బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర మరణం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన చివరి చిత్రం ఏంటంటూ చర్చించుకుంటున్నారు. ధర్మేంద్ర చివరి సినిమా ‘ఇక్కిస్’. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేయగా.. క్షణాల్లో అది వైరల్ అయింది. ఈ మూవీలో ఆయన అమర సైనికుడికి తండ్రిగా శక్తివంతమైన పాత్ర పోషించారు. DEC 25న ఇది విడుదల కానుంది.
చిన్న సినిమాగా రిలీజైన రియల్ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ మూవీ ‘రాజు వెడ్స్ రాంబాయి’ మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.9.08 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘తలైవార్ 173’ మూవీ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి దర్శకుడు సుందర్ సి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీకి దర్శకుడిగా పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ను మేకర్స్ ఎంపిక చేశారట. 2026 మార్చి నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన సినిమా ‘శంబాల’. డిసెంబర్ 25న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా OTT, శాటిలైట్ పార్ట్నర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్ను ఆహా రూ.5 కోట్లకు, శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ చిత్రం ఇప్పట్లో OTTలోకి రాదని స్పష్టం చేశాడు. ఈ సినిమాను 50 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని పేర్కొన్నాడు. ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో అఖిల్, తేజస్వి జంటగా నటించారు.
కేవలం రూ. 50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఓ చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ‘లాలో- కృష్ణ సదా సహాయతే’ అనే గుజరాతీ చిత్రం ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా వసూళ్లతో రూ.100 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. కథలో బలం ఉంటే చిన్న సినిమా అయినా సరే భారీ కలెక్షన్లు సాధించవచ్చని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.
నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘తెలుసు కదా’ చిత్రం కథ తనదే అంటూ ఓ యువకుడు SMలో కొన్ని సాక్ష్యాలను బయటపెడ్డాడు. 2020లో సమంతకు తాను స్టోరీ చెప్పినట్లు అతడు తెలిపాడు. ఆ కథను సమంత తన స్నేహితురాలు నీరజ కోనకు చెప్పడంతో, ఆమె కథలో చిన్న మార్పులు చేసి ఈ సినిమా తిసినట్లు పేర్కొన్నాడు. కథలను ఇతరులకు చెప్పే ముందు జాగ్రత్తగా అంటూ సూచించాడు.
➛ ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్.➛ 1960లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన ఆయన 300లకు పైగా చిత్రాలలో నటించారు.➛ ‘షోలే’ చిత్రంతో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.➛ 2004లో రాజస్థాన్లోని బికనీర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.➛ 2012లో పద్మభూషణ్, 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య అవార్డును అందుకున్నారు.
రామ్ చరణ్ నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ పాట యూట్యూబ్లో రికార్డులను సృష్టిస్తోంది. ఈ సాంగ్ ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇక ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.
నవంబర్ చివరి వారంలో సినీ ప్రేక్షకులను అలరించేందుకు 5 మూవీలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 27న రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలుకా’, ధనుష్ ‘అమర కావ్యం’ విడుదల కానున్నాయి. అలాగే 28న రాయ్ లక్ష్మీ ‘జనతాబార్’తోపాటు స్కూల్ లైఫ్, మరువ తరమా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవే కాక 28న మహేష్ ‘బిజినెస్మేన్’ కూడా రీరిలీజ్ కానుంది.
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర నివాసానికి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. కాగా, గత కొంతకాలంగా ధర్మేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
‘రాజాసాబ్’ ఈవెంట్లో ‘నేను వారిలా కాలర్ ఎగరేయను’ అని డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలపై NTR ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో మారుతి వారికి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘ప్రతి అభిమానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు. ఎవరినీ అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. NTR అభిమానులందరి పట్ల అపారమైన గౌరవం ఉంది. మీరు దాని వెనకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా’ అని పే...
గుజరాతీ మూవీ ‘లాలూ- కృష్ణ సదా సహాయతే’ సంచలనం సృష్టించింది. మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్తో వసూళ్లను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని చేరుకుంది. రూ.50 లక్షల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ రూ.100 కోట్లు వసూలు చేసింది. ఏకంగా 14,000 శాతం లాభంతో రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది.
చిన్న సినిమాగా వచ్చి అభిమానులను అలరిస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ఈవెన్ సాధించింది. దేశవ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.7.28 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. అలాగే రోజురోజుకూ వసూళ్లు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని ఓ పల్లెటూరులో సాగే ఈ ప్రేమ కథా చిత్రంలో అఖిల్, తేజస్విని జంటగా నటించారు.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభు’ సినిమాపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.