సీనియర్ నటి భానుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి ఎం లక్ష్మి(83) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఎం లక్ష్మికి భానుప్రియ, శాంతిప్రియతో పాటు గోపాలకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఆమె తన ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తీర్చిదిద్దారు.
విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ పట్టాలెక్కనుంది. షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ జూన్ చివరలో లేదా జూలైలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి.
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ ప్రారంభంలో మోహన్ బాబు సరదాగా బెదిరిస్తూనే తనను ప్రోత్సహించారని వెల్లడించారు. ‘ఏయ్ సుద్దాలా.. కేవలం దాసరి నారాయణరావు సినిమాలకే పాటలు రాస్తే సరిపోదు.. నా సినిమాలకూ రాయ్. అవే నీకు ఫుడ్డు పెడతాయి’ అంటూ తనను కొత్త దిశలో నడిపించారని తెలిపారు. మోహన్ బాబు మంచి వ్యక్తి అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్టుల గురించి ఆయన బృందం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం పవన్ పూర్తిస్థాయిలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నారని చెప్పింది. ఆయన ఎలాంటి కొత్త సినిమాలకు సంతకం చేయలేదని స్పష్టం చేసింది. ‘OG 2’ సీక్వెల్ గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది. దీంతో ఇతర దర్శకులతో పవన్ చర్చలు జరుపుతున్నారనే రూమర్లకు ఈ ప్రకటనతో తెరపడింది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఏప్రిల్ 3 నుంచి ఈ సినిమా SonyLIVలో స్ట్రీమింగ్ కానుంది. స్పెషల్ ఒలింపిక్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో అమీర్ ఖాన్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ చిత్రంలో అమీర్ భార్యగా జెనీలియా నటించింది.
‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంతో మానస వారణాసి యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ గుర్తింపుతో ఆమె కోలీవుడ్లో ఒక పెద్ద ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న శశికుమార్ సరసన ఆమె హీరోయిన్గా నటించబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణికందన్ తెరకెక్కించబోతున్నాడు.
‘ధురంధర్-2’ చిత్రాన్ని రాజకీయ వివాదాలు చుట్టుముట్టాయి. ఈ మూవీని తమిళనాడులో తక్షణమే నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో అభ్యంతరకర రాజకీయ అంశాలు ఉన్నాయని, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ చిత్రాన్ని ప్రదర్శించకపోవడమే ఉత్తమమని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.
‘ధురంధర్-2’ చిత్రాన్ని రాజకీయ వివాదాలు చుట్టుముట్టాయి. ఈ మూవీని తమిళనాడులో తక్షణమే నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో అభ్యంతరకర రాజకీయ అంశాలు ఉన్నాయని, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ చిత్రాన్ని ప్రదర్శించకపోవడమే ఉత్తమమని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.
రణవీర్ సింగ్ ‘ధురంధర్-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ చిత్ర విజయంపై రణవీర్ భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇప్పటివరకు స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. తాజాగా వీరిద్దరూ కలిసి ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ వద్ద సందడి చేయడంతో ఈ పుకార్లకు చెక్ పడింది.
‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ‘ధురంధర్ 3’ వస్తుందనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే దర్శకుడు ఆదిత్యధర్ సన్నిహిత వర్గాలు వీటిని ఖండించాయి. రెండు భాగాలుగా 8 గంటల నిడివితో కథను ఇప్పటికే పూర్తి చేశామని, ఇక సాగదీసే ఉద్దేశం లేదని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఆదిత్యధర్ తన తదుపరి కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు తెలిపాయి.
‘ధురంధర్ 2’ చిత్రంలో భాగం కావడంపై నటుడు రాకేష్ బేడీ హర్షం వ్యక్తం చేశాడు. అయితే, ఈ సినిమాలోని కీలక దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ప్రేక్షకులను కోరాడు. ఇలా చేయడం వల్ల సినిమాపై ఇతరులకు ఉండే ఆసక్తి, థ్రిల్ దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా స్ఫూర్తిని గౌరవించి, ప్రతి ఒక్కరూ థియేటర్లో ఆ అనుభూతిని పొందేలా సహకరించాలని విజ్ఞప్తి చేశాడు.
టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దర్శకుడు గోపి అచ్చెర తెరకెక్కించిన ‘హే బల్వంత్’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్ను జీ5 సొంతం చేసుకోగా.. మార్చి 31 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తన తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా తీసుకోవాలనుకునే యువకుడి కథతో ఈ సినిమా రూపొందింది.
ఇటీవలే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీతో వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దర్శకుడు దేవ కట్టాతో సినిమా చేయనున్నట్లు సమాచారం. గతంలోనే పవన్ కోసం దేవ ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేశాడట. అయితే పవన్.. సురేందర్ రెడ్డి, దేవ కట్టాలతో ఏకకాలంలో సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తన పేరుతో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం జరుగుతోందని వస్తున్న వార్తలపై ఫోక్ సింగర్ మంగ్లీ స్పందించింది. తనకు ఎలాంటి ఫైనాన్స్ సంస్థలతో సంబంధం లేదని, తన పేరు వాడుకుని డబ్బులు వసూలు చేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఈవెంట్స్ కోసం వచ్చే వారి వ్యక్తిగత వ్యాపారాలకు తాను బాధ్యురాలిని కానని, ఇది తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.