ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తన్వి ది గ్రేట్’. ఆటిజంతో బాధపడుతున్న ఒక యువతి, ఆర్మీలో చేరి తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చింది అనే స్ఫూర్తిదాయక కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సుభాంగీ దత్ ప్రధాన పాత్రలో నటించగా.. కీరవాణి సంగీతం అందించాడు.
శ్రద్ధా కపూర్ 2010లో సినీరంగంలోకి వచ్చి, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2024లో వచ్చిన విజయాలతో ఆమె నికర సంపద రూ.130 కోట్లకు చేరింది. ఒక్కో సినిమాకు రూ.10-15 కోట్లు తీసుకుంటూ, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపార పెట్టుబడులతో భారీగా ఆర్జిస్తున్నారు. లగ్జరీ కార్లు కలిగి, అధిక పారితోషికం అందుకుంటున్న టాప్ నటీమణులలో ఆమె ఒకరిగా నిలిచారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26, 2026న విడుదల కానుంది. ఈ మూవీలో కేవలం 4 పాటలు మాత్రమే ఉన్నాయని, నెక్స్ట్ వచ్చే సాంగ్ భారీ లెవల్లో ఉంటుందని హరీష్ శంకర్ తెలిపాడు. మార్చి 4న ఈ పాటపై అప్డేట్ రానుందని చెప్పాడు. దీంతో ఈ పాట నెక్స్ట్ లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు అనుదీప్ KV రూపొందించిన ‘ఫంకీ’ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మార్చి 12 లేదా 13న స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం వాయిదా పడింది. మార్చి 6, 2026న విడుదల కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా.. ఎక్కడా రాజీపడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని తాతినేని సత్య తెరకెక్కించగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘టాక్సిక్’. ఈ మూవీ పారితోషికం విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వార్తల్లో నిలిచింది. తొలుత ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె రూ.18 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, నిర్మాతలతో చర్చల తర్వాత రూ.12 కోట్లకు ఆమె అంగీకరించినట్లు సమాచారం. 2026 మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తన ప్రియుడు మోహనకృష్ణ (45)ను హత్య చేయించిన కేసులో నటి ఊర్వశి బెంగళూరులో అరెస్టయ్యింది. వినయ్ అనే మరో వ్యక్తితో ప్రేమలో పడ్డ ఆమె, పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో మోహనకృష్ణను కత్తితో పొడిచి చంపించింది. భర్తకు దూరంగా ఉంటున్న ఊర్వశి పలు కన్నడ చిత్రాల్లో నటించింది. ఈ క్రూరమైన పథకంలో ఆమెకు సహకరించిన వినయ్, మరో యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, బి. రామరాజు(85) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇవాళ ఉదయం మధురానగర్లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో రామరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విజయ్ దళపతి ‘తేరి’ మూవీకి రీమేక్ కాదని దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. మొదట రీమేక్గా భావించినా, తర్వాత కథను పూర్తిగా మార్చేశామని స్పష్టం చేశాడు. కథ, మాటలు, దర్శకత్వం తనవే అయినప్పుడు రీమేక్ అనడం సరికాదన్నాడు. ‘గబ్బర్ సింగ్’లోని అంశాలే ‘తేరి’లో కనిపించాయని, ఇప్పుడు తన సినిమానే రీమేక్ అనడంపై ఆయన అసహనం వ్యక్తం ...
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కానీ ఇది కేవలం ఆహా గోల్డ్ వినియోగదారులకి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మార్చి 4 నుంచి సాధారణ సబ్స్క్రైబర్స్కి అందుబాటులోకి రాబోతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆయన లైనప్లో ఉన్నాయి. దర్శకుడు సుకుమార్తో ‘పుష్ప 3’, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్తో ‘AA23’ మూవీలు చేయనున్నాడు. అలాగే మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్తో ‘AA24’ మూవీ చేయనున...
2018లో సెన్సేషన్ సృష్టించిన ‘తుంబాడ్’ మూవీకి సీక్వెల్ రాబోతుంది. దర్శకుడు అనిల్ రాహి బర్వె తెరకెక్కించిన ఈ విజువల్ వండర్కు పార్ట్-2 సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ‘సైంధవ్’ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీని మేకర్స్ ఖరారు చేశారు. ఆయన రాకతో ఈ హారర్ థ్రిల్లర్పై అంచనాలు రెట్టింపయ్యాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్ 2’ మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిర్మాత విజయ్ గుడ్న్యూస్ చెప్పాడు. ‘సలార్ 2’ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని తెలిపాడు. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించాడు. ఈ విషయం అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నాడు. అలాగే, ఇండస్ట్రీలో ఉన్న గొప్ప దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరని విజయ్ కితాబిచ్చాడు.
హీరోయిన్ దిశా పటానీ ప్రస్తుతం ‘అవరాపన్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మలేసియాలో చివరి షెడ్యూల్ను పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకుందట. దిశ, ఇమ్రాన్ల ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకుల పరిస్థితి దారుణంగా ఉంది. న్యూ టాలెంట్ను ప్రోత్సహిస్తామని పెద్దలు చెబుతున్నా, వాస్తవం మాత్రం భిన్నంగా ఉందని యువ దర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్లలో స్టోరీ లిజనర్స్ కొత్త వారిని కలవడానికి ఇష్టపడరని, అపాయింట్మెంట్ ఇచ్చి కూడా గంటల తరబడి వెయిట్ చేయించి ఆఖరి నిమిషంలో అబద్ధాలు చెబుతారని వాపోతున్నారు.