పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక శ్రీలీల, రాశి ఖన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
‘సైయారా’తో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ యంగ్ హీరో అహాన్ పాండే.. వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. అనీష్ బజ్మీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన.. తాజాగా మరో రెండు చిత్రాలకు సంతకం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఆనంద్ ఎల్ రాయ్ తన తదుపరి చిత్రంలో మహాభారతంలోని ‘కర్ణ’ పాత్ర కోసం అహాన్ను ఎంపిక చేసినట్లు టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. మార్చి 6న రిలీజైన ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT వేదిక ఈటీవీ విన్లో మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా… అలీ, ధన్రాజ్, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అర్జునరాజు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వ్యద్ధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో కన్నుమూశారు. వేటగాడు, కొండవీటి సింహం, జేబుదొంగ, అడవి సింహాలు, జాబిల్లి వంటి సినిమాలకు నిర్మాత వ్యవహించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తమిళ లెజెండరీ నటుడు MGRను గురించి తను చేసిన వ్యాఖ్యలపై తెలుగు నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. తను MGRను దైవంలా భావిస్తానని.. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో తను నోరుజారినట్లు ఒప్పుకున్నారు. అయితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని స్పష్టం చేశారు. కాగా కాంతారావును చూసి MGR భయపడేవారని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రొటోకాల్స్ వివాదంపై బన్ని మేనేజర్ శరత్ చంద్ర స్పందించాడు. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. అల్లు అర్జున్ను కలవడం కష్టమని అనుకుంటే పొరపాటే అవుతుందని పేర్కొన్నాడు. ఇటీవల ఓ బ్రాండ్ స్ట్రాటజర్ బన్నీ కలవాలంటే 42 నిబంధనలు పాటించాలంటూ వ్యాఖ్యనించటం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
యాంకర్ అనసూయ భరద్వాజ్పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన జనార్దన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అనసూయను టార్గెట్ చేస్తూ, ఆమె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేస్తున్నాడు. దీనిపై అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టి, అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రముఖ నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో ప్రభుదేవా కుమారుడు రిషిల్ రాఘవేంద్ర దేవా హీరోగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శేఖర్ మాస్టర్ చెన్నై వెళ్లి ప్రభుదేవాకు కథ వినిపించారని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్, యశశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుర్తుకొస్తున్నాయి’. ETV Win సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. వినోద్ గాలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది నేరుగా ETV Win ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సూపర్ హిట్ పొలిటికల్ క్రైమ్ ఫ్రాంచైజీ ‘సర్కార్ 4’ షూటింగ్ను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనితో పాటు ‘సిండికేట్’ అనే మరో సినిమాపై కూడా పని చేస్తున్నట్లు చెప్పాడు. స్టీవెన్ స్పీల్బర్గ్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ దర్శకుడని వర్మ పేర్కొన్నాడు.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈనెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. అలాగే, పది రోజులపాటు సింగిల్ స్క్రీన్లో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 టికెట్ ధరలు చొప్పున పెంచుకునే అవకాశమిచ్చింది.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ దుమ్మురేపుతోంది. అయితే, ఈ సాంగ్ చిత్రీకరణ కోసం హైదరాబాద్లో ఏకంగా 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ మురికివాడ సెట్ను నిర్మించారు. అందులో 60 ఇళ్లతో ఒక గ్రామాన్నే సృష్టించడం విశేషం. ఈ సాంగ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న భారీ చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాను ఏప్రిల్ 17న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం VFX పనులు జరుగుతున్నాయి. అవుట్పుట్ చూశాక OTT భాగస్వాములు విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. పీరియడ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కాక్టెయిల్ 2’ విడుదల తేదీ ఖరారైంది. హోమీ అదజానియా తెరకెక్కిస్తున్న ఈ మూవీని 2026, జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 18న ఈ మూవీ ఫస్ట్ లుక్ను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత విడుదల కానున్న ఆమె తొలి సినిమా ఇదే. ఇందులో షాహిద్ కపూర్, కృతి సనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.