శర్వానంద్ హీరోగా.. దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘బైకర్’. APR 3న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్పై ఇలాంటి సినిమా చేయలేదు. తీయలేదు, చూడలేదు. ఈ సంక్రాంతికి చెప్పి మరీ హిట్ కొట్టాను. మరోసారి చెబుతున్నా బైకర్ బంపర్హిట్ అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశాడు.
మెగాహీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి మెగా డాటర్ నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘వాళ్ల లవ్స్టోరీ గురించి నాలుగేళ్ల తర్వాత తెలిసింది. ఇండస్ట్రీలో అన్నయ్యకు ఎక్కువమంది ఫ్రెండ్స్ లేరు. అందుకే ఆ విషయం సీక్రెట్గా ఉంది. ఎవరినీ పార్టీలకు పిలవడు కానీ అన్నయ్య బర్త్డేకి లావణ్య వచ్చింది. అప్పుడే వాళ్లు లవ్లో ఉన్నారని అర్థమైంది’ అని చెప్పింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు ‘AA22 X A6’. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కీలక పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక, మృనాల్ ఠాకూర్, జాన్వి కపూర్ వంటి హీరోయిన్లు కూడా కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్, దర్శకుడు ఆదిత్య ధర్పై ప్రశంసలు కురిపించింది. ‘ధురంధర్తో ఆదిత్య ధర్ దర్శకుడిగా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. హాలీవుడ్ స్టార్ దర్శకులు ఎల్లప్పుడూ నటుల కంటే గొప్పవారు. కానీ, మనం మన దర్శకనిర్మాతలకు ఎప్పుడూ తగినంత గౌరవం, గుర్తింపు ఇవ్వము. సెల్యూట్ ఆదిత్య ధర్’ అని ‘X’ వేదికగా రాసుకొచ్చింది.
నటి రేణు దేశాయ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారాయి. రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్ 2’ సినిమా చూసిన ఆమె, ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. సినిమాలో ‘ఈ ఛాయ్వాలా వచ్చాక మనలో భయం పెరిగింది’ అనే డైలాగ్ను ప్రస్తావిస్తూ.. తాను ‘గర్వించదగ్గ అంధభక్తురాలిని’ అని పోస్ట్ చేసింది.
ధురంధర్ మూవీపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘X’ వేదికగా స్పందించాడు. ఆధిత్యధర్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘రిల్ లైఫ్ హమ్జా(రణ్వీర్) పాక్ ఉగ్రవాదులను అంతం చేస్తే, రియల్ లైఫ్ హమ్జా(ఆదిత్యధర్) భారతీయ చిత్ర దర్శకులను పని పడుతున్నాడు. ఉగ్రవాదులు ప్రాణాలకై పారిపోవచ్చు, కానీ అతడి ప్రతిభ నుంచి తమ సినిమాలను కాపాడుకోవడానికి దర్శకులు ఎక్కడికి పారిపోతారు?’ అని అన్నాడు.
ఉత్తరాంధ్ర బుర్ర కథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. తాజాగా ఈ మూవీ నుంచి ‘కూసింది కోయగూర’ అంటూ సాగే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. పూర్తి పాటను మార్చి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గౌరీనాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆనంది ప్రధాన పాత్రలో కనిపించనుంది.
గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది మరోసారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ‘గౌతమ్ నంద’, ‘సిటిమార్’ వంటి చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇరువురు తమ ప్రస్తుత సినిమాలను పూర్తి చేసిన తర్వాత, ఈ కొత్త చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో ఓ సినిమా చేయనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. ఆత్రేయ చెప్పిన కథ నచ్చడంతో కొత్త ప్రాజెక్ట్కు బాలయ్య అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో దర్శకుడు ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసినట్లు తెలిసింది.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీలో మరో భారీ విల్లాను కొనుగోలు చేసినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అక్కడి వాతావరణంపై మక్కువతో ఖాళీ దొరికితే ఆయన ఇటలీకే వెళ్తుంటాడు. గతంలోనే ఒక విల్లా కొన్న ప్రభాస్, తాను లేని సమయంలో దానిని అద్దెకు ఇస్తాడని సమాచారం. ఇప్పుడు మరో విల్లా కొనడంతో భవిష్యత్లో ప్రభాస్ అక్కడే సెటిల్ అవుతాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు,రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ తదుపరి షెడ్యూల్ కాశీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అక్కడ భారీ యాక్షన్ సీన్లను ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి కాగా, మిగిలిన భాగాన్ని అంటార్కటికా, వియత్నాం, థాయ్లాండ్లలో చిత్రీకరించనున్నట్లు టాక్. కాగా, ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ యాంకర్ సుమ కనకాల పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త, నటుడు రాజీవ్ కనకాల సోషల్ మీడియా వేదికగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘నిండు నూరేళ్లు కాదు.. 120-130ఏళ్ల వరకు మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా ఉండాలి’ అంటూ భార్యపై తన ప్రేమను చాటుకున్నాడు. 1999లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
‘ధురంధర్ 2’ చిత్రంపై యూట్యూబర్ ధృవ్ రాఠీ విమర్శలు చేశాడు. దీన్ని పచ్చి ప్రచార చిత్రంగా అభివర్ణిస్తూ.. దర్శకుడు ఆదిత్య ధర్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శించాడు. ఈ సినిమా చూస్తే మెదడు మొద్దుబారిపోతుందని ఎద్దేవా చేశాడు. అయితే, ఈ విమర్శలను లెక్కచేయకుండా ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.63.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సూర్య కథానాయకుడిగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా మే 14న విడుదల కానుంది. అయితే తొలుత ఈ కథను విజయ్తో చేయాలనుకున్నట్లు దర్శకుడు బాలాజీ తెలిపాడు. కథా విస్తృతి పెరగడంతో స్టార్ హీరో కావాలని విజయ్ను సంప్రదించగా, రాజకీయాల వల్ల ఆయనకు కుదరలేదు. ఆ తర్వాత సూర్యను ఎంపిక చేసి, ఆయన శైలికి తగ్గట్టుగా కథలో మార్పులు చేసినట్లు వెల్లడించాడు.