కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగింది. ‘పుష్ప 2’ ప్రభంజనం సృష్టించి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (అల్లు అర్జున్), ఉత్తమ దర్శకుడు (సుకుమార్) అవార్డులను గెలుచుకుంది. నివేదా థామస్ (35: చిన్నకథ కాదు) ఉత్తమ నటిగా నిలిచింది. అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడిగా, తేజ సజ్జా, కాజల్ అగర్వాల్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ‘పుష్ప 2’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకోవడంతో ఆయన ఖాతాలో మొత్తం 7 అవార్డులు చేరాయి. దీనితో అత్యధిక ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న నటుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డును బన్నీ సమం చేశాడు. యంగ్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక నటుడిగా అల్లు అర్జున్ ఇప్పుడు టాప్లో నిలిచాడు.
నటుడు విక్రమ్ ఒకేసారి నాలుగు సినిమాలను ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒక ప్రిపరేషనే. నేను ఆరాధించే దర్శకులతో, విభిన్నమైన కథలతో మీ ముందుకు వస్తున్నాను’ అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ ఏడాది అంతా కథల ఎంపికపైనే దృష్టి పెట్టానని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపాడు. ఈ అప్డేట్తో సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఫ్రెండ్ ప్రమోద్ శెట్టి హాట్ కామెంట్ చేశాడు. ‘నాకు రష్మిక పెళ్లికి ఇన్విటేషన్ రాలేదు. వస్తే నేను తప్పకుండా వెళ్తాను. కానీ, నాకు తెలుసు.. ఆమె మమ్మల్ని పిలవదు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను బాలీవుడ్ని వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. కొన్ని కారణాల వల్ల తనకు బాలీవుడ్లో పరిమితమైన అవకాశాలు వచ్చాయనే భావన కలిగినట్లు తెలిపింది. అలాంటి పరిస్థితుల్లోనే హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు పేర్కొంది. ఈ రెండు పరిశ్రమలలో పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.
గతంలో అమ్మాయిల దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ తాజాగా స్పందించాడు. తాను ఆ సమయంలో రెండు పదాలు వాడినందుకు మానసిక సంఘర్షణకు గురైనట్లు తెలిపాడు. అలాగే, తాను అనసూయను కూడా ఏమీ అనలేదని చెప్పాడు. ఆమెతో తనకు పరిచయం కూడా తక్కువని.. ఆమె అంటే తనకు గౌరవం ఉందన్నాడు. ఈ ప్రపంచంలో మగవారు ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లను కించపరచాలని అనుకోరనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చాడు.
‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘కిల్లర్’. ఈ సినిమాతో ఆమె వెండితెరపై హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజాగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. Sci-Fi థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జ్యోతి ఐదు పాత్రలలో నటిస్తుండటం విశేషం.
దర్శకుడు సంపత్ నందితో హీరో శర్వానంద్ ‘భోగి’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో శర్వా రోడ్డుపై నిలబడి, భుజంపై హ్యామర్ను పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్గా నటిస్తున్నారు.
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘కల్ట్’. ఈ మూవీ టీజర్ను ఈరోజు ఘనంగా విడుదల చేశారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు రవి బస్రూర్కు విశ్వక్ సేన్ ఖరీదైన రోలెక్స్ వాచ్ను బహుమతిగా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. రవి బస్రూర్ అందించిన అద్భుతమైన సంగీతానికి కృతజ్ఞతగా ఈ స్పెషల్ గిఫ్ట్ అందించినట్లు విశ్వక్ తెలిపాడు.
ప్రియాంక చోప్రా తన చిన్నతనంలో జరిగిన ఓ భయానక ఘటనను గుర్తుచేసుకుంది. ’11ఏళ్ల వయసున్నప్పుడు, ఢిల్లీలో అర్ధరాత్రి 11 గంటలకు తల్లితో కలిసి క్యాబ్లో వెళ్తుండగా డ్రైవర్ రూట్ మార్చాడు. వెంటనే అప్రమత్తమైన అమ్మ, డ్రైవర్ గొంతు పట్టుకుని హెచ్చరించి.. మరీ మెయిన్ రోడ్డుకు వచ్చేలా చేసింది. బిడ్డను రక్షించుకోవాలన్న తపనలో అమ్మ చూపిన ఆ ధైర్యం మరువలేనిది’ అని పేర్కొంది.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో యష్ డ్యూయెల్ రోల్లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాయా, రూమి అనే పాత్రలతో ఆయన అలరించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ 2026 మార్చి 19న విడుదలవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన క్లాసిక్ మూవీ ‘అతడు’ రీ-రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 28న ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా రీ-రిలీజ్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లు 40 లక్షలకు దక్కించుకున్నారట. అద్భుతమైన డైలాగ్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో అలరించిన ఈ చిత్రం మరోసారి వెండితెరపై ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.
టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దర్శకుడు గోపి అచ్చర తెరకెక్కించిన ‘హే బల్వంత్’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ మూవీ రూ.2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ఎలాగైనా తండ్రి బిజినెస్ను తాను టేకప్ చేయాలనే కొడుకు కథతో ఈ మూవీ తెరకెక్కింది.
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. 2026 సమ్మర్ రిలీజ్ అని చిరు స్వయంగా చెప్పినా, భారీ VFX పనుల వల్ల జాప్యం జరుగుతోంది. మరోవైపు ఆలస్యంగా మొదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే విడుదలై రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో పెండింగ్లో ఉన్న ‘విశ్వంభర’ ఓటీటీ డీల్, విడుదల తేదీపై మెగా ఫ్యాన్స్ ఆందోళన చెంద...