యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చి అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన చిత్రం ‘సింహాద్రి’. అయితే, రాజమౌళి మొదట ఈ కథను రెబల్ స్టార్ ప్రభాస్తో చేయాలని భావించారట. ఈ కథను ‘డార్లింగ్’కు చెప్పారట. కానీ, ప్రభాస్కు ఆ సమయంలో డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ చిత్రాన్ని ఆయన వదులుకోవాల్సి వచ్చిందని, స్వయంగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. NOV 21న విడుదలైన ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. OTT ప్లాట్ఫామ్ ‘ఈటీవీ విన్’లో ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు ‘ఈటీవీ విన్’ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. యువ నటీనటులు అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని సాయిలు కంపాటి తెరకెక...
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి భారీ అప్డేట్ ఇచ్చారు. రేపు ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించబోతున్నట్లు తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వం, భీమ్స్ సంగీతం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రానుంది. కాగా, JAN 9న ది రాజాసాబ్, రవితేజ చిత్రం JAN 13న రిలీజ్ కానున్నాయి.
రణ్వీర్ సింగ్ ‘దురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఈ సినిమాను చూసినట్లు ట్వీట్ చేశాడు. రణ్వీర్ తన నటనతో అదరగొట్టినట్లు బన్నీ తెలిపాడు. ఈ మూవీ తనకు బాగా నచ్చినట్లు పేర్కొన్నాడు. అలాగే, దురంధర్ టీమ్కు ప్రత్యేక అభినందనలు చెప్పాడు.
బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్గా తెరకెక్కిన ‘అఖండ2: తాండవం’ థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, ఈ చిత్రం ‘పార్ట్-3’ కూడా ఉండబోతున్నట్లు చిత్ర బృందం ‘అఖండ2’ మూవీ చివర్లో హింట్ ఇచ్చింది. ‘జై అఖండ’ పేరుతో మూడో భాగం రానున్నట్లు తెలిపింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్గా తెరకెక్కిన ‘అఖండ2: తాండవం’ థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, ఈ చిత్రం ‘పార్ట్-3’ కూడా ఉండబోతున్నట్లు చిత్ర బృందం ‘అఖండ2’ మూవీ చివర్లో హింట్ ఇచ్చింది. ‘జై అఖండ’ పేరుతో మూడో భాగం రానున్నట్లు తెలిపింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘అఖండ-2’ చిత్ర నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్లో భారీ ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు జీవోను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అందరి వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ తీర్పు వెల్లడించిందని డివిజన్ బెంచ్ పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.
నటసింహ బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే USకు చెందిన బాలయ్య ఫ్యాన్ ఆయనకు తన సంతోషాన్ని వ్యకపరిచాడు. సినిమా సూపర్గా ఉందని, ఇంటర్వెల్ సీన్ నుంచి తాండవం మొదలైందని చెప్పుకొచ్చాడు. దీనిపై బాలయ్య స్పందిస్తూ.. ఇది యూనివర్సల్ మూవీ అని అన్నారు.
బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ-2’ ప్రీమియర్స్ కలెక్షన్స్లో అదరగొట్టింది. నైజాం ప్రాంతంలో ప్రీమియర్స్ బుకింగ్స్కు మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా కేవలం ప్రీమియర్స్ వసూళ్ళగానే 2.3 కోట్ల షేర్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అటు ఏపీలో కూడా ప్రీమియర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
టాలీవుడ్ నటుడు తిరువీర్ ఇంట సంబరాలుమొదలయ్యాయి. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ ఆనందాన్ని తిరువీర్ వెరైటీగా పంచుకున్నారు. బుజ్జాయి చిట్టి చేతిని పట్టుకుని.. ‘నాయినొచ్చిండు’ అంటూ ఎమోషనల్ అయ్యారు. 2024లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇప్పుడు వారసుడు వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు.
టాలీవుడ్ నటుడు తిరువీర్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ ఆనందాన్ని తిరువీర్ వెరైటీగా పంచుకున్నాడు. బుజ్జాయి చిట్టి చేతిని పట్టుకుని.. ‘నాయినొచ్చిండు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. 2024లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇప్పుడు వారసుడు వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు.
OTTలోకి తాజాగా పలు సినిమాలు వచ్చేశాయి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’. ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ కామెడీ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే హాలీవుడ్ నుంచి వచ్చి మంచి హిట్ అందుకున్న’సూపర్ మ్యాన్’ మూవీ జియో హాట్స్టార్లో విడుదలైంది.
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో తనదైన స్టైల్తో, అద్భుతమైన నటనతో అభిమానులను అలరిస్తున్న మన ‘తలైవా’ రజినీకాంత్ పుట్టినరోజు నేడు. బస్ కండక్టర్గా జీవితం ప్రారంభించి సూపర్ స్టార్గా ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి సినిమాలోనూ తనదైన మ్యాజిక్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నారు.
హీరో నాగచైతన్య సతీమణి శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లయ్యాక HYD చుట్టేయాలనుకున్నా.. రెండు సినిమాలతో బిజీ కావడంతో సాధ్యపడటం లేదు. పెళ్లి తర్వాత 160 రోజుల పాటు షూటింగ్స్లో పాల్గొన్నాను. ‘మనకు ఏదైనా నచ్చితే దాన్ని ఎలాగైనా సాధిస్తాం. అది పెద్ద కష్టమనిపించదు. నచ్చకపోతే సులువైన పని కూడా చాలా కష్టమనిపిస్తుంది’ అంటూ వివాహ జీవితంపై సంతోషం వ్యక్తం చేసింది.
రణ్వీర్ సింగ్ కొత్త సినిమా ‘ధురంధర్’కు గల్ఫ్ దేశాల్లో భారీ షాక్ తగిలింది. ఈ మూవీని సౌదీ, యూఏఈ సహా 6 దేశాల్లో బ్యాన్ చేశారు. ఇందులో ‘యాంటీ పాకిస్థాన్’ కంటెంట్ ఉండటమే దీనికి కారణం. గల్ఫ్ మార్కెట్ బాలీవుడ్కు చాలా ముఖ్యం. కానీ పర్మిషన్ కోసం నిర్మాతలు ఎంత ప్రయత్నించినా.. అక్కడి ప్రభుత్వాలు నో చెప్పేశాయి. దీంతో అక్కడ సినిమా రిలీజ్ ఆగిపోయింది.