మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ షఫీ కన్నుమూశారు. ఈ నెల 16న గుండెపోటుకు గురైన ఆయన.. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘వన్ మ్యాన్ షో’ సినిమాతో డైరెక్టర్గా మారిన షఫీ.. దాదాపు 50కి పైగా సినిమాలు తెరకెక్కించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
రానా దగ్గుబాటితో దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వర్మ తన డ్రీమ్ ప్రాజెక్టు ‘బ్రహ్మా రాక్షస’ మూవీ కథను రానాకు వినిపించగా.. కథ నచ్చి సినిమా చేసేందుకు ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండే ఈ సినిమాలో రానా టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్రలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రాబోతున్న స్పై థ్రిల్లర్ ‘ఫ్యామిలీమ్యాన్ 3’. తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా టీం వేడుకను నిర్వహించింది. ఈ సిరీస్లో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక బృందం పాల్గొని సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 10ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘పదేళ్ల క్రితం రిలీజైన ‘పటాస్’ మూవీ నా జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతీ మూమెంట్, ప్రతీ క్షణం, ప్రతీ సవాల్ పాఠం నేర్పించాయి. నా జర్నీలో భాగమైన ప్రతిపక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు.
వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ వసూళ్లు రాబడుతోంది. విడుదలైన వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.203+ కోట్లు వసూలు చేసినట్లు చిత్రం బృందం ప్రకటించింది. అమెరికాలోనూ ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తల్లిదండ్రులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించినప్పటికీ అక్కడ జన్మించిన పిల్లలకు పౌరసత్వం ఇచ్చేలా అమెరికన్ చట్టాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ్టి నుంచి అలాంటి జన్మహక్కును ఫెడరల్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదని ట్రంప్ ప్రకటించారు. అక్రమంగా ప్రవేశించిన ఏలియన్స్ ఏరివేత కోసం పరిశీలన, స్క్రీనింగ్ చేపడతామని తెలిపారు.
హిందీ భాషా రియాలిటీ షో బిగ్ బాస్ 18లో కరణ్ వీర్ మెహ్రా విజయం సాధించారు. కరణ్కు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతిని హోస్ట్ సల్మాన్ ఖాన్ అందించారు. వివియన్ మొదటి రన్నరప్గా నిలిచారు. అయితే ఈ గ్రాండ్ ఫినాలేకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
చిత్రసీమలో కొందరు ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటే హీరోయిన్ సాయిపల్లవి మాత్రం వచ్చిన భారీ ఆఫర్లను తిరస్కరించింది. విజయ్ నటించిన లియో, వారసుడు, అజిత్ నటించిన వలిమై, చిరంజీవి నటించిన భోళాశంకర్, కార్తీ నటించిన చెలియా సినిమాల్లో హీరోయిన్గా వచ్చిన అవకాశాలను రకరకాల కారణాలతో వదిలేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి వెల్లడించింది.
మంచు మనోజ్, విష్ణు మధ్య నెట్టింట మాటల యుద్ధం జరుగుతోంది. ‘కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు మిగిలిన వాళ్లను పక్కన పెట్టి మనమే చర్చించుకుందాం. ఏం అంటావు’ అని మనోజ్ పోస్టు పెట్టాడు. మరోవైపు మనోజ్తో వివాదంపై ఓ ఇంటర్వ్యూలో విష్ణుకు ప్రశ్న ఎదురైంది. ‘మనం చేసే చర్యలే మన వైఖరికి అద్దం పడతాయి. జనరేటర్లో పంచదార పోస్తే పేలదు’ అని తెలిపాడు.
తమిళ హీరో అజిత్ ప్రధాన పాత్రలో మాగిజ్ తిరుమేని తెరకెక్కించిన మూవీ ‘విడాముయార్చి’. తాజాగా ఈ సినిమాను తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్తో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇవాళ సాయంత్రం 6:40 గంటలకు తమిళంతో పాటు తెలుగులో ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ముంబైలోని సైఫ్ నివాసంలో కత్తితో దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు.
ఈ ఏడాది ఆస్కార్ వేడుక రద్దు కానుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్పై ఆస్కార్ అకాడమీ స్పందించింది. ‘ఆస్కార్ అవార్డుల వేడుకను రద్దు చేయాలనే ఆలోచన అకాడమీకి లేదు. వేడుకల్లో ఎలాంటి మార్పు ఉండదు. మార్పులుంటే స్వయంగా మేమే వెల్లడిస్తాం’ అని తెలిపింది. కాగా.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో కార్చిచ్చు కారణంగా ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది.
టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘అనగనగా ఒకరాజు’. తాజాగా ఈ సినిమా OTT పార్ట్నర్ ఫిక్స్ అయింది. నెట్ఫ్లిక్స్ దీని డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుంది. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి ‘అమరన్’ మూవీ హిట్తో ఫుల్ జోష్లో ఉంది. అయితే, ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో మూవీకి నో చెప్పినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో విక్రమ్.. దర్శకుడు మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని చిత్ర బృందం ఎంపిక చేసిందట. కానీ, ఆ డేట్స్కి కాల్షీట్ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గేమ్ ఛేంజర్’ థియేటర్లలో ఇవాళ విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఆన్లైన్లో HD ప్రింట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. కాగా, దీనిపై మేకర్స్ ఇంకా స్పదించలేదు. ఇక ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు.