నటి సమీరా రెడ్డి సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇస్తుంది. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘ఆఖ్రీ సవాల్’ చిత్రంలో ఆమె ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. అభిజీత్ మోహన్ వారంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సమీరా.. ఇకపై కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తానని పేర్కొంది.