ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా YS మాధవ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సుయోధన’. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్తో పాటు జియో హాట్స్టార్లో ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు వైఎస్ మాధవ్కి తొలి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రియదర్శి, సాయికుమార్, ప్రేమ నటనతో అలరించారు.
సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ‘కరుప్పు’ చిత్రం మే 14న విడుదల కానుంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. అయితే, త్రిషతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని కల కన్నానని, గతంలో ఓ అవకాశం చేజారిపోయినా.. ఇప్పుడు ‘కరుప్పు’ ద్వారా అది నెరవేరిందని ఆర్జే బాలాజీ తెలిపాడు. అందుకే ఆమెను ఈ కథలో ప్రత్యేకంగా తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు.
యంగ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి చిత్రానికి సిద్ధమయ్యాడు. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘పవర్ పేట’ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. విభిన్నమైన కథాంశం, మాస్ ఎలిమెంట్స్తో ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. సందీప్ కెరీర్లో ఇది ఓ వినూత్న ప్రయత్నంగా నిలవనుంది.
2026 సంవత్సరానికి గానూ ‘టైమ్ 100’ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ స్థానం దక్కించుకున్నారు. ఆయనతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఉన్నారు. ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ నటుడు రణ్బీర్ కావడం గమనార్హం.
త్వరలో ‘కర’ సినిమాతో తెరపైకి రావడానికి హీరో ధనుష్ సన్నద్ధమవుతున్నాడు. ‘డీ 56’ (వర్కింగ్ టైటిల్)గా పట్టాలెక్కబోతున్న ఈ చిత్రంలో ధనుష్తో రుక్మిణీ వసంత్ జోడీ కట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడామె స్థానంలో బాలీవుడ్ యువ నటి సారా అర్జున్ను తీసుకున్నట్లు సమాచారం. ‘ధురంధర్’తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సారా ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ...
మైక్రో ఫైనాన్స్ కేసుతో తనకు సంబంధం లేదని ప్రముఖ సింగర్ మంగ్లీ అన్నారు. ఓ కార్యక్రమం ద్వారా రమావత్ మధును తన తమ్ముడు శివతో కలిశానని ఆమె పేర్కొన్నారు. మధు వ్యాపారాల గురించి తనకేమి తెలియదని, మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో తాను కూడా బాధితురాలినే అని చెప్పారు. ఆ కేసు విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తప్పు చేసిన మధుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈరోజు నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో శ్రీలీల, రాశీ నటించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో సందడి చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, PSPK సినిమాను నెట్ఫ్లిక్స్లో చూసేయండి.
యువ దర్శకుడు సుజిత్ తన తదుపరి చిత్రాన్ని నాచురల్ స్టార్ నానితో తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ను ఖరారు చేశారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్తో ‘OG 2’ ప్రారంభించడానికి అతడు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంపై నెట్టింట ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. సినిమాలో బన్నీ రెండు పాత్రల్లో కనిపిస్తాడని టాక్. పగలు మనిషిలా, రాత్రి మృగంలా అల్లు అర్జున్ మారిపోతాడని తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో సరికొత్త గెటప్లో బన్నీని చూడబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
హీరోలు నాని, దుల్కర్ సల్మాన్లు తనకు మంచి స్నేహితులని బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలిపింది. చిత్ర పరిశ్రమలో వారు తనకు ఎంతో అండగా నిలుస్తారని, తమ మధ్య మంచి అనుబంధం ఉందని ఆమె పేర్కొంది. గతంలో ‘సీతారామం’లో దుల్కర్తో, ‘హాయ్ నాన్న’లో నానితో మృణాల్ కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా, క్రికెట్ నేపథ్యంలో సాగే ఓ రొమాంటిక్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హరిహరణ్ రామ్ ఈ ప్రాజెక్ట్కు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో మాళవిక మనోజ్ హీరోయిన్గా నటించబోతుంది. ఈ మూవీ కోసం జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా క్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
మెగా హీరో వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘బరి’ షూటింగ్ సందర్భంగా కాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుణ్కు సర్జరీ జరిగినట్లు ఆయన సోదరి నిహారిక కొణిదెల వెల్లడించింది. ప్రస్తుతం వరుణ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిపింది. త్వరలోనే కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొంటాడని పేర్కొంది.
నటి విష్ణుప్రియ వివాదాలు, పోలీస్ కేసులు ఆమె ఆర్థిక స్థితిని అమాంతం పెంచినట్లు కనిపిస్తోంది. ఆమె వివాదానికి కంటే ముందు దాదాపు 1,892 మంది పెయిడ్ సబ్ స్కైబర్లు ఉండేవారు. ఒక్కో సబ్ స్క్రిప్షన్ విలువ రూ. 380 చొప్పున.. నెలకు రూ.7లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఆమె సబ్ స్క్రైబర్ల సంఖ్య 4,832కు పెరిగింది. దీంతో ఆమె నెలకు రూ. 18 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్కు సెన్సార్ కష్టాలు తప్పడం లేదు. ‘జన నాయగన్’ సెన్సార్ సమస్యలతో ఇప్పటికే నిలిచిపోగా.. ఇప్పుడు ‘కేడీ ది డెవిల్’ చిత్రానికీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇందులో రక్తపాతం ఎక్కువగా ఉండటంతో సెన్సార్ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఐటమ్ సాంగ్ వివాదంతో పాటు పలు మార్పులు సూచించడంతో ఈ సంస్థ మరోసారి ఇబ్బందుల్లో పడింది.