సమంత తన బెడ్రూం ఫొటోను SMలో పంచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఫొటోలో రాజ్ నిడిమోరు బెడ్రూంలో పడుకోకుండా ల్యాప్టాప్ ముందు కూర్చుని పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. బెడ్రూమ్లో కూడా ఆయన ఇంత బిజీగా పని చేస్తున్నాడని సరదాగా పేర్కొంటూ ఈ పోస్ట్ను షేర్ చేసింది.
టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఒప్పుకున్నప్పుడే పవన్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని హరీష్ శంకర్ తనకు చెప్పినట్లు తెలిపింది. ‘పవన్ మీద ఇష్టంతో నా డేట్స్ సర్దుబాటు చేసుకుంటానని చెప్పా. ఈ సినిమా కోసం కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు పని చేశా. అదొక మర్చిపోలేని అనుభవం’ అని చెప్పుకొచ్చింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో స్టార్ హీరోయిన్స్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్లతో బుచ్చిబాబు సంప్రదింపులు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. ఇక జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ నెల 19న విడుదల కానుండటంతో తెలంగాణలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఏపీలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, తెలంగాణలో మాత్రం పాత ధరలకే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పవర్ స్టార్ సినిమా కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి అప్పుడే మొదలైంది.
బాలకృష్ణ, నయనతార జంటగా భారీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని నటిస్తున్నాడు. మరి వీరి కలయికలో సీన్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని పెద్ది నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో ఓ సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ మార్చి 19న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా టికెట్ బుకింగ్స్పై తాజాగా చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. నైజాంలో ఈరోజు రాత్రి 10 గంటల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.
జాతీయవాద హీరోగా ముద్ర వేయించుకోవడం కోసం తాను దేశభక్తి సినిమాలు చేయనని హీరో అక్షయ్ కుమార్ స్పష్టం చేశాడు. తన కెనడియన్ పాస్పోర్ట్పై వచ్చే విమర్శలకు, తన సినిమాలకు సంబంధం లేదని వెల్లడించాడు. కేవలం ఇమేజ్ కోసం కాకుండా.. తనకు సరైనవనిపించే కథలను మాత్రమే ఎంచుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఎంపికలో కథా బలమే ముఖ్యం తప్ప వేరే ఉద్దేశం లేదని తెలిపాడు.
కెపాప్ డిమాన్ హంటర్స్ చిత్రంలోని గోల్డెన్ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ చిత్రానికి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ఇటీవల గ్రామీ అవార్డును కూడా గెలుచుకున్న ఈ పాట, ఇప్పుడు ఆస్కార్ను సైతం కైవసం చేసుకుని ప్రపంచ వేదికపై కె-పాప్ సత్తాను చాటింది.
ఆస్కార్ వేదికపై క్రమశిక్షణ తప్పినందుకు విల్ స్మిత్పై 10 ఏళ్ల నిషేధం పడింది. అలాగే లైంగిక వేధింపుల కేసుల్లో రోమన్ పోలంస్కీ, బిల్ కాస్బీ, ఆడమ్ కిమ్మెల్లను అకాడమీ బహిష్కరించింది. సినిమాలను పైరసీ చేసినందుకు కార్మైన్ కార్డీపై, లైంగిక ఆరోపణల వల్ల హార్వీ వైన్స్టీన్పై వేటు పడింది. నైతిక విలువలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఈ ఆరుగురిని ఆస్కార్ దూరం పెట్టింది.
బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. అలాగే కన్నడ స్టార్ యాక్టర్ యశ్ కీ రోల్లో నటిస్తుండగా.. పంచాయత్ ఫేం ఫైజల్ మాలిక్ ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని 2026 దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంగీత దర్శకుడు తమన్ రాలేకపోవడానికి గల కారణాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ వివరించాడు. ఈ నెల 19న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో, తమన్ రాత్రింబగళ్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నాడని తెలిపాడు. స్టేజ్ మీద కనిపించడం కంటే, సినిమాకు మంచి అవుట్పుట్ ఇవ్వడమే ముఖ్యమని అన్నాడంటూ తమన్ సంస్కారాన్ని ప్రశంసించాడు.
అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని AP ప్రభుత్వం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై నటుడు మంచు మనోజ్ స్పందిస్తూ.. ‘చేతిలో తుపాకీ లేదు, సైన్యం లేదు, అధికారమూ లేదు. కేవలం అచంచల సంకల్పం. 58 అడుగుల విగ్రహం కేవలం ఒక కొలత కాదు. 58 రోజుల సంకల్పానికి నిలిచిన సజీవ రూపం. కొన్నిసార్లు చరిత్రను మార్చేది సైన్యాలు కావు. ఒక మనిషి ఉపవాస దీక్ష కూడా’ అని అన్నాడు.
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో వస్తున్న ‘వృషకర్మ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చైతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా చివరి 25 నిమిషాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని, ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు చూడని సరికొత్త అంశాన్ని క్లైమాక్స్లో చూపించబోతున్నామని చెప్పాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు బుక్ మై షోలో దాదాపు 15వేల టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా, R. పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో పవన్ టీం సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్ మైలురాయి ‘తొలిప్రేమ’లోని ‘ఈ మనసే’ సాంగ్ను ఇందులో రీ-క్రియేట్ చేసినట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్, శ్రీలీలపై చిత్రీకరించిన ఈ సాంగ్ రీమిక్స్ వెర్షన్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్త...