ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. ముందుగా 2026 జూన్ 25న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఇది 2027 మార్చి 7కు మారనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడం, దర్శకుడు నీల్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఎక్కువ సమయం తీసుకుంటుండటమే ఈ జాప్యానికి కారణమని టాక్.
పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు 50 ఏళ్ల నట ప్రయాణం ఉంటుందని ఊహించలేదని మోహన్ బాబు అన్నారు. తన యూనివర్సిటీ 34వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. 1975లో ‘స్వర్గం నరకం’తో మొదలైన తన కెరీర్లో ఇప్పటివరకు 560 సినిమాలు చేశానని తెలిపారు. తల్లిదండ్రుల దీవెనలు, ప్రేక్షకుల అభిమానం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని, నటుడిగా ప్రయాణం ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ‘మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది’ అంటూ ట్వీట్ చేశారు. ఉగాది పర్వదినాన విడుదలైన ఈ వీడియో పవర్ఫుల్గా ఉందని, ఈ సినిమాతో అన్నీ శుభాలే జరుగుతాయని ఆయన ఆకాంక్షించారు. హరీష్ శంకర్ మేకింగ్, పవన్ స్వాగ్ అదిరిపోయాయని మెచ్చుకున్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రశంసలు కురిపించాడు. ‘ది ప్యారడైజ్’ మూవీ సెట్లో మోహన్ బాబు ఉంటే ఆ రోజు షెడ్యూల్ అంత అనుకున్న సమయానికి పూర్తవుతుందన్నాడు. మిగిలిన రోజు ఆలస్యమవుతుందని చెప్పాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి ఇప్పుడేం చెప్పలేనని, అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ట్రైలర్ విడుదలైనప్పుడు మీకే అర్థమవుతుందని తెలిపాడు.
నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ‘రాకాస’ మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కుల డీల్ క్లోజ్ అయింది. తెలుగు హక్కులను శ్రీ లక్ష్మీనరసింహ మూవీ మేకర్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఇక దర్శకురాలు మానస వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయన్ సారిక కథానాయికగా నటిస్తుంది.
ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతయ్య ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి భారతీయ వ్యక్తి. గాంధీ(1982) సినిమాకు గాను ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మ అవార్డ్ దక్కింది. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆమె లగాన్, స్వదేశ్ వంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన డిజైన్లు అందించారు. మన భారతీయ సినిమా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప కళాకారిణిగా చరిత్రలో నిలిచిపోయారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. యూఎస్ మార్కెట్లో ఈ సినిమా ప్రీమియర్ బుకింగ్స్ మొదట్లో జోరుగా సాగి, ఆపై కాస్త నెమ్మదించాయి. అయితే, తాజాగా ఈ చిత్రం నార్త్ అమెరికాలో 2 లక్షల డాలర్ల గ్రాస్ మార్కును దాటినట్లు డిస్ట్రిబ్యూటర్లు ధృవీకరించారు. పవన్ క్రేజ్తో వసూళ్లు మళ్లీ పుంజుకుంటాయని మేకర్స్ భావిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రం 2026 ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్న ఫొటో ఒకటి బయటకు రావడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
విజయ్ సేతుపతి ‘మహారాజా’ మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ సీక్వెల్పై విజయ్ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. దర్శకుడు నితిలన్ స్వామినాథన్ ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేశారని, త్వరలోనే నరేషన్ వినబోతున్నట్లు ఆయన వెల్లడించాడు. ఈ ప్రాజెక్ట్ పట్ల తాను చాలా ఎక్జయిటింగ్గా ఉన్నానని చెప్పడంతో, అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ‘ధురంధర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్గా తెరకెక్కిన ‘ధురంధర్ 2’ మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పార్ట్ 3ని కూడా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్మెంట్లో ఉన్నట్లు టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సిద్ధూ జొన్నలగడ్డ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో ఆయన చేయనున్న సినిమా మే నుంచి పట్టాలెక్కనుంది. ఈలోపే ఒక కొత్త దర్శకుడు చెప్పిన సోషియో ఫాంటసీ కథకు సిద్ధూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ రెండు చిత్రాలను ఆయన ఒకేసారి సమాంతరంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు టాక్. విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తూ సిద్ధూ తన జోరును కొనసాగిస్తున్నాడు.
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీపై అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి ‘ధురంధర్’ ఓ ఉదాహరణ అని తెలిపాడు. భారీ యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చెప్పాడు. రణవీర్ సింగ్ చేసిన హై-ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు జేజేలు కొట్టారని చెప్పుకొచ్చాడు.
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ఇటీవల ‘ఈషా’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్తో అలరించేందుకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేన్ను మేకర్స్ ప్రకటించారు. ‘దర్జా’ సినిమా ఫేమ్ సలీం మాలిక్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో మాలిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళ రచయిత, సాహిత్యకారుడు వైరముత్తును 60వ జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2025కు సంబంధించిన పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్లు భారత జ్ఞానపీఠ్ పాలక మండలి ప్రకటించింది. తమిళనాడు తేని జిల్లా మేట్టూర్ జన్మించిన ఆయన.. 1980లో నిళల్గల్ చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొత్తం 7,500కి పైగా పాటలు రాశారు. 7 జాతీయ, 6 రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలను పొందారు.