అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జైస్వాల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా.. 37 పరుగులతో నిరాశపర్చాడు. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన కోహ్లీ (7), మరోవైపు గిల్ (31) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ (1), పంత్ (4) ఉన్నారు. స్టార్క్ మూడు వికెట్లు తీసుకు...
ఆడిలైడ్ వేదికగా కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ వేదికలో టాస్ అత్యంత కీలకం కానుంది. ఇక్కడ ఇప్పటివరకు జరిగిన 82 టెస్టుల్లో టాస్ గెలిచిన జట్లు 72 సార్లు బ్యాటింగ్ ఎంచుకున్నాయి. అందులో 33 సార్లు గెలిచాయి. రెండు సార్లు మాత్రమే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జట్లు ఇక్కడ విజయం సాధించాయి. దీంతో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సూపర్ హాట్ ఫామ్లో ఉన్న ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ న్యూజిలాండ్తో జరుగుతున్న రెండవ టెస్టులో అద్భుత సెంచరీతో చెలరేగాడు. మొదటి నుంచి వన్డే తరహా బ్యాటింగ్ చేస్తూ కేవలం 91 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ఓ పక్క వికెట్లు కోల్పోతున్నా.. బ్రూక్ మాత్రం కివీస్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కాగా, బ్రూక్కు ఇది 8వ సెంచరీ.
పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోపీపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఈ టోర్నీని హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించిన ఐసీసీ.. భారత మ్యాచ్లకు వేదికగా దుబాయ్ను ఎంపిక చేసిందని సమాచారం. కాగా.. ఐసీసీ చైర్మన్ జైషా, బోర్డు సభ్యుల మధ్య గురువారం జరిగిన అనధికార సమావేశంలో ఈ నిర్ణయం తీసు...
కృష్ణా: గన్నవరంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం ఉదయం కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహిళల జట్ల ఎంపికలు ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 14,15 తేదీలలో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
E.G: రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల క్రీడామైదానంలో అథ్లెటిక్స్ ట్రాక్ గ్రౌండ్లో ఈనెల 6, 7 తేదీల్లో ఆదికవి నన్నయ యూనివర్శిటీ అంతర్ కళాశాలల మెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్కు యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల నుంచి క్రీడాకారులు రానున్నారని కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర ఆర్కా తెలిపారు. యూనివర్శిటీ జట్టును ఎంపిక చేస్తారన్నారు.
ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా AUS,IND మధ్య ఇవాళ్టి నుంచే రెండో టెస్టు ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ సిరీస్లో బోణీ కొట్టిన టీమిండియా.. అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యం ఉంది.
పాకిస్థాన్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. మూడు టీ20ల సిరిస్లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన ZIM.. పాక్ను 2 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయిన జింబాబ్వే.. ఎట్టకేలకు మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా.. బ్రియాన్ బెన్నె...
పాకిస్తాన్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. మూడు టీ20ల సిరిస్లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన ZIM.. పాక్ను 2 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయిన జింబాబ్వే.. ఎట్టకేలకు మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా.. బ్రియాన్ బెన్నె...
PLD: చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న జాన్ ఫ్రెడ్డి పాల్ మార్టిన్ జాతీయ క్రీడలకు ఎంపికయ్యాడు. ఇటీవల నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 నెట్ బాల్ ఉమ్మడి గుంటూరు జిల్లా తరపున పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
ఆఫ్ఘనిస్థాన్లో మహిళలకు వైద్య విద్యను తాలిబాన్ నిషేధించింది. ఇకపై నర్సింగ్ సహా వైద్య విద్యలో మహిళలు చేరకూడదని ఆదేశించింది. దీనిపై క్రికెటర్లు మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మాయిలు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నిరాకరించడం దారుణమని నబీ వ్యాఖ్యానించారు. వారి కలలకు, దేశ భవిష్యత్కు ద్రోహం చేయటమేనని మండిపడ్డారు. తాలిబన్ తీసుకున్న ఈ నిర్ణయంపై పునరాలోచించాలని రషీద్ ఖాన్ ...
రెండో టెస్టుకు ఆసీస్ జట్టు నుంచి పేసర్ జోష్ హేజిల్వుడ్ను తప్పిస్తారని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను ఆ జట్టు స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఖండించాడు. ‘సన్నీ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోయాను. ప్రస్తుతం అతను వినోద పరిశ్రమలో ఉన్నాడని కొన్ని జట్లు అంటున్నాయి. ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు ఆయనకు ఆనందాన్ని ఇస్తే.. అదే కొనసాగించమనండ...
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ 5 గంటలకు జరగాల్సిన ఐసీసీ సమావేశం మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. . అయితే, బ్రీఫ్ సెషన్లో హైబ్రిడ్ మోడల్ను అంగీకరించాలని ఐసీసీ మరోసారి పాక్ను అడిగింది. దీంతో తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో డిసెంబర్ 7న మళ్లీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అరుదైన రికార్డు నమోదైంది. ఒకే రోజు రెండు హ్యాట్రిక్లు నమోదయ్యాయి. నాగాలాండ్- గోవా మ్యాచ్లో బౌలర్ ఫెలిక్స్ అలెమావో 4 ఓవర్లో 24 రన్స్ ఇచ్చి ఐదు వికెట్లను తీసుకున్నాడు. మొదట గోవా 237/6 పరుగులు చేయగా, నాగాలాండ్ 129 పరుగులకే ఆలౌటైంది. అలాగే జార్ఖండ్- యూపీ మ్యాచ్లోనూ భువనేశ్వర్ 4 ఓవర్లలో కేవలం 6 రన్స్ ఇచ్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు.