మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ‘చిన్నప్పుడు నా చేయి పట్టుకోవడం నుంచి నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం వరకు.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది చరణ్. నీ క్రమశిక్షణ, కుటుంబంపై బాధ్యత, దైవచింతన నీపై నా ప్రేమను మరింత పెంచుతున్నాయి. దేవుడి దీవెనలతో నువ్వు మరిన్ని శిఖరాలు అధిరోహించాలి’ అని పేర్కొన్నారు.
నటుడు, టీవీకే అధినేత విజయ్పై తాను చేసిన వ్యాఖ్యలపై సముద్రఖని స్పందించాడు. ‘కార్మేని సెల్వం’ ప్రమోషన్స్లో ఆయన మాట్లాడుతూ.. ‘విజయ్కు మొదట మద్దతు ఇచ్చింది నేనే, అందుకే ఆయన నిర్ణయంపై నా బాధను వెలిబుచ్చాను. నా మాటలను ఎవరో మధ్యలో రికార్డ్ చేసి తప్పుగా చూపారు. రికార్డ్ చేస్తున్నారని తెలిసి కూడా నా మనసులోని మాటను దాచుకోకుండా చెప్పాను’ అని క్లారిటీ ఇచ్చాడు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుల క్రేజీ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం కానుందట. దీని కోసం ముంబైలోని SRPF గ్రౌండ్లో ఒక భారీ సెట్ను (మినీ సిటీలా) నిర్మిస్తున్నారట. భారీ యాక్షన్ సీక్వెన్స్ల కోసం చిత్రబృందం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నట్లు టాక్.
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు. టాలీవుడ్లో ‘చిరుత’గా అడుగుపెట్టి.. ‘మగధీర’తో రికార్డులు సృష్టించి, ‘RRR’తో గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. నటనలో వైవిధ్యం, అద్భుతమైన డ్యాన్సింగ్తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటుతున్న చరణ్కు మరిన్ని విజయాలు అందుకోవాలని ...
ధనుష్ హీరోగా, మమిత బైజు హీరోయిన్గా విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కారా’. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమాలో మమితను ఇప్పటివరకు చూడని సరికొత్త లుక్లో చూస్తారని తెలిపాడు. ఆమె పల్లెటూరి అమ్మాయిగా, డీ-గ్లామర్ రోల్లో కనిపించబోతుందన్నాడు. తెరపై ఆమె నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని పేర్కొన్నాడు.
సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘రాకాస’. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్ను పొందింది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి మెగా అప్డేట్ రాబోతోంది. చరణ్ బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 9:45 గంటలకు బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బ్యాట్ పట్టుకోవడం చూశారు.. ఇప్పుడు గద పట్టుకోవడం చూస్తారు’ అంటూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా జంటగా నటించిన ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రం 2024లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ, మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘ది టెర్రర్ రిపోర్ట్’ పేరుతో ఈ సీక్వెల్ను రూపొందించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సీక్వెల్కు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నాడు.
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. శ్రీరామనవమి కానుకగా తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా, సాయి కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
యంగ్ హీరో రామ్ పోతినేని తన తర్వాతి చిత్రాన్ని తమిళ దర్శకుడు విఘ్నేష్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని హర్రర్ థ్రిల్లర్ జోనర్లో భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బ్రో’ చిత్రం సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర సీక్వెల్పై దర్శకుడు సముద్రఖని స్పందించాడు. ‘బ్రో-2’ చేయాలని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే సినిమా పనులు ప్రారంభిస్తానని పేర్కొన్నాడు. దీంతో ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.
శర్వానంద్ ‘బైకర్’ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించాడు. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్మేన్’ సినిమాలో తాను హీరోగా నటించాల్సి ఉందని వెల్లడించాడు. అయితే, అప్పట్లో కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
‘లిటిల్ హార్ట్స్’ మూవీతో దర్శకుడిగా పరిచమైన సాయి మార్తాండ్ తొలి ప్రాజెక్టుతో భారీ విజయం అందుకున్నాడు. తాజాగా ఆయన.. హీరో అడివి శేష్తో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల అడివి శేష్కి సాయి మార్తాండ్ కథను వినిపించగా.. అతను ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.