కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో ‘చెన్నై లవ్ స్టోరీ’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘కింగ్ ఆఫ్ మెలోడీ రిటర్న్స్’ అంటూ రాబోతున్న ఈ పాట మార్చి 30న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానుంది. ఇక ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్న ఈ మూవీకి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాకాళి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ‘అసురగురువు శుక్రాచార్యుడు’గా నటిస్తున్నాడు. ఇవాళ అక్షయ్ ఖన్నా పుట్టినరోజు కావడంతో.. ప్రశాంత్ వర్మ సెట్స్లోని ఫొటోను షేర్ చేస్తూ విషెష్ తెలిపాడు. అక్షయ్ వంటి నటుడితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే అక్షయ్ తన షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.
‘ధురంధర్ 2’ సినిమాపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. అది హింసను ప్రేరేపించే ఒక పనికిరాని చిత్రమని, అందులో బూతులు తప్ప ఏమీ లేవని మండిపడ్డారు. ముఖ్యంగా ముస్లింలను చూపించిన విధానాన్ని ఆయన తప్పుబట్టారు. సినిమా హిట్టయినా తనకేం పట్టదంటూ “ఐసే చీజాం కు హమ్ లైట్ లేతే” అంటూ తనదైన హైదరాబాదీ యాసలో కొట్టిపారేశారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు జోడీగా నయనతార నటించనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు SVC బ్యానర్పై దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న సినిమాలో సల్మాన్ హీరోగా చేయనున్నట్లు టాక్. ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2026 ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2027 ఈద్ కానుకగా ఇది రిలిజ్ కానున్నట్లు సమాచారం.
రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ‘ధురంధర్ 2’ ఇప్పటికే రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సిరీస్లోని రెండు భాగాలు కలిపి ఏకంగా రూ.2400 కోట్లు కొల్లగొట్టడం విశేషం. దీంతో ‘పుష్ప’ సినిమాల కలెక్షన్ల రికార్డులను ధురంధర్ బద్దలు కొట్టింది. రణ్వీర్ కెరీర్లో ఇదొక మైలురాయిగా...
‘రాజాసాబ్’ తర్వాత దర్శకుడు మారుతి తన తదుపరి సినిమాపై అప్డేట్ ఇచ్చాడు. ఈ మూవీ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉందని, దీనికి శ్రీరాముడి ఆశీస్సులు ఉన్నాయని తెలిపాడు. అయితే మారుతి ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్తో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. మారుతి మార్క్ కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది ఉండనుందట. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించనున్నట్లు టాక్.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నార్త్ అమెరికా వసూళ్లు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అక్కడ ఇప్పటివరకు ఈ చిత్రం కేవలం రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టింది. కనీసం 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకోకపోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ. 7 కోట్లు సాధించాలి, లేదంటే భారీ నష్టాలు తప్పవు.
‘సైయారా’ ఫేమ్ అనీత్ పడ్డా సోదరి రీత్ పడ్డా ‘ధురంధర్ 2’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ చిత్రం కేవలం ప్రభుత్వ ప్రోపగాండా అని, నోట్ల రద్దు వంటి నిర్ణయాలను సమర్థించుకునేలా ఉందని విమర్శించారు. గతంలో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ చిత్రాలు కూడా వాస్తవాలను వక్రీకరించాయని ఆమె అనడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి ఓ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీకి సంబంధించి నిర్మాణ సంస్థ ఖరారైంది. సాహు గారపాటి నేతృత్వంలోని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్పై ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే ‘భగవంత్ కేసరి’, ‘మనశంకరవరప్రసాద్ గారు’వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఈ బ్యానర్, తాజా ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో ...
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘జై హనుమాన్’ . తాజాగా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో రిషబ్, ఇతర కీలక నటీనటులపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట చుట్టూ సాగే ఆసక్తికర కథాంశంతో, హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రియురాలు, నటి సబా ఆజాద్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. ‘సైక్లోస్పోరా కయెటానెన్సిస్’ అనే పరాన్నజీవి ఇన్ఫెక్షన్ సోకడంతో గత 14 రోజులు తన జీవితంలోనే అత్యంత భయంకరమైనవని ఆమె ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ ఇన్ఫెక్షన్ నేరుగా కడుపుపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఆమె కోలుకోవాలని హృతిక్ అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సంస్కృతిని మరోసారి చాటుకున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా జపాన్ గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్సు కోసానోకు ‘సీతారామ కళ్యాణం’ చిత్రపటాన్ని బహూకరించాడు. భారతీయ సంప్రదాయాలు, శ్రీరాముడి కథా ప్రాముఖ్యతను వారికి వివరించి గ్లోబల్ వేదికపై మన ఆధ్యాత్మిక విలువలను చాటాడు. ఒక స్టార్ హీరోగా భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం విశేషం.
జూ. ఎన్టీఆర్ కెరీర్ను మలుపు తిప్పిన సెన్సేషనల్ హిట్ ‘ఆది’ విడుదలై నేటితో 24 ఏళ్లు. కేవలం 19 ఏళ్ల వయసులో NTRను మాస్ హీరోగా నిలబెట్టిన ఈ మూవీ రూ. 2.5 కోట్ల బడ్జెట్తో వచ్చి రూ. 20 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. 96 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైన ఈ మూవీలోని ‘అమ్మ తోడు.. అడ్డంగా నరికేస్తా’ వంటి డైలాగ్స్, NTR నటన ఇప్పటికీ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘రణబాలి’. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ అనంతపురంలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకు ఇక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో విజయ్, రష్మిక పాల్గొంటున్నారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నందమూరి బాలకృష్ణ మాస్ జాతర ‘లెజెండ్’ విడుదలై నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగించింది. వరుసగా 1000 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శించబడిన అరుదైన రికార్డు ఈ సినిమా సొంతం చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తాయి.