• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

T20 WC: భారత్ ఘన విజయం

జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచులో భారత్ 72 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 184/7కే పరిమితమైంది. ఆ టీమ్ తరఫున బెనెట్ 97* పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. మన బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ విజయంతో సూర్యసేనకు సెమీస్ ఆశలు సజీవం కాగా.. జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

February 26, 2026 / 10:33 PM IST

15 ఓవర్లు.. పోరాడుతున్న జింబాబ్వే

టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే 15 ఓవర్లకు 131/2 పరుగులు చేసింది. బెన్నెట్ 78*, రజా 19* క్రీజులో ఉన్నారు. మరుమని 20, మయర్స్ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్, అక్షర్ చెరో వికెట్ తీశారు. జింబాబ్వే విజయ లక్ష్యం 257 రన్స్‌.

February 26, 2026 / 10:06 PM IST

T20 WC: జింబాబ్వేపై భారత్ ‘సిక్సర్ల’ వర్షం

జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు 17 సిక్సర్లు బాదారు. T20 WCలోని ఒకే మ్యాచ్‌లో టీమిండియా ఇన్ని సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, ప్రస్తుత WCలో భారత్ మొత్తంగా 63 సిక్సర్లు నమోదు చేసింది. దీంతో ఒకే WC ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. వెస్టిండీస్ ఇదే ప్రపంచకప్‌లో 66 సిక్సర్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

February 26, 2026 / 09:44 PM IST

T20 WC: చరిత్ర సృష్టించిన టీమిండియా

జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా 256/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లండ్‌పై చేసిన 218/4 పరుగుల రికార్డును ఈ మ్యాచ్‌తో భారత్ అధిగమించింది. అలాగే, T20 WC చరిత్రలో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో శ్రీలంక(260/6) అగ్రస్థానంలో కొనసాగుతోంది.

February 26, 2026 / 09:05 PM IST

రేపు ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ ఢీ!

సూపర్-8 గ్రూప్-2లో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకోగా, కివీస్‌కు మాత్రం ఈ మ్యాచ్ కీలకంగా మారింది. NZ గెలిస్తే గ్రూప్-2 టాపర్‌గా నేరుగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఒకవేళ కివీస్ ఓడిపోతే మాత్రం.. వారి సెమీస్ అవకాశాలు శ్రీలంక-పాక్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటాయి.

February 26, 2026 / 09:03 PM IST

ప్రపంచకప్‌లో టీమిండియా సరికొత్త రికార్డ్

జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు (12.4 ఓవర్లలో) పూర్తి చేసిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అలాగే, టీ20ల్లో వేగంగా 200 పరుగులు (16.4 ఓవర్లలో) సాధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. శ్రీలంక (16.2 ఓవర్లలో), ఇంగ్లండ్ (16.3 ఓవర్లలో) తొలి రెండో స్థానంలో ఉన్నాయి.

February 26, 2026 / 08:54 PM IST

BREAKING: భారత్ విధ్వంసం.. భారీ స్కోర్

జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంజూ(24), అభిషేక్(55) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్(33), సూర్య(33), పాండ్యా(50), తిలక్(44) సమష్టిగా రాణించడంతో.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బౌలర్లలో నగారవ, ముజారబానీ, మాపోసా, సికందర్ తలో వికెట్ పడగొట్టారు.

February 26, 2026 / 08:45 PM IST

లక్షల వాచ్ కంటే.. ఒకరి జీవితం మారాలి: చక్రవర్తి

ఖరీదైన వస్తువుల కంటే ఒకరి జీవితాన్ని మార్చడమే గొప్ప శక్తి అని వరుణ్ చక్రవర్తి అన్నాడు. ’30-40 లక్షల వాచ్ కొనే బదులు, ఆ డబ్బుతో ఒక పేద కుటుంబం యొక్క రెండు మూడు తరాల భవిష్యత్తును మార్చవచ్చు’ అని అతడు అభిప్రాయపడ్డాడు. తన స్నేహితులు ఇంకా డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్నప్పుడు, వారి ముందు ఖరీదైన వస్తువులు ధరించి వెళ్లి మాట్లాడటం నాకు అసౌకర్యంగా అనిపిస్తుందని వ్యాఖ్యానించాడు.

February 26, 2026 / 08:12 PM IST

T20ల్లో ఇషాన్ కిషన్ ‘ట్రిపుల్ సెంచరీ’

టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20ల్లో 300 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో ఒక సిక్సర్ బాదడం ద్వారా ఇషాన్ ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున టీ20ల్లో వేగంగా 300 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ (217 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో నిలిచాడు. అభిషేక్ (163 ఇన్నింగ్స్‌లు) తొలి స్థానంలో ఉండగా, రాహుల్ (205) రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

February 26, 2026 / 08:09 PM IST

BREAKING: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న అతడు, జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 3 ఫోర్లు, 4 సిక్సర్లతో బాదాడు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం టీమిండియా 10.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.

February 26, 2026 / 07:56 PM IST

తొలి వికెట్ కోల్పోయిన భారత్

జింబాబ్వేతో మ్యాచ్‌లో 48 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ 8 బంతుల్లో 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు. 3.4 ఓవర్లలో భారత్ స్కోర్ 48/1.

February 26, 2026 / 07:28 PM IST

IND vs ZIM: తొలి వికెట్ కోల్పోయిన భారత్

జింబాబ్వేతో మ్యాచ్‌లో 48 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ 8 బంతుల్లో 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు. 3.4 ఓవర్లలో భారత్ స్కోర్ 48/1.

February 26, 2026 / 07:28 PM IST

IND vs ZIM: ప్లేయింగ్-11

జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్.. రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్ ఆడుతున్నారు.ZIM: మారుమణి(w), బెన్నెట్, మైయర్స్, ర్యాన్, సికందర్(సి), టోనీ, తషింగా, బ్రాడ్, మపోసా, ముజారబానీ, నగరవIND: సంజు(w), అభిషేక్, ఇషాన్, సూర్య(c), తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్‌దీప్, చక్రవర్తి, బుమ్రా

February 26, 2026 / 06:37 PM IST

‘డూ ఆర్ డై’ మ్యాచ్.. టాస్ ఓడిన భారత్

చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే మధ్య ‘డూ ఆర్ డై’ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైన భారత్‌కు, సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఓడితే భారత్ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

February 26, 2026 / 06:35 PM IST

BREAKING: విండీస్‌పై సౌతాఫ్రికా ఘనవిజయం

వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా అద్భుత విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. మార్‌క్రమ్(82*) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డికాక్(47), రికల్టన్(49*) రాణించారు. ఈ విజయంతో SA దాదాపుగా సెమీస్‌కు అర్హత సాధించింది. దీంతో భారత్ తన చివరి 2 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. ఏ జట్టుతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరుకుంటుంది.

February 26, 2026 / 06:14 PM IST