రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్-2’ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారానే రూ.75 కోట్లు వచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. భారత్లోనే రూ.52.50 కోట్లు వచ్చింది. ఓవర్సీస్లో ప్రీమియర్స్తోనే హయ్యెస్ట్ కలెక్షన్లు రూ.23 కోట్లు సాధించిన ఇండియన్ సినిమాగానూ నిలిచింది. ఈ క్రమంలో OG రూ.25 కోట్లు, యానిమల్ రూ.11 కోట్లను వెనక్కి నెట్టింది.
ధురంధర్-2 సినిమాలో దేశభక్తిని చాలా స్టైలిష్గా చూపించారని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పేర్కొన్నాడు. మూవీలో చప్పట్లు కొట్టించే సీన్స్ ఎన్నో ఉన్నాయని.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదొక బ్లాస్ట్ అంటూ ప్రశంసించాడు. రణ్వీర్ లాంటి నటుడు మన దేశంలో ఉండటం గర్వకారణమని, మాధవన్ సహా అందరూ అదరగొట్టారని కొనియాడాడు. భారతీయ కథను అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా తెరకెక్కించారన్నాడు.
ఈ ఏడాది అనుష్క శెట్టి పెళ్లంటూ వస్తున్న రూమర్స్ను ఆమె టీమ్ కొట్టిపారేసింది. SM వేదికగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదని ప్రకటించింది. సమాచారం లేకుండా ఎలాంటి వార్తలను పబ్లిష్ చేయొద్దని మీడియాను కోరింది. అనుష్క ఏజ్కు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం ఆమె ప్రైవసీకి భంగం కలిగించడమేనని పేర్కొంది. వ్యక్తిగత విషయమైన పెళ్లిపై ఇలా రూమర్స్ సృష్టించడం సరికాదని తెలిపింది.
పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో దశాబ్దం తర్వాత థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హీరో ఎలివేషన్స్, డైలాగ్స్, తమన్ మ్యూజిక్ అభిమానులను అలరిస్తాయి. కానీ, అక్కడక్కడా పవన్ సినిమా చూస్తున్న ఫీల్ రాకపోవడం, రోటిన్ సీన్స్ మైనస్గా చెప్పుకోవచ్చు. మొత్తంగా పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ని ఇష్టపడేవారికి ఇది ఒక ట్రిబ్యూట్ మూవీలా అనిపిస్తుంది. రేటింగ్: 3/5
నేషనల్ జియోగ్రాఫిక్-2026 సంవత్సరానికి గాను ’33 మంది గ్లోబల్ ఛేంజ్ మేకర్స్’ జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీయ నటీమణులు అలియా భట్, ప్రియాంక చోప్రాకు చోటు లభించింది. పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తున్నందుకు అలియాను ఈ గౌరవం వరించింది. అలాగే ఆరోగ్య సంరక్షణ, ముఖ్యంగా డయాబెటిస్ పట్ల అవగాహన పెంచేందుకు ప్రియాంక చేస్తున్న కృషిని నెట్ జియో గుర్తించింది.
రణ్వీర్ సింగ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ మూవీలో నటి యామీ గౌతమ్ ‘డాక్టర్ షాజియా బానో’గా సర్ప్రైజ్ రోల్లో మెరవనుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆమె పాత్ర కథను మలుపు తిప్పనుందని సమాచారం. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ నటించిన ఈ క్రేజీ సీక్వెల్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
పాకిస్తాన్లో స్పైగా రణ్వీర్ సింగ్ సాగించే మైండ్ గేమ్, యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదించినా, సెకండాఫ్, క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. రణ్వీర్ నటన, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. స్పై థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన భారీ స్పై థ్రిల్లర్ మూవీ ధురంధర్ 2 ప్రీమియర్ షోలపై నెలకొన్న డైలమాపై మేకర్స్ స్పందించారు. ఇప్పటికే హిందీ వెర్షన్ ప్రీమియర్ షోలు నడుస్తున్నాయిని.. తమిళ్, తెలుగు ప్రీమియర్ షోలు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభవుతాయని ప్రకటించారు. మలయాళం, కన్నడలో రేపు ఉదయం నుంచి షోలు పడతాయన్నారు. కాగా ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు మహేష్ ఆచంట వైపు హీరోయిన్ శ్రీలీల సీరియస్ లుక్స్ SMలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ఘటనపై శ్రీలీల వివరణ ఇచ్చింది. తన ఫోన్ మహేష్ దగ్గర ఉందని.. అందుకే తాను వెనక్కి చూసినట్లు అతడు అనుకున్నాడని తెలిపింది. కానీ ఏదో శబ్ధం వచ్చినట్లు అనిపించడంతోనే తాను వెనక్కి చూశానని.. అంతకుమించి ఏదీ లేదని స్పష్టం చేసింది.
డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ రావడంపై నటి హేమ హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయితే దోషులేనా?.. జైలుకెళ్లినంత మాత్రాన నేరం చేసినట్టేనా? అని ప్రశ్నించారు. తాను సెలబ్రిటీని కాబట్టే అప్పుడు తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలను పదే పదే చూపించిన ఛానల్స్.. క్లీన్ చిట్ ఇచ్చిన విషయంపై మాత్రం సపోర్ట్ చేయట్టేదన్నారు.
కేడీ: ది డెవిల్ మూవీలోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై సింగర్ మంగ్లీ స్పందించారు. ‘అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. జరిగిన దానికి చింతిస్తున్నాం. ఇలా మరోసారి జరగదు’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను చాలా తక్కువ రోజుల్లో దర్శకుడు హరీష్ శంకర్ పూర్తిచేశాడని మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని తెలిపాడు. హరీష్లా సినిమా తీస్తే తాను ఏడాదికి 10 సినిమాలు తీయవచ్చని అభిప్రాయపడ్డాడు. ఉస్తాద్ సినిమా షూటింగ్ను నిర్మాతగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేశానని.. ఒక పిక్నిక్ తరహాలో గడిచిపోయిందని పేర్కొన్నాడు.
తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘పాలిటిక్స్లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంది. వారికి కుటుంబం, గౌరవం, పర్సనల్ లైఫ్ అనేవి కూడా ఉంటాయి. ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దాం’ అని సూచించారు.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది కానుకగా రేపు విడుదల కానుంది. ఈ సినిమా ఫలితం ఇద్దరి కెరీర్కు కీలకం కానుంది. మిస్టర్ బచ్చన్తో అట్టర్ ఫ్లాప్ చవిచూసి విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు హరీష్ శంకర్కు, ఇటీవల వరుస పరాజయాలతో కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న హీరోయిన్ శ్రీలీలకు ఈ సినిమా తప్పక హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.