పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈనెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. అలాగే, పది రోజులపాటు సింగిల్ స్క్రీన్లో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 టికెట్ ధరలు చొప్పున పెంచుకునే అవకాశమిచ్చింది.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ దుమ్మురేపుతోంది. అయితే, ఈ సాంగ్ చిత్రీకరణ కోసం హైదరాబాద్లో ఏకంగా 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ మురికివాడ సెట్ను నిర్మించారు. అందులో 60 ఇళ్లతో ఒక గ్రామాన్నే సృష్టించడం విశేషం. ఈ సాంగ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న భారీ చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాను ఏప్రిల్ 17న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం VFX పనులు జరుగుతున్నాయి. అవుట్పుట్ చూశాక OTT భాగస్వాములు విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. పీరియడ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కాక్టెయిల్ 2’ విడుదల తేదీ ఖరారైంది. హోమీ అదజానియా తెరకెక్కిస్తున్న ఈ మూవీని 2026, జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 18న ఈ మూవీ ఫస్ట్ లుక్ను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత విడుదల కానున్న ఆమె తొలి సినిమా ఇదే. ఇందులో షాహిద్ కపూర్, కృతి సనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మార్చి 19న రిలీజ్ కానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. HYDలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ‘డాల్బీ సినిమా’ స్క్రీన్పై ప్రదర్శితం కానున్న తొలి తెలుగు మూవీగా చరిత్ర సృష్టించనుంది. అద్భుతమైన విజువల్స్, సౌండ్ ఎక్స్పీరియన్స్తో ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.
‘తండేల్’ తర్వాత నాగచైతన్య, కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ రూ.45 కోట్లకు దక్కించుకోగా, ఓవర్సీస్ రైట్స్ రూ.8 కోట్లకు అమ్ముడయ్యాయట. చైతూ కెరీర్లోనే ఇది అత్యధిక ఓవర్సీస్ బిజినెస్ కావడం విశేషం.
తమిళ దిగ్గజ నటుడు, మాజీ సీఎం ఎం.జి.రామచంద్రన్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. ‘నేను MGRను అగౌరవపరచాలని ఆ మాటలు అనలేదు. నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను’ అని పేర్కొన్నాడు. కాగా, దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరించే క్రమంలో రాజేంద్ర ప్రసాద్ MGRపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
బాలీవుడ్ దివంగత నటుడు రిషి కపూర్ వ్యక్తిత్వ హక్కుల విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆయన పేరు, ఫోటోలు, గొంతును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడాలంటే కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. రిషి కపూర్ గౌరవానికి భంగం కలగకుండా, ఆయన ఇమేజ్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీతూ కపూర్, రణ్బీర్ కపూర్ పేర్కొన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా.. టీజర్ను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ‘కాలరే ఎత్తారా’ సాంగ్కు మంచి స్పందన వస్తోంది. ఈ పాట లాంచ్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. మార్చి 15న హైదరాబాద్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో గ్రాండ్గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్లో జోష్ నింపాడు.
భారీ అంచనాల నడుమ వస్తున్న ‘ధురంధర్-2’ టికెట్ ధరల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లో ఒక ప్రత్యేక స్క్రీన్ కోసం టికెట్ ధరను రూ.3,100గా నిర్ణయించారు. బుక్ మై షో ఛార్జీలతో కలిపి ఇది రూ.3,145కి చేరుతుంది. కేవలం 42 సీట్లు ఉన్న ఈ స్క్రీన్లో ప్రీమియర్స్ కోసం ఈ ధర ఫిక్స్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో రేట్లు రూ.800 వరకు ఉన్నాయి.
అనుష్క పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న ఆమె, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోబోతున్నారట. ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత దర్శకుడు సుకుమార్తో చరణ్ ‘RC 17’ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కథ లాక్ అయినట్లు, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు సమాచారం. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా.. ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్ ‘ధురంధర్ 2’ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన ప్రేక్షకులకు, తన టీమ్కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్పాడు. ముఖ్యంగా తన మేకింగ్పై వచ్చే ‘డీటెయిలింగ్’ మీమ్స్ చూస్తుంటే సంతోషంగా ఉందని, గ్యారెంటీ లేని ఈ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకోవడం తనకెంతో గర్వంగా ఉందన్నాడు.