కడప నగరంలో నీటి కాలుష్యంపై ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రాకేశ్ చంద్ర ప్రత్యక్షంగా పరిశీలించారు. లీకేజీ మరమ్మతు పనుల్లో ఆలస్యం జరిగినప్పటికీ, వాటిని వేగవంతం చేసి మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేపట్టినట్లు అధికారులు తెలిపారు.