• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘నాగబంధం’ ఓటీటీ డీల్ క్లోజ్..!

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నాగబంధం’. 2026 జూలై 3న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ OTT డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 27కోట్లకు ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మేనన్, జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

April 15, 2026 / 04:30 PM IST

తెలుగులో ఆలస్యంగా ‘పళ్లి చట్టంబి’

మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ ‘పళ్లి చట్టంబి’. ‘జన గణ మన’ ఫేమ్ డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1950-60ల నాటి నేపథ్యంలో సాగుతుంది. ఏప్రిల్ 15న మలయాళంలో విడుదలైన ఈ సినిమాను, ఏప్రిల్ 17న ప్రముఖ నిర్మాత బన్ని వాస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. పక్కా యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

April 15, 2026 / 04:07 PM IST

నేనెప్పుడూ ఆ విషయాన్ని నమ్ముతాను: రాజమౌళి

‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేషన్ మూవీ ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’. ప్రతిష్టాత్మక ఎన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. దీనిపై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ.. యానిమేషన్ ప్రపంచానికి హద్దులు లేవని తాను నమ్ముతున్నానని, ఈ ఎంపిక భారతీయ సినిమాకు దక్కిన గౌరవమని తెలిపాడు. ప్రపంచ ప్రసిద్ధ వేదికపై మన కథను ప్రదర్శించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నాడు.

April 15, 2026 / 03:45 PM IST

మరింత ఆలస్యంగా ‘మాతృభూమి’.. కారణమిదే!

సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న ‘మాతృభూమి’ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఏప్రిల్‌లో రావాల్సిన ఈ చిత్రం, ఇప్పటికీ సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లలేదట. రక్షణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు దర్శకుడు కథలో భారీ మార్పులు చేసి, సుమారు 40% రీషూట్ చేసినట్లు సమాచారం. అదనపు రొమాంటిక్ సీన్లు, కొత్త బ్యాక్‌స్టోరీల వల్ల జాప్యం జరుగుతుండటంతో, ఇది మేలో కూడా విడుదలవ్వడం కష్టమేనని టాక్.

April 15, 2026 / 03:25 PM IST

‘ఈన‌గ‌రానికి ఏమైంది 2’ కొత్త షెడ్యూల్ స్టార్ట్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2018లో వచ్చిన హిట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా ‘ENE రిపీట్’ రాబోతుంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఇవాళ థాయ్‌లాండ్‌లో ప్రారంభమైంది. మే 20 వరకు అక్కడే చిత్రీకరణ జరగనుంది. ఈ షెడ్యూల్‌తో దాదాపు 80% షూటింగ్ పూర్తవుతుంది. ఇక చిత్ర బృందం ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.

April 15, 2026 / 03:05 PM IST

‘టాక్సిక్‌’ అలాంటి మూవీ కాదు: యష్

కన్నడ స్టార్ యష్ నటిస్తున్న తాజా సినిమా ‘టాక్సిక్’. ఈ మూవీ గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదని, ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే విభిన్న కథాంశమని చెప్పాడు. బలమైన భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఇంగ్లీష్‌లో కూడా విడుదల కానుంది. ఈ మూవీ 2026 జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

April 15, 2026 / 02:26 PM IST

పవన్ కళ్యాణ్‌పై జోకులు.. కమెడియన్‌ అరెస్ట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నేత బడే వెంకట కృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న అనుదీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ప్రస్తుతం కాకినాడకు తరలిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నారు.

April 15, 2026 / 01:59 PM IST

డిస్నీలో లేఆఫ్స్ సెగ.. 1,000 మంది తొలగింపు!

వాల్ట్ డిస్నీ కొత్త సీఈఓ జోష్ డి అమారో బాధ్యతలు చేపట్టిన నెలలోనే 1,000 మంది ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయించారు. మార్కెటింగ్, స్టూడియోలు, ESPN, టెక్నాలజీ విభాగాల్లో ఈ కోతలు ఉండనున్నాయి. అసద్ అయ్యాజ్ నేతృత్వంలోని ‘యూనిఫైడ్ మార్కెటింగ్ స్ట్రక్చర్’ ద్వారా పనితీరును మెరుగుపరిచేందుకు ఈ మార్పులు చేస్తున్నారు. ఖర్చుల తగ్గింపు, సామర్థ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

April 15, 2026 / 01:50 PM IST

‘ధురంధర్’.. తొలి భారతీయ సినిమాగా రికార్డు

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన ‘ధురంధర్’ ఫ్రాంఛైజీ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సిరీస్ రెండు భాగాలతోనే ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన మొదటి ఇండియన్ ఫిల్మ్ ఫ్రాంఛైజీగా నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి భాగం రూ.1300CR+, రెండో భాగం రూ.1700CR+ వసూళ్లు చేశాయి.

