బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన తండ్రి హరి ఓం భాటియాను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 67 ఏళ్ల వయసులో తన తండ్రి ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల మరణించారని, సకాలంలో పరీక్షలు చేయించకపోవడమే అందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు. 50 ఏళ్లు దాటిన పురుషులందరూ తప్పనిసరిగా PSA పరీక్ష చేయించుకోవాలని, స్క్రీనింగ్ ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన సూచించాడు.