తల్లి అయిన తర్వాత తన జీవితం మారిపోయిందని నటి కియారా అద్వాణీ పేర్కొంది. ఇప్పుడు తానొక ‘ఆడపులి’లా మారానని, మాతృత్వంతో తన ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపింది. పెళ్లయినా.. సిద్ధార్థ్తో తన బంధం, సరదా కబుర్లు ఏమీ మారలేదని, తామిద్దరం సినిమా ప్రేమికులుగా ఎన్నో విషయాలు చర్చిస్తామని చెప్పింది. ఓటమే ఉత్తమ గురువుగా భావించి, కథ నచ్చితే వెంటనే ఓకే చేస్తానని వెల్లడించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించనున్నారు.
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ‘మదరాసి’ సినిమా బడ్జెట్ను రూ.115 కోట్ల నుండి రూ. 170 కోట్లకు పెంచారన్న ఆరోపణలతో నిర్మాత కౌన్సిల్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన కౌన్సిల్, నష్టపరిహారంగా ‘రమణ 2’ కథను సదరు నిర్మాణ సంస్థకు ఉచితంగా ఇవ్వాలని మురుగదాస్కు సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఈ వివాదానికి ముగింపు పడుతుందో లేదో అని చర్చ నడుస్తోంది.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో ప్రియదర్శి హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, తాజాగా ప్రియదర్శి హీరోగా నటించిన ‘సుయోధన’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ మూవీ రూపొందుతోంది. గతంలో వచ్చిన ‘జైలర్’ సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 4న జన్మాష్టమి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తన తదుపరి చిత్రాన్ని యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్తో చేయనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించనుందట. 2021లో ‘చెక్’ తర్వాత యేలేటి తెరకెక్కించబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. విలక్షణ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వృషకర్మ’. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులపై మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఓవరీస్లో PHF, ప్రత్యంగిర సినిమాస్ సంస్థలు సంయుక్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ టీజర్లో మ్యూజిక్ హైలైట్గా నిలవనుందట. సరికొత్త సౌండ్ డిజైన్ కోసం అట్లీ, బన్నీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ భారీ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో దర్శకుడు అభిలాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘తండ్రీకొడుకుల ఎమోషన్స్, రేసింగ్ నేపథ్యంలో సాగే మూవీ ఇది. దీని కోసం శర్వా 6 నెలలు ఫిజికల్, మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు. 23 KGల బరువు తగ్గాడు. ఈ సినిమా తన కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది’ అని అన్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో మహేష్, ప్రియాంకలపై ఓ పాటను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో జరిగే ఈ పాట షూటింగ్ కోసం భారీ సెట్ను వేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మూవీ కోసం రెండు భిన్నమైన క్లైమాక్స్లను చిత్రీకరిస్తున్నారట. ఒకటి అభిమానులను అలరించే మాస్ ఎలిమెంట్స్తో ఉంటే, రెండోది హీరో పాత్రలోని గ్రే షేడ్స్, సీక్వెల్ హింట్తో కూడిన సర్ప్రైజింగ్ ట్విస్ట్తో ఉండనుందట. టెస్ట్ స్క్రీనింగ్ తర్వాతే ఫైనల్ వెర్షన్పై మేకర్స్ నిర్ణయం తీసుకుంటారని టాక్.
ఇటీవలే ‘ఫంకీ’ సినిమాతో దర్శకుడు అనుదీప్ KV అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయాడు. తాజాగా ఆయన మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కించనున్నట్లు సమాచారం. అనుదీప్ కామెడీ మార్క్కి భిన్నంగా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘ఈఎన్ఈ రిపీట్’. ఇవాళ విశ్వక్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్.. ఆయనకు విషెస్ చెప్పారు. ‘మ్యాన్ ఆఫ్ షేడ్స్ విశ్వక్ సేన్కి హ్యాపీ బర్త్ డే. ఆయన మళ్లీ బ్రిలియంట్ అనిపించడానికి వస్తున్నారు’ అంటూ టీమ్ పోస్ట్ చేసింది. గతంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్గా ఈ మూవీ రా...
నందమూరి బాలకృష్ణ 111వ చిత్రంలో కాస్టింగ్ పరంగా భారీ మార్పులు జరుగుతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా నయనతార నటిస్తుండగా, తాజాగా రాయ్ లక్ష్మీ కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. సెకండ్ హాఫ్లో వచ్చే ఈ పవర్ఫుల్ రోల్ కథను మలుపు తిప్పుతుందట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.