‘ఛాంపియన్’ ఫేమ్ రోషన్ తన తర్వాతి ప్రాజెక్టును దర్శకుడు శైలేష్ కొలనుతో చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘ఏమో ఏమో ఇది’ అనే టైటిల్ ఖరారైంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా 2026 దసరా కానుకగా రిలీజ్ కానుంది.