• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘పరాశక్తి’ సెకండ్‌ సింగిల్ టైమ్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పరాశక్తి’. ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్ రేపు సా.5:30 గంటలకు లాంచ్ చేయనున్నట్లు తెలియజేస్తూ.. శివకార్తికేయన్, శ్రీలీల రొమాంటిక్ మూడ్‌లో ఉన్న లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

November 22, 2025 / 09:47 PM IST

ఆస్కార్ రేసులో ‘మహావతార్ నరసింహ’

హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ బరిలో నిలించింది. 98వ అకాడమీ అవార్డులకు (ఆస్కార్స్ 2026) ‘బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్’ విభాగంలో అర్హత సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. వచ్చే నెల16న ఆస్కార్-2026 షార్ట్‌లిస్ట్, వచ్చే ఏడాది జనవరిలో తుది నామినేషన్లు ప్రకటిస్తారు.

November 22, 2025 / 08:44 PM IST

దూరదర్శన్‌తోనే సినీ జీవితాన్ని ప్రారంభించా: అనుపమ్ ఖేర్

ఇఫీ వేదికపై నటుడు అనుపమ్ ఖేర్ తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ‘మనమంతా దూరదర్శన్ ద్వారా సినీ జీవితాన్ని ప్రారంభించాం. దూరదర్శన్ మనల్ని సినిమా ప్రపంచానికి పరిచయం చేయడం మన అదృష్టం. నేనూ దూరదర్శన్ వల్లే ఈ రంగానికి వచ్చాను.. ఎన్నిటికీ దానిని మర్చిపోలేను. దూరదర్శన్ మన జీవితాల్లో నిలిచి ఉండే పరిమళం.. ఎప్పటికీ మనల్ని కౌగిలితో పెనవేసుకుని ఉంటుంది’ అని అన్నారు.

November 22, 2025 / 08:05 PM IST

GHMC నోటీసులు.. స్పందించిన సురేష్ ప్రొడక్షన్స్

రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్‌కు GHMC తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ స్పందించింది. తాము క్రమం తప్పకుండా రామానాయుడు స్టూడియో తరఫున ట్రేడ్ లైసెన్స్, GHMC జారీ చేసిన నోటీసులకు అనుగుణంగానే కడుతున్నామని పేర్కొంది. ప్రాపర్టీ టాక్స్, అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు రెండూ GHMC కలెక్ట్ చేస్తుందని స్పష్టం చేసింది.

November 22, 2025 / 07:05 PM IST

‘స్వయంభూ’ నుంచి సాలిడ్ అప్‌డేట్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. ఇక యాక్షన్ అడ్వెంచర్ తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

November 22, 2025 / 06:15 PM IST

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి

పంజాబ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ గాయకుడు హర్మాన్ సిద్ధూ(37) మృతి చెందాడు. మన్సా-పాటియాలా రోడ్డులోని స్థానిక ప్యాలెస్ సమీపంలో అతడి కారు ట్రక్కును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వసంమవడంతో హర్మాన్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

November 22, 2025 / 05:51 PM IST

ఈ వారం OTTలోకి సినిమాలు, సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌లో ‘బైసన్’, ‘హోమ్‌బౌండ్’, ‘జురాసిక్ వరల్డ్ సీజన్ 4’, ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. జియో‌ హాట్‌స్టార్‌లో ‘ఫీనిక్స్’.. అమెజాన్ ప్రైమ్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’.. జీ5లో ‘ది బెంగాల్స్ ఫైల్స్’.. సన్‌నెక్స్ట్‌లో ‘ఉసిరు’, ‘...

November 22, 2025 / 03:58 PM IST

iBOMMA రవి వివాదంపై RGV ట్వీట్

iBOMMA రవి వివాదంపై దర్శకుడు RGV  పోస్ట్ పెట్టాడు. ‘టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందున రాబిన్ హుడ్ రవి చేస్తున్న పైరసీ ఎప్పటికీ ఆగదు. పైరేటెడ్ కంటెంట్‌ను చూస్తున్న 100 మంది వ్యక్తులను అరెస్ట్ చేస్తే మూవీ లింక్‌ను చూడటం వంటివి చేయడానికి చాలామంది భయపడతారు. పైరసీ వంటి ఆలోచన సామాజిక పతనానికి దారితీస్తుంది. అలా చేయడం చాలా పెద్ద తప్పు’ అని పేర్కొన్నాడు.

