శర్వానంద్, అభిలాష్ రెడ్డి కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. దీనిపై సంగీత దర్శకుడు గిబ్రాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘సాహో’ తర్వాత తనకు ఇది పర్ఫెక్ట్ కమ్బ్యాక్ అవుతుందని, కథలోని ఎమోషన్స్ తనను ఆకట్టుకున్నాయని తెలిపాడు. సినిమాలో 8 పాటలు ఉండగా, ఒక పూర్తి పాటతో పాటు మిగిలినవి మాంటేజ్ సాంగ్స్ అని పేర్కొన్నాడు.
దివంగత నటి శ్రీదేవికి చెందిన 4.7 ఎకరాల స్థలంపై వివాదం మద్రాస్ హైకోర్టుకు చేరింది. 1988లో ఆమె కొన్న ఈ ఆస్తిపై కొందరు వేసిన దావాను బోనీ కపూర్, జాన్వీ, ఖుషి కపూర్ సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ తమిళ్సెల్వి, జిల్లా కోర్టు చర్యలపై మార్చి 26 వరకు స్టే విధించారు. తమ వద్ద పక్కా పత్రాలు ఉన్నాయని, ఇది కావాలని సృష్టించిన వివాదమని కపూర్ కుటుంబం పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ హీరోలు మోహన్ బాబు, రాజశేఖర్ భాగం కానున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీలో కీలక పాత్రల కోసం వారిని మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
హాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంఛైజీ ‘డూన్’ నుంచి పార్ట్ 3 రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. నటుడు టిమోతీ చాలమెట్ ఇన్స్టాలో షేర్ చేసిన ఈ పోస్టర్ ఇంటెన్స్గా ఉంది. ‘డూన్ మెస్సయ్య’ నవల ఆధారంగా దర్శకుడు డెనిస్ విల్నెయువ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రెండో భాగం ముగిసిన 12 ఏళ్ల తర్వాత సాగే కథతో ఈ మూవీ రానుంది
ఇటీవలే ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’తో వచ్చిన నటుడు తిరువీర్ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన విలేజ్ కామెడీ సినిమా ‘పాపం ప్రతాప్’. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఏప్రిల్ 17కి వాయిదా వేశారు. ఇక S.P దుర్గా నరేష్ తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా.. ప్రసాద్ బెహర, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.
మెగాస్టార్ చిరంజీవిపై దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ చూసిన చిరంజీవి డైలాగ్స్ బాగున్నాయని తనతో చెప్పారని తెలిపాడు. చిరుతో కొన్ని యాడ్ ఫిల్మ్స్ తీశానని చెప్పాడు. అంతేకాదు ఆయనతో తన సినిమా ప్రాసెస్లో ఉందన్నాడు. కచ్చితంగా మెగాస్టార్తో ఒక ‘రౌడీ అల్లుడు’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమా చేస్తానని తెలిపాడు.
దర్శకుడు శేఖర్ కమ్ముల, నాని కాంబోపై వస్తున్న వార్తలు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారాయి. శేఖర్ కమ్ముల మార్క్ సున్నితమైన ‘క్లాస్’ కథను నాని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ‘దసరా’, ‘సరిపోదా శనివారం’ వంటి చిత్రాలతో ప్రస్తుతం నాని ‘మాస్’ ఇమేజ్పై దృష్టి పెట్టాడట. తన ప్రస్తుత మార్కెట్ లెక్కల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. US మార్కెట్లో ఈ సినిమా రికార్డు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ఇప్పటికే 250K డాలర్ల గ్రాస్ మార్కును దాటినట్లు డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. ప్రీమియర్లకు ఇంకా ఒకరోజు సమయం ఉండగానే ఈ స్థాయి వసూళ్లు రావడం ఈ మూవీ గ్రాండ్ ఓపెనింగ్స్కు సంకేతమని సినీ వర్గాలు తెలిపాయి.
‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదల కానున్న ఈ మూవీ పెయిడ్ ప్రివ్యూలు, అడ్వాన్స్ బుకింగ్స్తో రికార్డులు తిరగరాస్తోంది. ప్రివ్యూల ద్వారా రూ.40.54 కోట్లు, తొలిరోజు బుకింగ్స్తో రూ.29 కోట్లు రాగా, ఓవర్సీస్లో రూ.60 కోట్లు వచ్చినట్లు టాక్. మొత్తంగా రిలీజ్కు ముందే రూ.130 కోట్లు సాధించి సత్తా చాటిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదల కానున్న ఈ మూవీ పెయిడ్ ప్రివ్యూలు, అడ్వాన్స్ బుకింగ్స్తో రికార్డులు తిరగరాస్తోంది. ప్రివ్యూల ద్వారా రూ.40.54 కోట్లు, తొలిరోజు బుకింగ్స్తో రూ.29 కోట్లు రాగా, ఓవర్సీస్లో రూ.60 కోట్లు వచ్చినట్లు టాక్. మొత్తంగా రిలీజ్కు ముందే రూ.130 కోట్లు సాధించి సత్తా చాటిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో తమిళ సీనియర్ డైరెక్టర్ K.S రవికుమార్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ చెప్పాడు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా, R. పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో తమిళ సీనియర్ డైరెక్టర్ K.S రవికుమార్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ చెప్పాడు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా, R. పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఆస్కార్ వేడుకల్లో ధర్మేంద్రకు తగిన గౌరవం దక్కలేదనే విమర్శలపై ఆయన కుమార్తె ఈషా స్పందించింది. తన తండ్రి ఎప్పుడూ గుర్తింపు కోసం ఆశపడలేదని, ఇలాంటి వేడుకలను ఆయన అస్సలు పట్టించుకోరని స్పష్టం చేసింది. హేమమాలిని సైతం స్పందిస్తూ.. ధర్మేంద్రను విస్మరించడం బాధాకరమే అయినా, కోట్లాది మంది అభిమానుల ప్రేమే ఆయనకు అసలైన అవార్డు అని పేర్కొంది.
మార్చి 19న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీలీల చేసిన వినూత్న ప్రమోషన్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సినిమాలోని మాస్ డైలాగ్ను ప్రతిబింబించేలా ఆమె ఒక ప్రత్యేకమైన టీషర్ట్ ధరించింది. దానిపై ‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’ అనే కొటేషన్ ఉంది. ఈ వెరైటీ ప్రమోషన్ పవన్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ 40% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారట.