అనగనగా ఒక రాజు (ప్రకాష్ రాజ్), అతనికి రక్షణగా నిలిచిన యోధుడు (పవన్ కళ్యాణ్) పదేళ్ల తర్వాత తిరిగి వచ్చి శత్రువును ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే ‘OG’ కథ. సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు పవన్ స్వాగ్, హై వోల్టేజ్ ఎలివేషన్స్, యాక్షన్, థమన్ సంగీతం ప్రధాన బలాలు. అయితే, సెకండాఫ్లో కొన్ని సీన్స్, ఆసక్తి రేకెత్తించని కథనం మైనస్. రేటింగ్: 3/5
పవన్ కళ్యాణ్ ‘OG’ విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ చిత్రబృందానికి విషెస్ చెప్పారు. ‘OG అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్.. కానీ మా పవన్ అన్న మాత్రం అభిమానులకు ఒరిజినల్ గాడ్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న. ఓజీ సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు’ అని ‘X’లో పోస్ట్ పెట్టారు.
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘OG’ మూవీని పైరసీ చేస్తామంటూ నెట్టింట హెచ్చరికలు వస్తున్నాయి. ‘బప్పమ్ టీవీ’ (IBOMMA) అనే పైరసీ వెబ్సైట్ ‘OG కమింగ్ సూన్’ అనే పోస్టర్ను షేర్ చేసింది. ప్రముఖ హీరోల సినిమాను కూడా లీక్ చేస్తామంటూ హెచ్చరికలు రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, ఆ పోస్టర్ను ‘బప్పమ్ టీవీ’ వెంటనే డిలీట్ చే...
TG: రేపు రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ రెట్లను పెంపును హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు వస్తాయా? లేదా? అన్న చర్చ మొదలైంది. అయితే బెనిఫిట్ షో, మిగతా టికెట్లకు పెంచిన ధరలను రిఫండ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన సినిమా ‘మాస్ జాతర’. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ ‘A’ సర్టిఫికెట్ రావడంతో 18ఏళ్లు పైబడిన వారికి మాత్రమే థియేటర్లలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ నేపథ్యంలో బుక్ మై షో.. ఎవరైనా మైనర్లు టికెట్లు బుక్ చేసుకుని ఉంటే.. వారి టికెట్ డబ్బులు తిరిగిస్తామని తెలిపింది. ఇవాళ సాయంత్రం 6 గంటలోపు టికెట్ బుక్ చేసుకున్న వారి ఫోన్కి లింక్ వస్తుందని, దాన్ని ఓపెన్ చేసి క్యాన్సిల్ చేసుకోవాలని పేర్కొంది.
‘కాంతార 1’ సినిమాను థియేటర్లలో చూసే వారు మద్యం తాగకూడదు.. మాంసం తినకూడదు. సిగరెట్ తాగకూడదు అంటూ ఓ పోస్టర్ వైరల్ అయింది. దీంతో ఈ సినిమాపై వివాదం నెలకొంది. తాజాగా ఈ అంశంపై నటుడు రిషబ్ శెట్టి స్పందించారు. ఆ పోస్టర్తో తమకు సంబంధం లేదన్నారు. అది ఫేక్ పోస్టర్ అని, అలాంటి రూల్స్ ఏమీ లేవని పేర్కొన్నారు.
అక్కినేని నాగార్జున తన 100వ సినిమాను తమిళ కొత్త దర్శకుడు రా. కార్తీక్తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దసరా కానుకగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారాలను ప్రకటించింది. 2021కి గాను సాయి పల్లవి, SJ సూర్య సహా ఐదుగురు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 2023కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్తో పాటు ఆరుగురు దీన్ని అందుకోనున్నారు. జాతీయ పురస్కారాల విభాగంలో సింగర్ K.J ఏసుదాస్కు MS సుబ్బులక్ష్మి అవార్డును ప్రకటించారు. OCTలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
OG మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపును రద్దు చేసింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ జారీ చేశారు. కాగా, ఈ సినిమా రేపు విడుదల కానుంది.
లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నివాసంలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు స్వాధీనం చేసుకున్న కార్లలో ఒక వాహనం దుల్కర్ పేరు మీద రిజిస్టర్ కాలేదు. దీంతో ఆ కారు యజమాని ఎవరనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు సంబంధించి దుల్కర్కు సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వారం రోజుల గ్యాప్లోనే పవన్ ‘OG’, రిషబ్ శెట్టి ‘కాంతార 1’లు విడుదల కాబోతున్నాయి. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ల వ్యూస్ పరంగా ‘కాంతార 1’.. ‘OG’ని డామినేట్ చేసింది. తెలుగులో ‘OG’ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్, ‘కాంతార 1’ 15 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్ట...
యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన మూవీ ‘మిరాయ్’. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.140.08 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.
నిర్మాత దిల్ రాజు మరో సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్తో మూవీ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అజిత్, దిల్ రాజ్ కథపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో మలయాళ నటుడు అమిత్ చక్కలకల్ నివాసంలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిపై అమిత్ స్పందిస్తూ.. అధికారులు స్వాధీనం చేసుకున్న కార్లలో ఒకటి మాత్రమే తనదని చెప్పారు. మిగిలిన కార్లను వాటి ఓనర్స్ మరమ్మతుల కోసం తన వద్దకు తీసుకొచ్చారన్నారు. గతంలో ఇదే విషయంపై సమన్లు జారీ కాగా.. అందుకు సంబంధించిన పత్రలన్నింటినీ అందించానని చెప్పారు.