హీరో రాజ్తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్చల్ చేసింది. మద్యం మత్తుతో కారుతో బైక్ను ఢీకొట్టింది. అనంతరం లావణ్యతో పాటు మరో యువకుడు పరారయ్యేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు. కాగా, ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి దగ్గర జరిగింది.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.87.40 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు sacnilk తెలిపింది. గత రెండు రోజుల్లో కలెక్షన్లు భారీగా డ్రాప్ అయినట్లు పేర్కొంది. ఈ రెండు రోజుల్లో కేవలం రూ.4.9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని వెల్లడించింది.
రామ్ చరణ్ షూటింగ్లో గాయపడ్డారనే వార్తలపై ‘పెద్ది’ చిత్ర బృందం స్పందించింది. షూటింగ్ సమయంలో చరణ్ కుడి కంటికి స్వల్ప గాయమైందని, వెంటనే ఆయన వైద్య చికిత్స తీసుకున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, రేపటి నుంచే షూటింగ్లో పాల్గొంటారని స్పష్టం చేసింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ను ఇచ్చారు. శ్రీరామనవమి కానుకగా రేపు ఈ చిత్రం నుండి ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
యాంకర్ శ్రీముఖి కొత్త అవతారమెత్తింది. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్లోని ఐటీ హబ్ మాదాపూర్లో తన స్నేహితులతో కలిసి ‘ఫుర్సత్’ అనే గ్రాండ్ రెస్టారెంట్ను ప్రారంభించింది. సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని శ్రీముఖి పేర్కొంది.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 31 నుంచి అమెజాన్, యాపిల్ టీవీల్లో స్ట్రీమింగ్ కానుంది. జూన్ నాటికి హాట్స్టార్లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, తాజాగా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గాయపడటంతో షూటింగ్కు బ్రేక్ పడింది. ఈ కారణంగా సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో మూవీ వాయిదా పడుతుందా అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది.
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించాడు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటించాల్సిందని తెలిపాడు. ఇందుకోసం మేకర్స్ తనను సంప్రదించారని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని వెల్లడించాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇన్స్టాలో అడుగుపెట్టారు. ‘anna.konidala’ పేరుతో ఖాతా తెరిచిన కోన్ని నిమిషాల్లోనే 64 వేల మంది ఫాలోవర్స్ రావడం విశేషం. రష్యాకు చెందిన అన్నాలెజినోవాను పవన్ 2013 సెప్టెంబరు 30న వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయాలను పాటిస్తూ తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో SMలో వైరల్ అవుతోంది.
హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ గాయపడ్డాడు. దీనిపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించాడు. ‘చరణ్ గాయపడ్డాడని తెలిసింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని పవన్ పేర్కొన్నాడు.
భూత్ బంగ్లా ప్రమోషన్లలో భాగంగా హీరో అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో ఆయనకు జోడీగా వామికా గబ్బి నటిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య 26 ఏళ్ల గ్యాప్ ఉండడంపై ఆయన స్పందించారు. కథకు అవసరమైన వారిని ఎంపిక చేసుకుంటామని తెలిపారు. ఒక నటుడి అసలు వయసుకి, స్క్రీన్ వయసుకి చాలా తేడా ఉంటుందని.. ఇందులో నాకైతే ఎలాంటి సమస్య కనిపించడం లేదన్నారు.
నటిగా తాను ఇప్పుడు పరిపూర్ణంగా సిద్ధమయ్యానని, దర్శకులు తనను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్లు రాయడమే అసలైన పురస్కారమని మృణాల్ ఠాకూర్ పేర్కొంది. ‘సీతారామం’తో లభించిన గుర్తింపు తన కెరీర్కు ఊతమిచ్చిందని తెలిపింది. ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తున్న ఆమె, హిందీ, తెలుగు భాషల్లో నటనపై పట్టు సాధిస్తున్నట్లు వెల్లడించింది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ విజయంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ సినిమా రికార్డులను చూసి దక్షిణాది దర్శకులు అసూయ పడడం లేదని, కానీ ‘టాక్సిక్’ వంటి చిత్రాలతో ఆ రికార్డులను తిరగరాయాలని వారు కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ప్రచారం అనే విమర్శలపై స్పందిస్తూ.. దర్శకుడికి తన పరిశోధన ఆధారంగా కథను ఆవిష్కరించే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని RGV సమర్థించారు.
హీరో రామ్ పోతినేని తన నెక్ట్స్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ శిష్యుడు లోగి విఘ్నేశ్ చెప్పిన కథకు రామ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. నిర్మాణ సంస్థపై స్పష్టత రాగానే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనుందని సమాచారం.
హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సెట్స్లో రామ్ చరణ్ గాయపడ్డారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కంటి దగ్గర స్వల్ప గాయమైనట్లు.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోస్టులు షేర్ చేస్తున్నారు. కాగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో పెద్ది టీజర్ విడుదల చేస్తారని సమాచారం.