యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ మమితా బైజు జంటగా నటించిన డ్యూడ్ మూవీ థియేటర్లలో మంచి కలెక్షన్స్ సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా టీవీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 19న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు కీర్తీశర్వన్ తెరకెక్కించాడు.
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘వృషకర్మ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 85 శాతం పూర్తయినట్లు చైతూ వెల్లడించాడు. అయితే మే చివరికి షూటింగ్ ముగించి, అక్టోబర్ 2026 (దసరా) కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా.. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.
బిగ్బాస్ ఫేమ్ అంబటి అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పోచమ్మ’ సిరీస్ ఏప్రిల్ 16 నుంచి ప్రముఖ OTT ఆహాలో స్టీమింగ్ అవుతోంది. ఇక కథ విషయానికి వస్తే దర్శకుడు రమేష్ ఇందిరా మొదటి నిమిషం నుంచే కథను ఆసక్తికరంగా నడిపించాడు. నటీనటులు యాక్టింగ్తో మెప్పించారు. స్థానిక నేటివిటీ కోసం భక్తి అంశాన్ని జోడించినప్పటికీ.. క్లైమాక్స్ ట్విస్ట్ను ముందే ఊహించేలా ఉండడం కాస్త మైనస్.
తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. తన తండ్రి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపాడు. సాయం కోసం ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వస్తే ఆయనే ముందుగా స్పందిస్తారని చెప్పాడు. ‘ఇతరుల కన్నా కూడా నాన్నే నాకు ఎక్కువ స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఎందుకంటే రోజూ ఆయన్ను చూస్తూ పెరిగాను’ అని చరణ్ చెప్పుకొచ్చాడు.
తిరువీర్ నటించిన ‘పాపం ప్రతాప్’ సినిమాకు బిగ్ రిలీఫ్ కలిగింది. ఏప్రిల్ 17 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కావాల్సిన ఈ చిత్రానికి, సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది అనుకున్నారు. కానీ, చిత్ర యూనిట్ సాంకేతిక లోపాలను క్లియర్ చేసింది. దీంతో సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో పలు చోట్ల ప్రీమియర్ షోలు ప్రారంభంకానున్నాయి.
హీరో, టీవీకే చీఫ్ విజయ్ ‘జన నాయగన్’ మూవీ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నై సైబర్ క్రైమ్ విభాగం ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ సహా ముగ్గురిని అరెస్టు చేసింది. విజయ్ నటించిన ఈ సినిమాపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం విజయ్ తమిళనాడు ఎన్నికల బరిలో ఉన్నాడు.
నటి కంగనా రనౌత్ దీపికా పదుకొణెకు మద్దతుగా నిలిచింది. 8 గంటల వర్కింగ్ అవర్స్పై దీపికకు అండగా ఉంటానని తెలిపింది. 8 గంటలు మాత్రమే పనిచేస్తానని దీపిక చెప్పడం సబబేనని పేర్కొంది. ఎంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చిందని ప్రశంసించింది. నటించే విషయంలో తనకంటూ నిర్ణయం తీసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. పైగా ఇప్పుడామె ఓ బిడ్డకు తల్లి కూడా అని గుర్తు చేసింది.
కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రం మే 1, 2026న విడుదల కానుంది. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వాయిదా పడడం.. మే 1న హాలిడే కావడంతో మరింత కలిసొచ్చే ఛాన్స్ ఉంది. పెద్దికి భయపడకుండా ముందే ఆ డేట్ను బ్లాక్ చేయడం గ్రేట్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
హీరో నిఖిల్ సిద్ధార్థ్, భరత్ కృష్ణమాచారి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘రా రా ధీవర’ అంటూ సాగే ఈ పాటను ఏప్రిల్ 16న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న మూవీ ఇదే కావడం విశేషం.
నటి తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. పవర్ సోప్స్ లిమిటెడ్ సంస్థ తన ఫొటోలను అనుమతి లేకుండా వాడుకుందని దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రూ.కోటి నష్టపరిహారం కోరుతూ.. ఆమె వేసిన అప్పీల్ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఒప్పందం ముగిశాక కూడా ఫొటోలు వాడారనేందుకు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో కోర్టు ఈ కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా YS మాధవ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సుయోధన’. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్తో పాటు జియో హాట్స్టార్లో ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు వైఎస్ మాధవ్కి తొలి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రియదర్శి, సాయికుమార్, ప్రేమ నటనతో అలరించారు.
సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ‘కరుప్పు’ చిత్రం మే 14న విడుదల కానుంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. అయితే, త్రిషతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని కల కన్నానని, గతంలో ఓ అవకాశం చేజారిపోయినా.. ఇప్పుడు ‘కరుప్పు’ ద్వారా అది నెరవేరిందని ఆర్జే బాలాజీ తెలిపాడు. అందుకే ఆమెను ఈ కథలో ప్రత్యేకంగా తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు.
యంగ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి చిత్రానికి సిద్ధమయ్యాడు. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘పవర్ పేట’ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. విభిన్నమైన కథాంశం, మాస్ ఎలిమెంట్స్తో ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. సందీప్ కెరీర్లో ఇది ఓ వినూత్న ప్రయత్నంగా నిలవనుంది.
2026 సంవత్సరానికి గానూ ‘టైమ్ 100’ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ స్థానం దక్కించుకున్నారు. ఆయనతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఉన్నారు. ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ నటుడు రణ్బీర్ కావడం గమనార్హం.
త్వరలో ‘కర’ సినిమాతో తెరపైకి రావడానికి హీరో ధనుష్ సన్నద్ధమవుతున్నాడు. ‘డీ 56’ (వర్కింగ్ టైటిల్)గా పట్టాలెక్కబోతున్న ఈ చిత్రంలో ధనుష్తో రుక్మిణీ వసంత్ జోడీ కట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడామె స్థానంలో బాలీవుడ్ యువ నటి సారా అర్జున్ను తీసుకున్నట్లు సమాచారం. ‘ధురంధర్’తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సారా ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ...