సినిమా విజయానికి నిడివి కంటే కంటెంట్ ముఖ్యం అని ‘యానిమల్’, ‘పుష్ప-2’, ‘ధురంధర్’ చిత్రాలు నిరూపించాయి. 3 గంటలకుపైగా నిడివి ఉన్నా, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారంటే కారణం బలమైన కథనం. రొటీన్ ఫార్ములాలు కాకుండా, ఎమోషన్స్, ఎంగేజింగ్ స్క్రీన్ప్లేతో వస్తే నిడివి అడ్డంకి కాదని, కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎన్ని గంటలైనా థియేటర్లో కూర్చుంటారని ఈ మూవీలు నిరూపించాయి.
హాలీవుడ్ సీనియర్ నటి వాలెరీ పెర్రిన్ (82) కన్నుమూశారు. గత పదేళ్లుగా పార్కిన్సన్స్ వ్యాధితో పోరాడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. 1978లో వచ్చిన ‘సూపర్మ్యాన్’ చిత్రంలో లెక్స్ లూథర్ గర్ల్ఫ్రెండ్ ‘మిస్ టెష్మాకర్’ పాత్రలో ఆమె పోషించిన నటన మరువలేనిది. మోడల్గా కెరీర్ ప్రారంభించి, తన గ్లామర్, నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు.
నాగ్ అశ్విన్-ప్రభాస్ క్రేజీ కాంబోలో వచ్చిన ‘కల్కి’ సీక్వెల్పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం ఒక భారీ సెట్ను నిర్మిస్తున్నారట. ఈ సెట్లో ప్రభాస్ అదిరిపోయే ఎంట్రీ సాంగ్ను చిత్రీకరించనున్నారట. ఈ పాటలో ప్రభాస్తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా సందడి చేయనున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లోని శ్రీలీల ఎపిసోడ్ మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందని, ఆ ట్రాక్ కోసమే మహిళలు భారీగా థియేటర్లకు వస్తున్నారని తెలిపాడు. పవన్ను ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా చూపిస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉందన్నాడు.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన మ్యాజిక్ చేయలేకపోయింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం, మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.80.75 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు టాక్. డివైడ్ టాక్, నెగిటివ్ కామెంట్స్ సినిమాపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో పోలిస్తే ఈ వసూళ్లు తక్కువని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆది పినిశెట్టి నటించిన రివెంజ్ డ్రామా ‘శబ్దం’ ఎట్టకేలకు OTTలోకి వచ్చేసింది. అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. హారర్, ఎమోషనల్ అంశాలతో సాగే ఈ చిత్రం తాజాగా జీ5లో కేవలం తమిళ భాషలోనే అందుబాటులో ఉంది. దీంతో తెలుగు ప్రేక్షకులు కాస్త నిరాశకు గురయ్యారు.
అమెరికన్ సింగర్, బ్లూగ్రాస్, కంట్రీ మ్యూజిక్ లెజెండ్ రోనీ బోమాన్ (64) కన్నుమూశాడు. మార్చి 22న టేనస్సీలో జరిగిన బైక్ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ‘ది లోన్సమ్ రివర్ బ్యాండ్’ మాజీ సభ్యుడైన ఆయన, మూడుసార్లు IBMA ‘మేల్ వోకలిస్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు అందుకున్నాడు. గాయకుడిగా, పాట రచయితగా సంగీత ప్రపంచంలో అతను చెరగని ముద్రవేశాడు.
శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్లు సమాచారం . గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సామజవరగమన’ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇటీవల శ్రీవిష్ణు నటించిన రెండు సినిమాలు నిరాశపరచడంతో, ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభమైనట్లు టాక్.
రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో క్లాసిక్ హిట్గా నిలిచిన ‘డార్లింగ్’ చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ఏ. కరుణాకరన్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. 2026, ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రీ-రిలీజ్ చేస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ మ్యాజికల్ లవ్ స్టోరీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘ధురందర్ 2’ ప్రభంజనంపై తలైవా రజినీకాంత్ ప్రశంసలు కురిపించడంపై దర్శకుడు ఆదిత్య ధర్ ఎమోషనల్ అయ్యాడు. ‘వినోదానికి మీరే మా బెంచ్మార్క్. మీ స్టైల్, గ్రేస్ అద్భుతం. అలాంటిది మీరు మా సినిమాను మెచ్చుకోవడం నా జీవితంలో అతిపెద్ద సూపర్స్టార్ మూమెంట్. మీ మాటలు ఒక వరంలా ఉన్నాయి’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. విడుదలైన ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.829.76 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో రూ.619.76 కోట్ల గ్రాస్(రూ.519.12 CR నెట్). ఓవర్సీస్లో రూ.210 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు పేర్కొన్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ టీజర్ను మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ టీజర్ నిడివి కేవలం 40 సెకన్లు మాత్రమే ఉంటుందని సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.
వివాదాస్పద హిందీ చిత్రం ‘ద తాజ్ స్టోరీ’ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం లయన్స్ గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫారమ్లలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక పరేష్ రావల్ ప్రధాన పాత్రలో తుషార్ అమ్రిష్ గోయల్ తెరకెక్కించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా.. తాజ్ మహల్ అసలు పేరు ‘తేజో మహాలయ’ అని, అది ఒకప్పుడు శివాలయం అనే కథాంశంతో సాగుతుంది.
హీరోయిన్ సమీరా రెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘చిన్నప్పుడు నాకు నత్తి ఉండేది. దానివల్ల నన్ను వెక్కిరిస్తూ వేధించేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను నత్తిగా మాట్లాడినప్పుడు ఎవరైనా సెటైర్లు వేస్తే బాధగా ఉంటుంది. చిన్ననాడు మనల్ని ఏమేం అంటారో అవన్నీ మనసులో పాతుకుపోయుంటాయి’ అని పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బాబీ ‘మెగా 158’ మూవీని తెరకెక్కించనున్నాడు. అయితే ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నెలలోనే అధికారికంగా సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఫస్ట్ షెడ్యూల్లో మెగాస్టార్ సోలో ఎంట్రీ సీన్స్తో పాటు, ఒక భారీ సాంగ్ను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.