ప్రపంచవ్యాప్తంగా ‘సూపర్మ్యాన్’ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ సిరీస్ నుంచి విడుదలైన తాజా సూపర్ హిట్ చిత్రం ‘సూపర్మ్యాన్’ OTTలోకి వచ్చేసింది. జియోహాట్స్టార్లో తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్మ్యాన్గా డేవిడ్ కోరెన్స్వెట్ నటించాడు. జేమ్స్ గన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ నిర్మించారు.
అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ’12A రైల్వే కాలనీ’. నవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఏకంగా 4 భాషల్లో ప్రసారం అవుతుండటం విశేషం.
‘అఖండ 2’ సినిమాకు తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరలు పెంచుకోవడానికి జారీ చేసిన జీవో రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రీమియర్ షో జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమాకు తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేయాలని హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రీమియర్ షో జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
నటసింహ బాలకృష్ణ ‘అఖండ 2’ మూవీ రేపు విడుదల కానుంది. అయితే ఈ సినిమా రేట్లను పెంచుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను న్యాయస్థానం అనుమతించింది. టికెట్ ధరల పెంపుతో పాటు స్పెషల్ షోల నిర్వహణపై కోర్టు విచారణ జరిపే అవకాశముంది.
తమిళ హీరో కార్తీతో దర్శకుడు నలన్ కుమార్ స్వామి తెరకెక్కించిన సినిమా ‘వా వాతియర్'( తెలుగులో ‘అన్నగారు వస్తారు’). అయితే రేపు విడుదల కావాల్సిన ఈ మూవీ.. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రంలో కృతి శెట్టి, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సీనియర్ నటి పావలా శ్యామలా ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదుకునే వారు లేకపోవడంతో ఆమె జీవనం దయనీయంగా మారింది. తన కూతురితో కలిసి నివాసముంటున్న హోం నిర్వాహకులకు డబ్బు చెల్లించకపోవడంతో వారిని బయటకు పంపారు. దీంతో వారు ఆత్మహత్యకు యత్నిస్తుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు.
బిగ్బాస్ సీజన్-9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. లీడర్ బోర్డులో సుమన్ శెట్టి స్కోర్ తక్కువగా ఉండటంతో ఫినాలే టిక్కెట్ రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో సుమన్ శెట్టి తనకు ఉన్న స్కోర్ను ఇతరులకు ఇవ్వమని బిగ్బాస్ ఆదేశించగా.. తన స్కోర్ను సంజనకు ఇస్తున్నట్లు తెలిపాడు. కాగా, ఈ వారం సంజన ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ 75వ బర్త్ డే నేడు. సాధారణ బస్ కండక్టర్గా పనిచేసిన శివాజీ రావు గైక్వాడ్ ఇవాళ సూపర్ స్టార్. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి. దర్శకుడు బాలచందర్ అపూర్వ రాగంగళ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన రజినీ.. హీరోగా చేసిన మొదటి చిత్రం భైరవి. 75 ఏళ్ల వయసులోనూ నంబర్ 1 హీరోగా కొనసాగుతున్నారు.
బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ-2’. ఈనెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘Bookmyshow’లో టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. రేపు రాత్రి నుంచి ప్రిమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
అఖండ-2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 14 వరకు టికెట్ల ధరల పెంచుకోవచ్చని తెలిపింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.50, మల్టీప్లెక్స్లో రూ.100 పెంచుతూ పర్మిషన్ ఇచ్చింది. రేపు రాత్రి 8 గం.ల ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.600 ఖరారు చేసింది. టికెట్ ధరల పెంపుతో వచ్చే లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని ఆదేశించింది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘కళంకావల్’. డిసెంబర్ 5న విడుదలైన ఈచిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. కేవలం 4 రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సైకోగా మమ్ముట్టి ప్రతినాయకుడి పాత్రలో అద్భుత నటనతో అదరగొట్టాడు. ఈ సినిమాకు జితిన్ జోస్ దర్శకత్వం వహించాడు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ విడుదల చేసిన ‘2025-Most Stylish People’ జాబితాలో షారుఖ్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయుడిగా షారుఖ్ నిలిచాడు. కాగా, జెన్నిఫర్ లారెన్స్, సబ్రినా కార్పెంటర్, డోచి, నికోల్ షెర్జింగర్ వంటి హాలీవుడ్ స్టార్లు ఈ జాబితాలో ఉన్నారు.
హెబ్బా పటేల్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా’. ఈ సినిమాను శ్రీనివాస్ మన్నే తెరకెక్కిస్తున్నాడు. మొదట ఈ చిత్రాన్ని ఈనెల 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ను ఈనెల 25కు వాయిదా వేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ‘భయపడడానికి ఇంకొంచెం టైం ఉంది’ అంటూ పోస్టర్ విడుదల చేసింది.
2025లో గూగుల్లో అత్యధికంగా వెతికిన టాప్-10 సినిమాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో బాలీవుడ్ మూవీ ‘సైయారా’ అగ్రస్థానంలో ఉంది. రిషభ్ శెట్టి కాంతార: ఛాప్టర్ 1, రజనీకాంత్ కూలీ, వార్ 2, సనమ్ తేరీ కసమ్, మార్కో, హౌస్ఫుల్, గేమ్ ఛేంజర్, మిసెస్, మహావతార్ నరసింహ చిత్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీటిలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.