మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో ‘మెగా 158’ మూవీ పట్టాలెక్కబోతోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మేలో షూటింగ్ మొదలుకానున్న నేపథ్యంలో తాజాగా చిరుకి లుక్ టెస్ట్ నిర్వహించారట. ఇందులో మెగాస్టార్ రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారట. వింటేజ్ చిరు మార్క్ మాస్ అంశాలు, హై-వోల్టేజ్ యాక్షన్తో ఈ చిత్రం ఉండబోతోంది.
ప్రభాస్, రాజమౌళిల ‘బాహుబలి’ మ్యాజిక్ మళ్లీ మొదలైంది. ఈ సిరీస్కు కొనసాగింపుగా వస్తున్న యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ప్రతిష్టాత్మక ఎన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఈ చిత్రం ఎంపికైంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్కు గ్లోబల్ గుర్తింపు రావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి, రౌడీ జనార్ధన’ మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో మరో రెండు భారీ చిత్రాలను లైన్లో పెట్టాడట. ‘హాయ్ నాన్న’ ఫేం శౌర్యువ్తో ఒక సినిమా, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు విజయ్ పచ్చజెండా ఊపాడట. వీటిని కూడా సమాంతరంగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ మూవీపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన అండర్ వాటర్ సెట్స్ను ఇప్పుడు రాజమౌళి తన సినిమా షూటింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం దేవర సెట్స్ను రీమోడల్ చేసి షూట్ చేస్తున్నారని టాక్.
శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘భోగి’ షూటింగ్ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం రంపచోడవరం అడవుల్లో దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. 1960ల నాటి రా రస్టిక్ డ్రామాలో శర్వా ఊర మాస్ లుక్లో కనిపించనుండగా.. అనుపమ, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది.
నాగశౌర్య, విధి జంటగా నటించిన ‘బ్యాడ్బాయ్ కార్తీక్’ ఈనెల 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో HYDలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో నాగశౌర్య మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనను సరికొత్తగా చూస్తారని, ఇది అందరికీ నచ్చే చిత్రమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రభాస్ తొలి హీరోయిన్ శ్రీదేవితో నటించడం అదృష్టమని, తనకూ ఆ లక్ కలిసి రావాలని శౌర్య కోరుకున్నాడు.
దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా శ్రీనివాస మంగాపురం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. రేపు సా.6 గంటలకు టీజర్ విడుదల కాబోతున్నట్లు పోస్టర్ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనికి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పరాజయం పొందింది. 193 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన కోల్కతా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 రన్స్ మాత్రమే చేయగలిగింది. KKR బ్యాటర్లలో రమణదీప్ 35, రహానే 28 పరుగులతో పర్వాలేదనిపించారు. CSK బౌలర్లలో నూర్ 3, కాంబోజ్ 2, ఖలీల్, అకేల్ హోసేన్ చెరో ఒక్క వికెట్ పడగొట్టారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో ‘ధురంధర్’ సంచలనం సృష్టిస్తోంది. ‘ధురంధర్’, ‘ధురంధర్ 2’ చిత్రాలు కలిపి ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ఒకే ఫ్రాంఛైజీ ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం భారతీయ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి. ఇక రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు.
కయ్యదు లోహర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. దుల్కర్ సల్మాన్ సరసన ‘ఐయామ్ గేమ్’ అనే యాక్షన్ థ్రిల్లర్లో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, తన ‘విశ్వరూపం’ చూస్తారని కయ్యదు ధీమా వ్యక్తం చేసింది. నహస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 ఓనం కానుకగా విడుదల కానుంది.
ఆస్తి తగాదా కారణంగా తనపై దాడి జరిగిందని మళయాళ నటి సజిని వెల్లడించింది. 2001లో సినిమాల ద్వారా వచ్చిన సంపాదనతో తన తల్లి పేరుతో జూబ్లీహిల్స్లో ఇల్లు కొన్నానని వెల్లడించింది. ఇప్పుడు ఆ ఇంటి కోసం తన అక్క, వాళ్ల పిల్లలతో పాటు తన భర్త కూడా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రూ.10 కోట్ల ఆస్తి లాగేసుకోవాలని చూస్తున్నారని పేర్కొంది.
వరుస పరాజయాల నేపథ్యంలో రాశీ ఖన్నా తన ఆశలన్నీ ఓటీటీపైనే పెట్టుకుంది. ర్యాపర్ కింగ్ హీరోగా పరిచయమవుతున్న ‘లుఖ్కే’ అనే మ్యూజికల్ యాక్షన్ డ్రామాలో ఆమె నటిస్తోంది. పంజాబ్ ర్యాప్ కల్చర్, డ్రగ్ సిండికేట్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రాజెక్ట్తోనైనా రాశీ మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ వేడుకకు సంబంధించి మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. రష్మిక విధించిన షరతు మేరకు పెళ్లి రోజున కేవలం గంటన్నర లోపే మేకప్ను పూర్తి చేసినట్లు తన్వీ తెలిపింది. సాధారణంగా సెలబ్రిటీల మేకప్కు గంటల సమయం పడుతుంది. కానీ రష్మిక ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయించుకోవడం విశేషం.
‘లిటిల్ హార్ట్స్’ విజయంతో జోరుమీదున్న హీరో మౌళి, తన తదుపరి మూవీని మైత్రీ మూవీ మేకర్స్తో చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీకి ‘దొంగ నా కొడుక’ అనే మాస్ టైటిల్ను ఖరారు చేసినట్లు టాక్. ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రం యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఉండబోతోందట. ఈ క్రేజీ ప్రాజెక్టు మౌళి కెరీర్కు మరో బిగ్ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.