భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 మూవీ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.241 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది. బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనర్గా రికార్డు సృష్టించింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు.
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ వాయిదా పడుతుందన్న వార్తలపై చిత్రబృందం స్పందించింది. ఈ సినిమాని ఏప్రిల్ 30న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా US బుకింగ్స్ కూడా అదే రోజు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చరణ్ అయ్యప్ప దీక్షలో ఉండటంతో, అది పూర్తయ్యాక పెండింగ్ ఉన్న స్పెషల్ సాంగ్ షూట్ చేయనున్నారు.
అనన్య పాండే నటించిన కాల్ మీ బే మొదటి సీజన్ హిట్ కావడంతో, అమెజాన్ ప్రైమ్ రెండో సీజన్ను సిద్ధం చేస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులోకి స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. మరింత డ్రామా, కామెడీ, ఊహించని మలుపులతో రానున్న ఈ కొత్త సీజన్పై శృతి రాకతో అంచనాలు భారీగా పెరిగాయి. ఆమె ఇందులో ఒక కీలక పాత్రలో మెరవనుందని సమాచారం.
TG ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డుల్లో నటుడు చిరంజీవికి NTR అవార్డు వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. NTR అంటే N నాట్యం, T తాళం, R రాగం.. కళల సమ్మేళనం అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘NTR నేషనల్ అవార్డు’ రావడం జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు.
నటి నిమిషా నాయర్కు ముంబైలో నడిరోడ్డుపై చేదు అనుభవం ఎదురైంది. తెల్లవారుజామున క్యాబ్లో వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు బైక్తో కారును అడ్డుకున్నారు. ఆమెను, డ్రైవర్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధించారు. ఈ భయానక దృశ్యాలను నిమిషా వీడియో తీసి SM వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వెండితెరపై అలరించేందుకు మరో విజువల్ వండర్ సిద్ధమవుతోంది. ఇద్దరు వెర్సటైల్ నటులు విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. దర్శకుడు మణిరత్నం వీరిద్దరితో ఓ క్లాసిక్ లవ్ స్టోరీని ప్రకటించారు. దీనికి AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న మణిరత్నం మార్క్ రొమాంటిక్ డ్రామాపై సినీ ప్రియుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
కన్నడ చిత్రం ‘కేడీ’లోని ‘సర్కే చునార్ తేరీ’ పాట వివాదానికి దారితీయడంతో.. కేంద్ర ప్రభుత్వం దానిపై నిషేధం విధించింది. ఈ పాట ఇస్లామిక్ బోధనలకు విరుద్ధంగా ఉందంటూ నటి నోరా ఫతేహీపై ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా అనే మతపరమైన సంస్థ కూడా ఫత్వా జారీ చేసింది. దీనిపై నటి నోరా ఫతేహీ స్పందిస్తూ.. తనకు ఆ భాష తెలియదని, సినిమా నేపథ్యం చూసి మాత్రమే నటించానని వివరణ ఇచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు రూ.37.17 కోట్లు వచ్చినట్లు Sacnilk వెబ్సైట్ వెల్లడించింది. దీంట్లో రూ.31.50 కోట్లు నెట్ వసూళ్లని తెలిపింది. పవన్ డైలాగ్స్, మేనరిజమ్స్తో ఈ సినిమా ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా మెరిశారు.
తన బట్టతలపై వచ్చే విమర్శలను తిప్పికొట్టి, జాతీయ అవార్డులతో మెప్పించిన విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ తన అనుభవాలను పంచుకున్నారు. తనను అంకుల్ అని పిలువొద్దని ఏకే లేదా అనుపమ్ గారు అని పిలవాలని యువతను కోరారు. ఎంతోమంది డాక్టర్లు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామన్నా ఆయన నిరాకరించారు. ప్రస్తుతం ఆయన నటించిన ఘోస్లా 2 చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది.
భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 మూవీ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే రూ.102 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసిందని Sacnilk తెలిపింది. ప్రీమియర్స్తో కలుపుకొని రూ.145 కోట్లు(రూ.172 కోట్ల గ్రాస్) రాబట్టిందని వెల్లడించింది. 12,735 ప్రీమియర్ షోలు, తొలి రోజు 21,728 షోలు పడినట్లు చెప్పింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
TG: తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉందని మాధురీ దీక్షిత్ కొనియాడింది. గద్దర్ అవార్డుల వేదికపై టాలీవుడ్ సినీ లెజెండ్స్ను కలుసుకోవడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపింది. ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. దక్షిణాది సినిమా సాధిస్తున్న విజయాలు భారతీయ సినిమాకే గర్వకారణమని వ్యాఖ్యానించింది.
TG: పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే ఏ బాధ్యతనైనా స్వీకరిస్తానని చిరంజీవి ప్రకటించారు. దేశ జీడీపీలో చిత్ర పరిశ్రమ పాత్ర కీలకమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం(AP) కళాకారులను ఉత్సాహపరచడంలో వెనుకంజలో ఉందన్నారు. చంద్రబాబు కూడా రేవంత్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇండియన్ సినిమా అంటే తెలంగాణ గుర్తుకురావాలన్నదే సీఎం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
TG: హైదరాబాద్ బిర్యానీకే కాక, తెలుగు సినిమాకు కూడా దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సౌత్ కొరియా తరహాలో సినిమా రంగాన్ని తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. ఇండియన్ సినిమాకు హైదరాబాద్ కేంద్రంగా మారాలని, గద్దర్ పేరుతో అవార్డులు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
TG: హైటెక్స్లో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. అవార్డులు నటుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. కొన్నాళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సినిమా పురస్కారాలను సీఎం రేవంత్ పునరుద్ధరించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో బాలకృష్ణతో కలిసి నటించబోతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడ వేగ-2’ కోసం సిద్ధమైన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. తామిద్దరం కలిసి నటిస్తే ఇద్దరు చిన్నపిల్లలు చేసినట్టు ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శర్వానంద్ ‘బైకర్’ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.