‘నరసింహ’ రీ-రిలీజ్ వేళ స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్ ఆసక్తికర విషయం చెప్పారు. క్లైమాక్స్లో రజనీ షర్ట్ లేకుండా చేసిన ఫైట్ కంపోజిషన్ చూసి తలైవా ఫిదా అయ్యారట. ఏకంగా ‘డైమండ్స్ గిఫ్ట్గా ఇస్తా.. ఓకేనా’ అని ఆఫర్ చేశారట. కానీ కన్నన్ మాత్రం సున్నితంగా తిరస్కరించి, తనకు వజ్రాలు సెట్ కావని, ఓ రుద్రాక్ష ఇప్పించమని కోరారట. పనిని, మనుషులను గౌరవించడంలో రజనీ ముందుంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. తాజాగా ఈ సినిమాపై క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో మహేష్ తండ్రి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో కూడా మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన విషయం తెలి...
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్, నటుడు రాబ్ రీనర్ (78), ఆయన సతీమణి మిచెల్ సింగర్ దారుణంగా హత్యకు గురయ్యారు. లాస్ ఏంజెలెస్లోని వారి నివాసంలో అనుమానాస్పద రీతిలో వీరి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. మృతదేహాలపై కత్తిపోట్లు కనిపించడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కాగా, రాబ్ రీనర్కు సపోర్టింగ్ యాక్టర్గా రెండు ఎమ్మీ అవార్డులు లభించాయి.
సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఛాంపియన్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 25న గ్రాండ్గా విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల వేగం పెంచింది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. రేపు ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు రవీంద్రభారతి వేదికైంది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం రేవంత్ హాజరవుతున్నారు. అయితే విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని హెచ్చరికలు రావడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించనున్నారు. రవీంద్రభారతి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసి, ఎలాంటి గొడవలు జరగకుండా నిఘా పెట్టారు.
బిగ్బాస్ సీజన్-9 తుది దశకు చేరుకుంది. మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఫైనల్కు చేరుకున్న టాప్-5 కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోయారు. తనూజ, డిమోన్ పవన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన నిలిచారు. ఈ వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్లో శనివారం సుమన్శెట్టి ఎలిమినేట్ కాగా, ఆదివారం భరణి ఇంటి నుంచి బయటకు వచ్చారు.
‘అఖండ 2’ విజయోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరిని చూసుకుని రా బాలకృష్ణకు అంత పొగరు.. అని చాలా మంది అంటూ ఉంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు’ అని ఆయన పేర్కొన్నారు. ‘మనం బ్యాట్మ్యాన్, సూపర్మ్యాన్ గురించి మాట్లాడుకుంటాం. ఇది కూడా అలాంటి సినిమానే’ అని తెలిపారు.
‘అఖండ 2’ను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులందరికీ నందమూరి బాలకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో మనిషే దేవుడు అయితే ఎలా ఉంటుందో చూపించామని ఆయన పేర్కొన్నారు. “ఈ సినిమాలో ప్రతి డైలాగ్ ఆణిముత్యం. మన దేశ మూలాలు, మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన చిత్రమే ‘అఖండ 2’. ఈ సినిమా చూసి సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది” అని ఆయన వ్యాఖ్యానించారు.
భారతదేశాన్ని ధర్మానికి గ్రంథాలయంగా దర్శకుడు బోయపాటి శ్రీను అభివర్ణించాడు. ‘అఖండ 2’ విజయం దేవుడి సంకల్పం అని ఆయన పేర్కొన్నాడు. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒకే వేదికపైకి వచ్చి ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చాడు. అలాగే, త్వరలో ఢిల్లీలో ప్రధాని మోదీ కోసం ‘అఖండ 2’ స్పెషల్ షో వేయనున్నట్లు వెల్లడించాడు.
అఖండ -2 సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో యూనిటీ లేదన్నారు. టాలీవుడ్కి దిష్టి తగిలిందని తెలిపారు. టాలీవుడ్లో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేయండని.. బ్యాండ్ వేయొద్దని హితవు పలికారు.
‘అఖండ 2’ విజయోత్సవ కార్యక్రమంలో నిర్మాత దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, బోయపాటి చిత్రాల్లో ‘నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్’ ఉంటుందని ఆయన అన్నారు. లాజిక్ చూస్తే మ్యాజిక్ పనిచేయదని ఆయన తెలిపారు. ‘అఖండ 2’ సినిమాకు లాజిక్లు అక్కర్లేదని, అది దైవత్వమని చెప్పారు. ఈ సినిమా తరువాత జనరేషన్కు ఒక ‘భగవద్గీత, బైబిల్, ఖురాన̵్...
‘బిగ్ బాస్’ 9వ సీజన్ నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే, 14 వారాల పాటు ఉన్నందుకు అతడు భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అతడు రోజుకు రూ.40 వేల చొప్పున, వారానికి రూ.2 లక్షల 80 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే, అతడు 14 వారాల్లో మొత్తం రూ.39 లక్షల 20 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 446.25 కోట్లు వసూళ్లు రాబట్టి, రూ.500 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతోంది. నిన్న ఒక్కరోజే ఈ చిత్రం రూ. 53 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. కాగా, ఇది రణ్వీర్ సింగ్ కెరీర్లోనే రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
టాలీవుడ్ నటుడు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డెకాయిట్’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న తెలుగు, హిందీ భాషల్లో టీజర్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇక షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, 2026 మార్చి 19న ఇది విడుదల కాబోతుంది.
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘మోగ్లీ’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ప్రీమియర్స్తో కలిపి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1.22 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ‘వైల్డ్ బ్లాక్బస్టర్’ అంటూ పోస్టర్ షేర్ చేశారు.