ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అనంతరం నాగబాబు నివాసానికి వెళ్లాడు. తన ఇంటికి విచ్చేసిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు నాగబాబు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు కాసేపు ముచ్చటించారు. సంధ్య థియేటర్ ఘటనను, కేసు వివరాలను బన్నీ నాగబాబుకు వివరించాడు. కష్ట సమయంలో మెగా ఫ్యామిలీ అండగా నిలవడం పట్ల బన్నీ కృతజ్ఞతలు తెలియజేశాడు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన మూవీ ‘పుష్ప 2 ది రూల్’. ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 10 రోజుల్లోనే హిందీ మార్కెట్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.507.50 కోట్లు (కేవలం హిందీ మార్కెట్) వసూలు చేసింది. హిందీలో వేగంగా రూ.500 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ విషయ...
ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్, విశ్వదేవ్ కాంబోలో డైరెక్టర్ నందకిషోర్ ఈమని తెరకెక్కించిన ’35 చిన్న కథ కాదు’ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జీ తెలుగులో ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు ఇది టెలికాస్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
హీరో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆయన్ని కలిశారు. కుటుంబసభ్యులతో వెళ్లిన బన్నీని చిరంజీవి ఆప్యాయంగా పలకరించారు. పుష్ప-2 విజయం తర్వాత మెగాస్టార్ ఇంటికి బన్నీ వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటన, అరెస్టుపై మాట్లాడారు. కాగా.. తొక్కిసలాట ఘటన కేసులో మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.
ప్రముఖ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఘాటీ’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. 2025 వేసవి కానుకగా ఏప్రిల్ 18న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాను UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఉపాసన కొణిదెల Xలో పోస్ట్ పెట్టారు. ‘అవసరమైన వారికి సానుభూతి, గౌరవంతో వైద్యాన్ని అందించడమే మాకు నిజమైన సనాతన ధర్మం అని తాతయ్య నేర్పించారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం దగ్గర అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించాం. తిరుమల, శ్రీశైలం వంటి పలు క్షేత్రాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేశాం. చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు...
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ మూవీ 10వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. అలాగే హైదరాబాద్లోని కొన్ని థియేటర్లలో 3D వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
తమిళ నటుడు విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల 1’ సినిమాకు సీక్వెల్గా ‘విడుదల 2’ రాబోతుంది. ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దీని విడుదలకు ముందు ‘విడుదల 1’ను OTTలో ఫ్రీగా చూడొచ్చని ‘జీ5’ ప్రకటించింది. ఈ ఛాన్స్ ఈ నెల 20 వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది. ఇక దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ సినిమాక...
అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఇవాళ జరగనుంది. తాజాగా దీని ప్రోమో రిలీజ్ కాగా.. ఈ సీజన్ ప్రైజ్మనీ రూ.54,99,999 అని నాగార్జున ప్రకటించారు. దాన్ని రూ.55 లక్షలుగా నిర్ణయించారు. గెలిచిన విజేతకు టైటిల్తో పాటు ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ వేడుకలో ఎక్స్ కంటెస్టెంట్స్, పలువురు సెలబ్రిటీలు పాల్గొన...
అక్కినేని నాగచైతన్య, నటి శ్రీలీల జంటగా నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ దండుతో చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల కనిపించనున్నట్లు సమాచారం. ‘తండేల్’ రిలీజ్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అలాగే శ్రీలీల అక్కినేని అఖిల్తో కూడా సినిమా చేయబోతుందట.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్’. ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్ను రేపు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. ఈ క్రమంలో చిరు నివాసానికి బయలుదేరారు. బన్నీ అరెస్టైన విషయం తెలియగానే షూటింగ్ని మధ్యలోనే ఆపేసి.. అల్లు ఫ్యామిలీని కలిసేందుకు చిరంజీవి వెళ్లారు. అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అవటానికి చిరంజీవి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. దీనిపై స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు. బన్నీను చూసి ఆయన భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అయిన వీడియోను ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేశారు. ‘ఇప్పుడు నేనేమీ ఏడవడం లేదు ఓకే’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజీలను పోస్ట్ చేశారు. దానికి అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను ట్యాగ్ చేశారు.
తన పెళ్లి గురించి నటి తాప్సి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అందరూ అనుకుంటున్నట్లు తన పెళ్లి ఈ ఏడాది జరగలేదన్నారు. తమ పెళ్లి గతేడాది డిసెంబర్లోనే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. త్వరలోనే మా పెళ్లి రోజు రాబోతుంది. ఇవాళ నేను ఈ విషయాన్ని బయటపెట్టకపోతే ఎవరికీ దీని గురించి తెలిసేది కాదు’ అని పేర్కొన్నారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలోని మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రేపు లెజెండరీ లాలెట్టన్ మోహన్ లాల్ మొదటి గ్లింప్స్ వచేస్తున్నాయని మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కానుంది.