• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

శర్వానంద్ సినిమా కోసం మ్యూజిక్ కసరత్తులు

హీరో శర్వానంద్‌తో దర్శకుడు శ్రీను వైట్ల ఓ మూవీని తెరకెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ మూవీ మ్యూజిక్‌పై పని జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు టాక్. ముందుగా శర్వా లేని సీన్స్‌ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.

February 22, 2026 / 03:50 PM IST

భార‌తీయ న్యాయ‌ వ్యవ‌స్థ‌పై ద‌ర్శ‌కుడి వ్యాఖ్య‌లు

ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ వాలెంటిన్ హెనాల్ట్ తన పుస్తకం ‘J’avais un rêve indien’ ద్వారా గోరఖ్‌పూర్ జైలులోని దారుణాలను బయటపెట్టారు. 2023లో అక్కడ జైలు జీవితం గడిపిన ఆయన, ఖైదీలను గాలి కూడా ఆడనంతగా కుక్కేవారని పేర్కొన్నారు. ముస్లింలు, దళితులపై వివక్ష చూపుతూ, అగ్రవర్ణాలకే మెరుగైన సౌకర్యాలు ఇస్తున్నారని, సరైన వైద్యం అందక ఖైదీలు మరణిస్తున్నారని సంచలన విషయాలు వెల్లడించారు.

February 22, 2026 / 03:35 PM IST

‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్

తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’లో సమంత నటిస్తోన్న మూవీ ‘మా ఇంటి బంగారం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. 2026 మే 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

February 22, 2026 / 03:24 PM IST

అసలైన కేరళ స్టోరీ ఇదీ : ప్రకాష్ రాజ్

‘ది కేరళ స్టోరీ’ మూవీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ సినిమా కేరళ వాస్తవాలను ప్రతిబింబించడం లేదని పరోక్షంగా విమర్శించారు. ఆ రాష్ట్రపు అసలైన సంస్కృతిని రుచి చూడమని చెప్పారు. కేరళకు చెందిన ప్రసిద్ధ వంటకాలు  ‘బీఫ్ ఫ్రై’, కొబ్బరితో చేసిన ‘బీఫ్ కర్రీ’ ఫోటోలను షేర్ చేశారు. ‘అసలైన కేరళ స్టోరీని రుచి చూడండి’ అంటూ తన SM వేద...

February 22, 2026 / 02:56 PM IST

డ్రాగన్ సీక్వెల్.. హింట్ ఇచ్చిన డైరెక్టర్!

ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు అశ్వత్ మారిముత్తు కాంబోలో వచ్చిన ‘డ్రాగన్’ మూవీ ఘనవిజయం సాధించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అశ్వత్ నెట్టింట పోస్ట్ పెట్టాడు ‘సెల్ఫ్ మేడ్ స్టార్ ప్రదీప్‌తో పనిచేయడం మర్చిపోలేను. త్వరలోనే తాము రెండోసారి తప్పకుండా వస్తాం’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ‘డ్రాగన్ 2’ సీక్వెల్ రాబోతుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

February 22, 2026 / 02:42 PM IST

నాని, సుజీత్ మూవీలో ఇద్దరు భామలు!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ భామలు భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటించనుండగా.. మరో కీలక పాత్రలో సీనియర్ నటి మాధురి దీక్షిత్ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

February 22, 2026 / 02:36 PM IST

‘మొద‌టి ఆప్ష‌న్ థియేటర్ ఎక్స్‌పీరియెన్సే: దర్శకుడు

మూవీ థియేటర్ల భవిష్యత్తుపై దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘OTTల సబ్‌స్క్రిప్షన్ మోడల్ వల్ల మూవీలు నేరుగా స్ట్రీమింగ్‌కే పరిమితమై, థియేట్రికల్ బిజినెస్ దెబ్బతినే ప్రమాదం ఉంది. వార్నర్ బ్రదర్స్ వంటి పెద్ద స్టూడియోలు ఇదే బాట పడితే భారీ బడ్జెట్ మూవీల నిర్మాణం తగ్గిపోవచ్చు. అయితే నా మొదటి ప్రాధాన్యత మాత్రం థియేటర్ ఎక్స్‌పీరియెన్సే’ అని తెలిపారు.

