మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో భారీ VFXతో రూపొందుతున్న ఈ మూవీ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే మేకర్స్ ఒకేసారి డబుల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఒక పవర్ఫుల్ ట్రైలర్తో పాటు, కొత్త రిలీజ్ డేట్ను కూడా అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం వాయిదా పడింది. ముందుగా ఈ సినిమాను మే 1న విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజాగా 2026, జూన్ 26కి మార్చారు. రామ్ చరణ్ – బుచ్చిబాబుల ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద పోటీని నివారించేందుకు చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో మరో మాస్ యాక్షన్ సినిమా సిద్ధమవుతోంది. ముంబై బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, తాజాగా రెండో హీరోయిన్గా డింపుల్ హయాతి ఎంపికైనట్లు తెలుస్తోంది. సెకండాఫ్లో వచ్చే కీలక పాత్రలో ఆమె మెరవనుందట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్లో దశలో ఉంది.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజ హెగ్డే, మృణాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఈ ఇద్దరు నాయికల కాంబోలో ఓ సాంగ్ రాబోతున్నట్లు సమాచారం. వీరిద్దరి ప్రత్యేక స్టెప్పులతో ప్రేక్షకులను అలరించేలా ఈ పాట ఉంటుందట. ఈ రొమాంటిక్ డ్రామా జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్టార్ మా: కుబేర(8AM), సంతాన ప్రాప్తిరస్తు(1PM), ప్రేమంటే(3.30PM); జీతెలుగు: ది గ్రేట్ ఇండియన్ కిచెన్(9AM), శతమానం భవతి(12PM), తండేల్(2.30PM); జెమిని: నాంది(6AM), శివరామరాజు(9AM), విజిల్ (12PM), ఊపిరి(3.30PM), గుంటూరు కారం(6PM), దేవుడు చేసిన మనుషులు(10.30PM); స్టార్మా మూవీస్:చంద్రముఖి(12PM), KGF(3PM), పరుగు(6PM), సింగం-3(9PM); జీ సినిమాలు: 777 చార్లీ(3PM), ఘర్షణ(6PM).
తమిళ దర్శకుడు వెట్రిమారన్ ‘నీలిర’ ట్రైలర్ లాంచ్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ప్రతిదీ ప్రచారంగా మారుతోంది. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడ్డ కష్టాలను ద్వేషపూరిత ప్రచారంతో మార్చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డాడు. ఇలాంటి ప్రచార చిత్రాలకు వ్యతిరేకంగా వాస్తవాలను చూపే సినిమాలు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, ‘దురందర్ 2’ను ఉద్దేశించే ఆయన ఈ విమర్శలు చేశారని...
దర్శకుడు వెట్రిమారన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రస్తుతం ప్రతిదీ ప్రచారంగా మారుతోంది. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడ్డ కష్టాలను ద్వేషపూరిత ప్రచారంతో మార్చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డాడు. ఇలాంటి ప్రచార చిత్రాలకు వ్యతిరేకంగా వాస్తవాలను చూపే సినిమాలు రావాలని ఆయన పిలుపునిచ్చాడు. అయితే, ‘ధురంధర్-2’ను ఉద్దేశించే ఆయన ఈ విమర్శలు చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తనకు కులం, మతం లేదని ధ్రువీకరించే సర్టిఫికెట్ కోసం తమిళ నటుడు పార్తిబన్ చెన్నైలో దరఖాస్తు చేశాడు. ఇటీవల తన కులాన్ని ప్రస్తావించి విమర్శలు ఎదుర్కోవడంతో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనపై వచ్చిన విమర్శలు బాధించాయని, ఈ సర్టిఫికెట్ ద్వారా సమాజంలో మార్పు తెస్తానని ఆయన పేర్కొన్నాడు. దీనిని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తానని పార్తిబన్ వెల్లడించాడు.
‘పుష్ప’ మూవీతో టాలీవుడ్లో ఫహాద్ ఫాజిల్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ తప్ప మరే ఇతర తెలుగు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. విలన్ పాత్రల కోసం ఆయన ఏకంగా రూ.15-20 కోట్ల భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అంత పెద్ద మొత్తం ఇవ్వలేక టాలీవుడ్ నిర్మాతలు వెనుకంజ వేయడంతో, ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయని టాక్ నడుస్తోంది.
బెల్లంకొండ గణేష్ తన తదుపరి మూవీని దర్శకుడు కరుణాకరన్తో చేయనున్నట్లు తెలుస్తోంది. ‘స్వాతిముత్యం’, ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాల తర్వాత గణేష్ నటించబోయే క్రేజీ ప్రాజెక్ట్ ఇది. కరుణాకరన్ చెప్పిన కథ నచ్చడంతో గణేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ సినిమాను 2026 ఏప్రిల్ 13న అధికారికంగా ప్రారంభించనున్నారట. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘అధర్వం’ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అద్భుతమైన పాటలు అందించారు .అయితే ఆయన కేవలం అరగంటలోనే 4 అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేశారని అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. ఆ సమయంలో ఆ పాటల కోసం తొలుత ఆయన రూ.10 లక్షలు డిమాండ్ చేశారట. కానీ చివరకు కేవలం రూ.50వేలకే పాటలు కంపోజ్ చేసినట్లు సమాచారం.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో ‘చెన్నై లవ్ స్టోరీ’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘కింగ్ ఆఫ్ మెలోడీ రిటర్న్స్’ అంటూ రాబోతున్న ఈ పాట మార్చి 30న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానుంది. ఇక ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్న ఈ మూవీకి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాకాళి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ‘అసురగురువు శుక్రాచార్యుడు’గా నటిస్తున్నాడు. ఇవాళ అక్షయ్ ఖన్నా పుట్టినరోజు కావడంతో.. ప్రశాంత్ వర్మ సెట్స్లోని ఫొటోను షేర్ చేస్తూ విషెష్ తెలిపాడు. అక్షయ్ వంటి నటుడితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే అక్షయ్ తన షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.
‘ధురంధర్ 2’ సినిమాపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. అది హింసను ప్రేరేపించే ఒక పనికిరాని చిత్రమని, అందులో బూతులు తప్ప ఏమీ లేవని మండిపడ్డారు. ముఖ్యంగా ముస్లింలను చూపించిన విధానాన్ని ఆయన తప్పుబట్టారు. సినిమా హిట్టయినా తనకేం పట్టదంటూ “ఐసే చీజాం కు హమ్ లైట్ లేతే” అంటూ తనదైన హైదరాబాదీ యాసలో కొట్టిపారేశారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు జోడీగా నయనతార నటించనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు SVC బ్యానర్పై దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న సినిమాలో సల్మాన్ హీరోగా చేయనున్నట్లు టాక్. ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2026 ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2027 ఈద్ కానుకగా ఇది రిలిజ్ కానున్నట్లు సమాచారం.