కృష్ణా: నాగాయలంక మండలం ఎదురుమొండిలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మత్స్యకారులకు బోటు లైసెన్సులు, రిజిస్ట్రేషన్ పత్రాలను శుక్రవారం అందచేశారు. సముద్రంలో చేపల వేటకు అనువుగా ఎదురుమొండి పరిధిలోని అరవై మంది మత్స్యకారులకు ఈ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ నాగరాజా, ఎఫ్.డీ.వో సత్యనారాయణ, ఫిషరీస్ కో-ఆపరేటివ్ సోసైటీ అధ్యక్షులు చెన్ను వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.