వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్లు సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘AK47 మ్యూజిక్ స్టార్ట్’ అంటూ ఒక క్రేజీ ఫోటోను షేర్ చేశాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది.
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. ఈ చిత్రంతో తమిళ స్టార్ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా, ఈ సినిమాలోని మొదటి పాటను హీరో దుల్కర్ సల్మాన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ‘దొర’ ట్వీట్పై నటి హేమ తీవ్రంగా మండిపడింది. ఆమె మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు చేయడంలో తప్పులేదు కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదన్నారు. షూటింగ్లకు సరిగ్గా రాకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించే ప్రకాష్ రాజ్కు పవన్ను విమర్శించే నైతిక హక్కు లేదని హేమ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. “ప్రతి ఒక్కడూ దొంగ వెధవేరా.. మంచోడికి చోటు లేదురా” అంటూ పూరీ రాసుకొచ్చాడు. ఈ ఘాటు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. పూరీ మార్క్ డైలాగ్లా ఉన్న ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి మల్టీస్టారర్ చిత్ర స్క్రిప్ట్కు స్వగ్రామం చిలుకూరివారిపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించాడు. వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మూవీలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేమ్ దర్శకుడు చిదంబరం తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘’బాలన్ ది బాయ్’. బలమైన సెంటిమెంట్, ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా జూన్ 19న దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర అధికారిక ట్రైలర్ను జూన్ 5న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ కాలేయ సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దశాబ్దాల కెరీర్లో ‘ఆంఖేన్’, ‘అందాజ్’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 2015-2017 మధ్య సెన్సార్ బోర్డు ఛైర్మన్గా ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
మాధురి దీక్షిత్, త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ డార్క్ కామెడీ చిత్రం ‘మా బెహన్’ ఈరోజు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలోని ముగ్గురు మహిళల ఇంట్లో పక్కింటి వ్యక్తి శవమై కనిపిస్తాడు. పోలీసులకు దొరకకుండా ఆ శవాన్ని వారు ఎలా దాచారు, ఎలాంటి విచిత్ర పరిస్థితులు ఎదుర్కొన్నారనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
నందు, అవికా గోర్, రవితేజ మహాదాస్యం ప్రధాన పాత్రల్లో ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’. మే 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, థియేటర్ రన్ ముగించుకుని ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో జూన్ 5 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
‘మ్యాడ్’ ఫేమ్ రామ్ నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్ర స్పెషల్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. వినోదం, ఉత్సవం, గందరగోళం నేపథ్యంలో ఈ వినూత్న కథ ఉండబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే సినిమా టైటిల్ను మాత్రం ఇంకా సస్పెన్స్లో ఉంచారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో మెప్పించిన ఈ యంగ్ హీరో కొత్త పోస్టర్ ప్రస్తుతం ఆకట్టుకుంట...
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో సినిమాలోని ఓ పవర్ఫుల్ డైలాగ్ లీకైనట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. “చట్టాన్ని ఫాలో అవ్వను.. నేనే చట్టం” అనే లైన్ నెటిజన్లను ఊపేస్తోంది. ప్రభాస్ క్యారెక్టరైజేషన్కు ఈ డైలాగ్ పక్కాగా సరిపోతుందంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం ఇవాళ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఓ వివాదాస్పద సన్నివేశంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హీరోయిన్ను హీరో బలవంతంగా ముద్దుపెట్టుకునే సీన్ను లవ్ మ్యూజిక్తో గ్లోరిఫై చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అలాగే జాన్వీ పాత్రను కేవలం గ్లామర్ డాల్గా చూపించారని, ఆ సీన్ను వెంటనే తొలగించాలన్నారు.
నటి సారా అలీ ఖాన్ సినిమాల్లోకి రాకముందు 96 కేజీల బరువు ఉండేదట. పిజ్జాలు, జంక్ ఫుడ్కు అలవాటు పడటం, పీసీఓఎస్ సమస్య వల్ల బరువు పెరిగినట్లు ఆమె చెప్పింది. అయితే కెరీర్, ఆరోగ్యం కోసం కఠినమైన డైట్, వ్యాయామంతో ఏకంగా 45 కిలోలు తగ్గానని పేర్కొంది. చక్కెర, నూనె వస్తువులకు దూరంగా ఉంటూ మానసిక, శారీరక శ్రేయస్సు సాధించానని సారా వివరించింది.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంతో వచ్చిన ‘వేదం’ ఈరోజుతో 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2010 జూన్ 4న విడుదలైన హైపర్లింక్ నేరేటివ్ చిత్రం మానవీయ విలువలతో అలరించింది. వేర్వేరు నేపథ్యాలున్న ఐదు పాత్రల కథలను క్లైమాక్స్లో క్రిష్ అద్భుతంగా కలిపారు. కేబుల్ రాజుగా అల్లు అర్జున్, సరోజగా అనుష్క తమ కెరీర్ బెస్ట్ ప్రదర్శనలిచ్చి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు.