బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. అవకాశాల్లేక బాధపడ్డానని చెప్పారు. ఆ సమయంలో కుటుంబసభ్యులు కూడా ఎంతో బాధకు గురయ్యారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పోలీసులు పంపిన నోటీసుల మేరకు మంచు మనోజ్ రాచకొండ సీపీ కార్యాలయంలో హాజరయ్యారు. దాడి ఘటనలో పోలీసులకు మనోజ్ వివరణ ఇచ్చారు. విచారణకు హాజరుకాని మోహన్ బాబు, విష్ణుకు పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. రెండోసారి కూడా విచారణకు హాజరుకాకపోతే.. మేజిస్ట్రేట్ హాదాలో అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశమున్నట్లు తెలిపారు. కాగా.. పోలీసుల నోటీసులను కోర్టులో సవాల్ చేసిన మోహన్ బాబు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదన...
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్లో సంచలనం సృష్టిస్తోంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ కేవలం ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూవీగా రికార్డుకెక్కినట్లు పేర్కొన్నాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకట...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం OTTలో అదరగొడుతోంది. ఇండియా వ్యాప్తంగా టాప్ 3లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది.
మోహన్ బాబు, మనోజ్ వివాదంపై మంచు విష్ణు స్పందించారు. ‘మమ్మల్ని ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. మేము కలిసి ఉంటాం అనుకున్నా.. కానీ పరిస్తితులు ఇలా మారుతాయనుకోలేదు. గేట్లు పగులగొట్టి మనోజ్ ఇంట్లోకి వచ్చాడు. నిన్న జరిగిన దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. గొడవలతో మా అమ్మ ఆసుపత్రి పాలైంది. ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిదిపై మా నాన్న దాడి చేయలేదు. తరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు’ అని ...
టాలీవుడ్ హీరో గోపీచంద్.. యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో మూవీ చేసేందుకు సిద్ధమయ్యారట. ఈ మేరకు గోపీకి డైరెక్టర్ కథను వినిపించగా.. అది ఆయనకు నచ్చి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారట. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి గతంలో ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ వంటి సినిమాలను తెరకెక్కించారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్గా ‘అఖండ 2 తాండవం’ రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 5.31 గంటలకు మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు పోస్టర్ వదిలారు. ఇక 14 రీల్స్ ప్లస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
అస్వస్థతతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ విడుదలైంది. ‘మోహన్ బాబు ఎడమ కన్ను కింద గాయమైంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. మోహన్ బాబు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. మరో రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణ అవసరం’ అని బులిటెన్లో డాక్టర్లు పేర్కొన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆస్తుల కోసం మా నాన్నతో గొడవ పడుతున్నాననేది వాస్తవం కాదని మంచు మనోజ్ అన్నారు. ‘సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాను. ఆదాయం కోసం ఇంటి వాళ్ల మీద ఆధారపడలేదు. మా నాన్న ఇలా ఉండేవారు కాదు.. ఇవాళ చూస్తున్నది మా నాన్న కాదు’ అంటూ ఆవేదనకు గురయ్యారు. కాగా.. ఇవాళ పోలీసుల విచారణలో భాగంగా సీపీ ముందు హాజరుకానున్న మనోజ్.. మిగతా విషయాలు విచారణ తర్వాత వెల్లడిస్తానని పేర్కొన్నారు.
2025లో తనను ప్రేమించే భాగస్వామి కావాలని సమంత కోరుకున్నారు. వచ్చే ఏడాదిలో తనకేం కావాలో తెలుపుతూ విష్ లిస్ట్ను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ‘ఏడాది మొత్తం చాలా బిజీగా ఉండాలి. నటనను ఇంకా మెరుగుపర్చుకోవాలి. ఆర్థికంగా బలంగా ఉండాలి. మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవాలి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేయాలి. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్గా ఉండాలి. పిల్లలు కావాలి’ అంటూ ...
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఖరారైంది. ‘ఫంకీ’ అనే టైటిల్ పెట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ మరో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్తో ఓ మూవీ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇండస్ట్రీలో తనకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ చెప్పారు. ఇటీవల ‘భూల్ భూలయ్య 3’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన తాజాగా ఇంటర్వ్యూలో.. తాను ఒంటరిగా పోరాడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తనకు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు చాలన్నారు. వారి సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలనని పేర్కొన్నారు.
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన సినిమా ‘రాబిన్హుడ్’. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. అయితే ఈ మూవీ నుంచి ‘అదిదా సర్ప్రైజ్’ అనే ఐటెం సాంగ్ను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ పాట విడుదల వాయిదా పడింది. టెక్నికల్ సమస్య వల్ల దీన్ని వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్...