విజయ్ దేవరకొండ, రష్మిక జంట తమ వివాహ వేడుకను వినూత్నంగా, సేవా కార్యక్రమాలతో జరుపుకుంటూ ఆదర్శంగా నిలిచారు. పెళ్లి తర్వాత ఈ జంట దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇవాళ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, యూపీ, అస్సాంలలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదం, మిఠాయిలు పంచుతూ తమ సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నారు.