స్టార్ హీరోలు హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను నిర్మాత నాగవంశీ భారీ ధరకు దక్కించుకున్నాడు. కాగా, ఎన్టీఆర్ గత చిత్రం ‘దేవర’ హక్కులను కూడా ఆయనే దక్కించుకున్నాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్పై నయా అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం HYDలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్రబృందం ఢిల్లీకి వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. జూలై 12 నుంచి జాన్వీ కపూర్ ఈ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం.
మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ మూవీ రేపు విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ టీంకు మంచు మనోజ్ ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. నాన్న మోహన్ బాబు నటించిన సినిమా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షించాడు. ఈ మూవీలో భాగమైన ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవాలకు కృతజ్ఞతలు చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
‘కుబేర’ మూవీతో మంచి హిట్ అందుకున్న నటి రష్మిక మందన్న తదుపరి ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాపై రష్మిక అప్డేట్ ఇచ్చింది. ‘రేపు ఉదయం 10:08 గంటలకు నా కొత్త మూవీ టైటిల్ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ టైటిల్ను గెస్ చేయగలరా? చేస్తే మిమ్మల్ని కలవడానికి వస్తానని మాట ఇస్తున్నాను’ అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది.
AP: మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. టికెట్పై రూ.50 (జీఎస్టీ అదనం) అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈ పెరిగిన ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. కాగా, ఈ చిత్రం 27న విడుదల కానుంది.
ఇటీవల ‘కుబేర’ మూవీతో మంచి హిట్ అందుకున్న హీరో ధనుష్ తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయన.. దర్శకుడు వెంకీ అట్లూరితో మరోసారి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027లో స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, గతంలో వీరిద్దరి కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమా ‘సార్’ తెరకెక్కిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కన్నప్ప’. ఈ నెల 27న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృంతం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మరో రెండు రోజుల్లో ‘కన్నప్ప’ సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమాపై ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’ అంటూ హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్లో మంచి రెస్పాన్స్ అందుకున్న వెబ్ సిరీస్ ‘పంచాయత్’. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి మూడు సీజన్లు రిలీజ్ కాగా.. తాజాగా నాలుగో సీజన్ అందుబాటులోకి వచ్చేసింది. ఫులేరా గ్రామంలోని ఎన్నికలే ప్రధానంగా ఈ సిరీస్ను దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ కలిసి తెరకెక్కించారు. ఇందులో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మరాఠీ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు తుషార్ ఘడిగావ్కర్(32) ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సరైన మూవీ అవకాశాలు లేకపోవడం, పని ఒత్తిడి కారణంగా డిప్రెషన్లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. కాగా.. అతను సినిమాలు, నాటక రంగంలో పని చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మూవీ తెరకెక్కుతోంది. ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో జరిగిన ఈ షూటింగ్లో చిరు, నయనతార, కేథరిన్లపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతుంది.
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కిన సినిమా ‘ఘాటీ’. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్కు డేట్ ఫిక్స్ అయింది. ‘సైలోరే’ అంటూ సాగే ఈ పాటను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాలో ‘మీర్జాపూర్’ సిరీస్ నటుడు దివ్యేందు రామ్ బుజ్జి పాత్రలో కనిపించనున్నాడు. ఇవాళ దివ్యేందు బర్త్ డే సందర్భంగా.. అతనికి మేకర్స్ విషెస్ చెప్పారు. ఈ మేరకు మూవీ నుంచి అతనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 2026 మార్చి 27న రిలీజ్ కానుంది.
కన్నడ స్టార్ యష్, గీతూ మోహన్ దాస్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘టాక్సిక్’. తాజాగా ఈ మూవీపై అప్డేట్ వచ్చింది. ముంబైలో దీని షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తోంది. యష్, కియారా అద్వానీల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారట. కియారా ప్రెగ్నెంట్ కావడంతో మూవీలో తన పార్ట్ పూర్తి అవ్వడం కోసం యష్.. షూటింగ్ లొకేషన్ను బెంగళూరు నుంచి ముంబైకి మార్చినట్లు సమాచారం.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా ‘కూలీ’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్పై అప్డేట్ వచ్చింది. ఈ వారంలోనే ఇది రిలీజ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సన్పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించగా.. ఈ మూవీ ఆగస్టు 14న విడుదలవుతుంది.
మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్తో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలుత మూవీ ట్రైలర్ను జూన్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, అహ్మదాబాద్ విమాన ఘటనతో వాయిదా వేశారు. అయితే, తాజాగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని మంచు విష్ణు ‘X’ వేదికగా ప్రకటించాడు.