నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘థామా’. అక్టోబర్లో రిలీజైన ఈ సినిమా OTTలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్లో డిసెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే రెంట్ పద్దతిలో ఇది అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 16 నుంచి ఇది రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కు అందుబాటులో రానున్నట్లు సమాచారం.
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై సంచలన ఆరోపణలు చేశారు. వేరే వ్యక్తితో పడుకోవాలని, అసహజ శృంగారం కోసం భర్త వేధించాడని గృహహింస కేసు పెట్టారు. తన నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడని, పిల్లల ముందే తనను కొట్టేవాడని ఆమె వాపోయారు. భర్త పెట్టిన చిత్రహింసలకు గాను తనకు రూ.50 కోట్లు పరిహారం ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు.
నటి మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. తనకు ఉన్న ఏకైక కోరిక.. తన కుటుంబమంతా కలిసి ఉండటమేనని మనసులో మాట బయటపెట్టారు. గతంలో మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా కుటుంబం అంతా ఒక్కచోట ఉండాలి’ అని లక్ష్మి కోరుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీకి US ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. రామ్ వన్ మ్యాన్ షో చేశాడని, సాలిడ్ హిట్ కొట్టాడని నెటిజన్లు అంటున్నారు. భాగ్యశ్రీతో కెమిస్ట్రీ, స్క్రీన్ప్లే, ఎమోషన్స్ బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. సందర్భం లేని సీన్లు ఉన్నా.. ఓవరాల్గా రామ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీకి US ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. రామ్ వన్ మ్యాన్ షో చేశాడని, సాలిడ్ హిట్ కొట్టాడని నెటిజన్లు అంటున్నారు. భాగ్యశ్రీతో కెమిస్ట్రీ, స్క్రీన్ప్లే, ఎమోషన్స్ బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. సందర్భం లేని సీన్లు ఉన్నా.. ఓవరాల్గా రామ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. ఇటీవల రిలీజైన ‘డ్యూడ్’ సినిమాలో తన పాటలు వాడారని ఆయన కేసు వేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘సినిమా విడుదలై, విజయం సాధించిన తర్వాతే ఎందుకు కేసులు వేస్తున్నారు? ముందే ఎందుకు అభ్యంతరం చెప్పరు?’ అని నిలదీసింది. కాపీరైట్ వివాదాల్లో లేటుగా స్పందించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
‘రివాల్వర్ రీటా’గా ఈ శుక్రవారం కీర్తి సురేశ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రమోషన్స్లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్ ఇప్పుడే మొదలైనట్లు అనిపిస్తోందని, విభిన్న పాత్రలే తన బలమని చెప్పారు. ఇదే సమయంలో.. ‘బలగం’ వేణు దర్శకత్వంలో వస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియా రూమర్లకు చెక్ పడింది.
హీరో శర్వానంద్, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కాంబోలో ‘బైకర్’ మూవీ తెరకెక్కుతుంది. డిసెంబర్ 6న రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. 3డీ, 4 డీఎక్స్ ఫార్మాట్లో తీసుకురానున్న కారణంగా ఆలస్యమవుతుందని తెలిపారు. కాగా ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్గా చేస్తుండగా ప్రముఖ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ శుభవార్తను ఆది ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 2014లో అరుణ అనే అమ్మాయిని ఆది పెళ్లి చేసుకోగా.. వారికి కూతురు పుట్టింది. తాజాగా వచ్చే జనవరిలో తన భార్య బిడ్డకు జన్మనివ్వనుందని, తాము ముగ్గురం నుంచి నలుగురం కాబోతున్నామని తెలుపుతూ ఫొటో షేర్ చేశాడు. దీంతో వారికి నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కేవలం తెలంగాణ, APలో రూ.130 కోట్లకుపైగా బిజినెస్ జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. రేపు ఉదయం 11:07 గంటలకు ఈ మూవీ టైటిల్తో పాటు ప్రీ లుక్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక GV ప్రకాష్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటించనుంది.
నటుడు విజయ్ రామరాజు నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు మరో OTTలోకి రాబోతుంది. ఈటీవీ విన్లో రేపటి నుంచి అందుబాటులో ఉండనుంది. అలాగే విష్ణు విశాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ నెట్ఫ్లిక్స్లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
బాలీవుడ్ నటీనటులు వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రేపటి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సన్యా మల్హోత్రా, రోహిత్ సరఫ్, మనీష్ పాల్ కీలక పాత్రలు పోషించారు.
మహిళలపై ఆన్లైన్ వేధింపులకు వ్యతిరేకంగా నటి సమంత పోరాడేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఆమె ఐక్యరాజ్యసమితిలో భాగమైంది. మహిళలు, బాలికలపై డిజిటల్ హింసను అరికట్టేందుకు చేపట్టే అవగాహన కార్యక్రమంలో తన స్వరాన్ని వినిపించనుంది. నిన్నటి నుంచి DEC 10 వరకు 16 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో తాను భాగమైనట్లు సామ్ తెలిపింది.
‘రామాయణ’ లాంటి పెద్ద ప్రాజెక్టు చేస్తున్నానని అంగీకరించడానికి రెండేళ్ల టైం పట్టిందని దర్శకుడు నితేష్ తివారీ చెప్పాడు. దీన్ని విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ఈ మూవీలో VFXకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నాడు. దీనికోసం ఐదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నామని, 2026లో ఈ సమయానికి దీని ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానున్నట్లు తెలిపాడు. ఆ విషయంలో కొంచెం భయంగా ఉందన్నాడు.