ప్రభాస్ నటించిన ‘కల్కి’ని బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ బీట్ చేసింది. తాజాగా 2024లో గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ విడుదలైంది. దీంట్లో టాప్ టెన్లో మొదటి స్థానంలో ‘స్త్రీ 2’ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ‘కల్కి’ సినిమా ఉంది. అలాగే గ్లోబల్ లెవల్లో గూగుల్లో అత్యధికంగా వెతికిన నటీనటుల జాబితాలో పవన్ ...
ఇకపై తనను ‘కడవులే.. అజితే’ అని పిలవడం ఆపాలని తమిళ స్టార్ హీరో అజిత్ అభిమానులను కోరాడు. తనను అలా అనడం ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. తన పేరు ముందు ఎలాంటి పదాలను ఉంచి పిలవొద్దని సూచించాడు. కాగా, కడవులే.. అంటే తమిళంలో దేవుడని అర్థం. ప్రస్తుతం అజిత్.. తిరుమేని దర్శకత్వంలో ‘విడాముయార్చి’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
జీ తెలుగు: నాగవల్లి (9AM), ప్రతినిధి (11PM); ఈటీవీ: సుస్వాగతం (9AM); జెమినీ: సింహరాశి (8.30AM), బద్రి (3PM); స్టార్ మా మూవీస్: ఏ మంత్రం వేశావె (7AM), జై భజరంగి (9AM), విశ్వాసం (12PM), కృష్ణార్జున యుద్ధం (3PM), ప్రసన్నవదనం (6PM), సింగం (9PM); జీ సినిమాలు: యువకుడు (7AM), కొంచెం ఇష్టం కొంచెం కష్టం (9AM), జయం మనదేరా! (12PM), మిరపకాయ్ (3PM), చక్రం (6PM), రామయ్యా వస్తావయ్యా (9PM).
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ షెడ్యూల్లో పవన్ కూడా పాల్గొంటున్నాడు. ఈ మేరకు చిత్ర బృందం పవర్స్టార్ వర్కింగ్ స్టిల్ను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. కాగా ఈ మూవీ మార్చి 28న విడుదల కానుంది.
నటుడు జోజూ జార్జ్, అభినయ ప్రధాన పాత్రల్లో ‘పని’ మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి జోజూ జార్జ్నే దర్శకత్వం వహించారు. తాజాగా ఈనెల 13న థియేటర్లలో తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జోజూ జార్జ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేశాడు. గతంలో తెలుగులో ‘ఆదికేశవ’ ...
పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తరువాత దర్శకుడు సుకుమార్ లాంగ్ గ్యాప్ తీసుకోనున్నారు. కానీ బన్నీ మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోవట్లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తన నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్తో తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన పనులు వచ్చే ఏడాది మార్చ్లోనే మొదలు పెట్టేస్తారన్న రూమర్స్ వినిపిస్తున్నాయి.
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ 30 రోజుల్లో థియేటర్స్లోకి రాబోతున్నట్లు తెలుపుతూ రామ్ చరణ్ పోస్టర్ను విడుదల చేశారు. మెగా మాస్ మేనియా వచ్చేస్తుంది. థియేటర్స్లో కలుద్దాం అనే క్యాప్షన్ జత చేశారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, మమూలుగానే తన సినిమాల్లోని సాంగ్స్కు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడం డైరెక్టర్ శంకర్ స్పెషాలిటీ. ఈ నేపథ్యంలోనే ‘నానా హైరానా’ సాంగ్ను న్యూజిలాండ్లో చిత్రీకరించారు. ఈ సాంగ్ క...
మంచు ఫ్యామిలీలో గొడవలపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్పందించాడు. మొహన్ బాబు ముక్కుసూటి మనిషని, ఇండస్ట్రీలో అతను ఓ టైగర్ అని పేర్కొన్నాడు. మంచు కుటుంబానికి చాలా మంచి పేరు ఉందన్నారు. అలాంటి ఫ్యామిలీలో గొడవలు జరగడం దురదృష్టకరమన్నారు. వారికి ఏదో నగఘోష తగిలినట్లుందని, మోహన్ బాబు తప్ప వారి వివాదాన్ని ఎవరూ పరిష్కరించలేరన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 దేశ సినిమా చరిత్రలో రికార్డులు నెలకొల్పుతోంది. ఐదు రోజుల్లోనే 922 కోట్లు వసూల్ చేసిన తొలి ఇండియా సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.
బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీ కపూర్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టీవ్గా ఉంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రమ్ ఖాతాలో స్టన్నింగ్ లుక్స్తో చేసిన ఫొటో షూట్ను షేర్ చేసింది. దీనికి పుష్ టు స్టార్ట్ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే జాన్వీ పోస్ట్కు సీతారామం ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ రిప్లే ఇస్తూ ఫైర్ ఎమోజీని పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటో షూట్ తెగ వైరల్ అవుతోంది.
నాగ చైతన్య- కార్తిక్ వర్మ దండు కాంబినేషన్లో రాబోతున్న సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని అనుకున్న మేకర్స్ తాజాగా హైపర్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ని కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై చిత్ర బ...
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబోలో ‘మిరాయ్’ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
మోహన్ బాబు ఫామ్హౌజ్లో పోలీసుల విచారణ ముగిసింది. మోహన్ బాబు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. మనోజ్ మీద జరిగిన దాడిపై ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మనోజ్, మౌనికతో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ మాయం కావటంపై పోలీసులు ఆరా తీశారు. ఫుటేజ్ అప్పగించాలని మోహన్ బాబును ఆదేశించారు. మనోజ్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని థియేటర్లో పుష్ప 2 చూస్తూ ముద్దానప్ప అనే అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షో ముగిశాక కూడా అతను సీటులో అలానే కూర్చొని ఉండగా.. మిగతా ప్రేక్షకులకు అనుమానం వచ్చి థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబీకులు.. ముద్దానప్ప తొక్కిసలాట వల్లే చనిపోయాడని ఆందోళనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున...