• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

ఆస్కార్స్ 2026కు తగ్గిన టీవీ వ్యూయర్‌షిప్!

98వ ఆస్కార్ అవార్డుల రేటింగ్స్ ఈసారి నిరాశపరిచాయి. కోనన్ ఓబ్రియన్ హోస్ట్‌గా చేసిన ఈ వేడుకను 17.9 మిలియన్ల మంది వీక్షించగా, గత ఏడాదితో (19.7 మిలియన్లు) పోలిస్తే ఇది 9 శాతం తక్కువ. ముఖ్యంగా 18-49 ఏళ్ల మధ్య వయసు గల ప్రేక్షకులలో 14 శాతం తగ్గుదల నమోదైందని వాల్ట్ డిస్నీ తెలిపింది. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఆదరణకు ఈసారి బ్రేక్ పడటం గమనార్హం.

March 18, 2026 / 12:02 PM IST

‘ధురంధర్‌ 2’ ఫస్ట్‌ రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ

‘ధురంధర్ 2’పై రాంగోపాల్ వర్మ తొలి రివ్యూ ఇచ్చాడు. ఇది కేవలం సినిమా కాదు, భారతీయ చిత్ర చరిత్రను మలుపు తిప్పే ‘సినిమాటిక్ ఆర్డర్’ అని అభివర్ణించాడు. భారతీయ సినిమా గర్వించదగ్గ క్లాసిక్ ‘షోలే’ కంటే 100 రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని, సినిమా వ్యాకరణాన్ని ఇది మార్చేస్తుందని తెలిపాడు. వసూళ్లే కాదు, సామాజిక ప్రభావం కూడా అసాధారణంగా ఉంటుందన్నాడు. ఇక ఈ మూవీ మార్చి 19న ...

March 18, 2026 / 11:52 AM IST

ఆగిపోయిన సినిమాను మళ్లీ స్టార్ట్ చేసిన హీరో!

గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గతంలో ఆగిపోయిన దర్శకుడు కుమార్ సాయితో ప్రాజెక్టును ఆయన మళ్లీ పట్టాలెక్కిస్తున్నాడట. ఆర్థిక కారణాలతో నిలిచిపోయిన ఈ మూవీపై మేకర్స్ ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ నుంచి లండన్‌లో రెండు నెలలు కీలక షెడ్యూల్ జరగనున్నట్లు, మూవీలోని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరించి, షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లు టాక్.

March 18, 2026 / 11:12 AM IST

‘ధురంధర్ 2’.. ఆ సీన్స్‌ తొలగించాలన్న సెన్సార్‌

‘ధురంధర్‌ 2 చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. 3 గంటల 49 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో తల నరకడం, సుత్తితో దాడి వంటి 4 అత్యంత హింసాత్మక దృశ్యాలతో సహా మొత్తం 21 మార్పులను సూచించింది. అలాగే నోట్ల రద్దు తేదీల సవరణతో పాటు ‘లాహోర్’ అనే పదాన్ని ‘డిల్లీ’గా మార్చాలని సీబీఎఫ్‌సీ ఆదేశించింది. ఈ మార్పుల తర్వాతే సినిమా విడుదలకు సర్టిఫికెట్ జారీ చేసింది.

March 18, 2026 / 11:02 AM IST

రాజకీయాల్లో నటీమణులను లాగొద్దు: మంచు విష్ణు

తమిళనాడు రాజకీయ వివాదాల్లోకి నటీమణులను లాగడంపై నటుడు మంచు విష్ణు తీవ్రంగా స్పందించాడు. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలను వాడుకోవడం అత్యంత అసభ్యకరమని మండిపడ్డాడు. నటీనటులకు కూడా భావోద్వేగాలు, కుటుంబాలు, గౌరవం ఉంటాయని.. వారి ప్రైవేట్ స్పేస్‌ను సమాజం గౌరవించాలని హితవు పలికాడు. రాజకీయ విమర్శల్లో నటీమణులను కించపరచడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు.

March 18, 2026 / 10:50 AM IST

‘ఉస్తాద్’ నటీనటుల రెమ్యూనరేషన్

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న రిలీజ్ కానుంది. పవన్ ఈ సినిమా కోసం కేవలం రూ.25 కోట్లు మాత్రమే తీసుకున్నారట. నిర్మాతలతో ఉన్న పాత అడ్వాన్స్‌ల సర్దుబాటు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. శ్రీలీలకు రూ.2.5-3 కోట్లు, రాశీ ఖన్నాకు దాదాపు రూ.1.5-2 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సుమారు రూ.120-150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారట.