April 15, 2026 / 01:21 PM IST

‘రామాయణ’కి జపాన్ ‘గాడ్జిల్లా’ షాక్..!

బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’కు జపాన్ మూవీ ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ రూపంలో భారీ ముప్పు పొంచి ఉంది. రెండు సినిమాలు ఐమ్యాక్స్ వెర్షన్‌లో 2026 నవంబరులో వస్తుండటంతో స్క్రీన్స్ కేటాయింపులో క్లాష్ రానుంది. ఆస్కార్ విన్నింగ్ సీక్వెల్ కావడంతో విదేశాల్లో గాడ్జిల్లాకు క్రేజ్ ఎక్కువ. దీంతో రూ.4000 కోట్ల బడ్జెట్ ‘రామాయణ’ ఓవర్సీస్ కలెక్షన్లపై ఈ ప్రభావం పడే అవ...

April 15, 2026 / 01:20 PM IST

రణ్‌బీర్‌తో సీన్స్‌పై యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రణ్‌బీర్ సింగ్ రాముడిగా యష్ రావణుడిగా రాబోతున్న సినిమా ‘రామాయణ’. ఈ మూవీలో ఇప్పటివరకు రణబీర్‌కు, తనకు మధ్య ఎలాంటి కాంబో సీన్స్ చిత్రీకరించలేదని యష్ తెలిపాడు. మొదటి భాగంలో రాజ్యాల నేపథ్యం వేర్వేరుగా ఉంటుందని, అందుకే తమ మధ్య స్క్రీన్ షేర్ చేసుకునే సన్నివేశాలు రాలేదని చెప్పాడు. అయితే, సెట్స్‌లో కలిసినప్పుడు మాత్రం తమ మధ్య బాండింగ్ చాలా బాగుంటుందని అన్నాడు.

April 15, 2026 / 12:52 PM IST

‘LIK’ సీక్వెల్‌పై విఘ్నేష్ శివన్ కామెంట్స్

ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఇటీవలే రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తీసే అవకాశం ఉందని దర్శకుడు విఘ్నేష్ చెప్పాడు. ‘నాకు ఆర్థిక స్థోమత ఉంటే కంటే కచ్చితంగా సీక్వెల్ రస్తా. S.J సూర్య. ప్రదీప్ రంగనాథన్ పాత్రలతో కథను రకరకాల కోణాల్లో అన్వేషించవచ్చు’ అని చెప్పాడు.

April 15, 2026 / 12:38 PM IST

సరికొత్త థ్రిల్లర్ ‘అగధ’ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు M.S రాజు సరికొత్త హారర్ థ్రిల్లర్‌తో రాబోతున్నాడు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ మూవీకి ‘అగధ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజు మాట్లాడుతూ..’ఇదొక మిస్టిక్ డివైన్ థ్రిల్లర్. 85రోజులు షూట్ చేశాం. మూవీలో 45 నిమిషాల VFX ఉంటుంది’ అని చెప్పాడు. 

April 15, 2026 / 12:15 PM IST

మెగా హీరోకి ఇవాళ సర్జరీ..?

మెగా హీరో వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘భారీ’ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా కాలికి చిన్న గాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి HYDలోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరగనున్నట్లు సమాచారం. ఆపరేషన్ అనంతరం వరుణ్ కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నాడట. కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాడని టాక్. ఈ వార్తతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

April 15, 2026 / 11:53 AM IST

మూవీ లవర్స్‌కు షాక్.. సింగిల్ థియేటర్లు బంద్

టాలీవుడ్‌లో ‘రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్’ వివాదం ముదురుతోంది. మల్టీప్లెక్స్ తరహాలో సింగిల్ స్క్రీన్లలోనూ పర్సెంటేజీ విధానం కోరుతూ ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్‌కు సిద్ధమవుతున్నారు. ఇది సమ్మర్ బిగ్ రిలీజ్‌లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. థియేటర్లు మూతపడితే కలెక్షన్స్, ప్రీ-రిలీజ్ బిజినెస్ దెబ్బతింటాయి. రాజీ పడకపోతే ఈ వేసవి సినిమా ఇండస్ట్రీకి గడ్డుకాలమే.

April 15, 2026 / 11:42 AM IST