దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ గౌరవార్థం జరిగిన విందులో ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. అక్కడ ఆయన నటి ప్రియాంక మోహన్, కే-పాప్ స్టార్ ఆరోరాలను కలిసి ముచ్చటించారు. వారితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘మేడ్ ఇన్ కొరియా స్టార్ ప్రియాంకను కలవడం సంతోషం’ అని థరూర్ ట్వీట్ చేశారు. దీనికి స్పందిస్తూ ప్రియాంక ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.