NRPT: మక్తల్లో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని బుధవారం డీటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈవో గోవిందరాజులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. మక్తల్, కృష్ణ, మాగనూరు మండలాలకు చెందిన విద్యార్థులు తగిన సదుపాయాలు లేక చదువును మధ్యలోనే విరమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.