రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీపై అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి ‘ధురంధర్’ ఓ ఉదాహరణ అని తెలిపాడు. భారీ యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చెప్పాడు. రణవీర్ సింగ్ చేసిన హై-ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు జేజేలు కొట్టారని చెప్పుకొచ్చాడు.
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ఇటీవల ‘ఈషా’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్తో అలరించేందుకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేన్ను మేకర్స్ ప్రకటించారు. ‘దర్జా’ సినిమా ఫేమ్ సలీం మాలిక్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో మాలిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళ రచయిత, సాహిత్యకారుడు వైరముత్తును 60వ జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2025కు సంబంధించిన పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్లు భారత జ్ఞానపీఠ్ పాలక మండలి ప్రకటించింది. తమిళనాడు తేని జిల్లా మేట్టూర్ జన్మించిన ఆయన.. 1980లో నిళల్గల్ చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొత్తం 7,500కి పైగా పాటలు రాశారు. 7 జాతీయ, 6 రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలను పొందారు.
పరిశ్రమకు వచ్చే రచయితలు, దర్శకులకు దర్శకుడు హరీష్ శంకర్ కీలక సూచనలు చేశాడు. ‘ఇండస్ట్రీ మనల్ని మార్చకుండా ఉంటే చాలు, అన్నిటికంటే ముఖ్యంగా మనలోని ‘ప్రేక్షకుడు’ చనిపోకూడదు. పరిశ్రమలో రచయితలకు క్రెడిట్, పారితోషికం తక్కువ.. ఆ విషయంలో నేను మొదటినుంచి కచ్చితంగా ఉంటాను’ అని తెలిపాడు. అనుకున్న ఫీల్డ్లో ఉండటమే సక్సెస్ అని, సినిమా హిట్ అవ్వడం అనేది బోనస్ అని పేర్కొన్నాడు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. ఇటీవల జరిగిన అల్లు శిరీష్ వివాహ వేడుకకు బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలోనే తాజాగా అరవింద్ నివాసానికి వెళ్లిన సీఎం, నూతన వధూవరులను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులతో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు.
తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ రావడంపై కమల్హాసన్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. గతంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సింగర్ చిన్మయి, కమల్ స్పందనపై తీవ్రంగా మండిపడింది. బాధితుల పక్షాన నిలవాల్సిన వారు ఇలా వేధింపుల ఆరోపణలు ఎదర్కొనే వ్యక్తిని అభినందించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
మొదటి సినిమా ‘షాక్’ ఫ్లాప్ అయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పూరి జగన్నాథ్ తనను రెండేళ్లు పోషించారని దర్శకుడు హరీష్ శంకర్ గుర్తుచేసుకున్నాడు. ‘రామ్ చరణ్ను పరిచయం చేస్తున్నాం, నువ్వు నాతో ఉండు’ అని పూరి అండగా నిలిచారని తెలిపాడు. రైటర్గా తనకు గుర్తింపునిచ్చి, ఆర్థికంగా ఆదుకున్నారని.. పూరి వద్ద పనిచేయడం ‘పెయిడ్ ఇంటర్న్షిప్’ లాంటిదని హరీష్ ఉద్వేగంగా చె...
అతిగా ప్రేమించే వ్యక్తికి మనసులోని మాట చెబితే, ఎక్కడ ఉన్న స్నేహం కూడా విడిపోతుందోననే భయం చాలామందిని వేధిస్తుంది. అయితే, నిజమైన ప్రేమను వ్యక్తపరచకుండా దాచుకోవడం వల్ల కాలక్రమేణా పశ్చాత్తాపం మిగిలే అవకాశం ఉంది. అందుకే, సరైన సమయంలో నిజాయితీగా వ్యక్తపరచడమే మేలు. ఫలితం ఏదైనా, ఆ స్పష్టత మీ మనసులోని భారాన్ని తగ్గించి భవిష్యత్తుపై ధైర్యాన్ని ఇస్తుంది.
తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మార్చి 16న సాయంత్రం 4:06 గంటలకు టీజర్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని 2026 జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘కోర్ట్’ జోడీ రోషన్, శ్రీదేవి మరోసారి జంటగా నటించిన మూవీ ‘బ్యాండ్ మేళం’. 2026 మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కించాడు.
‘తెలుసు కదా’ సినిమా రిజల్ట్పై రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది. షూటింగ్ సమయంలోనే సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తనకు అర్థమైందని, కథలోని కొన్ని పాయింట్లు ప్రేక్షకులకు కనెక్ట్ కావని యూనిట్కు ముందే చెప్పానని ఆమె పేర్కొంది. డైరెక్టర్ నీరజ కోన విజన్పై నమ్మకంతోనే బాధ్యతగా నటించానని రాశి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
HYDలోని అల్లు సినిమాస్ డాల్బీ స్క్రీన్లో ‘ధురంధర్ 2’ ప్రీమియర్ ప్రతిపాదనను దర్శకుడు ఆదిత్య ధర్ తిరస్కరించాడట. రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి భాగం తర్వాత ఆయన ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నాడు. కేవలం థియేటర్ క్రేజ్ కోసం సౌత్లో ప్రమోట్ చేయడం అనవసరమని భావించాడట. బాలీవుడ్లోనూ ప్రమోషన్లకు దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
తమపై వచ్చిన ట్రోల్స్పై నటుడు జయం రవి చేసిన వ్యాఖ్యలకు ఆయన భార్య ఆర్తి ఘాటుగా బదులిచ్చారు. పురుషులే అసలైన బాధితులన్న రవి మాటలపై ఆమె స్పందిస్తూ.. ఒక మహిళ విడాకులకు ముందే వేరే వ్యక్తితో కనిపిస్తే సమాజం అంగీకరిస్తుందా? అని ప్రశ్నించింది. మరి పురుషుడు అదే పని చేస్తూ బాధితుడినని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్.. ఇలాంటి అసహ్యమైన ప్రవర్తన గర్వించదగ్గది కాదని ఆమె పోస్ట్ చేసింది.
బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు, కీర్తి సురేష్ తొలిసారి జతకడుతున్న క్రేజీ థ్రిల్లర్ ‘రఫ్తార్’. విద్యా వ్యవస్థలోని చీకటి కోణాలు, కార్పొరేట్ పోటీ, సక్సెస్ కోసం సాగే సంఘర్షణే ఈ చిత్ర కథాంశం. డబ్బు, అధికారం మనుషుల సంబంధాలను ఎలా మారుస్తాయో దర్శకుడు ఆదిత్య నింబాల్కర్ ఇందులో చూపించబోతున్నాడు. ఈ మూవీని 2026 జూలై 24న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.