సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన క్లాసిక్ మూవీ ‘అతడు’ రీ-రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 28న ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా రీ-రిలీజ్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లు 40 లక్షలకు దక్కించుకున్నారట. అద్భుతమైన డైలాగ్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో అలరించిన ఈ చిత్రం మరోసారి వెండితెరపై ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.
టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దర్శకుడు గోపి అచ్చర తెరకెక్కించిన ‘హే బల్వంత్’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ మూవీ రూ.2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ఎలాగైనా తండ్రి బిజినెస్ను తాను టేకప్ చేయాలనే కొడుకు కథతో ఈ మూవీ తెరకెక్కింది.
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. 2026 సమ్మర్ రిలీజ్ అని చిరు స్వయంగా చెప్పినా, భారీ VFX పనుల వల్ల జాప్యం జరుగుతోంది. మరోవైపు ఆలస్యంగా మొదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే విడుదలై రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో పెండింగ్లో ఉన్న ‘విశ్వంభర’ ఓటీటీ డీల్, విడుదల తేదీపై మెగా ఫ్యాన్స్ ఆందోళన చెంద...
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. ఫిబ్రవరి 28న రిలీజ్ కానున్న ఈ సినిమా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. FEB 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక నయన్ సారిక కథానాయికగా నటించిన ఈ మూవీకి రధన్ మ్యూజిక్ అందించాడు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి కానుకగా రిలీజై పర్వాలేదనిపించింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా OTTలోకి రాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ ఆలస్యానికి కారణం ఇతర భాషల డబ్బింగ్ పనులేనని సమాచారం. OTT సంస్థ జీ5 ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయాలని భావిస్తుందట.
‘రోసిన్’ సిరీస్లో తాను అమ్మ పాత్ర పోషించానని మీనా తెలిపింది. ‘నేను అమ్మను అయ్యాకే సిరీస్లోని తల్లి పాత్ర విలువను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోగలిగా. అందుకే ఎమోషనల్ సీన్స్లో ప్రతి డైలాగ్ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటి తరం పిల్లలకు అన్ని విషయాలపై అవగాహన ఎక్కువ, ఏది చెప్పినా తెలుసు అంటారు. ఏది తప్పో, ఏది ఒప్పో వారికి చెప్పడం వరకే మన బాధ్యత’ అని తెలిపింది.
ప్రెగ్నెన్సీ సమయంలోనే ‘సతీ లీలావతి’ మూవీ పూర్తి చేసినట్లు నటి లావణ్య త్రిపాఠి తెలిపింది. ‘షూటింగ్లో వాంతులు అవుతున్నా లెక్కచేయకుండా, యాక్షన్ సీన్లప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేశాను. ప్రతి షెడ్యూల్ తర్వాత హెల్త్ చెకప్ చేయించుకున్నా. మొదటి బిడ్డతో సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో రెండో బిడ్డ పుట్టినప్పుడు ఈ మూవీకి పార్ట్-2 చేస్తానేమో’ అంటూ చమత్కరించింది.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ FEB 28న రిలీజ్ కానుంది. దాదాపు రూ.19 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా రూ.26 కోట్లు వచ్చినట్లు సమాచారం. థియేట్రికల్ హక్కులు రూ.10 కోట్లు, నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.16 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. దీంతో విడుదలకు ముందే నిర్మాతలకు రూ.7 కోట్లు లాభాల వచ్చినట్లు తెలుస్తోంది.
దర్శకుడు పూరీ జగన్నాథ్ టేకింగ్, రైటింగ్పై ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు SMలో వైరలవుతున్నాయి. ‘బుజ్జిగాడు’ కంటే ‘ఏక్ నిరంజన్’లో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, ఆ క్యారెక్టర్ను ఎలా చేయాలా అని ఎక్కువగా ఆలోచించేవాడినని ప్రభాస్ తెలిపాడు. పూరీ డైలాగ్స్, రైటింగ్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయని, ఆయనలాంటి రైటింగ్ ప్రపంచంలోనే ఎవరూ చేయలేరని, ఎవరి వల్ల కాదని తెలిపాడు.
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2026 ఫిబ్రవరి 6న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT డేట్ ఫిక్స్ అయింది. సన్నెక్స్ట్లో FEB 27 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
‘ధురంధర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో దాని సీక్వెల్పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘ధురంధర్ 2’ ట్రైలర్ అప్డేట్ వచ్చింది. 2026 మార్చి 5న ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీనికోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.
సీనియర్ నటి మీనా తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లపై తీవ్రంగా స్పందించింది. భర్త విద్యాసాగర్ మరణం నుంచి తాను ఇంకా కోలుకోలేదని, ప్రస్తుతం తన కూతురే తన ప్రపంచమని స్పష్టం చేసింది. ‘నేను ఒంటరి మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నారా?’అని ఆవేదన వ్యక్తం చేస్తూ, తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దని కోరాడు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని పేర్కొంది.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మృత్యుంజయ్’. FEB 27న రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా పడింది. 2026 మార్చి 6న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. అయితే FEB 28న శ్రీవిష్ణు మరో సినిమా ‘విష్ణు విన్యాసం’ విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ మూవీలో మహేష్ రుద్ర, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్. తాజాగా మైత్రీ సినిమాస్ వద్ద రాముడి గెటప్లో ఉన్న మహేష్ డిజిటల్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ధనుస్సు పట్టుకున్న మహేష్ గంభీరమైన లుక్ చూసి రాజమౌళి సైతం తనకు ‘గూస్బంప్స్’ వచ్చాయని ప్రశంసించడం విశేషం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడు శిరీష్, నయనికల పెళ్లి సందర్భంగా గ్రాండ్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు నిహారిక, వైష్ణవ్ తేజ్ వంటి మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుతం అల్లు, మెగా హీరోల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్చి 6న శిరీష్ వివాహం జరగనుంది.