నయనతార భర్త విఘ్నేశ్ శివన్ పుదుచ్చేరిలో ప్రభుత్వ ఆస్తులు కొనుగోలు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై విఘ్నేశ్ స్పందించాడు. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. సినిమా షూట్ కోసం మాత్రమే తాను పుదుచ్చేరి వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అదే సమయంలో అక్కడి సీఎంతో పాటు పర్యటక మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు వెల్లడించాడు.
కోలీవుడ్ దర్శకుడు అట్లీ లుక్పై బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ అవమానించేలా వ్యవహరించాడు. కపిల్ శర్మ నిర్వహిస్తున్న ఓ షోలో అట్లీ పాల్గొన్నాడు. అయితే.. కథ చెప్పడం కోసం ఎవరినైనా స్టార్ హీరోను మీరు కలిసినప్పుడు.. వాళ్లు అట్లీ ఎక్కడ అని అడుగుతారా? అని ప్రశ్నించాడు. దీనిపై అట్లీ తనదైన స్టైల్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది ముఖ్యం కాదని రిప్లై ఇచ్చాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రూ.వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ మరో ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పింది. రిలీజైన 11వ రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. సెలవు కావడంతో ఆదివారం ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. కాగా ఓవరాల్గా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో సి...
బిగ్బాస్ తెలుగు సీజన్-8 విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ నిలిచాడు. ఓటింగ్లో అగ్రస్థానంలో ఉన్నాడని.. నిఖిల్ను నాగార్జున విజేతగా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఓటింగ్లో గౌతంకృష్ణకు 44 శాతం ఓట్లు రాగా.. నిఖిల్కు 30 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, గౌతంకృష్ణ ఐదోవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతోనే నిఖిల్ను విజేతగా ప్రకటించినట్లు నెటిజన్లు చర్చించుకు...
స్టార్ హీరోయిన్ అనుష్క.. దర్శకుడు క్రిష్ కాంబోలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘ఘాటి’. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. అందులో అనుష్క స్వయంగా విడుదల తేదీపై స్పష్టత ఇచ్చింది.
ఇండస్ట్రీలో శ్రీలీల జోరుమీదుంది. కొత్త సినిమాలు ఏవి ప్రారంభం అవుతున్న ఈ అమ్మడి పేరే వినిపిస్తుంది. మురళీ కిషోర్ డైరెక్షన్లో అఖిల్ హీరోగా మొదలైన సినిమాకు లెనిన్ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో అఖిల్తో హైపర్ బ్యూటీ రొమాన్స్ చేయనుంది. కాగా అటు నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మనే సెలక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస...
అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శివ కార్తికేయన్ మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆకాశమే నీ హద్దురా సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తన 25వ సినిమా పనులు ప్రారంభించాడు. అయితే ఈ చిత్రం 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. శివ కార్తికేయన్ సరసన హైపర్ బ్యూటీ శ్రీలీల మెరవనున్నది.
కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కనున్న ‘యుఐ’ సినిమా తెలుగులో ఈ నెల 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దేశంపై ప్రేమతో ఇలాంటి సినిమాలు చేస్తున్నారా లేక కోపంతోనా అని అడగ్గా, దానికి ఉపేంద్ర సమాధానమిస్తూ దేశం, దేహం రెండు ఒక్కటేనన్నాడు. దేహం బాగుంటే దానిపై ప్రేమ ఉంటుందని, సరిగ్గా లేకుంటే కోపం వస్తుందని, దేశం విషయంలోనూ అం...
జీ తెలుగు: వసంతం (9AM), మొగుడు (11PM); ఈటీవీ: దేవాంతకుడు (9AM); జెమినీ: కింగ్ (8.30AM), జర్నీ (3PM); స్టార్ మా మూవీస్: డా. సలీం (7AM), అత్తిలి సత్తిబాబు (9AM), చిన్నా (12PM), నిన్ను కోరి (3PM), ఫ్యామిలీ స్టార్ (6PM), జల్సా (9PM); జీ సినిమాలు: అఖిల్ (6AM), రాజకుమారుడు (9AM), మున్నా (12PM), మల్లీశ్వరి (3PM), డీడీ రిటర్న్స్ (6PM), బేతాలుడు (9PM).
తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న RC16లో విజయ్ కీ రోల్ పోషిస్తున్నాడని వార్తలు వినిపించాయి. వాటిపై సేతుపతి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తాను ఆ మూవీలో సమయం లేక నటించడంలేదని తెలిపాడు. అలాగే తెలుగు సినిమాల్లో హీరోలాగా నటిస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ త్వరలోనే ఓ సినిమాలో చేసే అవకాశాలున్నాయని పేర్కొ...
106 రోజులుగా రసవత్తరంగా సాగిన తెలుగు బిగ్బాస్ సీజన్ 8 ముగిసింది. ఈ సీజన్ విన్నర్గా సీరియల్ యాక్టర్ నిఖిల్ నిలిచాడు. మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్లు ఫైనల్ లిస్ట్లో ఉన్నారు. ఈ ఉత్కంఠ పోరులో నిఖిల్ విజేతగా.. గౌతమ్ రన్నరప్గా నిలిచాడు. విన్నర్ నిఖిల్ ఛీఫ్గెస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా టైటిల్ ...
తన కుటుంబంపై హత్యకు కుట్ర పన్నారని నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. ‘జనరేటర్లో చెక్కర కలిపి డీజిల్ పోశారు. తద్వారా విద్యుత్ సరఫరాలో భయంకరమైన హెచ్చుతగ్గులు జరిగాయి. మా అమ్మ, తొమ్మిది నెలల పాప, బంధువులు ఇంట్లో తీవ్ర ఇబ్బంది పడ్డారు. నేను, నా భార్య ఇంట్లో లేని సమయంలో విష్ణుతో పాటు ఆయన అనుచరులు కలిసి కుట్ర పన్నారు. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని పోలీసులకు చేసిన ఫ...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ! నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా ఆనందం, శాంతిని తెచ్చావు.. ప్రతి రోజూ, ప్రతి గంట, ప్రతి జ్ఞాపకం నీతో మరింత అందంగా ఉంటుంది. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నన్ను డ్యాన్స్ చేసేలా చేసేది నువ్వు ఒక్కదానివే’ అంటూ తన ప్రేమను ఉద్దేశిస్తూ భావోద్వేగపు పోస్ట్ చే...
టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్, తన ప్రియుడు అంటోనీతో గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్లో పెద్దల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నటి మళ్లీ క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రియుడికి కిస్ పెడుతున్న, రింగ్ తొడుగుతున్న, డ్యాన్స్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
TG: HYD జల్పల్లిలో మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం చోటుచేసుకుంది. మంచు మనోజ్ మహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు. జల్పల్లి నివాసంలో స్నేహితులతో కలిసి మనోజ్ పార్టీ చేసుకునేందుకు విద్యుత్ సరఫరాకు జనరేటర్ తెప్పించినట్లు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటుతో అసహనానికి గురైన మంచు విష్ణు తన అనుచరులతో జనరేటర్లో చక్కెర పోయించినట్లు సమాచారం. దీంతో వారిద్దరి మధ్య స్వల్ప వివాదం జరిగింది.