టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్పై హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ‘బౌలింగ్ విషయానికి వస్తే, చాలా బాగుంది. నాకు కొత్త బంతితో బౌలింగ్ చేయడం ఇష్టం. దేవుడి దయ వల్ల నా దగ్గర ఇన్స్వింగ్, అవుట్స్వింగ్ చేసే నైపుణ్యం ఉంది. నేను దానిని నిజంగా ఆస్వాదిస్తాను. కానీ, నేను ఇంకా ఒక ఓవర్ బౌలింగ్ చేయాల్సింది. ఇక్కడి నుంచి వెళ్ళాక ఆ ఓవర్ వేస్తాను’ అని అన్నాడు.
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కొడుకు స్టార్ క్రికెటర్ అయినా.. రూ. కోట్లు సంపాదిస్తున్నా.. ఆయన మాత్రం గ్యాస్ సిలిండర్ మోస్తూ కష్టపడేవారు. పనులన్నీ వదిలి విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఇలా జరగడం బాధాకరం. కొన్ని రోజుల్లో రింకూకి పెళ్లి జరగనుండగా.. ఆ వివాహ వేడుక చూడకుండానే ఆయన కన్నుమూయడం అందరిని కలిచివేస్తోంది.
జింబాబ్వే బ్యాటర్లపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ వారి పర్ఫామెన్స్ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పవర్ ప్లేలో కాస్త స్లోగా ఆడినా.. చాలా తెలివిగా బ్యాటింగ్ చేశారు. ఇక వెస్టిండీస్ మ్యాచ్ గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు. ఒక రోజు రెస్ట్ తీసుకుని మ్యాచ్కు రెడీ అవుతాం’ అని పేర్కొన్నాడు.
T20 WCలో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ‘బ్యాటర్లందరూ తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. బ్యాటింగ్ పరంగా మా ప్రదర్శనలో ఎలాంటి లోటే లేదు. కానీ బౌలింగ్లో మేం ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉండాల్సింది. వెస్టిండీస్తో మ్యాచ్కు ముందు మా లోపాలను సరిదిద్దుకుంటాం’ అని తెలిపాడు.
రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూ కాశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో కర్ణాటక జట్టు ఇబ్బందుల్లో పడింది. మయాంక్ అగర్వాల్ (86*) రాణించినప్పటికీ, జమ్మూ బౌలర్ల ధాటికి 3వ రోజు ఆట ముగిసే సమయానికి 293 పరుగులకే కర్ణాటక ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం కర్ణాటక జట్టు 291 పరుగుల వెనకంజలో ఉంది. కాగా, జమ్మూ తొలి ఇన్నింగ్స్లో 584 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే.
టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పవర్ప్లేలో బౌండరీలు కొట్టే క్రమంలో అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఆ రిస్క్ తీసుకోకపోతే జట్టు స్కోరు వేగంగా పెరగదు. అందుకే ‘సంజూని నిందించలేం’ అని పేర్కొన్నాడు. ఫీల్డింగ్ గ్యాప్స్ను వాడుకోవడమే అతని ప్రధాన ఉద్దేశమని అభిప్రాయపడ్డాడు.
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచ కప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ ఘనవిజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్లోనూ ఇదే రిథమ్ కొనసాగించాలని సూచించాడు. కేవలం ఒకరిద్దరి మీద ఆధారపడకుండా, అందరూ కలిసికట్టుగా రాణించారని అభినందించాడు.
చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఆసక్తికరమైన ఘటనను పంచుకున్నాడు. ‘సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ను నా తండ్రితో కలిసి టీవీలో చూశాను. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు సిక్స్ కొట్టిన ప్రతిసారీ మా తండ్రి వారిపై అరిచాడు. వారిని శపించాడు’ అని తెలిపాడు.
భారత స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 33 వికెట్లు సాధించిన భారత బౌలర్ బుమ్రా రికార్డును, 35 వికెట్లతో అధిగమించి మొదటి స్థానానికి చేరుకున్నాడు. 19 మ్యాచ్లలోనే అర్షదీప్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అర్షదీప్ క్రియేట్ చేయగా… అంతర్జాతీయ క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని కూడా దాటేశాడు.
టీ20 ప్రపంచ కప్లో భాగంగా మార్చి 1న కోల్కతా వేదికగా భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన వాతావరణ శాఖ ఆరోజు వర్షం పడే అవకాశం లేదని, 23 డీగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా వుమెన్స్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి వన్డే ఓడిన నేపథ్యంలో.. సిరీస్ను కాపాడుకునేందుకు హర్మన్ సేన ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది.
భారత క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింకూ తండ్రి ఖచంద్ర సింగ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. యూపీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి.. చికిత్స అందించారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.
T20 WC వేదికగా జింబాబ్వే చెత్త రికార్డులు మూటగట్టుకుంది. T20ల్లో 2 వరుస మ్యాచుల్లో 250+ రన్స్ సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. జింబాబ్వేపై 23న విండీస్ 254/6 స్కోర్ చేయగా.. రాత్రి భారత్ 256/4 చేసింది. ఈ రెండూ T20 WCలోనే టాప్-3 టీమ్ స్కోర్స్లో ఉండటం గమనార్హం. అలాగే ఓ T20 WC మ్యాచులో అత్యల్పంగా 26 డాట్ బాల్స్ వేసిన జట్టుగానూ ఇంగ్లండ్(2016లో vs SA) సరసన నిలిచింది.
జింబాబ్వేపై విజయంతో భారత్ T20 WC సెమీస్ ఆశలను నిలుపుకుంది. అయితే అసలు డేంజర్ ముందే ఉంది. దూకుడుగా ఆడుతున్న విండీస్పై మార్చి 1న గెలిస్తేనే భారత్ సెమీస్కు చేరుతుంది. ఇరుజట్లకూ కీలకమైన ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్ వర్షంతో రద్దయితే.. మెరుగైన రన్రేట్ కలిగిన విండీస్ ముందుకు వెళ్తుంది. ఇలా ఓడినా, వర్షం పడినా డిఫెండింగ్ ఛాంప్ భారత్ ఖాళీ చేతులతో నిష్క్రమించాల్సిందే.