దర్శకత్వంపై హీరో అల్లరి నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో దర్శకత్వం వహిస్తానని, ఆ మూవీ ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’లా నిలిచిపోవాలన్నది తన కోరిక అని పేర్కొన్నాడు. కాగా అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు నాని కాసరగడ్డ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ’12A రైల్వే కాలనీ’. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా ఘనంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వేడుకలో బాలయ్యను సన్మానించారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్, గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి మురుగన్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బాలకృష్ణకు ఈ గౌవరం దక్కింది.
రామ్ చరణ్ నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ పాట రికార్డులను సృష్టిస్తోంది. ఈ సాంగ్ ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 90 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. 1.5 మిలియన్ల లైక్స్తో దూసుకుపోతోంది. ఇక ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ప్రముఖ నటుడు ఉపేంద్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మూవీల్లో సక్సెస్, ఫెయిల్యూర్లకు ఓ అర్థం ఉంది. కానీ రాజకీయాల్లో విజయమనే మాట విచిత్రంగా ఉంటుంది. ఓ వ్యక్తి, పార్టీ విజయం సాధించడం కాదు, ప్రజలు గెలవాలి. నాది పొలిటికల్ పార్టీ అయినా ప్రజలే హైకమాండ్, అభ్యర్థినీ ప్రజలే ఎంపిక చేయాలి. ఎలక్షన్, ప్రమోషన్ ప్రజలే చేయాలి. దీన్ని ప్రజలకు చేరువేయాలనుకుంటున్నా’ అని అన్నారు.
TG: ఐబొమ్మ నిర్వహకుడు రవి బ్యాంకు లావాదేవీలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీశారు. నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ గురించి వివరాలను సేకరించారు. పోలీసులు.. రవిపై ఫారెనర్స్ యాక్ట్ సెక్షన్ అటాచ్ చేశారు. కాగా, రవిని 5 రోజుల పోలీసు కస్టడీ విచారణకు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత iBOMMA క్లోజ్ అయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ‘ఐబొమ్మ వన్’ పేరుతో మరో పైరసీ వెబ్సైట్ తెరపైకి వచ్చింది. ఈ వెబ్సైట్లో సినిమా చూసేందుకు క్లిక్ చేస్తుంటే ‘Movierulz’కి కనెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, టికెట్ల ధరలు తగ్గించనంత వరకు ఇలాంటి సైట్లు వస్తూనే ఉంటాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘ఒక గ్రహశకలం వారణాసిని ఢీకొట్టినప్పుడు అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది. ప్రపంచం పూర్తిగా నాశనం అవుతుందా?. దీన్ని ఆపడానికి ఖండాలు, కాలక్రమాలు దాటాల్సిన రక్షకుడు అవసరమా? అనే అంశాలతో ఇది రాబోతున్నట్లు తెలుస్తోంది.
‘అవును’ మూవీ పోస్టర్ చూసి ఓ వ్యక్తి తనకు కాల్ చేసి తిట్టాడని దర్శకుడు రవిబాబు తెలిపాడు. ‘ఈ మూవీలో ఏనుగంత ప్రాబ్లంలో హీరోయిన్ ఉందని చెప్పడం కోసం పోస్టర్ చేయించా. దాన్ని చూసి పిల్లలను తీసుకుని మూవీకి వెళ్లానని, అందులో ఏనుగు లేదని ఓ వ్యక్తి కాల్ చేసి తిట్టాడు. ప్రేక్షకులు మనం తీసే మూవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నాడు.
గుజరాతి మూవీ ‘లాలో:కృష్ణ సదా సహాయతే’ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ.50 లక్షలతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.60 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ‘లాలో’ అనే రిక్షా డ్రైవర్ చుట్టూ తిరిగే కథతో దర్శకుడు అంకిత్ సఖియా తెరకెక్కించాడు. ఇక ఈ మూవీలో కరణ్ జోషి ప్రధాన పాత్రలో నటించాడు.
నెట్టింట సర్కులేట్ అవుతున్న తన AI మార్ఫింగ్, డీప్ఫేక్ ఫొటోలపై నటి కీర్తి సురేష్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఈ ఫేక్ ఫొటోలు నన్ను మానసికంగా బాధిస్తున్నాయి. వీటిని చూస్తే నిజంగానే నేను అలా ఫోజు ఇచ్చానా? అనే అనుమానం వస్తుంది. ఇది సెలబ్రెటీలకే కాదు.. సాధారణ ప్రజలకు కూడా ప్రమాదం. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ పోస్ట్ పెట్టింది.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సెట్స్కు ఫుడ్ ట్రక్కు తెచ్చుకుంటాడనే వార్త బయటకొచ్చింది. దీనిపై కొరియోగ్రాఫర్లు పీయూష్ భగత్, షాజియా సమ్జీ మాట్లాడారు. సల్మాన్ షూటింగ్లో పాల్గొనే ప్రతిచోటా బీయింగ్ హంగ్రీ అనే ట్రక్కు ఉంటుందని, దాని పూర్తి ఖర్చును ఆయనే భరిస్తాడని చెప్పారు. స్టార్ హీరోల వల్ల నిర్మాతలు నష్టపోతున్నారనే వార్తల్లో నిజం లేదన్నారు.
తమిళ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం ‘కరుప్పు’ మూవీతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యకు మరో ఇద్దరు తెలుగు దర్శకులు పరశురామ్, వివేక్ ఆత్రేయ కథలు వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా వీటిపై ఆసక్తి చూపించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
బాలీవుడ్ హీరోయిన్, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ రెండోసారి తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్తో పింక్ డ్రెస్లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. కాగా, 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ పెళ్లి చేసుకున్న సోనమ్.. 2022లో కుమారుడికి జన్మనిచ్చింది. ఆ బాబుకు ‘వాయు’ అనే పేరు పెట్టారు.
యువ నటీనటులు అఖిల్, తేజస్విని జంటగా దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన మూవీ ‘రాజు వెడ్స్ రాంబాయి’. రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే నిర్మాణ సంస్థ ఈటీవీ విన్ దీని టికెట్ ధరలను తగ్గించింది. టికెట్ ధరలు సింగిల్ థియేటర్లలో రూ.99, మల్టీప్లెక్స్ల్లో రూ.150గా నిర్ణయించింది. పైరసీపై పోరాటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన మూవీ ‘కాంత’. ఇటీవల రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.