బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెపై సైబర్ వేధింపులకు పాల్పడిన వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అక్షయ్ కుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ విభాగం నిందితుడిని పట్టుకుంది. వేధింపులపై ఆమె ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పడం వల్లే నిందితుడిని త్వరగా పట్టుకోగలిగామని ADG యశస్వి తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ పార్ట్-2 వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. మొదటి భాగం ‘మైఖేల్’ పేరుతో రాగా, రెండో భాగానికి ‘మైఖేల్ జాక్సన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్. ఇందులో లోతైన అర్థం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ పార్ట్-2ని 2028 ఏప్రిల్లో విడుదల చేసే అవకాశం ఉందనే రూమర్స్ జోరందుకున్నాయి. ఈ లెజెండ్ పూర్తి జీవితకథ రెండో భాగంతోనే ముగియనుంది.
గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో యష్ నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ మూవీపై యష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సాధారణంగా పురుష దర్శకులే ఇలాంటి చిత్రాలు తీస్తారనే భావన ఉంటుంది, కానీ ఒక మహిళా కోణంలో ఈ కథను చూడటం కొత్తగా ఉంటుంది. యాక్షన్ నుంచి ఎమోషన్స్ వరకు గీతూ స్పష్టత, ఆమెలోని గొప్ప రచయిత నన్ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సరికొత్త అనుభూతిని చూస్తారు’ అని తెలిపాడు.
దర్శకనటుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘గాయపడ్డ సింహం’. ఈ సినిమాను మే 1న విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని AAA Cinemasలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ వేడుకకు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ‘ఠాగూర్’ ఓ మైలురాయి. అయితే, ఈ సినిమా రీమేక్ హక్కులను మొదట తనే కొన్నానని హీరో రాజశేఖర్ తాజగా వెల్లడించాడు. అడ్వాన్స్ ఇచ్చినా, నిర్మాత తన స్నేహితుడు కావడంతో అగ్రిమెంట్ చేసుకోలేదని.. ఆ తర్వాత ఠాగూర్ మధు ఎక్కువ డబ్బులు ఆఫర్ చేయడంతో చిరంజీవి వద్దకు ప్రాజెక్ట్ వెళ్లిందని తెలిపాడు. అగ్రిమెంట్ చేసుకోకపోవడమే తన తప్పు అని పేర్కొన్నాడు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ #ENE2పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ షూట్ పూర్తయిందని, తదుపరి షెడ్యూల్ కోసం థాయ్లాండ్ వెళ్తున్నామని తెలిపాడు. నటుల మార్పుపై స్పందిస్తూ.. థియేటర్లోకి వచ్చిన 5 నిమిషాల్లో పాత సినిమాను మర్చిపోకపోతే అది తన తప్పేనని, అప్పుడు తన అడ్రస్ ఇస్తానంటూ నవ్వుతూ సవాల్ విసిరాడు. రఫ్ కట్ చూశాక పూర్తి నమ్మకం కలిగిందని వెల్లడించాడు.
హీరో అడివి శేష్ సినిమాల్లోని తన పాత్రల పేర్లు(రిషి, విక్రమ్ వాసుదేవ్, గోపి, హరిదాస్) అన్నీ విష్ణుమూర్తికి సంబంధించినవే ఉండటంపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. తాను సత్యనారాయణ స్వామి భక్తుడినని, అందుకే ఆ పేర్లంటే ఇష్టమని తెలిపాడు. తన సోదరి శివ భక్తురాలైనప్పటికీ, ఆమెకు పుట్టిన బాబుకు తానే ‘కేశవ’ అని నామకరణం చేసినట్లు శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
‘జన నాయగన్’ మూవీ లీక్ నేపథ్యంలో ‘సదరన్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్’ (SIFEA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ ఎడిటర్ ప్రదీప్ ఇ. రాఘవ్ను సస్పెండ్ చేసింది. ఓ ఫ్రీలాన్స్ ఎడిటర్ ఎడిటింగ్ రూమ్లోకి వెళ్లి, ఫుటేజీని చోరీ చేసినట్లు సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది. ప్రదీప్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని పేర్కొంటూ SIFEA ఈ చర్యలు చేపట్టింది.
1994లో ఐశ్వర్యరాయ్ మిస్ ఇండియా విజేతగా నిలిచినప్పుడు ఆమెను చూసి తాను కూడా మోడలింగ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు రకుల్ తాజాగా ప్రీత్ వెల్లడించింది. అయితే తల్లిదండ్రులు 18 ఏళ్లు నిండాకే అటువైపు వెళ్లాలని, అప్పటివరకు చదువుకోవాలని సూచించారట. వారి మాట ప్రకారం ఢిల్లీలో కాలేజీలో చదువుతూనే 18 ఏళ్లు రాగానే మోడలింగ్ను ఎంచుకున్నానని పేర్కొంది.
‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్గా వచ్చిన ‘ది కేరళ స్టోరీ 2’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 8 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ జిహాద్ నేపథ్యంలో అదితి భార్య, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.
నటి సమీరా రెడ్డి సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇస్తుంది. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘ఆఖ్రీ సవాల్’ చిత్రంలో ఆమె ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. అభిజీత్ మోహన్ వారంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సమీరా.. ఇకపై కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తానని పేర్కొంది.
నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 10 ఏళ్ల వయసు నుండే గోల్ఫ్ ఆడటం మొదలుపెట్టి, జూనియర్ నేషనల్ లెవల్లోనూ రాణించానని తెలిపింది. అయితే, ఎండ వల్ల శరీర రంగు మారుతుందనే కారణంతో, మోడలింగ్, సినిమాలపై మక్కువతో గోల్ఫ్ను వదిలేసినట్లు చెప్పింది. ప్రొఫెషనల్గా కాకపోయినా, ఇప్పటికీ అప్పుడప్పుడూ గోల్ఫ్ ఆడుతూనే ఉంటానని పేర్కొంది.
షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ల ‘కింగ్’ చిత్రంలో దీపికా పదుకొనె నటిస్తోంది. గర్భవతి అయినప్పటికీ, ఆమె భారీ యాక్షన్ సీన్స్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఏప్రిల్ 21, 22 తేదీల్లో ప్రత్యేక సెట్లో పోరాట దృశ్యాలను చిత్రీకరించారట. త్వరలో ఇసుకలో 8 మందితో జరిగే మరో భారీ ఫైట్ సీక్వెన్స్లో షారుఖ్, దీపికా కలిసి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ విడుదలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నేరాలను గ్లామరైజ్ చేయడం వల్ల యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని జీ5ని ఆదేశించింది. ఐటీ చట్టం కింద దీనిని నిలిపివేయాలని పోలీసులు కోరగా, దీని ట్రైలర్ను కూడా తొలగించారు.
ప్రస్తుతం ‘చాంద్ మేరా దిల్’ షూటింగ్లో ఉన్న అనన్య పాండే, తాజాగా కార్తీక్ ఆర్యన్ సరసన ‘నాగిల్లా’ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇప్పుడు మూడోసారి ఈ జోడీ కలిసి నటిస్తుండటంతో, ఈసారైనా హిట్ కొడతారా లేదా అనే చర్చ బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.