సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాలో నటుడు నరేష్ భాగమయ్యాడు. ఇందులో ఆయన ‘స్వతంత్ర బాబు’ పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ మేకర్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా పరిచయమవుతుండగా.. మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
టాలీవుడ్ నటుడు సత్య, దర్శకుడు రితేష్ రానా కాంబోలో వస్తున్న చిత్రం ‘జెట్లీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ అనే సాంగ్ను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. ‘మత్తు వదలరా’ టీమ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచ...
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాకు ‘కురుక్షేత్రం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్కు తగ్గట్టుగా యుద్ధం, ఎమోషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉండనున్నట్లు సమాచారం. పౌరాణిక అంశాలను ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా వివేక్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ‘రాకాస’ మూవీ 2026, ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్కు మేకర్స్ ప్లాన్ చేశారు. ఏప్రిల్ 2న తెలంగాణ, APలోని పలు నగరాల్లో ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఇక దర్శకురాలు మానస వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయన్ సారిక కథానాయికగా నటిస్తుంది.
రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇండియాలో 3 కోట్ల ఫుట్ఫాల్స్ (ప్రేక్షకుల సంఖ్య) మార్కును దాటి బాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. కరోనా తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో హిందీ చిత్రంగా నిలిచింది. గతంలో గదర్ 2, జవాన్, స్త్రీ 2, ఛావా, ధురంధర్ 1 మాత్రమే ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కాంబోలో ఓ భారీ సూపర్ హీరో మూవీ రాబోతున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ కెరీర్లో 25వ చిత్రంగా ఇది రూపొందనుందట. బాసిల్ ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని, అల్లు అర్జున్ను సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నారని టాక్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
‘పెద్ది’ సెట్స్లో రామ్ చరణ్ గాయపడిన విషయం తెలిసిందే. డూప్ లేకుండా స్టంట్స్ చేస్తుండగా ఆయన కంటిపై గాయం కావడంతో యూనిట్ చికిత్స అందించింది. అయితే, మార్చి 27న ఆయన పుట్టినరోజు కావడంతో గాయంతోనే సెట్స్లో వేడుకలు జరుపుకున్నాడు. ఎల్లో శాలువా, రగ్గడ్ లుక్లో కంటిపై కుట్లతో ఉన్న చరణ్ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
‘బేబీ’ కాంబో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘EPIC- First Semester’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ తేదీన రావాల్సిన ‘పెద్ది’ వాయిదా పడే అవకాశం ఉండటంతో, మేడే, వీకెండ్ సెలవులను క్యాష్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప...
తమిళ హీరో విజయ్ దళపతి, దర్శకుడు H. వినోద్ కాంబోలో రూపొందిన మూవీ ‘జన నాయగన్’. జనవరి 9, 2026న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదలపై సాలిడ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఏప్రిల్ 24, 2026లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ను కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. షూటింగ్ సెట్లో తనతో అనుచితంగా ప్రవర్తించారని ఓ యువ నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలతో ఆయన తన అకాడమీ పదవికి రాజీనామా చేశారు. హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో బయటపడుతున్న వరుస వేధింపుల కేసుల్లో ఇది మరో సంచలనంగా మారింది.
NTR-ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో ‘డ్రాగన్’లో తాను నటించడం లేదని మలయాళ స్టార్ టొవినో థామస్ స్పష్టం చేశాడు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన కొత్త సినిమా ‘పళ్లిచట్టంబి’ ప్రమోషన్స్లో వెల్లడించాడు. తెలుగు సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయని, ఒకేసారి 2-3 సినిమాలు చేయడం తనకు ఇష్టం ఉండదని తెలిపాడు.
బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 సరికొత్త వివాదంలో చిక్కుకుంది. తన స్టోరీని కాపీ కొట్టి సినిమా తీశారని తాజాగా కన్నడ దర్శకుడు ఆర్ఎస్ సంతోష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు. 2023లోనే ఈ కథను రిజిస్టర్ చేయించానని తెలిపాడు. టీ-సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థలకు ఈ కథ వినిపించానని ఆర్ ఎస్ సంతోష్ కుమార్ షాకింగ్ నిజాలను బయటపెట్టాడు.
స్టార్ మా: జనతా గ్యారేజ్(9AM); జీతెలుగు: కలిసుందాంరా(9AM), స్పైడర్(4.30PM); ఈటీవీ: అమ్మో ఒకటో తారీఖు(9AM); జెమిని: ఒక్కడు(9AM), అన్నయ్య(3:30PM); స్టార్మా మూవీస్: ది గోస్ట్(9AM), సర్కారు వారి పాట(12PM), నా సామిరంగ(3PM), రాజా దిగ్రేట్(6PM), మంగళవారం(9PM); Z సినిమాలు: బ్రాండ్ బాబు(7AM), ఒంగోలు గిత్త(9AM), ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(3PM), ప్రేమలు(6PM), గజకేసరి(9PM).
‘ధురంధర్ 2’ సంచలన విజయం దర్శకుడు రాజమౌళి ఆలోచన విధానంలో మార్పు తెచ్చినట్లు తెలుస్తోంది. తన తదుపరి ప్రాజెక్ట్ ‘వారణాసి’ని కేవలం ఒకే భాగంగా కాకుండా, రెండు భాగాలుగా తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. తన రూ.1000 కోట్ల బడ్జెట్ కథను కుదించకుండా ఎపిక్ నెరేటివ్గా అందించాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇందుకోసం సీనియర్ రైటర్లతో చర్చలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.
స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1390 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కర్ణాటకలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అలాగే, అత్యధిక వసూళ్లు చేసిన టాప్ భారతీయ చిత్రాల జాబితాలో, గతంలో నాలుగో స్థానంలో ఉన్న ‘ధురంధర్ 1’ (రూ.1350 కోట్లు) రికార్డును దాటేసింది.