బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’. అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. టీజర్ ఆగస్టు 28న రానున్నట్లు మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చింది. ‘పెళ్లికి మండపం రెడీ చేశాక.. సన్నీ, కుమారి ఎంట్రీతో పరిస్థితి అంతా మారిపోతుంది’ అనే క్యాప్షన్ జత చేసి జాన్వీతో క్లోజ్గా ఉన్న పోస్టర్ను షేర్ చేశారు.
తెలుగు సినీ కార్మికుల సమ్మె అల్లు అర్జున్, అట్లీ సినిమాపై ప్రభావం చూపిందని నిర్మాత బన్నీ వాసు తేలిపారు. సాధారణంగా ముంబై షూటింగ్స్పై సమ్మె ప్రభావం ఉండదు, కానీ ఈ సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో టెక్నీషియన్స్ అందుబాటులో లేక షూటింగ్స్ ఆగిపోయాయని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ సమ్మె వల్ల నిర్మాతలపై ఆర్థిక భారం పడిందని, సమ్మె వల్ల అందరికీ నష్టమేనని ఆయన అన్నారు.
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. KGF సినిమాలో బాంబే డాన్ ‘శెట్టి’ పాత్రలో నటించిన దినేశ్ మంగళూరు కన్నుమూశారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ఆయన నటుడిగానే కాకుండా ‘వీర మదకరి’, ‘చంద్రముఖి ప్రాణసఖి’, ‘రాక్షస’ తదితర చిత్రాలతో ఆర్ట్ డైరెక్టర్గానూ గు...
ప్రముఖ నటి తమన్నా నటించిన కొత్త వెబ్సిరీస్ ‘డు యూ వనా పార్ట్నర్’. నిషాంత్ నాయక్, గంగోపాధ్యాయ తెరకెక్కించారు. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ రూపొందించింది. తాజాగా, విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ కామెడీ, డ్రామా వెబ్సిరీస్లో బాలీవుడ్ నటి డయానా పెంటీ మరో కీలకపాత్ర పోషించారు.
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో తాజాగా జరిగిన ప్రత్యేక పార్టీకి టాలీవుడ్కు చెందిన పలు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నటుడు బ్రహ్మాజీ తన SM ఖాతాలో షేర్ చేశారు. ’30 ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీకి థ్యాంక్యూ బండ్ల గణేష్ బ్రో. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్తో.. సీనియర్ సిటిజన్స్.. కాదు కాదు, సీనియర్ యాక్టర్స్’ అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సినిమా ‘OG’. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది. ‘సువ్వి సువ్వి’ అంటూ సాగే ఈ పాట వినాయక చవితి కానుకగా ఈ నెల 27న ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఇక దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది.
తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంటగా నటించిన మూవీ ‘తలైవన్ తలైవి’. తెలుగులో ‘సార్ మేడమ్’ పేరుతో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
హాలీవుడ్లో విషాదం నెలకొంది. నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘ఎమిలీ ఇన్ పారిస్’ అసిస్టెంట్ డైరెక్టర్ డియాగో బొరెల్లా కన్నుమూశారు. ఈ సిరీస్ షూటింగ్లో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే సెట్లో ఉన్న వైద్య సిబ్బంది.. ఆయన ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించారు. అయితే గుండెపోటు కారణంగా ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. సినీ పరిశ్రమలో 50 ఏళ్లుగా ప్రేక్షకులను అలరించడం, బసవతారకం ఆస్పత్రి ద్వారా ఆయన చేస్తున్న సేవలకుగానూ UKలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపును ఇచ్చింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా బాలయ్య నిలిచారు. ఈ నెల 30న హైదరాబాద్లో జరగనున్న కార్యక్రమంలో బాలయ్యను సత్కరించనున్నారు.
సౌత్ ఇండస్ట్రీపై బాలీవుడ్ నటి డైసీ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ కంటే సౌత్లో బొడ్డు, నడుమును ఎక్కువగా చూపిస్తారని తెలిపారు. హీరోయిన్ల నడుము, పొట్టపై కెమెరా క్లోజప్ షాట్లు ఎక్కువగా పెట్టడం అన్ని ఇండస్ట్రీలో సాధారణమేనని, కానీ సౌత్లో అవి చాలా ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ మూవీ షూటింగ్కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్లో తాము పాల్గొనబోమని ఫెడరేషన్ సభ్యులు చెబుతున్నారట. సమ్మె సమయంలో ఈ మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ లీగల్ నోటిసులు పంపించడం ఇందుకు కారణమట. అయితే తాము నోటీసులు వెనక్కి తీసుకుంటామని మేకర్స్ చెప్పినా.. సినీ వర్కర్స్ ఒప్పుకోవడం లేదట.
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు భాను బోగవరపు కాంబోలో ‘మాస్ జాతర’ మూవీ రాబోతుంది. అయితే ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను సెప్టెంబర్ 12న పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు ఈ చిత్రం విడుదల అయ్యే ఛాన్స్ లేదట. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్టోబర్లో దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
‘మిరాయ్’ సినిమాతో బిజీగా ఉన్న తేజ సజ్జా మరో కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవర్ఫుల్ సినిమాను చేయనున్నారు. ‘తేజ సజ్జా X2 PMF’ అనే ట్యాగ్తో సాలిడ్ పోస్టర్ షేర్ చేశారు. ఈ మూవీ కథ రాయలసీమ నుంచి యావత్ ప్రపంచానికి చేరబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. 2027 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు చెప్పారు.
‘దృశ్యం’, ‘దృశ్యం 2’కి బిన్నంగా ‘దృశ్యం 3’ని తెరకెక్కిస్తున్నట్లు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెలిపారు. ‘దృశ్యం 4’ ఉంటుందో.. లేదో ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. అంతేకాదు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇంకా చాలు అనిపంచిందని, తదుపరి సినిమాలు కొత్తగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అవి ఫెయిల్ అయినా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చామనే తృప్తి ఉంటుందన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా 2:35 గంటల నిడివితో థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అమెరికాలో ఈ నెల 29 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ తెలిపింది. సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలు ఉంటాయని పేర్కొంది.