సత్యసాయి: ధర్మవరంలో తనపై అక్రమ కేసు బనాయించి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఓబుళరెడ్డి ఎస్పీ సతీష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. జనసేన నేతపై నకిలీ పోస్టు సృష్టించిన వ్యక్తిని వదిలేసి, సంబంధం లేని తనను స్టేషన్కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.