్యా’ అనే డైలాగ్ను వేరేలా వాడానని, అలా చేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నాడు. ఆ మూవీ కోసం చాలామంది కష్టపడ్డారని, ఒకరు చేసిన తప్పుకు సినిమా మొత్తాన్ని నిందించడం సరికాదని చాలా బాధపడ్డానని చెప్పాడు. ఇటీవల మనోజ్.. శివయ్యా అంటే శివుడు రాడని, మనసారా తలుచుకుంటే ఏదొక రూపంలో వస్తాడన...
విజయ్ సేతుపతి, యోగిబాబు కాంబోపై నమ్మకం పెట్టుకుని ఆర్ముగ కుమార్ తీసిన రొటీన్ హెయిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ఏస్’. దర్శకుడి టేకింగ్లో కొత్తదనం లేదు. ఫస్ట్ హాఫ్ సాగదీతగా.. సెకండాఫ్ కాస్త థ్రిల్లింగ్గా ఉంటుంది. బోల్ట్ కాశీ పాత్రలో విజయ్ సేతుపతి ఒదిగిపోయాడు. జ్ఞానానందంగా యోగిబాబు నవ్వించే ప్రయత్నం చేశాడు. సైకో పాత్రలో పృథ్వీరాజ్ ఆకట్టుకున్నాడు. రేటింగ్ 2.5/5.
ఇవాళ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 83వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1975లో ‘బాబు’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 100కుపైగా సినిమాలకు దర్శకత్వం వహించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.
విజయ్ సేతుపతితో దర్శకుడు పూరి జగన్నాథ్ చేయనున్న సినిమాకు ‘బెగ్గర్’ టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై విజయ్ క్లారిటీ ఇచ్చాడు. ఓ సినిమా ప్రమోషన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని అన్నాడు. పూరితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, జూన్ నుంచి దీని షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలిపాడు.
టాలీవుడ్ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం కొనసాగుతుంది. లాభాల్లో వాటా డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు నిరసన తెలిపారు. ఇవాళ ఫిల్మ్ చాంబర్ పెద్దలతో ఎగ్జిబిటర్ల భేటీ ముగిసింది. సింగిల్ స్క్రీన్లకు వస్తున్న నష్టాలపై మాట్లాడారు. నిర్మాతలతో మాట్లాడి లాభాల్లో వాటా ఇప్పించాలని విన్నవించారు. ఇవాళ కొందరు నిర్మాతలతో ఫిల్మ్ చాంబర్ భేటీ అయ్యింది. రెండ్రోజుల్లో ఇరువురితో చర్చించనుంది.
క్రికెటర్ చాహల్, ఆర్జే మహ్వశ్లు డేటింగ్ చేస్తున్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. చాహల్లో ఏ లక్షణం మీకు బాగా నచ్చిందని మహ్వశ్కు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి చాహల్ నిజంగా చాలా కేర్ తీసుకునే వ్యక్తి అని కితాబిచ్చింది. ప్రేమించే వ్యక్తులకు అందుబాటులో ఉండే అతని లక్షణాన్ని తాను కూడా అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించింది.
దర్శకుడు సాయి రాజేశ్ ‘బేబీ’ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోగా బాబిల్ ఖాన్ ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా నుంచి తాను తప్పుకున్నట్లు బాబిల్ ఖాన్ ప్రకటించాడు. దీనిపై సాయి రాజేశ్ స్పందించాడు. తాను కలిసిన ప్రతిభావంతులైన, బాగా కష్టపడే నటుల్లో బాబిల్ ఖాన్ ఒకరని తెలిపాడు. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నాడు.
తమిళ హీరోయిన్ మిర్నా మీనన్ ‘డాన్ బాస్కో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రుష్య హీరోగా పి.శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మిర్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీ స్కూల్ ఫ్రెండ్స్ రీయూనియన్ నేపథ్యంలో సాగుతుందని తెలిపింది. భావోద్వేగానికి గురిచేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
సవాలుగా మారిన వరుస హత్యల కేసును ACP అరవింద్(నవీన్ చంద్ర) ఎలా సాల్వ్ చేశాడనేది ‘లెవెన్’ కథ. హత్యల వెనుక ఎవరున్నారనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది. అనూహ్యమైన ట్విస్టులతో సాగుతుంది. నవీన్ చంద్ర నటన, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మూవీకి ప్లస్. ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాలు మైనస్. రేటింగ్:2.75/5.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదాలు పడింది. అయితే ఇటీవల పవన్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో మేకర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 12న ఈ మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 19న అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. ఈ సినిమాకు క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్పై హీరో నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో పాకిస్థాన్కు మద్దతుగా ఎర్డోగాన్ మాట్లాడటం పట్ల నిఖిల్ అసహనం వ్యక్తం చేశాడు. మనకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం మనం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిఖిల్ పేర్కొన్నాడు.
తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ను త్వరలోనే తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ వెల్లడించాడు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్జునుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బన్నీని ఇటీవల ఆమిర్ కలిశాడట. ఇక మొత్తం 5 భాగాలుగా రానున్న ఈ మూవీ తొలి భాగాన్ని సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన హిట్ మూవీ ‘భద్ర’ విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ సినిమాకు మొదటి ఛాయిస్ రవితేజ కాదట. బోయపాటి శ్రీను ఈ కథను మొదటగా ఇద్దరు స్టార్ హీరోలు అల్లు అర్జున్, జూ. ఎన్టీఆర్కు వినిపించారట. పలు కారణాలతో వారిద్దరూ దీన్ని మిస్ చేసుకున్నారట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బన్నీ, తారక్లు చెప్పారు.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, కార్తీక్ రాజు కాంబోలో ‘#సింగిల్’ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.16.30కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.
హీరోయిన్ సమంత నిర్మించిన చిత్రం ‘శుభం’. ఒక హారర్ కామెడీ సినిమాకి ఏమేం అవసరమో అవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ చిత్రం కొత్త నేపథ్యంతో పాటు.. ట్విస్టులు ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి. అయితే పాత్రల పరిచయ సన్నివేశాలు నత్తనడకగా సాగుతాయి. ఫస్టాఫ్ ఆసక్తిగా ఉన్నా.. ద్వితీయార్ధంలో ఒకే అంశం చుట్టూ కథ తిరగడంతో బోర్గా ఫీలవుతారు. ఇంటిల్లిపాదీ కలిసి ఈ సినిమాను చూడవచ్చు. రేటింగ్ 2.75/5