టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి తన నటన, కామెడీ టైమింగ్స్తో ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. పలు యూట్యూబ్ వీడియోలతో పాటు షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయం సాధించాడు. అదే ఏడాదిలో చిచోరే మూవీతో హిందీలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తెలుగులో జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి సినిమాలు తీశాడు.
TG: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ను కలిశారా? అంటూ ఓ విలేకరు జానీని అడిగాడు. దానికి ‘లేదు. జైలు నుంచి వచ్చాక ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నా’ అంటూ జానీ బదులిచ్చాడు.
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన గ్రేస్, నటన, డ్యాన్స్తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా చిరు ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన స్టైలిష్ స్టిల్స్ బయటకొచ్చాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. చిరు చాలా యంగ్ హీరోలా కనిపిస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
TG: HYDలోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలసిందే. కాగా, తొక్కిసలాటలో విరిగిపోయిన గ్రిల్స్కు మరమ్మతులు చేస్తున్నారు. అలాగే, థియేటర్ లోపల, బయట మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఇకనుంచి సంధ్య 70MM, 35MM థియేటర్లకు వెళ్లేందుకు ఆయా గేట్లకు ప్రత్యేక సూచికలు బిగిస్తున్నారు. ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన మూవీ ‘పుష్ప 2’. ఇటీవల ఈ సినిమా నుంచి ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ పాట రిలీజైన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ప్రస్తుతం టీ సిరీస్ తెలుగు ఛానల్లో ఇది కనిపించడం లేదు. బన్నీ పోలీసులు విచారించిన రోజున(డిసెంబర్) ఈ పాటను రిలీజ్ చేయగా.. కావాలనే దీన్ని విడుదల చేశారని పలువురు నెటిజన్లు విమర్శించారు.
హీరోయిన్ శ్రుతి హాసన్ తన పెళ్లిపై నిర్ణయాన్ని చెప్పారు. ‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ.. ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదు కదా..! నేను రిలేషన్లో ఉండటాన్ని ఇష్టపడతాను. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్లో ఎవరైనా నా మనసుకు దగ్గరైతే వారిని వివాహం చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం’ అని అన్నారు.
హీరోయిన్ శ్రుతి హాసన్ తన పెళ్లిపై నిర్ణయాన్ని చెప్పారు. ‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ.. ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదు కదా..! నేను రిలేషన్లో ఉండటాన్ని ఇష్టపడతాను. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్లో ఎవరైనా నా మనసుకు దగ్గరైతే వారిని వివాహం చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం’ అని అన్నారు.
దేశముదురు సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ తరువాత చాలా మంది యంగ్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. 2022లో పారిశ్రామికవేత్తను పెళ్లాడింది. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే హన్సిక బ్లాక్ కలర్ స్లీవ్లెస్ ధరించి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
TG: సీఎం రేవంత్ రెడ్డితో రేపు ఉదయం 10 గంటలకు సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి సీఎం అపాయింట్మెంట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, దిల్ రాజు, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు పాల్గొననున్నారు. ప్రభుత్వం నుంచి DY. CM భట్టి, మంత్రులు కోమటిరెడ్డి హాజరుకానున్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.
టాలీవుడ్ నటుడు జగపతి బాబు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భీమవరం ఫుడ్ ఫెస్టివల్లో రోడ్డు పక్కనే ఉన్న బండి వద్ద ఫుడ్ ఆరగించారు జగపతిబాబు. మరికొందరు నటులతో కలిసి రోడ్ సైడ్ ఫుడ్ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ సినిమా హిట్లర్ రీరిలీజ్ కానుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రంభ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, దాసరి నారాయణ రావు, రామిరెడ్డి కీలకపాత్రలు పోషించారు. సుమారు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీరిలీజ్ అవుతోంది.
TG: జానీ మాస్టర్ కేసులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈవెంట్స్ పేరుతో లేడీ కోరియోగ్రాఫర్ను వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడ్డట్లు నార్సింగి పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఛార్జీషీట్ ఫైల్ చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపుగా రూ.100కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది సినిమా బడ్జెట్లో దాదాపు 22శాతం ఉంది. హీరోయిన్ కియారా అద్వానీ కూడా రూ.5కోట్ల నుంచి 7కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ రూ.450కోట్లని అంచనా.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న మూవీ ‘డాకు మహారాజ్’. 2025 జనవరి 12న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ రన్ టైం అప్డేట్ వచ్చింది. దీని నిడివి 2.24 గంటలు ఉండగా.. టైటిల్ కార్డు, ఎండింగ్ క్రెడిట్స్ వంటివి కలిపి 2.32 గంటల సమయం ఉంది. శ్రద్దా శ్రీనాథ్, చాందినీ చౌదరి, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.