కన్నడ ఇండస్ట్రీలో మరో ఉద్యమం మొదలైంది. పబ్లిక్ ఈవెంట్స్లో హీరోయిన్ల ఫొటోలు, వీడియోలు జూమ్ చేసి తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యరాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. పోస్ట్లు పెడుతున్నారు. హీరోయిన్లు సప్తమి గౌడ, ఆషికారంగనాథ్, రుక్మిణివసంత్ నెట్టింట ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.