‘రామాయణ’ సినిమాలో రావణుడిగా నటించడంపై హారో యష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో భారతీయ నటీనటులందరూ భాగస్వాములు కావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నాడు. వ్యక్తిగతంగా తనకు నెగటివ్ షేడ్స్, డార్క్ రోల్స్, సంక్లిష్టమైన పాత్రలంటే ఇష్టమని, అందుకే ఈ పాత్రను ఎంచుకున్నట్లు వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమన్నాపై తాను చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని సీనియర్ నటుడు అన్నూ కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఆమె తెల్లగా ఉంటుందని హిందీలో అన్నందుకు నన్ను ట్రోల్ చేశారు. అదే ఇంగ్లీష్లో ‘Milk Body’ అంటే ఎవరికీ సమస్య ఉండకపోయేదేమో’ అని పేర్కొన్నాడు. తన ఉద్దేశం తప్పు కాదని, ఒకవేళ తమన్నా బాధపడితే ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికైనా సిద్ధమని స్పష్టం చేశాడు.
నటి ప్రగతి తన కెరీర్ గురించి కీలక విషయాలు పంచుకుంది. ఓ దర్శకుడితో పనిచేసినప్పుడు పడ్డ ఇబ్బందుల వల్ల, తాను నరకం అనుభవించానని తెలిపింది. ఇకపై అతనితో పని చేయనని చెప్పింది. కథ, పాత్ర నచ్చకపోతే ఎంతటి అవకాశాన్నైనా వదులుకుంటానని.. డబ్బు కంటే మంచి పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘డెకాయిట్’ హిట్తో జోరుమీదున్న అడివి శేష్ గతంలో ఎదురైన ట్రోలింగ్పై స్పందించాడు. ‘గూఢచారి 2’ అప్డేట్ ఇస్తూ ‘ఫ్యాన్స్’ అన్న పదం వాడగా.. ‘నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా?’ అని నెటిజన్ ఎద్దేవా చేయడం బాధించిందని తెలిపాడు. తాను ప్రేక్షకులను ఉద్దేశించి అన్నానని, తన క్రెడిబిలిటీయే తన బలమని సమాధానం ఇచ్చినట్లు చెప్పాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నితిన్ హీరోగా ఓ మూవీ రాబోతుంది. ఈ మూవీతో సోము, నర్రి డెబ్యూ డైరెక్టర్లు టాలీవుడ్కి పరిచయం కాబోతున్నారు. మే 4న ఈ మూవీ ప్రారంభం కానుండగా.. రెగ్యులర్ షూటింగ్ మే 6 నుంచి మొదలవుతుంది. 55 రోజుల్లోనే పూర్తి షూటింగ్ ముగించేలా మేకర్స్ ప్లాన్ చేశారట. దీంతో నితిన్ కెరీర్లో ఇది అతి తక్కువ సమయంలో పూర్తయ్యే మూవీగా నిలవనుంది.
మైఖేల్ జాక్సన్ బయోపిక్ తీయడం తన డ్రీమ్ అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పాడు. జాక్సన్ జీవితంలోని మలుపులు, రంగు మార్పు, సంగీత ప్రయాణం ఒక అద్భుతమైన సినిమా కథ అని అన్నాడు. అయితే, ఆ పాత్రను పోషించే సరైన నటుడు దొరకడమే అసలైన సవాలని, అటువంటి నటుడు కనిపిస్తే ఆ సినిమా తీయడం తన కల నిజమవ్వడమేనని పేర్కొన్నాడు. ఎవరు తీసినా ఆ సినిమా చూస్తానని చెప్పాడు.
రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ‘ధురంధర్’ రెండు భాగాలు భారీ విజయం సాధించాయి. ఇందులో ‘జమీల్ జమాలీ’గా అలరించిన సీనియర్ నటుడు రాకేశ్ బేడీకి మేకర్స్ బంపర్ ఆఫర్ ఇచ్చారట. రెండు పార్ట్లకు కలిపి రూ. 50 లక్షల పారితోషికం ఒప్పందం కాగా, సినిమా బ్లాక్బస్టర్ కావడంతో సంతోషంతో ఆయనకు అదనంగా రూ. 1 కోటి బోనస్ అందజేసినట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా క్రేజీ కాంబోలో వస్తున్న ‘రౌడీ జనార్ధన’ మూవీ అప్డేట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మే చివరిలో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ షెడ్యూల్ను ప్లాన్ చేశారట. ఇందులో కీలకమైన ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్తో పాటు థ్రిల్లింగ్గా ఉండే భారీ యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరించనున్నారట.
రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి నిరూపితమైంది. ఆయన నటించిన ‘డార్లింగ్’ రీ-రిలీజ్లోనూ సాలిడ్ రెస్పాన్స్తో దూసుకుపోతోంది. తొలిరోజు ప్రీమియర్స్తో కలిపి 7.59 కోట్ల గ్రాస్ వసూలు చేసి, రీ-రిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా ఏపీ, ఉత్తరాంధ్రలో వసూళ్లు అదిరిపోయాయి.
నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో ఓ మూవీ సిద్ధమవుతోంది. పక్కా కమర్షియల్ స్క్రిప్ట్తో రానున్న ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. మే 1న జరిగే పూజా కార్యక్రమాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారట. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్. బాలయ్యను కొరటాల ఎలా చూపిస్తారో అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ మూవీ పనుల్లో ఉండగానే, బ్లాక్ బస్టర్ ‘జవాన్’ సీక్వెల్కు రంగం సిద్ధమైనట్లు టాక్. దర్శకుడు అట్లీ ఇప్పటికే ‘జవాన్ 2’ స్క్రిప్ట్ను ఫైనల్ చేయగా, ఈ ఏడాది చివరలోనే మూవీని సెట్స్పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సీక్వెల్లో విలన్ పాత్ర కోసం సౌత్ ఇండియన్ టాప్ స్టార్ను ఎంపిక చేసే యోచనలో మేక...
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. అయితే ఈ సినిమా కోసం నాని ఏకంగా మూడు ప్రాజెక్టులు వదులుకున్నాడట. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ డైరెక్షన్లో చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండకు షిఫ్ట్ అవ్వగా.. సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు. ఇక టీజే జ్ఞానవేల్ నాని కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్ను సూర్యతో తెరకెక్కిస్తున్నాడు.
‘కోర్ట్’ సినిమాతో హిట్ పెయిర్గా పేరుతెచ్చుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ ‘బ్యాండ్ మేళం’. మార్చిలో రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఇది ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ‘జీ 5’లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక బావమరదళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సతీశ్ జివ్వాజీ దర్శకత్వం వహించాడు.
మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని కొత్త ప్రాజెక్టుపై తాజా అప్డేట్ వచ్చింది. దర్శకుడు ము.మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడట. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘అప్పా కుట్టి’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తుండగా.. ఇది కూడా తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న బలమైన భావోద్వేగ బంధం చుట్టూ తిరుగుతుందని సమాచారం. త్వరలో ఈ మూవీపై అధికారిక ప్రకటన రానుంది.
దర్శకనటుడు తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘గాయపడ్డ సింహం’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 25, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.