‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక భారీ కథను సిద్ధం చేశాడట. ఇది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి సీక్వెల్ లేదా పక్కా మైథలాజికల్ డ్రామా అని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, తెలుగు సినిమాలో మరో అద్భుత దృశ్యకావ్యం ఖాయమని సినీ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.