HYDలోని అల్లు సినిమాస్ డాల్బీ స్క్రీన్లో ‘ధురంధర్ 2’ ప్రీమియర్ ప్రతిపాదనను దర్శకుడు ఆదిత్య ధర్ తిరస్కరించాడట. రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి భాగం తర్వాత ఆయన ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నాడు. కేవలం థియేటర్ క్రేజ్ కోసం సౌత్లో ప్రమోట్ చేయడం అనవసరమని భావించాడట. బాలీవుడ్లోనూ ప్రమోషన్లకు దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్.