TG: సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు, ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు ఉండే అవకాశం ఉంది. FDC ఛైర్మన్ దిల్ రాజు సహా ఐదుగురు లేదా ఏడుగురితో సబ్ కమిటీ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. సబ్ కమిటీ నిర్ణయం మేరకు సమస్యల పరిష్కారం ఉండనుంది. కాగా, టికెట్ల రేట్ల అంశం సహా ఇతర సమస్యలపై కమిటీ చర్చించనుంది.
HYDలో హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా జరగాలని సీఎం రేవంత్ అన్నట్లు దిల్ రాజు తెలిపారు. ‘దీనికి సంబంధించి సలహాలు, సూచనలు సీఎం అడిగారు. డ్రగ్స్పై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం అడిగిన అంశాలపై త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులంతా సమావేశమై చర్చిస్తాం. 15రోజుల్లో నివేదిక ఇస్తాం’ అని అన్నారు.
TG: సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం రేవంత్తో చర్చలు జరిపామని FDC ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. ‘తెలుగు సినిమాపై సీఎం విజన్ ఏంటో చెప్పారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నారు. ఇంటర్నేషనల్ సినిమా హబ్గా HYDను మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు చిన్న విషయాలు. ఇండస్ట్రీ అభివృద్ధి మా ముందున్న అతిపెద్ద లక్ష్యం’ అని అన్నారు.
ఇప్పటివరకు అందరు CMలు సినీ ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు అన్నారు. ‘ప్రస్తుత ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ HYDలో నిర్వహించినట్లే, ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.
TG: తెలుగు సినీ నిర్మాతలకు ఇవాళ శుభదినమని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి.. ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ సందర్భంగా అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని ప్రభుత్వానికి తెలిపినట్లు వివరించారు.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న మూవీ ‘డాకు మహారాజ్’. తాజాగా ఈ మూవీపై బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డూప్ లేకుండా ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు తెలిపాడు. సెట్లో బాలకృష్ణ ఎప్పుడూ ఎనర్జిటిక్గా ఉండేవారని పేర్కొన్నాడు. ఈ మూవీలో బాలయ్యను కొత్తగా చూపిస్తున్నామని తెలిపాడు. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2025 జనవరి 12న విడుదల కానుంది.
తమిళ స్టార్ ధనుష్తో నటి శ్రుతి హాసన్ మరోసారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ‘అమరన్’ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామితో ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో శ్రుతి కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ధనుష్, శ్రుతి కాంబోలో గతంలో ‘3’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.
యూనివర్సల్ లెవల్లో స్టూడియో సెటప్ ఉండాలని, ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే టాలీవుడ్ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని హీరో నాగార్జున అన్నారు. ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ మద్దతు ఎప్పటికీ ఉంటుందని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తెలిపారు. గత ప్రభుత్వాల మద్దతుతో సినీ ఇండస్ట్రీ HYDకు వచ్చిందని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్గా హైదరాబాద్ మారాలన్నారు.
TG: ఎలక్షన్ రిజల్ట్ లాగే.. సినిమా రిలీజ్ ఫస్ట్డే ఉంటుందని టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటన తమను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్లో కాంపిటేషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండటం వల్ల ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
TG: బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చెప్పినదానికే కట్టుబడి ఉంటామని.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే అని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవని సినీ ఇండస్ట్రీ పెద్దలకు రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. కాగా, సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం కొనసాగుతుంది.
మెల్బోర్న్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన హెడ్(409)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. అతడి బంతిని అంచనా వేయడంలో విఫలమైన హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 4వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్మిత్, మిచెల్ మార్ష్ క్రీజులో ఉన్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ పలువురు సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకాలేదు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది. చిరు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారట. అందువల్లే ఆయన సీఎంను కలవలేదట. కాగా, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చిరు మాట్లాడారని సమాచారం.
మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు భాను భోగవరపు రూపొందిస్తున్న సినిమా ‘మాస్ జాతర’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26న ఇది విడుదల కానున్నట్లు సమాచారం. ఇక శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. 2025 మే 9న రిలీజ్ కానుంది.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి తన నటన, కామెడీ టైమింగ్స్తో ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. పలు యూట్యూబ్ వీడియోలతో పాటు షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయం సాధించాడు. అదే ఏడాదిలో చిచోరే మూవీతో హిందీలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తెలుగులో జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి సినిమాలు తీశాడు.