కోనసీమ: నిబంధనలు అతిక్రమించే ప్రైవేటు వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని DTO దేవిశెట్టి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. రావులపాలెం హైవేపై నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 25 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.53,500 జరిమానా విధించినట్లు వెల్లడించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.