‘ధురంధర్-2’లో శివ్ కుమార్ ఎడిటింగ్, శాశ్వత్ సచ్దేవ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాయని RGV అన్నాడు. ముఖ్యంగా రెట్రో హిందీ పాటలను యాక్షన్ సీన్స్లో వాడటం సినిమాకు కొత్త మూడ్ ఇచ్చిందని చెప్పాడు. సైనీ జోహ్రే ప్రొడక్షన్ డిజైన్ పాకిస్తాన్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిందని, సౌండ్ డిజైన్లో వాడిన ‘నిశ్శబ్దం’ ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టిందన్నాడు.
హీరో నితిన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వి.ఐ. ఆనంద్తో సైన్స్ ఫిక్షన్ మూవీ, నాగవంశీ నిర్మాణంలో ఒక చిత్రం లైనప్లో ఉండగా.. తాజాగా ‘ఆయ్’ దర్శకుడు అంజి కె. మణిపుత్రతో తన తదుపరి సినిమాను ప్రకటించాడు. రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినా, షూటింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.
‘ధురంధర్-2’ సినిమాలోని 30 నిమిషాల మసీదు ఫైట్ సీక్వెన్స్ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘విజువల్ సింఫనీ’గా పేర్కొన్నాడు. 6 రోజుల రిహార్సల్స్, 14 రోజుల షూటింగ్తో అత్యంత క్రూరంగా చిత్రీకరించిన ఈ క్లైమాక్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఉందన్నాడు. ఏజాజ్ గులాబ్ యాక్షన్ కొరియోగ్రఫీని ఆదిత్య ధర్ అద్భుతంగా మలిచి, ప్రేక్షకులకు గగుర్పాటు కలిగించే అనుభూతిని అందించారని చెప్పాడు.
ఫిల్మ్ స్టూడెంట్స్కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక సూచన చేశాడు. ‘ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు వెళ్లడం మానేయండి, ఆ డబ్బుతో ‘ధురంధర్ 2′ థియేటర్లో గడపండి’ అని అన్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వాన్ని ఒక ‘సర్జికల్ వార్ఫేర్’గా అభివర్ణించాడు. ఫిల్మ్ మేకింగ్కు ఈ సినిమా ఒక టెక్స్ట్ బుక్ అని.. ఇందులో ఎమోషన్స్, యాక్షన్ను అద్భుతంగా మేళవించా...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల జూన్ 26కు వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న నిర్మాత SKN ఈ విషయాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమిళంలో చిన్న సినిమాగా వచ్చి రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘తాయ్ కిళవి’ ఓటీటీ డేట్ ఖరారైంది. నటి రాధిక ప్రధాన పాత్రలో, హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ కామెడీ డ్రామా ఏప్రిల్ 10 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రోల్ కోసం రాధిక పడ్డ కష్టం, మేకప్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఇండియన్ హెర్క్యులస్గా పేరొందిన కుస్తీ వీరుడు కోడి రామమూర్తి నాయుడు రిఫరెన్స్ ‘పెద్ది’ చిత్రంలో ఉండటంపై ఆసక్తి నెలకొంది. ఓటమి ఎరుగని ఆయన చరిత్రపై సినిమా తీస్తే తెలుగోడి సత్తా దేశమంతా తెలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏనుగు బరువును మోసిన వీరుడి బయోగ్రఫీయే పెద్ది సినిమానా అనే చర్చ నడుస్తోంది. ఇదే నిజమైతే ఈ వీరగాథ వెండితెరపై మన చరిత్రను ఎలా చాటి చెబుతుందో చూడాలి.
డ్రగ్స్ కేసు ఆరోపణలు తనను తీవ్రంగా కుంగదీశాయని సీనియర్ నటి హేమ తెలిపింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపింది. ఆ సమయంలో అనుభవించిన మానసిక వేదన వర్ణనాతీతమని పేర్కొంది. అయితే, తాను ఏ తప్పూ చేయలేదనే నమ్మకంతోనే న్యాయపోరాటం చేశానని, చివరకు కోర్టులో నిర్దోషిగా తేలడంతో తనకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని వెల్లడించింది.
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ భారతీయ సినీ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మూడు రూ.1000 కోట్ల క్లబ్ చిత్రాల్లో (KGF 2, జవాన్, ధురంధర్ 2) భాగమైన ఏకైక నటుడిగా ఆయన రికార్డు సృష్టించాడు. హీరోగానే కాకుండా విలన్, సహాయక పాత్రల్లో మెప్పించడం ద్వారా తన వెర్సటిలిటీని చాటుకుని ఈ ఘనత సాధించడం విశేషం.
ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్లలో, OTTల్లో అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 3న బైకర్, రాకాస, కార్మేని సెల్వం, లీడర్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు ఏప్రిల్ 3న నెట్ఫ్లిక్స్లో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస’, వధ్ 2 స్ట్రీమింగ్ కానున్నాయి. జీ5లో మార్చి 31న ‘హే బల్వంత్’ అందుబాటులోకి రానుంది.
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ మూవీ FEB 6న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 2 నుంచి ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్, రోహిత్, నాజర్, విఘ్నేష్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
హిప్ హాప్ తమిళ ఆది దర్శకత్వంలో వస్తున్న ‘మీసయ మురుక్కు-2’తో కేతిక శర్మ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులోని ‘ఆర పత్తుక్కు పత్తు’ సాంగ్లో ఆమె స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కేతిక మాట్లాడుతూ.. తమిళంలోనూ టాప్ హీరోయిన్గా ఎదగాలని ఉందని తెలిపింది. దీంతో నెటిజన్లు, తెలుగులో హిట్ లేకపోయినా కనీసం తమిళంలోనైనా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.
‘ధురంధర్ 2’ మూవీని చూసి ఆదిత్య ధర్పై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రశంసలు కురిపించాడు. ఆదిత్యను అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడిగా అభివర్ణిస్తూనే, పరిశ్రమ పట్ల ఒక ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చాడు. ఇండస్ట్రీలోని రాజకీయాలు, గ్రూపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తన ప్రతిభను కాపాడుకోవాలని సూచించాడు. చిత్ర పరిశ్రమ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, అంతకంటే క్రూరంగా కూడా ఉంటుందని హెచ్చరించాడు.
నటుడు ప్రకాష్ రాజ్ తల్లి సువర్ణలత మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ప్రకాష్ రాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలి’ అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా నివాళులర్పించారు.