‘బలగం’ దర్శకుడు వేణుతో నటి సాయి పల్లవి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. హీరో నితిన్తో వేణు ‘ఎల్లమ్మ’ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. ఎల్లమ్మ పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి ఈ ఏడాది వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో తాను పెర్ఫార్మెన్స్ ఇవ్వడంపై ప్రముఖ సింగర్ మీకా సింగ్ తాజాగా స్పందించాడు. తాను భారీ మొత్తంలో డబ్బు అందుకున్నట్లు తెలిపాడు. కానీ అనంత్ తనకు రూ.2 కోట్లు విలువ చేసే వాచ్ ఇవ్వలేదని, అది తనని బాధించిందని సరదాగా చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
TG: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం HYD కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నిర్మాత దిల్ రాజు మరోసారి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నాడు. అల్లు అరవింద్, సుకుమార్తో కలిసి వెళ్లనున్నాడు. బాలుడి తండ్రి భాస్కర్తో సాయంపై చర్చించనున్నాడు. కాగా, ఇప్పటికే శ్రీతేజ్ తండ్రిని కలిసిన దిల్ రాజు.. వారిని అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.
ఇవాళ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు విషెస్ చెబుతున్నారు. తాజాగా ఆయనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘స్పిరిట్’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఉన్నట్లు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సందీప్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
నటి శ్రీదేవితో తన ప్రేమ, పెళ్లి గురించి నిర్మాత బోనీ కపూర్ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. మొదట శ్రీదేవికి తానే ప్రపోజ్ చేసినట్లు తెలిపాడు. ప్రేమ విషయం చెప్పగానే ఆమె తనతో మాట్లాడటం మానేసిందని, దాదాపు 6 నెలలు ఆమె తనతో మాట్లాడలేదని అన్నాడు. నా చివరి రోజు వరకూ ఆమెను పేమిస్తూనే ఉంటానని పేర్కొన్నాడు.
నటి మాళవికా మోహనన్ అభిమానులతో సరదాగా ముచ్చటించింది. X వేదికలో ఆమె #AskMalavika నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. ‘మీ జీవితాన్ని మార్చిన సూచన ఏంటి? అని అడిగాడు. దీంతో ఆమె.. ‘కామెంట్స్ సెక్షన్ చదవద్దు అని ఒక పెద్దాయన చెప్పారు. అది నా జీవితాన్ని ఎంతో మార్చింది’ అంటూ జవాబు ఇచ్చాడు.
‘నో ఎంట్రీ’ సినిమాపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీతో పోలిస్తే పార్ట్ 2 చాలా బాగుంటుందని అన్నాడు. ‘పార్ట్ 1లో నటించిన నటీనటులతో పార్ట్ 2 ప్లాన్ చేశా. వాళ్ల కోసం ఎంతో ఎదురుచూశాను. కాకపోతే వాళ్లకంటూ కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని నేను గౌరవించా. అందుకే కొత్త వాళ్లతో మూవీ చేస్తున్నా’ అంటూ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్పై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతున్నట్లు వెల్లడించాడు. ఈ టీంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందంటూ ఫొటో షేర్ చేశాడు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
మలయాళ హీరో మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘బరోజ్’ ఇవాళ విడుదలైంది. తాజాగా ఈ సినిమా OTT పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్ను డిస్నీ+హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్స్ రన్ పూర్తయిన తర్వాత OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాలీవుడ్ నటి కియారా అద్వానీ, అలియా భట్లతో అనుచితంగా ప్రవర్తించాడంటూ నటుడు వరుణ్ ధావన్పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా వీటిపై వరుణ్ స్పందించాడు. ‘నేను అందరితో ఒకేలా ఉంటా. కియారాను కావాలని ముద్దు పెట్టుకోలేదు. ఒక మ్యాగజైన్ ఫొటో షూట్లో భాగంగా అలా చేశాం. ఇక అలియా నాకు మంచి ఫ్రెండ్. ఆరోజు సరదాగా అలా చేశానంతే. కావాలని చేయలేదు’ అని పేర్కొన్నారు.
సినీ రచయిత చిన్నికృష్ణ ఇంట విషాదం నెలకొంది. చిన్నికృష్ణ తల్లి సుశీల(75) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశీల.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు వేకువజామున మరణించారు. కాగా.. చిన్నికృష్ణ తల్లి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్పై దాడి ఘటనలో మోహన్ బాబుకు పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో మోహన్ బాబుకు హైకోర్టు ఇచ్చిన గడువు పూరైంది. అయినప్పటికీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. దీంతో తదుపరి చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
తన వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పర్సనల్ లైఫ్లో క్రమశిక్షణ లేకపోయినా సినిమా షూటింగ్స్కు సమయానికి వెళ్లేవాడినన్నారు. పైప్ స్మోకింగ్, మద్యంపానం చేసేవాడినని తెలిపారు. తప్పు చేశానని గ్రహించిన తర్వాత సినిమానే మార్పు తీసుకొచ్చిందన్నారు. సినిమా మెడిసిన్లాంటిదని పేర్కొన్నారు.
కన్నడ స్టార్ యష్ KGF-1,2 సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘టాక్సిక్’తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో యష్ విలన్ పాత్ర.. అంటే రావణుడి రోల్లో కనిపించనున్నాడు. అయితే.. ఈ పాత్రకు గాను యష్ దాదాపు రూ.200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాఫిక్గా మారింది.
జీ తెలుగు: ప్రేమలు(9AM), ఏమాయ చేశావే(11AM); జెమినీ: అడవి రాముడు(8.30AM); స్టార్ మా: టిల్లు స్క్వేర్ (9AM), MCA(4PM) ; స్టార్ మా మూవీస్: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(9AM), రాజా ది గ్రేట్(12PM), నమో వెంకటేశ(3PM), అత్తారింటికి దారేది(9PM); జీ సినిమాలు: గర్జన(7AM), రెడీ(9AM), కాంచన-3(12PM), అ ఆ(3PM), నా పేరు సూర్య(6PM), అర్జున్ సురవరం(9PM). ఈటీవీ: మువ్వ గోపాలుడు(9AM).