February 22, 2026 / 02:23 PM IST

ప్రభాస్ ‘మున్నా’ రీ-రిలీజ్.. ఎప్పుడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన ‘మున్నా’ మూవీ 2007లో రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. 2026 మార్చి 6న ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇలియానా నటించింది.

February 22, 2026 / 02:10 PM IST

‘ది కేరళ స్టోరీ 2’పై దర్శకుడి విమర్శలు

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై తీవ్ర విమర్శలు చేశాడు. దీన్ని కేవలం డబ్బు కోసం తీసిన ‘చెత్త ప్రాపగండా’ చిత్రంగా ఆయన అభివర్ణించాడు. ప్రజల మధ్య విభజన తెచ్చి లాభపడాలని చూస్తున్నారని మండిపడ్డాడు. ట్రైలర్‌లోని కొన్ని సీన్లపై స్పందిస్తూ.. ఇవన్నీ పచ్చి అబద్ధాలని, మేకర్స్ అత్యాశతోనే ఇలాంటి కథలు తీస్తున్నారని ఘాటుగా విమర్శించాడు.

February 22, 2026 / 01:56 PM IST

సత్తా చాటిన ‘అమరన్‌’, ‘భ్రమయుగం’

కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ‘అమరన్’, ‘భ్రమయుగం’ మూవీలు సత్తా చాటాయి. ‘అమరన్’ సినిమా ఏకంగా నాలుగు అవార్డులను కైవసం చేసుకోగా, ‘భ్రమయుగం’ రెండు పురస్కారాలను అందుకుంది. ఈ చిత్రాల్లో అద్భుత నటన కనబరిచిన హీరోలను ‘ఉత్తమ నటుడు’ అవార్డులు వరించాయి. దక్షిణాది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక ...

February 22, 2026 / 01:26 PM IST

ఇది నా అకౌంట్ కాదు, నమ్మకండి: నటి

బాలీవుడ్ నటి అయేషా ఖాన్ పేరు మీద నకిలీ వాట్సాప్ అకౌంట్లు సృష్టించి పలువురిని సంప్రదిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన అయేషా.. ఆ ఫేక్ చాట్ స్క్రీన్‌షాట్‌లను, ఫోన్ నంబర్‌ను షేర్ చేస్తూ హెచ్చరించింది. ‘ఇది నా అకౌంట్ కాదు, నమ్మకండి’ అని స్పష్టం చేసింది. అపరిచితులకు వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు పంపవద్దని ప్రజలను కోరింది.

February 22, 2026 / 01:00 PM IST

‘RRR’ స్పెషల్ స్క్రీనింగ్.. ‘వారణాసి’ వీడియో!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘RRR’ మరోసారి వార్తల్లో నిలిచింది. అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైన్ ‘రీగల్’ మార్చి 2న ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ చేస్తోంది. ఈ ప్రదర్శనలో ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివీల్ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు రాజమౌళి బృందం హాజరయ్యే అవకాశం ఉంది.

February 22, 2026 / 12:49 PM IST

రెండుసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: రవి బస్రూర్

విశ్వక్ సేన్ ‘కల్ట్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు రవి బస్రూర్ తన గతాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 18 ఏళ్ల వయసులో ఆర్థిక కష్టాల వల్ల రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని తెలిపాడు . ఆ సమయంలో రవి అనే వ్యక్తి తనను రక్షించి, కీబోర్డుతో పాటు రూ.35 వేలు ఇచ్చి ఆదుకున్నారని, అందుకే ఆయనపై కృతజ్ఞతతో తన పేరులో ‘రవి’ని చేర్చుకున్నానని వెల్లడించాడు.

February 22, 2026 / 12:36 PM IST

ఒకేసారి 4Kలో పూరి 3 సినిమాలు రీ-రిలీజ్

దర్శకుడు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాలు త్వరలోనే 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ కానున్నాయి. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘పోకిరి’ సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు పూరి ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

February 22, 2026 / 12:10 PM IST

రాజ్ తరుణ్ కోలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ఈ సినిమా వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలతో అలరించనుంది. ఇక ఈ సినిమాలో ఆరి అర్జున్, అమ్ము అభిరామి, కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

February 22, 2026 / 11:42 AM IST