November 22, 2025 / 03:00 PM IST

తెలంగాణ యాసలో అదరగొట్టిన ఏపీ అమ్మాయి

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన తేజస్వి రావు SMలో ట్రెండింగ్‌గా మారింది. గతేడాది రిలీజైన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాలో జ్యోతి పాత్ర చేసింది కూడా ఈమే. తను పుట్టింది ఏపీలోని గోదావరి జిల్లాలో అయినప్పటికీ.. రాంబాయి (తెలంగాణ పిల్ల)గా తన యాక్టింగ్‌తో అదరగొట్టి అభిమానుల మనుసులు దొచేసింది.

November 22, 2025 / 02:48 PM IST

రవికి ఎలివేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు: నిర్మాత

ప్రజలు iBOMMA రవికి మద్దతు ఇవ్వడంపై నిర్మాత బన్నీవాసు స్పందించాడు. రవిని సోషల్ మీడియా దేవుడిగా చూడొద్దని, అతనికి అంత ఎలివేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదని తెలిపాడు. పైరసీకి మద్దతుగా మాట్లాడటం చట్టవిరుద్ధమని అన్నాడు. టికెట్ రేట్లు పెంచడం వల్లే పైరసీ జరుగుతుందని అనడం కరెక్ట్ కాదని, టికెట్ రేట్లు పెంచని సినిమాలు కూడా పైరసీకి గురవుతున్నాయని పేర్కొన్నాడు

November 22, 2025 / 02:10 PM IST

మంచు మనోజ్‌ కొత్త ప్రయాణం

తాజాగా మ్యూజిక్ సంస్థను ప్రారంభించినట్లు మంచు మనోజ్ ప్రకటించాడు. ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాడు. లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్స్ అనే క్యాప్షన్‌తో పోస్టర్ షేర్ చేశాడు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. మ్యూజిక్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఈ సంస్థ ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించనున్నట్లు సమాచారం.

November 22, 2025 / 01:21 PM IST

షూటింగ్‌లో గాయపడిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ షూటింగ్‌లో గాయపడింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఈతా’ మూవీ షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె కాలికి ఫ్రాక్చర్ అయింది. దీంతో మూవీ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలివేశారు. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్నాడు.

November 22, 2025 / 01:11 PM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ తేదీలో మార్పు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీని 2026 ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాను అనుకున్న సమయానికి కంటే ముందే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మార్చి 27న రిలీజ్ కానున్న ‘పెద్ది’ వాయిదా పడనున్నట్లు, ఆ డేట్‌కు ఈ మూవీని తీసుకురావాలని భావిస్తున్నట్లు టాక్.

November 22, 2025 / 12:25 PM IST

ఇండియాలో తెలుగు సినిమా రికార్డ్

ప్రస్తుతం పలు మూవీలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అందులో కొన్ని తెలుగు మూవీలు కాగా.. మరికొన్ని వేరే భాషలవి. అయితే 24 గంటల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ టికెట్లు 41.87Kపైగా అమ్ముడయ్యాయి. ఇండియా అంతటా నిన్న రిలీజైన సినిమాల్లో ఈ ఘనత సాధించిన మూవీగా ఇది రికార్డు సృష్టించింది. ‘మస్తీ’ మూవీ(4 34.7K), ‘120 బహదూర్'(36.71K) బుకింగ్స్‌తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

November 22, 2025 / 11:54 AM IST

‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫస్ట్ డే కలెక్షన్స్

యువ నటీనటులు అఖిల్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ అప్‌డేట్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.1.47 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తెలంగాణలో ఓ పల్లెటూరులోని ప్రేమ కథతో తెరకెక్కిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.

November 22, 2025 / 11:12 AM IST