వైఎస్కే, నిహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓ తండ్రి కథ’. దర్శకుడు నంది వెంకట్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. తండ్రి విలువను, తరం మధ్య ఉండే భావోద్వేగాలను చాటిచెప్పే ఈ సందేశాత్మక చిత్రం మే 1న విడుదలచేయనున్నారు. ఈ సినిమాలో అశోక్ రెడ్డి, తోట సుబ్బారావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘రానా, నేను పెళ్లి చేసుకోవాలకున్న కొత్తలో ఆయన నాకు ఒక యోడా బొమ్మను గిఫ్ట్గా ఇచ్చారు. తన దగ్గర ఇలాంటివి రెండు ఉన్నాయని, తన జీవితంలోకి వచ్చే వ్యక్తికి రెండోది ఇద్దామని దాచుకున్నానని చెప్పాడు. ఆ బొమ్మే నా దగ్గర ఉన్న అన్నిటికంటే చాలా విలువైనది’ అని తెలిపింది.
హీరో రామ్ పోతినేని వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు పొందడంలేదు. దీంతో రామ్ తన కోసం ఒక విభిన్నమైన కథను స్వయంగా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని తన సొంత ప్రొడక్షన్ హౌస్లో, తానే దర్శకుడిగా మారి తెరకెక్కించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అని, ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో రామ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడని సమాచారం.
TG: యాంకర్ అనసూయ భరద్వాజ్పై అసభ్యకర పోస్టులు పెట్టిన మరో నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండకు చెందిన దొరెపల్లి చంటిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వివరాలను పోలీసులు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదే కేసులో ఇటీవలే కడపకు చెందిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
దీపికా పదుకొనె గర్భవతి కావడంతో ఇప్పటికే ఆమె సంతకం చేసిన చిత్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావిస్తునట్లు సమాచారం. దీంతో ‘రాకా’ దర్శకుడు వెంటనే ఆమె పాత్రకు సంబంధించిన సీన్లను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా భారీ బడ్జెట్తో ‘రామాయణ’ చిత్రం తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్త పంపిణీ బాధ్యతలను హాలీవుడ్ దిగ్గజ సంస్థ ‘వార్నర్ బ్రదర్స్’ చేపట్టబోతున్నట్లు సమాచారం.
‘మా ఊరి పొలిమేర’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కామాక్షి భాస్కర్ల. తాజాగా ఆమె ‘అగాధ’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఇందులో ఆమె ‘మహాదేవి’ అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.
నటి పూనమ్ కౌర్ ఇవాళ వేములవాడలోని భీమేశ్వర స్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకుంది. అనంతరం వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాజన్న ఆలయ నిర్మాణ పనులు పూర్తైన తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకుంటానని ఆమె తెలిపింది.
హీరోయిన్ దీపికా పదుకొనె రెండోసారి తల్లి కాబోతున్న తరుణంలో పిల్లల గురించి ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే, ముగ్గురు పిల్లలతో సమయం గడిపేదాన్ని అని ఆమె తెలిపింది. ఇప్పుడు కూడా తన వృత్తిని కొనసాగిస్తూనే పిల్లలను షూటింగ్ సెట్స్కు తీసుకెళ్లాలని ఉందని, కుటుంబంతో గడపడం తనకు ఇష్టమని పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఒకే వారంలో సుమారు రూ.20L ఆర్థిక సాయం అందించి ఆదర్శంగా నిలిచారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్కు రూ.10.5L, మాజీ మేనేజర్ కుటుంబానికి రూ.9.5L అందజేశారు. అలాగే.. ఇటీవల వివిధ సేవా సంస్థలకు రూ.10L, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్కు రూ.5L విరాళంగా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకుని అండగా నిలిచారు.
కాంతార స్టార్ రిషబ్ శెట్టి ‘యూత్’ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని, ఇది తల్లిదండ్రులకు ఇచ్చే గొప్ప బహుమతి అని కొనియాడాడు. నటీనటులు సహజంగా నటించారని, దర్శకుడు కెన్ కరుణాస్ పరిశ్రమకు దొరికిన ఆస్తి అని పేర్కొన్నాడు. టీనేజ్ ప్రేమ, బ్రేకప్, జీవిత పాఠాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం విశేష ఆదరణ పొందుతోంది.
హీరో ప్రదీప్ రంగనాథన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి, ఆ సమయంలోనే స్క్రిప్టులు రాసి షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ‘కోమాలి’తో దర్శకుడిగా, ‘లవ్ టుడే’తో హీరోగా మారి స్టార్డమ్ దక్కించుకున్నాడు. నాడు కుటుంబాన్ని నమ్మించి కష్టపడిన ప్రదీప్, నేడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.25 కోట్ల పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగాడు.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిత్ర పరిశ్రమలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు విజయ్ సేతుపతి ఆయనపై ప్రశంసలు కురిపించాడు. పూరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన తెరకెక్కిస్తున్న ‘స్లమ్ డాగ్’ చిత్రం కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన విలక్షణమైన శైలితో పూరి మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకున్నాడు.
స్టార్ డైరెక్టర్ అట్లీ, ఆయన భార్య ప్రియా మోహన్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ఇవాళ ప్రియ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అట్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘నాకు చెల్లి వచ్చేసింది – మీర్’ అంటూ తన కుమారుడి తరఫున ఒక క్యూట్ పోస్టర్ను షేర్ చేశాడు. 2023లో వీరికి కుమారుడు మీర్ జన్మించగా, ఇప్పుడు ఆడబిడ్డ రావడంతో అట్లీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.
దర్శకుడు హను రాఘవపూడి NTRను ‘సునామీ’ వంటి నటుడని కొనియాడాడు. ఆయనలో Sr. NTR గారి అన్ని లక్షణాలు ఉన్నాయని, పౌరాణికం నుంచి కామెడీ వరకు ఏ పాత్రనైనా చేయగలరని ప్రశంసించాడు. ఇప్పటివరకు సరైన కథ కుదరకపోవడం వల్లే తారక్తో సినిమా చేయలేకపోయానని, ఆయన స్థాయికి తగ్గ స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సి ఉందన్నాడు. వేటూరి కూడా తారక్ స్పష్టమైన ఉచ్చారణను మెచ్చుకునేవారని హను గుర్తుచేశాడు.