మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు.. పండగకి వస్తున్నారు’ సినిమా రాబోతుంది. ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ పోస్టర్ విడుదలైంది. ఇందులో పడవపై చిరు పంచకట్టులో అదరగొట్టారు. ఇక నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
30 ఏళ్లు దాటినా అమ్మాయిల్లో తనకు నచ్చిన ఐదు లక్షణాలు లేవంటూ రిజెక్ట్ చేస్తున్న సిద్ధార్థ్(నారా రోహిత్)కు చివరికి పెళ్లి జరిగిందా? లేదా? అనేది ఈ మూవీ కథ. కామెడీ బాగుంది. ఫస్టాఫ్, ఓ చోట ట్విస్ట్ మూవీకి ప్లస్. ఊహించే సన్నివేశాలు మైనస్. రేటింగ్ 2.5/5.
‘పరమ్ సుందరి’ సినిమాతో ‘చెన్నై ఎక్స్ప్రెస్’ మూవీని పోల్చడంపై నటి జాన్వీ కపూర్ స్పందించారు. అలాంటి ఐకాన్ సినిమాతో ‘పరమ్ సుందరి’ మూవీని పోల్చడం ఆనందంగా ఉందన్నారు. కానీ ఈ రెండు సినిమాలకు పోలిక ఉండదని, అయినా ప్రేక్షకులు దీన్ని అంత గొప్ప సినిమాతో పోలుస్తున్నందుకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం(TVK) పార్టీ అధినేత విజయ్పై కేసు నమోదైంది. మధురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నటుడిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకున్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు.
నటుడు కిచ్చాసుదీప్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశాడు. సెప్టెంబర్ 2న తన పుట్టినరోజు సందర్భంగా తన ఇంటిముందుకు వచ్చి హంగామా చేయవద్దని హెచ్చరించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ‘ప్రియమైన మిత్రులారా సెప్టెంబర్ 2 ఉదయం కాదు రాత్రి 1 గంటలకు కలుద్దాం. సెప్టెంబర్ 2న మీరు నన్ను కలవడానికి ఎంతగానో వేచి ఉంటారో దానికంటే ఎక్కువగా నేను మీకోసం ఎదురు చూస్తాను’ అని రాసుకోచ్చాడు.
VSP: కబడ్డీ క్రీడాకారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది. హీరో విజయ రామరాజు మాట్లాడుతూ.. ఇది ఒక కబడ్డీ ఛాంపియన్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రమని తెలిపారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, దర్శకుడు జితిన్ కె జోస్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘కలమ్ కవల్’ టీజర్ రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28న ఓనమ్ సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ మూవీలో వినాయకన్ విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మమ్ముట్టి సొంత బ్యానర్లో స్వయంగా ఆయనే నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ మొదట ప్రకటించింది. అయితే, అనుకోని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ‘X’ వేదికగా అధికారికంగా తెలిపింది. షూటింగ్ పూర్తయ్యాక భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తామని పేర్కొంది. అతి త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిరాయ్’. పలు మార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 12 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తేజా సజ్జా ఓ పోస్టర్ను విడుదల చేశారు. అలాగే ఈ నెల 28న ట్రైలర్ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. విడుదలైన 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు Jr. NTR, హృతిక్ నటించి ‘వార్-2’ ప్రపంచవ్యాప్తంగా రూ.327 కోట్లకుపైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. తెలుగులో ఈ మూవీ రూ.62.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలిపాయి.
ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్బాస్-9’ SEP 5న ప్రారంభం కాబోతుంది. ఈ షోలో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఫేమ్ ఆశా సైనీ, ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన, ముద్దమందారం సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ పాల్గొనబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ‘అగ్నిపరీక్ష’ పేరుతో షో కండక్ట్ చేసి సామాన్య ...
దుల్కర్ సల్మాన్ హీరోగా, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబరు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కోలీవుడ్ హీరో జయం రవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సింగర్ కెన్నీషాతో కలిసి రావడంతో.. ఈ ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. తన భార్య ఆర్తితో విడాకుల వివాదం తర్వాత వీరిద్దరు జంటగా కనిపించారు. తాజాగా, తిరుమలలో సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చి స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. మరోవైపు జయం రవి ‘కరాటే బాబు’, ‘పరాశక్తి’ లాంటి ప్రాజెక్టుల్లో నటిస్తున్న...
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కింగ్డమ్’. ఇందులో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. జూలై 31న ఈ సినిమా రిలీజ్ కాగా.. ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా నెట్ఫ్లిక్స్లోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’. అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. టీజర్ ఆగస్టు 28న రానున్నట్లు మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చింది. ‘పెళ్లికి మండపం రెడీ చేశాక.. సన్నీ, కుమారి ఎంట్రీతో పరిస్థితి అంతా మారిపోతుంది’ అనే క్యాప్షన్ జత చేసి జాన్వీతో క్లోజ్గా ఉన్న పోస్టర్ను షేర్ చేశారు.