గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రం 2026 ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్న ఫొటో ఒకటి బయటకు రావడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.