‘పెద్ది’ సెట్స్లో రామ్ చరణ్ గాయపడిన విషయం తెలిసిందే. డూప్ లేకుండా స్టంట్స్ చేస్తుండగా ఆయన కంటిపై గాయం కావడంతో యూనిట్ చికిత్స అందించింది. అయితే, మార్చి 27న ఆయన పుట్టినరోజు కావడంతో గాయంతోనే సెట్స్లో వేడుకలు జరుపుకున్నాడు. ఎల్లో శాలువా, రగ్గడ్ లుక్లో కంటిపై కుట్లతో ఉన్న చరణ్ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
‘బేబీ’ కాంబో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘EPIC- First Semester’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ తేదీన రావాల్సిన ‘పెద్ది’ వాయిదా పడే అవకాశం ఉండటంతో, మేడే, వీకెండ్ సెలవులను క్యాష్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప...
తమిళ హీరో విజయ్ దళపతి, దర్శకుడు H. వినోద్ కాంబోలో రూపొందిన మూవీ ‘జన నాయగన్’. జనవరి 9, 2026న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదలపై సాలిడ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఏప్రిల్ 24, 2026లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ను కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. షూటింగ్ సెట్లో తనతో అనుచితంగా ప్రవర్తించారని ఓ యువ నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలతో ఆయన తన అకాడమీ పదవికి రాజీనామా చేశారు. హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో బయటపడుతున్న వరుస వేధింపుల కేసుల్లో ఇది మరో సంచలనంగా మారింది.
NTR-ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో ‘డ్రాగన్’లో తాను నటించడం లేదని మలయాళ స్టార్ టొవినో థామస్ స్పష్టం చేశాడు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన కొత్త సినిమా ‘పళ్లిచట్టంబి’ ప్రమోషన్స్లో వెల్లడించాడు. తెలుగు సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయని, ఒకేసారి 2-3 సినిమాలు చేయడం తనకు ఇష్టం ఉండదని తెలిపాడు.
బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 సరికొత్త వివాదంలో చిక్కుకుంది. తన స్టోరీని కాపీ కొట్టి సినిమా తీశారని తాజాగా కన్నడ దర్శకుడు ఆర్ఎస్ సంతోష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు. 2023లోనే ఈ కథను రిజిస్టర్ చేయించానని తెలిపాడు. టీ-సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థలకు ఈ కథ వినిపించానని ఆర్ ఎస్ సంతోష్ కుమార్ షాకింగ్ నిజాలను బయటపెట్టాడు.
స్టార్ మా: జనతా గ్యారేజ్(9AM); జీతెలుగు: కలిసుందాంరా(9AM), స్పైడర్(4.30PM); ఈటీవీ: అమ్మో ఒకటో తారీఖు(9AM); జెమిని: ఒక్కడు(9AM), అన్నయ్య(3:30PM); స్టార్మా మూవీస్: ది గోస్ట్(9AM), సర్కారు వారి పాట(12PM), నా సామిరంగ(3PM), రాజా దిగ్రేట్(6PM), మంగళవారం(9PM); Z సినిమాలు: బ్రాండ్ బాబు(7AM), ఒంగోలు గిత్త(9AM), ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(3PM), ప్రేమలు(6PM), గజకేసరి(9PM).
‘ధురంధర్ 2’ సంచలన విజయం దర్శకుడు రాజమౌళి ఆలోచన విధానంలో మార్పు తెచ్చినట్లు తెలుస్తోంది. తన తదుపరి ప్రాజెక్ట్ ‘వారణాసి’ని కేవలం ఒకే భాగంగా కాకుండా, రెండు భాగాలుగా తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. తన రూ.1000 కోట్ల బడ్జెట్ కథను కుదించకుండా ఎపిక్ నెరేటివ్గా అందించాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇందుకోసం సీనియర్ రైటర్లతో చర్చలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.
స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1390 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కర్ణాటకలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అలాగే, అత్యధిక వసూళ్లు చేసిన టాప్ భారతీయ చిత్రాల జాబితాలో, గతంలో నాలుగో స్థానంలో ఉన్న ‘ధురంధర్ 1’ (రూ.1350 కోట్లు) రికార్డును దాటేసింది.
‘ధురంధర్ 2’లో రణ్వీర్ నటనపై దర్శకుడు RGV ప్రశంసలు కురిపించాడు. రణ్వీర్ కళ్లలో కనిపించే ఆ తీవ్రత, భావోద్వేగాలు అద్భుతమని అన్నాడు. ఆయన ఎనర్జీకి, మాధవన్ నిశ్శబ్దమైన అథారిటీ తోడై సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పాడు. ప్రతి చిన్న పాత్రకు ఒక డెప్త్ ఇవ్వడం ఆదిత్య ధర్ గొప్పతనమని, నటుల నుంచి మైక్రో ఎక్స్ప్రెషన్స్ రాబట్టడంలో అతను సక్సెస్ అయ్యాడని చెప్పాడు.
దర్శకనటుడు తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘గాయపడ్డ సింహం’. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘బ్రైడ్ సాంగ్’ అనే తొలి పాట ఏప్రిల్ 1, 2026న సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఇక దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
క్యాస్టింగ్ కౌచ్పై సీనియర్ నటి సత్యకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది కేవలం సినీ రంగంలోనే కాదు, ప్రతి చోటా ఉంది. మా వారు ధైర్యంగా బయటకు చెబుతున్నారు కాబట్టి అందరికీ తెలుస్తోంది. ఎవరైనా హద్దు దాటితే మహిళలు నో చెప్పే ధైర్యం కలిగి ఉండాలి. సినీ అవకాశాల కోసం కొంతమంది తప్పుదోవ పడుతున్నారు. మూవీ లేకపోతే జీవితమే లేదనుకునే వారే ఇలాంటి వలలో పడుతున్నారు’ అని చెప్పింది.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో క్రేజీ ప్రాజెక్టు రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. ఇందులో స్టార్ హీరోయిన్ నయనతార కథానాయికగా నటించనున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానుంది.
సాధారణంగా ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడమే గొప్ప విషయం అనుకునే రోజుల్లో, ప్రభాస్ ఏకకాలంలో మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ విభిన్న సినిమాల కోసం వేర్వేరు బాడీ లాంగ్వేజ్, లుక్స్ కోసం అతడు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాడట. ప్రభాస్ డెడికేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
లాస్ ఏంజిల్స్లోని ఐమాక్స్లో రణ్బీర్ కపూర్ ‘రామాయణ’ గ్లింప్స్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రణ్బీర్ మాట్లాడుతూ.. ‘శ్రీరాముడు కేవలం పురాణ పాత్ర కాదు.. కోట్ల మంది అంతరాత్మ. కరుణ, ధైర్యం, నీతికి ఆయన నిలువుటద్దం. కష్టకాలంలో మనిషి ఎలా ఉండాలో నేర్పిన మర్యాద పురుషోత్తముడు ఆయనే. అలాంటి గొప్ప పాత్రను పోషించడం నా అదృష్టం’ అని అన్నాడు.