98వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నుల పండుగగా సాగింది. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి గానూ షాన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా నిలవగా, ‘వెపన్స్’ చిత్రానికి ఎమీ మాడగన్ ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు. ‘కెపాప్ డెమన్ హంట్స్’ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచింది. ‘సిన్నర్స్’ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డు గెలుచుకుంది.
‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సాయి పల్లవి మరో హిందీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్లీలా భన్సాలీ తెరకెక్కించనున్న నటి మధుబాల బయోపిక్ కోసం ఆమెను సంప్రదించారట. త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రస్తుతం సాయిపల్లవి ‘రామాయణ’, ధనుష్తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నందున బిజీగా ఉందట.
లాస్ ఏంజెలెస్లో 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. ‘ఫ్రాంకిన్స్టన్’ చిత్రం కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ & హెయిర్ స్టైలింగ్ విభాగాల్లో 2 అవార్డులను కైవసం చేసుకుంది. ఎమీ మాడిగన్(వెపన్స్) ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ‘కెపాప్ డెమన్ హంట్స్’, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – ‘ది గర్ల్ హూ క్రైడ్ పెరల్స్R...
తన వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫంక్షన్కు చిరంజీవిని పిలుద్దామని హరీష్ శంకర్ కోరగా.. ‘మీకు హీరో కావాలంటే నన్ను పిలవండి, తమ్ముడు కావాలంటే అన్నయ్యను పిలవండి’ అని చెప్పినట్లు పవన్ పేర్కొన్నారు. చిరంజీవి పక్కన ఉంటే తాను హీరో అన్న విషయం మర్చిపోతానని, ఏం మాట్లాడాలో కూడా తోచదని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో ఉన్న వారు వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకుంటారని, కానీ తనకు మాత్రం సినిమానే ఆధారం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అప్పుడప్పుడు సినిమాను వదిలేయాలని అనిపించినా, తనకున్న ఏకైక ఆదాయ వనరు ఇదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 16 గంటలు శ్రమిస్తున్నానని, రోజుకు మూడు, నాలుగు గంటలు సమయం కేటాయిస్తే సినిమాలు చేయవచ్చనే ధైర్యం కలిగిందని పవన్ వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో ఉన్నప్పటికీ తనలోంచి సినిమాను వేరు చేయలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. అది తన నరనరాన జీర్ణించుకుపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలో సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, సమాజంలో సినిమా లేకపోతే క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. భారతీయ ప్రేక్షకులను, ముఖ్యంగా తెలుగు ప్రజలను సినిమా నుంచి విడదీయడం అసాధ్యమని స్పష్టం చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలు అనేవి ఎవరినో ఉద్ధరించడానికి చేసేవి కావని తెలిపారు. సినిమా తనకు ‘అన్నం పెట్టిన వృత్తి’ అని పేర్కొన్నారు. బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే కూడా.. తనను నమ్మి కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాతలు క్షేమంగా ఉండాలని, అభిమానులు గర్వపడేలా సినిమాలు ఉండాలన్నదే తన కోరికని పవన్ పేర్కొన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్లో తన డ్యాన్స్పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఎంతోకొంత డ్యాన్స్ వేస్తున్నాను, నా బాడీ కదులుతుందంటే మైకేల్ జాక్సన్ కారణం. నేను బాగా ఇష్టపడే కళాకారుల్లో ఆయన ఒకరు. ఆయన చనిపోయినప్పుడు ఏడ్చాను. అలాంటి గొప్పాయనతో నన్ను కంపేర్ చేయొద్దు. ఆయనతో కంపేర్ చేసి ఇలా ఎడిట్ చేయడం తప్పు. నాకు భయం వేస్తుంది. ఇలా ఎడిట్ చేయడం పాపం’ అని తెలిపాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రాశి ఖన్నా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నా కేరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్తో పని చేయాలనుకున్నాను. ఈ సినిమాతో నా కల నేరవేరింది. చాలా సింపుల్గా ఉంటారు. ఒక మనిషిగా నాలో స్పూర్తి నింపారు. చాలా తక్కువగా మాట్లాడుతారు.. కానీ సూటిగా మాట్లాడుతారు’ అని తెలిపింది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్లో పుస్తకాలు చదవడంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను నిద్ర లేవగానే ఏదైనా ఓ పుస్తకంలో 15 నుంచి 20 పేజీలు చదువుతానని తెలిపాడు. రోజు మొత్తంలో రెండు నుంచి మూడు గంటలు పాటు పుస్తకాలు చదవాడానికి కేటాయిస్తానని పేర్కొన్నాడు. చదవడానికి ప్రత్యేక పుస్తకాలంటూ ఏమీ లేవని, అందుబాటులో ఉన్న ఏదైనా ఒకటి చదువుతానని వెల్లడించాడు.
హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఈత’. ప్రఖ్యాత తమాషా కళాకారిణి వితాబాయి నారాయణంగావ్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ మూవీ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
విజయ్, రష్మిక పెళ్లిపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘గీత గోవిందం సినిమాకు మొదట నన్నే అడిగారు. కథ వినకముందు నో చెప్పా. కథ విన్న తర్వాత సినిమా చేయడానికి ఓకే చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు మిస్ అయింది. కానీ, ఆ మూవీ వల్ల విజయ్, రష్మిక కలిశారు. వాళ్లిద్దరూ కలవాలని ఆ సినిమా నా నుంచి వెళ్లిపోయిందేమో. ఆ ఇద్దరూ బ్యూటిఫుల్ కపుల్’ అని పేర్కొంది.
మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ గురించి తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కళ్యాణి సినిమాల్లోకి వస్తుందని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఆర్కిటెక్ట్ కావాలన్నది తన డ్రీమ్. ఓ రోజు నాగార్జున కాల్ చేసి ‘హలో!’ మూవీలో హీరోయిన్గా మీ అమ్మాయిని అనుకుంటున్నామన్నారు. కానీ కళ్యాణికి నటన రాదని చెప్పా. కానీ ఒకసారి ప్రయత్నిస్తా నాన్న అని ముందడుగు వేసింది’ అని అన్నాడు.
స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాపై నటుడు అనిల్ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమాను ఉచితంగా చేసినప్పటికీ, పారితోషికానికి సంబంధించిన చెక్కులు వస్తున్నాయని తెలిపాడు. తాజాగా రూ.3.6 లక్షల చెక్కు వచ్చిందని, ఇప్పటివరకు దాదాపు అర మిలియన్ పౌండ్లు అందుకున్నానని వెల్లడించాడు. ఆనాడు నిర్మాతలు డబ్బులు ఇవ్వలేమన్నా.. సినిమాపై ఉన్న ఇష్టంతో అతడు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించడం విశేషం.
బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో ‘G.O.A.T’ (Greatest Of All Times) మూవీ రాబోతుంది. ఈ చిత్రం 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ మూవీని దర్శకుడు వేదవ్యాస్ ఆకుల రూపొందించాడు.