March 18, 2026 / 10:26 AM IST

క్షమాపణలు చెప్పిన పార్తిబన్‌

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఈవెంట్‌లో తన స్పీచ్‌పై నటుడు పార్తీబన్ క్షమాపణలు చెప్పాడు. వేదికపై కులం పేరు ప్రస్తావించడంపై స్పందిస్తూ.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, అది కేవలం నోరు జారడం వల్ల జరిగిందని వివరించాడు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు చేసిన తాను ఇలా చేయడం తన ఇన్నేళ్ల అనుభవంలో ఇదే మొదటిసారని, ఇకపై జాగ్రత్తగా ఉంటానని తెలిపాడు.

March 18, 2026 / 10:17 AM IST

తమిళ దర్శకుడితో పవన్ సినిమా?

మార్చి 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఈ సినిమా తర్వాత పవన్ తమిళ దర్శకుడు మోహన్ రాజాతో ప్రాజెక్టు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పవన్‌కు ఆసక్తికరమైన కథను వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి మధ్య చర్చలు జరుగుతున్నాయట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించనున్నట్లు టాక్.

March 18, 2026 / 09:50 AM IST

‘కేడీ’ పాట వివాదం.. దర్శకుడి భార్య పోస్ట్‌ వైరల్‌

దర్శకుడు ప్రేమ్ రూపొందిస్తున్న ‘కేడీ: ది డెవిల్‌’ మూవీలోని ‘సర్కే చునార్‌ తేరీ సర్కే’ సాంగ్ వివాదంపై ఆయన భార్య నటి రక్షిత ఇన్‌స్టా వేదికగా స్పందించింది. గతంలో శృంగారభరిత సినిమాలు వచ్చినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ఆమె ప్రశ్నించింది. విమర్శించే హక్కు ఉన్నా, వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని పేర్కొంటూ.. సినిమాపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసింది.

March 18, 2026 / 09:22 AM IST

నోరా ఫతేహి పాట వివాదం.. గీత రచయిత వివరణ

నోరా ఫతేహి నటించిన ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట వివాదంపై గీత రచయిత రఖీబ్ ఆలం స్పందించాడు. ఈ పాటలోని అసభ్య పదజాలంపై వస్తున్న విమర్శలపై ఆయన వివరణ ఇచ్చాడు. దర్శకుడు ప్రేమ్ ఒత్తిడి వల్లే కన్నడ సాహిత్యాన్ని హిందీలోకి అనువదించాల్సి వచ్చిందని, కొన్ని లైన్లు ద్వంద్వార్థాన్ని ఇస్తున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. సెన్సార్ సమస్యలు వస్తాయని ముందే హెచ్చరించినా టీమ్ వినలేదని తెలిపాడు.

March 18, 2026 / 08:52 AM IST

‘ఉస్తాద్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్‌పై కేసు

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 15న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడుకకు 1,500 మందికే అనుమతి ఉండగా, 5,000 మందికి పైగా హాజరయ్యారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సెక్షన్ 188 కింద FIR నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 18, 2026 / 08:40 AM IST

‘ధురంధర్ 2’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!

రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. రేపు సినిమా విడుదల కానుండగా, నేటి నుంచే వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ మొదలయ్యాయి. కేవలం ప్రీమియర్స్ ద్వారానే రూ. 40 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొదటి రోజు వసూళ్లు రూ. 150 నుంచి 180 కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

March 18, 2026 / 08:28 AM IST

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘సుమతీ శతకం’

బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి నటించిన రూరల్ డ్రామా ‘సుమతీ శతకం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, మార్చి 19, 2026 నుంచి ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో శైలీ చౌదరి హీరోయిన్‌గా, టేస్టీ తేజ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాయి సుధాకర్ నిర్మించారు.

March 18, 2026 / 08:06 AM IST

నటనపై ప్రేమతోనే అలా అడిగేదాన్ని: మృణాల్‌

నటి మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సినీ పరిశ్రమలోకి బయటి వ్యక్తిగా అడుగుపెట్టి నిలదొక్కుకోవడం సవాలే. అవకాశాలు నాకు సులభంగా రాలేదు; నేనే వాటిని వెతుక్కుంటూ వెళ్లాను. నటనపై ఉన్న ప్రేమతో దర్శకులను కలిసి అవకాశాలు అడగడానికి నేను ఎప్పుడూ సిగ్గుపడలేదు. ప్రస్తుతం దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల మధ్య సమతుల్యత పాటిస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాను’ అని పేర్కొంది.

March 18, 2026 / 07:18 AM IST

శర్వానంద్‌కు జోడీగా పూజా హెగ్డే!

శర్వానంద్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం. శర్వా, శ్రీను వైట్ల కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక యాక్షన్ కామెడీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజ కథానాయికగా నటించనున్నట్టు టాక్. ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలుపెట్టి, 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

March 18, 2026 / 06:58 AM IST