తమిళ నటుడు కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ ‘యూత్’. ఈ సినిమా విడుదల తేదీలో స్వల్ప మార్పు జరిగింది. నిజానికి మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ, ఒక్కరోజు ఆలస్యంగా మార్చి 27, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇందులో అనిష్మ అనిల్కుమార్, దేవదర్శిని కీలక పాత్రలు పోషించారు.
రామ్ చరణ్, బుచ్చిబాబుల భారీ చిత్రం ‘పెద్ది’ ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది. నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ షెడ్యూల్లో మార్పు జరిగింది. చరణ్ పుట్టినరోజైన మార్చి 27న బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో దీన్ని ఏప్రిల్ 8కి వాయిదా వేశారు. అదే రోజున డి-బాక్స్, డాల్బీ సినిమా వంటి ప్రీమియం ఫార్మాట్ల టికెట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026’ వేడుకల్లో ఆయనకు ప్రతిష్టాత్మక ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్’ పురస్కారాన్ని అందజేశారు. దశాబ్దాలుగా సినిమా రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత్ మండపంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. బాలయ్య అభిమానులు ఈ ఘనతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్లతో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం ఇప్పటికే కీర్తి సురేష్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తాజాగా మరో ముఖ్యమైన పాత్ర కోసం ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
చంద్రముఖి చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ జ్యోతిక.. కెరీర్ ప్రారంభంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్లో నటిస్తున్న ఆమె 47 ఏళ్ల వయసులోనూ అందంగా, ఎనర్జిటిక్గా కనిపిస్తోంది. తాజాగా జ్యోతిక ఫిట్నెస్తో కూడిన తన ఫొటోలను మీడియాకు విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. చరణ్ బర్త్ డే సందర్భంగా.. ఈ సినిమా టీజర్ను ఈనెల 27న ఉ.11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
హీరో రాజ్తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్చల్ చేసింది. మద్యం మత్తుతో కారుతో బైక్ను ఢీకొట్టింది. అనంతరం లావణ్యతో పాటు మరో యువకుడు పరారయ్యేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు. కాగా, ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి దగ్గర జరిగింది.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.87.40 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు sacnilk తెలిపింది. గత రెండు రోజుల్లో కలెక్షన్లు భారీగా డ్రాప్ అయినట్లు పేర్కొంది. ఈ రెండు రోజుల్లో కేవలం రూ.4.9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని వెల్లడించింది.
రామ్ చరణ్ షూటింగ్లో గాయపడ్డారనే వార్తలపై ‘పెద్ది’ చిత్ర బృందం స్పందించింది. షూటింగ్ సమయంలో చరణ్ కుడి కంటికి స్వల్ప గాయమైందని, వెంటనే ఆయన వైద్య చికిత్స తీసుకున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, రేపటి నుంచే షూటింగ్లో పాల్గొంటారని స్పష్టం చేసింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ను ఇచ్చారు. శ్రీరామనవమి కానుకగా రేపు ఈ చిత్రం నుండి ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
యాంకర్ శ్రీముఖి కొత్త అవతారమెత్తింది. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్లోని ఐటీ హబ్ మాదాపూర్లో తన స్నేహితులతో కలిసి ‘ఫుర్సత్’ అనే గ్రాండ్ రెస్టారెంట్ను ప్రారంభించింది. సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని శ్రీముఖి పేర్కొంది.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 31 నుంచి అమెజాన్, యాపిల్ టీవీల్లో స్ట్రీమింగ్ కానుంది. జూన్ నాటికి హాట్స్టార్లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, తాజాగా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గాయపడటంతో షూటింగ్కు బ్రేక్ పడింది. ఈ కారణంగా సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో మూవీ వాయిదా పడుతుందా అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది.
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించాడు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటించాల్సిందని తెలిపాడు. ఇందుకోసం మేకర్స్ తనను సంప్రదించారని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని వెల్లడించాడు.