నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్తో బిజీగా ఉండగా, ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ అనే చిత్రంలో నటించనున్నాడు. ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరితో నాని ఓ సినిమా చేయనున్నాడట. ఆయన చెప్పిన ఒక వినూత్నమైన కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నట్లు సమాచ...
అడివి శేష్ హీరోగా దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన చిత్రం ‘డెకాయిట్’. తాజాగా ఈ మూవీ స్టోరీపై నటుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ ‘సుప్రియ నాకు రామ్గోపాల్ వర్మతో పనిచేస్తున్న రోజుల నుంచీ తెలుసు. హైదరాబాద్కి పెళ్లి కోసం వస్తే ఈ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. దర్శకుడు షానియల్తో కలిసి పనిచేయడం మంచి అనుభవం’ అని తెలిపాడు.
రామ్చరణ్ హీరోగా నటించిన మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ.. రామ్చరణ్ కొత్త ఫొటోను విడుదల చేశారు. కాగా, APR 30న విడుదల కానున్న ఈ మూవీ డాల్బీ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి టాలీవుడ్ చిత్రంగా నిలవనుంది.
దర్శకుడు బోయపాటి శ్రీను తన యాక్షన్ సినిమాల ఫ్రాంచైజీలను ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. ‘అఖండ 2’తో మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. తాజాగా సన్నీ డియోల్ సినిమా ‘జాట్ 2’ను డైరెక్ట్ చేసేందుకు బోయపాటిని సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ‘జాట్’ మూవీకి సీక్వెల్&z...
అక్కినేని నాగచైతన్య తన వంట గది ముచ్చట్లను సరదాగా పంచుకున్నాడు. ఖాళీ దొరికితే కొత్త వంటకాలను ప్రయత్నిస్తుంటానని అన్నాడు. తాను చేసిన వంటలకు తన భార్య శోభిత ఇచ్చే ఫీడ్బ్యాకే ఫైనల్ అని తెలిపాడు. ఇక తన తండ్రి నాగార్జున డైట్ పక్కన పెట్టి మరీ ఆదివారం ‘స్కూజీ’ పిజ్జాలను ఇష్టంగా తింటారని వెల్లడించాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ నెల 19న నిర్వహించనున్న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి చిరంజీవిని ఆహ్వానించారు. కాగా, ఇటీవల చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దిల్ రాజు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
TG: ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ను CM రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ సినీ రంగంలో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బన్నీ చిత్రాలు భవిష్యత్తులో హాలీవుడ్ స్థాయికి చేరుకోవాలన్నారు. అంతర్జాతీయ వేదికలపై మన సినిమా సత్తా చాటాలని పేర్కొన్నారు.
దేశంలోని సినిమా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు తప్పనిసరిగా సబ్టైటిల్స్తో పాటు, అంధుల కోసం దృశ్యాలను వివరించే ఆడియో డిస్క్రిప్షన్ ఉండాలని ఆదేశించింది. వినికిడి, దృష్టి లోపం ఉన్నవారు కూడా సినిమాల్లోని భావోద్వేగాలను, శబ్దాలను సులభంగా ఆస్వాదించేలా చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
TG: హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు అర్జున్ నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. అనంతరం మల్టీప్లెక్స్లోని స్క్రీన్లను ఆయన పరిశీలించారు. ఇందులో 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ కలిగి ఉండటం విశేషం.
SM ప్రచారాలపై నటి రష్మిక స్పందించింది. ఎనిమిదేళ్లుగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తన పాత ప్రైవేట్ ఆడియోను లీక్ చేశారని, తన కుటుంబం, స్నేహితుల ప్రైవసీని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లో SM నుంచి ఆ కంటెంట్ తొలగించాలని హెచ్చరించింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. తన వ్యక్తిగత జీవితంపై ఇతరులు జోక్యం అనవసరమని పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. OTT వేదిక జీ5లో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇటీవల జీ తెలుగు ఛానల్లో టెలికాస్ట్ అయింది. తాజాగా వెల్లడైన TRP రేటింగ్స్లో ఈ సినిమా సత్తా చాటింది. అర్బన్లో 12.52 రేటింగ్, అర్బన్ + రూరల్లో 10.35 రేటింగ్ సాధించింది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ టాక్ సాలిడ్గా వచ్చినట్లు సమాచారం. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందని, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం బ్లాక్బస్టర్ రేంజ్లో ఉంటుందని తెలుస్తోంది. అలాగే, సెకండ్ హాఫ్లో పవన్ పీక్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇది ఓ కమర్షియల్ ఎంటర్టైనర్.
తమిళ హీరో ధనుష్ వరుస మూవీలతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామితో ‘D55’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా.. మమ్ముట్టి త్వరలోనే భాగం కానున్నాడు. ఈ మూవీని SEP వరకు పూర్తి చేసి.. మారి సెల్వరాజ్తో ‘D56’ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత తమిళరసన్ పచ్చ ముత్తు దర్శకత్వంలో ‘D57’ సినిమా చేయనున్నట్లు, 2027లో ఇది స్టార్ట్ క...
సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా, నిన్న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు ఫర్మాన్ ఖాన్ను ఆమె హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. అయితే, ఈ పెళ్లిని ‘లవ్ జిహాద్’ అని కొందరు విమర్శిస్తుండటంతో మోనాలిసా ఘాటుగా స్పందించింది. తన వివాహానికి ‘లవ్ జిహాద్’ అని ముద్ర వేయవద్దని కోరింది. తనకు అన్ని మతాల పట్ల గౌరవం ఉందని స్పష్టం చేసింది.