మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, వ్యాన్ ఢీకొని.. నలుగురు వ్యక్తులు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు వాహనాల్లో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.