హీరో సిద్ధార్థ్, హీరోయిన్ త్రిష మళ్లీ కలిసి నటించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమాకు “భర్తగా మారకు బ్యాచిలరూ” అనే ఆసక్తికరమైన టైటిల్ను పరిశీలిస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలుబడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
న్యాచురల్ స్టార్ నాని క్లాసిక్ సినిమాల్లో నిన్ను కోరి ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని గ్రాండ్గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మే 8న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రీరిలీజ్ చేయనున్నారు. ఇందులో నివేదా థామన్ హీరోయిన్గా, ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర MSRTC బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ నియమితులయ్యాడు. ఈ సందర్భంగా రితేష్ మాట్లాడుతూ.. MSRTCకి అంబాసిడర్గా ఎంపిక కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు. తన చిన్నతనంలో ఈ బస్సుల్లో ఎన్నోసార్లు ప్రయాణించానని గుర్తు చేసుకున్నాడు. రాష్ట్ర రవాణా రంగ అభివృద్ధికి, ప్రయాణికుల్లో అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నాడు.
హీరో రాజశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ‘ఠాగూర్’ సినిమాను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో వెల్లడించాడు. ‘తమిళంలో విజయ్ కాంత్ నటించిన ‘రమణ’ సినిమాను చూసి, దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావించాను. ఆ చిత్ర నిర్మాతతో మాట్లాడి రీమేక్ హక్కులు తీసుకుంటానని కూడా చెప్పాను. కానీ, వెంటనే అగ్రిమెంట్ చేసుకోకపోవడంతో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాను’ అని రాజశేఖర్ పేర్కొన్నాడు.
అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటిలతో క్రేజీ మల్టీస్టారర్ను దర్శకుడు చందు మొండేటి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఉజ్జయిని నేపథ్యంగా సాగే ఈ కథపై ఇప్పటికే ఇద్దరు హీరోలు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. మరో స్టార్ హీరో కీలక పాత్రలో నటించనున్న ఈ మూవీని నిర్మాత కరణ్ జోహార్ నిర్మించనున్నాడట. ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయమని సినీ వర్గాల్లో టాక్.
అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబోలో ‘రావణం’ అనే భారీ ప్రాజెక్ట్ను దిల్ రాజు ఫిక్స్ చేసినట్లు సమాచారం. గతంలో ప్రభాస్తో అనుకున్న ఈ కథలో, ఇప్పుడు బన్నీ ఒక పవర్ఫుల్ గ్రే షేడ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడట. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్తో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్.
శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో ‘జార్జ్ క్రిష్’ మూవీ రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీలో సీనియర్ హీరో అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇందులో మరో సీనియర్ హీరో నెగిటివ్ రోల్లో మెరవబోతున్నారనే టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ టైమ్ ట్రావెల్ బ్యాక్డ్రాప్లో సాగే డిఫరెంట్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రంలో తన లుక్స్పై వచ్చిన విమర్శలపై తాజాగా అక్షయ్ కుమార్ స్పందించాడు. ఈ సినిమాలో అక్షయ్ నకిలీ మీసం వాడటంపై నటుడు ముఖేష్ ఖన్నాతో పాటు ప్రేక్షకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అక్షయ్ క్షమాపణలు చెబుతూ.. ఒకే సమయంలో పలు ప్రాజెక్టులు చేయడం వల్ల సహజమైన మీసాన్ని పెంచడం సాధ్యం కాలేదని, అందుకే ఫేక్ మీసం వాడాల్సి వచ్చిందని వివరించాడు.
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది కుమార్తె కావ్య రెడ్డిని వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. తాజాగా, వీరు మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ పెళ్లి పత్రికను అందజేసి, వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా, వీరి వివాహం ఏప్రిల్ 29న తిరుపతిలో జరగనున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబోలో వస్తున్న ‘రౌడీ జనార్ధన’ షూటింగ్ వేగంగా సాగుతోంది. మే నెలాఖరున రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్పై ఓ సాంగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించనున్నారట. ఈ మూవీలో యాక్షన్ సీన్లు మెయిన్ హైలైట్గా నిలుస్తాయని సమాచారం. అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘రాజధాని ఫైల్స్’ దర్శకుడు భాను దర్శకత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్ రానుంది. సామాన్యుడి నుంచి ప్రపంచ స్థాయి దార్శనికుడిగా ఆయన ఎదిగిన తీరును, జీవితంలోని కీలక సంఘటనలు, ఉద్వేగభరిత ఘట్టాలతో ఈ చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కించనున్నాడు. భారీ తారాగణంతో పలు భాషల్లో రూపొందనున్న ఈ సినిమా వివరాలను, టైటిల్ను త్వరలోనే వెల్లడించనున్నాడు.
సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 26న మధురైలోని సోలమలై పాలిటెక్నిక్ కాలేజ్లో ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరగనున్నట్లు వెల్లడించింది. ఇక 2026, మే 14న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది.
విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రలో నటించింది. సెన్సార్ కారణాల వల్ల ఈ చిత్ర విడుదల వాయిదా పడగా, ఇటీవలే సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. ఈ ఘటనపై మమితా బైజు స్పందిస్తూ.. మూవీ లీక్ అయిందని తెలిసి తాను చాలా బాధపడినట్లు తెలిపింది. ఎంతో మంది కష్టపడి చేసిన పని ఇలా వృథా కాకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ‘ధురంధర్’ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ మేకింగ్పై పూర్తిస్థాయి డాక్యుమెంటరీని థియేటర్లలో విడుదల చేసేందుకు టీం సిద్ధమైంది. హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్, రణ్వీర్ పడ్డ కష్టం, ఆదిత్య విజన్ కళ్లకు కట్టేలా చూపించనున్నారట. బాలీవుడ్లో ఇలాంటి ప్రయోగం చాలా అరుదు. దీని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా, రణ్బీర్ కపూర్ ‘యానిమల్’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘యానిమల్ పార్క్’ ఎప్పుడు మొదలవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రణబీర్ ‘రామాయణ’ రెండు భాగాలతో పాటు, ‘బ్రహ్మాస్త్ర 2’, ‘ధూమ్ 4’ మూవీలకు ఓకే చెప్పాడట. ఈ మూవీల వల్ల సందీప్ వంగా సినిమా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. మరి వంగా అప్పటివరకు వేచి చూస్తారా లేదా అనేది ఇండస్ట్రీ...