బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో కలిసి శ్రీలీల మరో సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కబీర్ ఖాన్తో తెరకెక్కిస్తున్న మూవీలో శ్రీలీల ఎంపికైనట్లు సమాచారం. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో కార్తిక్ కిక్ బాక్సింగ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ మూవీ 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ను ’27’ నంబర్ సెంటిమెంట్ కలవరపెడుతోంది. గతేడాది SEP 27న కరూర్ తొక్కిసలాట, OCT 27న బాధితుల పరామర్శ, DEC 27న సినిమా ఆడియో లాంచ్ వివాదం.. ఇలా అన్నీ 27వ తేదీనే జరిగాయి. తాజాగా FEB 27న భార్య సంగీత 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ విడాకుల పిటిషన్ వేయడం సంచలనమైంది. MAR 27న కోర్టులో ఏం జరగనుందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ప్రముఖ బల్లితెర నటి దేవిప్రియ నిన్న తెల్లవారుజామున కారులో చెన్నై నుంచి తిరుచ్చి వైపు బయల్దేరారు. పెరంబలూరు వద్ద కారు టైరు పంక్ఛర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేష్(38) కారును రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. కారులో ఉన్న ముత్తుగణేష్ అక్కడికక్కడే మృతిచెండాడు. దేవిప్రియ తృటిలో తప్పించుకున్నారు. ఆమె పీఏ దివాకర్ తీవ్రంగా గాయపడ్డాడు.
శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి రాత్రి పూట 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గడం, చిరాకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండటం వల్ల మంచి నిద్ర పడుతుంది. దీనితో పాటు, పడుకునే ముందు కాఫీ, టీ వంటి కెఫీన్ పానీయాలకు దూరంగా ఉండటం వల్ల మెదడు త్వరగా విశ్రాంతి పొంది గాఢ నిద్ర పడుతుంది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా సినీ నటుడు మంచు విష్ణు దుబాయ్లో చిక్కుకుపోయాడు. ఈ నేపథ్యంలో, తన కుటుంబం సురక్షితంగా ఉన్నట్లు విష్ణు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికీ బాంబుల శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ, ఇక్కడ జనజీవనం ప్రస్తుతం సాధారణంగానే ఉందంటూ ట్వీట్ చేశాడు. పరిస్థితులు చక్కబడిన వెంటనే వీలైనంత త్వరగా ఇండియాకు తిరిగి వస్తామని పేర్కొన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలో తన జోరును కొనసాగిస్తుండటం విశేషం. ఏకంగా 109 కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇటీవల కాలంలో ఈ ఘనత సాధించిన ఏకైక చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ ఈనెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని స్పష్టం చేశాడు. కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇప్పటికే ‘చికిరి’ పాట రిలీజై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘రాయ్ రాయ్ రారా’ అంటూ సాగే లిరికల్ వీడియోను ఈరోజు రాత్రి 7:02 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.
యాంకర్, నటి రష్మీ తన సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి కీలక విజ్ఞప్తి చేసింది. ‘మన దేశం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలను గౌరవించింది. కానీ రాడికల్ (అతివాద) మనస్తత్వాన్ని మేము సహించము. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాప్తి చెందనివ్వం. రాడికల్ ఆలోచనలతో ఉండి, యుద్ధాన్ని సమర్థించే వారిని దయచేసి ఇరాన్కు పంపాలి’ అని కోరింది.
బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ఇన్స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించింది. తాను ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణలు, అక్కడి భయంకరమైన దృశ్యాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తన గురించి ఆందోళన చెందిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన అభిమానులకు కీలక అప్డేట్ ఇచ్చారు. తన స్వీయ దర్శకత్వంలోని ‘క్రిష్ 4’ను ప్రస్తుతానికి పక్కనపెట్టిన ఆయన, కన్నడ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’తో ఓ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది హృతిక్ కెరీర్లోనే తొలి సౌత్ ఇండియన్ సినిమా. ఈ చిత్రం పూర్తయ్యాకే ‘క్రిష్ 4’ పట్టాలెక్కుతుందని సమాచారం.
తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న కొత్త సినిమా టైటిల్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే పేరును ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జులైలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సూర్య మార్క్ నటన, వెంకీ స్టైల్ మేకింగ్పై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.
మళయాళ బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర దర్శకుడు చిదంబరం ఎస్ పొడ్యాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 2022లో తనను చిదంబరం వేధించినట్లు ఓ మహిళ ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల మళయాళ చిత్ర పరిశ్రమలో వరుసగా వెలుగులోకి వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
నటుడు, టీవీకే అధినేత విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడం సంచలనమైంది. విజయ్-సంగీతల విడాకుల వ్యవహారం, ఇతర ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం కుటుంబంలో విభేదాలకు సంకేతమని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా ఇటీవల భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కగా, విజయ్కు మరో మహిళతో సంబంధం ఉందని ఆమె ఆరోపణలు చేసింది.
దుబాయ్, ఖతార్ సహా ఏడు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో అక్కడ ఉన్న స్టార్ హీరోలు అజిత్, మాధవన్ భద్రతపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే వారిద్దరూ క్షేమంగా ఉన్నారని, ఎటువంటి ముప్పు లేదని వారి సిబ్బంది అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం వారు సురక్షిత ప్రాంతంలో ఉన్నారని తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.