‘లిటిల్ హార్ట్స్’ మూవీతో దర్శకుడిగా పరిచమైన సాయి మార్తాండ్ తొలి ప్రాజెక్టుతో భారీ విజయం అందుకున్నాడు. తాజాగా ఆయన.. హీరో అడివి శేష్తో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల అడివి శేష్కి సాయి మార్తాండ్ కథను వినిపించగా.. అతను ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్ 2’ చిత్రం కేవలం 7 రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. ఈ అద్భుత విజయంపై చిత్ర బృందానికి స్టార్ హీరో ఆమిర్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, తాను ఇప్పటివరకు ఈ సినిమాను చూడలేదని, కానీ మూవీ చాలా బాగుందని అందరూ చెబుతున్నారని పేర్కొన్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని వీక్షిస్తానని వెల్లడించాడు.
రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ‘వెంకీ’ మూవీ విడుదలై నేటితో 22ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది కేవలం సినిమా కాదు, ఒక మధుర ప్రయాణమని పేర్కొన్నాడు. సహజమైన నైట్ ఎఫెక్ట్ కోసం 70 రోజుల షూటింగ్లో, వరుసగా 40 రాత్రులు కష్టపడ్డామని వెల్లడించాడు. రవితేజ అందించిన తిరుగులేని సహకారం వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని అన్నాడు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి నటించనున్న సినిమా ‘జై హనుమాన్’. ఈ మూవీ కోసం రిషబ్ రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ + లాభాల్లో వాటాను తీసుకోనున్నట్లు టాక్. దీనివల్ల నిర్మాతలపై భారం తగ్గడమే కాకుండా, సినిమా బ్లాక్ బస్టర్ అయితే రిషబ్కు భారీ లాభం చేకూరుతుంది. ఒకవేళ ఈ చిత్రం రూ.600 కోట్లు వసూలు చేస్తే, వాటాల రూపంలో ఆయనకు ఏకంగా రూ.150 కోట్లకుపైగా వచ్చే అవకాశం ఉందట.
బావమరదళ్ల ప్రేమకథతో వచ్చిన సినిమా ‘బ్యాండ్ మేళం’. మ్యూజిక్ ఇండస్ట్రీలో రాణించాలనుకునే యాదగిరి(రోషన్).. తన మరదలు రాజి(శ్రీదేవి) ప్రేమని ఎలా గెలుచుకున్నాడనేది ఈ మూవీ కథ. నటీనటుల ప్రతిభ, అక్కడక్కడా పండిన కామెడీ, సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. అయితే.. రొటీన్ కథ, భావోద్వేగాలు పండకపోవడం, సాగదీత సీన్లు బోర్ కొట్టిస్తాయి. రేటింగ్: 2.25/5.
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ డబుల్ ఎంట్రీ సీన్పై వచ్చిన ట్రోల్స్కు దర్శకుడు హరీష్ శంకర్ గట్టిగా సమాధానమిచ్చాడు. ఒకే సీన్లో పవన్ రెండుసార్లు జీపు దిగడంపై స్పందిస్తూ.. ‘నాకు ఆ రెండు షాట్స్ నచ్చాయి. అందుకే పెట్టా. కొన్నిసార్లు లాజిక్ కంటే నాకు నచ్చిన మేకింగ్ స్వేచ్ఛకే ప్రాధాన్యత ఇస్తా. ఇలాంటి చిన్న చిన్న విమర్శలను నేను అస్సలు పట్టించుకోను’ అని అన్నాడు.
మలయాళ హీరో జయసూర్య, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘కథనార్’. అనుష్క ఈ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2026, మార్చి 31న మధ్యాహ్నం 1:31 గంటలకు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్కు ఇంకా 5 రోజులు మాత్రమే ఉందని మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నాడు.
శ్రీవిష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ మార్చి 6న రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 3, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ మూవీలో రెబా మోనికా జాన్ నటించగా, కాల భైరవ సంగీతం అందించాడు.
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఐకమత్యంగా ఉండాలన్న ప్రధాని మోదీ పిలుపుపై ‘కాంతార’ నటుడు కిషోర్ మండిపడ్డారు. దేశాన్ని కులమతాల వారీగా విభజించి, ప్రజల మధ్య ద్వేషాన్ని నింపిన తర్వాత మళ్లీ ‘అందరం ఒకటి’ అనడంపై ఆయన సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ప్రధాని అనాలోచిత నిర్ణయాల వల్ల దేశం ఇప్పటికే ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, ఇకనైనా విద్వేష రాజకీయాలు ఆపాలని అన్నారు.
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికే నెల రోజుల సుదీర్ఘ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని తెలిపాడు. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్న చిత్ర యూనిట్.. త్వరలోనే తదుపరి షెడ్యూల్ను స్టార్ట్ చేయనున్నట్లు చెప్పాడు.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నాగబంధం’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. 2026 జూలై 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక 1750 కాలం నాటి నేపథ్యంలో దేవాలయ నిధి రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నభా నటేష్, ఐశ్వర్యా మేనన్, జగపతి బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తన భర్త నిక్ జోనస్తో విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తోన్న వార్తలపై ప్రియాంక చోప్రా ఘాటుగా స్పందించింది. భిన్న దేశాలు, మతాలు, వయసు తేడా వల్ల కొందరు తమ బంధాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని మండిపడింది. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవడం మానేశానని, ఎనిమిదేళ్లుగా నిక్ జోనస్తో తన బంధం బలంగా ఉందని స్పష్టం చేస్తూ రూమర్లకు చెక్ పెట్టింది
రజీషా విజయన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సైన్స్ ఫిక్షన్ కామెడీ ‘మస్తిష్క మరణం’. ఇప్పటికే థియేటర్లలో మెప్పించిన ఈ చిత్రం మార్చి 27 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 2022లో విడుదలైన ‘వధ్’ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన క్రైమ్ డ్రామా ‘వధ్ 2’. ఈ సినిమా ఏప్రిల్ 3 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటు...
రణ్వీర్ సింగ్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ధురందర్’ షూటింగ్ పూర్తయిన సందర్భంగా తన హెయిర్ స్టైలిస్ట్ ముస్కాన్కు రణ్వీర్ స్వయంగా చేతితో రాసిన కృతజ్ఞతా లేఖను అందించాడు. ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ ఆయన రాసిన ఈ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సెట్లోని సిబ్బంది పట్ల రణ్వీర్ చూపిన గౌరవానికి నెటిజన్లు ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ 1, 2 మూవీ భారీ విజయం సాధించాయి. త్వరలోనే ‘పుష్ప 3’ రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ చిత్రంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆమె ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.