టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూశాడు. గతంలో అక్కినేని నాగార్జునతో కిరణ్ ‘కేడి’ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆయన తాజాగా దర్శకత్వం వహించిన ‘కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆ సినిమా విడుదల కాకముందే కిరణ్ చనిపోవడం బాధాకరమని పలువురు పేర్కొంటున్నారు.
ఇటీవలే ‘డ్యూడ్’ సినిమాతో హిట్ అందుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్ మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తన స్వీయ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని AGS ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’ మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ను APలోని అమరావతిలో రేపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మేకర్స్తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో ‘జైలర్ 2’ చిత్రం రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె ఈ మూవీ షూటింగ్లో కూడా జాయిన్ అయినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ధరల హైక్స్తో రిలీజైన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో ఈ మూవీ టికెట్ ధరలు నార్మల్కు రాగా.. APలో ఇవాళ్టి నుంచి సాధారణ టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో APలో ఈ సినిమా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా నటించిన మూవీ ‘హోమ్బౌండ్’. తాజాగా ‘ఆస్కార్ 2026’ షార్ట్ లిస్ట్లో ఈ మూవీ చోటు దక్కించుకుంది. ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్’ విభాగంలో భారత్ తరపున ఇది ‘ఆస్కార్ 2026’ బరిలో దిగింది. ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో స్నేహం, వివక్ష, ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే పోటీ, కోవిడ్ కష్టాల...
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వశిష్ఠ కాంబోలో సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రవితేజకు వశిష్ఠ కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2026 అర్ధభాగంలో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందట. కాగా, ప్రస్తుతం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో, వశిష్ఠ ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని ‘NBK-111’ మూవీ తెరకెక్కించనున్నాడు.. ఈ సినిమా కోసం బాలయ్య సింగర్గా మారనున్నారట. ఇందులో ఆయన ఓ పాట పాడనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపాడు. అది ‘బాహుబలి’లోని ‘సాహో రే బాహుబలి’ పాట తరహాలో ఉంటుందని పేర్కొన్నాడు. ఇక చారిత్రక అంశాలతో ముడిపడిన ఈ యాక్షన్ డ్రామాలో నయనతార కథానాయికగా నటించనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ప్రభాస్ ఇంట్రో సాంగ్తో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్లో ప్రభాస్ ఒక్కడే 200లకుపైగా మందితో ఫైట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ కానున్నట్లు సమాచారం.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన ‘బాస్టియన్’ రెస్టారెంట్పై కేసు నమోదైంది. బెంగళూరులో ఉన్న ఈ రెస్టారెంట్.. పోలీసులు అనుమతిచ్చిన సమయం కంటే ఎక్కువసేపు కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు అర్ధరాత్రి పార్టీలకు అనుమతిచ్చి రూల్స్ను బ్రేక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ రెస్టారెంట్ మేనేజర్లు, ఇతర సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ పాటకు యూట్యూబ్లో సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం తెలుగులోనే ఈ పాట 100 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించగా… అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్లకుపైగా వ్యూస్ అందుకుంది. ఇక దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 27న విడుదలవుతుంది.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ హిట్ అందుకుంది. ఈ మూవీలో రణ్వీర్ పాకిస్తాన్లో ఇండియన్ స్పైగా కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో దీన్ని కాపీ చేస్తూ SMలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ‘ఫస్ట్ డే యాజ్ ఏ స్పై ఇన్ పాకిస్తాన్’ అంటూ రీల్స్, మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ మూవీ ఇప్పటివరకు రూ.400 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్ట...
తన శరీర మార్పులకు ప్లాస్టిక్ సర్జరీ కారణమని ఓ వ్యక్తి పెట్టిన పోస్టుపై నాట్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. నిజాలు తెలుసుకోకుండా కొందరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. సంప్రదాయ వైద్యంతో పాటు మోడ్రన్ సైన్స్ను నమ్ముతానని చెప్పింది. కానీ కష్టపడి వ్యాయామం చేసినా బరువు తగ్గొచ్చనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది.
అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తోన్న సినిమా ‘లెనిన్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ నటి అనన్య పాండే రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె అఖిల్తో కలిసి స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు ఓ చిన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
తాను పెళ్లి చేసుకున్నట్లు వస్తోన్న వార్తలను నటి మెహరీన్ ఖండించింది. తాను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రాశారని, కానీ అతను ఎవరో కూడా తనకు తెలియదని చెప్పింది. తాను ఎవరినీ పెళ్లి చేసుకోలేదని, ఒకవేళ వివాహం చేసుకుంటే అందరికీ చెబుతానని పేర్కొంది. కాగా, గతంలో హర్యానాకు చెందిన భవ్యా బిష్ణోయ్తో మెహరీన్ ఎంగేజ్మెంట్ జరగ్గా.. ఆ పెళ్లి రద్దు అయింది.