టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఓ తమిళ రీమేక్ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన కాలికి తీవ్రగాయం కావడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా రాజశేఖర్ తమిళ మూవీ ‘లబ్బర్ పందు’ రీమేక్లో నటిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రముఖ హీరో జూ.ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా, ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్, సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తూ.. ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రముఖ హీరో జూ.ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా, ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్, సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తూ.. ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
మాస్ మహారాజ్ రవితేజ కొత్త మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి (BMW)’ నుంచి మేకర్స్ మరో అప్డేట్ ప్రకటించారు. సెకండ్ సింగిల్ ‘అద్దం ముందు’ పాట ప్రోమోను ఈరోజు సా.6:03 గంటలకు విడుదల చేస్తామని.. ఫుల్ సాంగ్ను ఈనెల 10న రిలీజ్ చేస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే విడుదలైన ‘Bella Bella’ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పటికే ఆహా, ఈటీవీ విన్ తదితర OTTలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా, తెలుగులో మరో OTT సంస్థ వచ్చింది. చాయ్ బిస్కెట్ సంస్థ.. చాయ్ షాట్స్ అనే కొత్త OTTని తీసుకొచ్చింది. ఇది తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ అందించేలా రూపొందించబడింది. మైక్రోడ్రామా సిరీస్లు, ఒరిజినల్ షోలతో ఈ OTT ప్రేక్షకులను అలరించనుంది. ఇందులోని సిరీస్ల్లో ప్రతి ఎపిసోడ్ 2 నిమిషాలలోపు ఉంటుందట.
ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ‘అఖండ 2’ మూవీ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ అంశంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. ఈ మూవీ ఇష్యూ క్లియర్ అయిందని తెలిపాడు. ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందన్నాడు. దీనిపై త్వరలోనే మేకర్స్ అప్డేట్ ఇస్తారని పేర్కొన్నాడు. ఇక నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ఈ సినిమా తెరకెక్కింది.
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుపై ఆమిర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉందని, కథ, కథనాలపై వర్క్ జరుగుతుందని వెల్లడించాడు. ఇటీవల లోకేష్ తనకు కాల్ చేసి మాట్లాడాడని, త్వరలోనే ముంబై వచ్చి పూర్తి స్క్రిప్ట్ని వినిపిస్తానని చెప్పాడని తెలిపాడు.
‘వారణాసి’ గ్లింప్స్లో ప్రతి షాట్ తనను షాక్కు గురిచేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. అంత క్రియేటివ్గా ఉంటుందని తాను ఊహించలేదన్నాడు. ప్రతి ఫ్రేమ్ టైం ట్రావెలర్లా అనిపించిందని, రాజమౌళి నుంచి మరో అద్భుతం రాబోతుందని తెలిపాడు. గ్లోబ్ ట్రాటర్ వేడుకలో మహేష్ ఎంట్రీ ప్లాన్ చూసి తనకు మాటలను రాలేదని, ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు రాజమౌళికే వస్తాయని అన్నాడు.
‘కొత్త లోక’ సినిమాతో నటి కళ్యాణి ప్రియదర్శన్ మంచి ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా మరో విభిన్న పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు కళ్యాణి సిద్ధమవుతుంది. తమిళ హీరో కార్తీ నటిస్తోన్న ‘మార్షల్’ మూవీలో ఆమె పెక్యులర్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానున్నట్లు సమాచారం.
ఈ వారంలో ఏకంగా 8 సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ నెల 12న ‘అన్నగారు వస్తారు’, ‘సైక్ సిద్ధార్థ’, ‘మోగ్లీ’, ‘ఘంటసాల ది గ్రేట్’, ‘ఈషా’, ‘మిస్ టీరియస్’, ‘నా తెలుగోడు’, ‘ఇట్స్ ఓకే గురు’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు జియో హాట్స్టార్లో ‘సూపర్ మ్యాన్’ ఈ నెల 11 నుంచి,...
సీనియర్ నటి జయా బచ్చన్ 1981 తర్వాత 14ఏళ్లు నటనకు బ్రేక్ తీసుకున్నారు. తాజాగా ఆమె దీనిపై వివరణ ఇచ్చారు. ”ఆ సమయంలో నా కూతురు శ్వేత చిన్నపిల్ల. నేను షూటింగ్కు వెళ్తుంటే ‘అమ్మా నువ్వు వెళ్లొద్దు. నాన్నని వెళ్లమని చెప్పు’ అని అడిగింది. ఆ ఒక్క మాట నన్ను తీవ్రంగా కదిలించింది. ఆమెకు ఆ సమయంలో తల్లి ప్రేమ ముఖ్యమని అనిపించి నేను సినిమాలకు బ్రేక్ తీసుకున్నా” అని చెప్పారు.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీ విడుదలైన 3 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఈ మూవీ రూ.103కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించాయి. కాగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రణ్వీర్ గూఢచారి పాత్రలో కనిపించాడు.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన మూవీ ‘కాంత’. NOVలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్లో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.