దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు. రూ. 1300 కోట్లకు పైగా బడ్జెట్తో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే, ఈ సినిమాలో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త లుక్లో కనిపించాడు. కొత్త హెయిర్ స్టైల్, గడ్డం, ట్రెండీ డ్రెస్సింగ్లో సందడి చేశాడు. మిర్చి సినిమాలో ఉన్నట్లుగానే కనిపిస్తున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ప్రభాస్ కొత్త లుక్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ కోసమే ఈ స్టైల్ అని టాక్ వినిపిస్తోంది.
యూట్యూబర్ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కరాటే కళ్యాణి స్పందిస్తూ.. ‘అన్వేష్ యూట్యూబ్ ఛానల్ సహా అన్ని అకౌంట్లను డిలీట్ చేయాలని CPని కలుస్తా. అలాగే పాస్ పోర్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలని కోరుతా. హిందువులను అవమానించిన అతడికి శిక్ష పడేలా చేస్తా’ అని తెలిపింది. దీంతో అన్వేష్ యుట్యూబ్ కూడా బ్లాక్ అవుతుందా అని SMలో చర్చ జరుగుతోంది.
సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన చిత్రం ‘హే బలవంత్’. చిన్నప్పటి నుంచి కృష్ణ(సుహాస్)కి తన తండ్రి బలవంత్(నరేష్) చేసే బిజినెస్పై ఆసక్తి. కానీ అతడి తండ్రి అంగీకరించడు. బలవంత్కి హార్ట్ స్ట్రోక్ రావడంతో వ్యాపారం తానే చూసుకుంటానని ఆఫీసుకి వెళ్తాడు. తండ్రి చేసే రహస్య వ్యాపారం ఏంటనేది కథాంశం. కామెడీతో మెప్పించినప్పటికీ.. సెకండాఫ్ కాస్త స్లోగా సాగడం మైనస్. రేటింగ్ 2.5/5.
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తాజాగా ‘హే బల్వంత్’ అనే మూవీలో నటించాడు. ఈ మూవీ ఈరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు నవీన్ ఒకరోజు రాత్రి తనకు మెసేజ్ చేసినట్లు తెలిపాడు. అందులో ‘నా చైల్డ్ హుడ్ ఎంతో బాగుండేది నాన్న. నీ ప్రేమను మిస్ అవుతున్నా’ అని రాసి ఉందన్నాడు. ఆ మెసేజ్ చూడగానే తాను ఎంతో ఏడ్చినట్లు చెప్పుకొచ్చాడు.
మలయాళ నటులు అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్ కలిసి నటించిన మూవీ ‘చథా పచ్చ’. FEB 13న రిలీజైన ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. WWE తరహా రెజ్లింగ్ క్లబ్ను స్థాపించే ముగ్గురు సోదరుల కథతో ఈ మూవీ దర్శకుడు అద్వైత్ నాయర్ తెరకెక్కించాడు.
శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’ ఈనెల 28న విడుదల కానుంది. తాజాగా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని, అందరినీ అలరిస్తుందని అన్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ యువతకు బాగా నచ్చుతుందని, థియేటర్లలో అందరూ హాయిగా నవ్వుకుంటారని ధీమా వ్యక్తం చేశాడు.
దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో రానున్న భారీ చిత్రం ‘వారణాసి’ గురించి ప్రియాంక చోప్రా ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇందులో తను ‘మందాకిని’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా తన సినీ ప్రయాణాన్ని మార్చేస్తుందని, తన కెరీర్ను నిర్వచించే చిత్రమిదని ఆమె పేర్కొంది.