ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా హిందీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అక్కడ ఐదో రోజు ఈ సినిమా రూ.48 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్లో ఇప్పటివరకు ఈ సినిమా రూ.339 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో అక్కడ అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఈ మేరకు మేకర్...
జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య తగాదా జరిగింది. విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపుతున్న క్రమంలో ఘర్షణ తలెత్తింది. మనోజ్ భార్య మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడుతుండగా విష్ణు వచ్చి వారిని బయటకు తోసేశారు. కాగా, ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు ఇంటికి చేరుకుని, మనోజ్పై దాడి ఫుటేజ్ మాయం కావటంపై విచార...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తోంది. అక్కడ $10 మిలియన్ల మార్క్ను దాటేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
డబ్బు, ఆస్తి కోసం కాదని.. తన ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. మోహన్ బాబు నివాసంలో చర్చల సందర్భంగా తన బౌన్సర్లను బయటకు పంపటంతో మనోజ్ ఫైర్ అయ్యారు. ‘పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయటం సరికాదు. న్యాయం కోసం అందరినీ కలుస్తా. నా భార్యా పిల్లలకు రక్షణ లేకుండా పోయింది.. అందుకే ఈ పోరాటం’ అని మీడియాతో అన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న ఇది విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్పై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. ఈ నెల చివరిలో దీన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. దర్శకుడు శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తోన్న సినిమా ‘రామాయణ’. ఈ సినిమాలో మరో సీనియర్ యాక్టర్ సన్నీ డియోల్ భాగమయ్యారు. ఈ విషయాన్ని సన్నీ డియోల్ అధికారికంగా ప్రకటించారు. కాగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 2026 దీపావళికి ఈ మూవీ మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానుంది.
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై రణ్బీర్ అప్డేట్ ఇచ్చారు. దీని షూటింగ్ 2027 స్టార్ట్ కానున్నట్లు, ఇందులో హీరో విలన్ మధ్య ఆసక్తికర పోరు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే యానిమల్ పార్ట్ 3 కూడా ఉంటుంద...
మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించటం తగదని అన్నారు. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తాయని పేర్కొన్నారు. త్వరలో అవన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. అయితే మంచు కుటుంబంలో విబేధాల నేపథ్యంలో మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. గరం ధరమ్ డాబాకు సంబంధించిన చీటింగ్ కేసులో ఆయనతో పాటు మరో ఇద్దరికి నోటీసులిచ్చింది. గరం ధరమ్ దాబా ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెడతానని చెప్పి మోసం చేశారని ఢిల్లీ వ్యాపారవేత్త సుశీల్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కోర్టు సమన్లు జారీ చేసింది.
తమిళ స్టార్ సూర్య నటించిన ‘కంగువా’ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్పై KE జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అయితే ఈ మూవీ వసూళ్లను అంతగా రాబట్టలేక పోయింది. దీంతో నిర్మాత కోసం సూర్య మంచి నిర్ణయం తీసుకున్నారట. మూవీ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఆయనతో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పారట. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.
తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులందరినీ అమెరికా నుంచి వెళ్లగొడతానని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మాత్రం మార్గం మరింత సులువు చేస్తానని చెప్పారు. ఇది భారతీయులకు శుభవార్త కావచ్చు. అమెరికాలో సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలన్నారు.
మంచు ఫ్యామిలీలో విబేధాల నేపథ్యంలో రెండు కేసులు నమోదయ్యాయి. మంచు మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకోవటంతో చర్యలు తీసుకున్నట్లు పహాడీషరీఫ్ పోలీసులు తెలిపారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్తో పాటు భార్య భూమా మౌనికపై కేసు పెట్టారు. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదైంది.
తమిళ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘తంగలాన్’ మూవీ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తులు కీలక పాత్రలు పోషించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ మూవీ షూటింగ్ను మొదలుపెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇక హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అంద...
కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడూ ఆశపడలేదని మంచు మనోజ్ తెలిపారు. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందిస్తూ.. ‘కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశా. కొంతకాలంగా నా కుటుంబం దూరంగానే ఉంటుంది. విష్ణు అనుచరులే నా ఇంటి సీసీఫుటేజీ మాయం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. విద్యాసంస్థల్లోని బాధితులకు నేను అండగా ఉన్నందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని పే...