హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘ఈషా’ మూవీ మంచి విజయం సాధించింది. తొలిరోజు ఈ చిత్రం రూ.2.18 కోట్లపైగా కలెక్షన్స్ను రాబట్టింది. ఇక దర్శకుడు శ్రీనివాస్ మన్నే రూపొందించిన ఈ మూవీలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘వృషభ’ మూవీ DEC 25న మలయాళం, తెలుగులో విడుదలైంది. దాదాపు రూ.70 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే కేవలం రూ.70 లక్షల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇది మోహన్ లాల్ కెరీర్లోనే అత్యల్ప ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కించాడు.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శంబాల’ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్స్పై అప్డేట్ వచ్చింది. వరల్డ్ వైడ్గా ఈ చిత్రం ఫస్ట్ డే రూ. 3.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ సినిమాలో అర్చనా అయ్యర్, శ్వాసిక విజయ్, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు.
తనపై వచ్చిన ట్రోల్స్పై నటుడు తేజ సజ్జా స్పందించాడు. పెద్ద హీరోలను కూడా ట్రోల్ చేస్తున్నారని, నేషనల్ అవార్డులు తీసుకున్న సినిమాలపై విమర్శలు చేస్తున్నారని తెలిపాడు. ఇప్పుడు కాకపోతే 10ఏళ్ల తర్వాత అయినా నిజాలు బయటకొస్తాయని, సమయం వచ్చినప్పుడు మన విలువ తెలుస్తుందన్నాడు. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు కొనసాగలేమని చెప్పాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటిస్తోంది.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1006.7 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. 21రోజుల్లో ఈ అరుదైన ఫిట్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించాడు.
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు రూ.4.50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం తెరకెక్కించగా.. అనశ్వర రాజన్ కథానాయికగా నటించింది.
ప్రపంచ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఫ్రాంఛైజీ ‘అవతార్’. 2009లో మొదలైన ఈ సిరీస్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ కాగా.. సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే ఈ మూడు మూవీలు ఇప్పటివరకు ఏకంగా 5.6 బిలియన్ డాలర్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఇంకా ‘అవతార్ 3’ థియేటర్లలో రన్ అవుతుండటంతో.. ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ‘ఈషా’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా నిర్వహించిన ఈ మూవీ ప్రెస్ మీట్లో నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేశాడు. కొందరు కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని అన్నాడు. తాను గతంలో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఇప్పుడు ‘ఈషా’ టీం అనుభవిస్తున్న బాధను తాను అర్థం చేసుకోగలనని తెలిపాడు.
ప్రపంచవ్యాప్తంగా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్న వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్ 5 పార్ట్ 1 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 4 ఎపిసోడ్స్తో వచ్చిన ఈ సిరీస్ OTTలో అదరగొడుతోంది. తాజాగా ఈ సీజన్ పార్ట్-2 కూడా సదరు OTTలో అందుబాటులోకి వచ్చేసింది. మొత్తం 3 ఎపిసోడ్స్తో వచ్చేసిన ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘రివాల్వర్ రీటా’. నవంబర్లో రిలీజైన ఈ సినిమా తాజాగా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఇది అందుబాటులో ఉంది. ఇక దర్శకుడు జే.కే చంద్రు తెరకెక్కించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్గా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. తాజాగా, సామ్ తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటికి ‘ఎ ఇయర్ ఆఫ్ గ్రాటిట్యూడ్’అనే క్యాప్షన్ జోడించింది. ఈ ఇయర్లో తనకు హ్యాపీనెస్ కలిగించిన తన మెహందీ, పెళ్లి, శుభం మూవీ సక్సెస్, రాజ్ నిడుమోరుతో తీసుకున్నవి షేర్ చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్గా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. తాజాగా, సామ్ తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటికి ‘ఎ ఇయర్ ఆఫ్ గ్రాటిట్యూడ్’అనే క్యాప్షన్ జోడించింది. ఈ ఇయర్లో తనకు హ్యాపీనెస్ కలిగించిన తన మెహందీ, పెళ్లి, శుభం మూవీ సక్సెస్, రాజ్ నిడుమోరుతో తీసుకున్నవి షేర్ చేసింది.
వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోన్న మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘కొన్నేళ్లుగా దక్షిణాదిలో, బాలీవుడ్లో మంచి అవకాశాలను అందుకుంటున్నా. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటా. అయితే దక్షిణాది చిత్రాల్లో నటించడమనేది నా ప్రణాళికలో లేదు. ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ అవకాశాన్ని ఒక వరంలా భావిస్తాను’ అని పేర్కొంది.
మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలకు మాజీ సర్పంచ్ నవ్య మద్దతు ప్రకటించారు. తమ దుస్తులు తమ ఇష్టం అంటున్న వారిపై ఆమె మండిపడ్డారు. ‘పశువులకు ఏమీ తెలియదు కాబట్టే అవి బట్టలు కట్టుకోవు. కానీ మనం కడుపుకు అన్నం తింటున్నాం, మనుషుల్లాగా బట్టలు కప్పుకోవాలి కానీ విప్పుకోకూడదు. బట్టలు విప్పుకునే మీలాంటి వారి వల్లే సమాజంలో మంచి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.