మెరిసే చర్మం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. రెండు స్పూన్ల శనగపిండిలో కొంచెం పెరుగు కలిపి ప్యాక్లా వేసుకోవాలి. ఇది చర్మాన్ని శుభ్రం చేసి కాంతినిస్తుంది. మచ్చలు తగ్గి ముఖం మెరవాలంటే తేనె, నిమ్మరసం మిశ్రమం మంచిగా పనిచేస్తుంది. రోజూ పడుకునే ముందు అలోవెరా జెల్ రాస్తే చర్మం మృదువుగా మారుతుంది. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం వల్ల టాక్సిన్స్ తొలగి చర్మం సహజంగా మెరుస్తుంది.