కామారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోందని ప్లానింగ్ సొసైటీ నివేదిక వెల్లడించింది. పిట్లం మండలంలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పలుచోట్ల 40 డిగ్రీలు దాటింది. వర్షపాతం ఎక్కడా నమోదు కాలేదు. ఎండల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.