పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 11 వేలకు పైగా పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 సందర్భంగా బాబర్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ను అధిగమించాడు. కాగా, 11 వేల పరుగుల మార్కును అందుకోవడానికి గేల్కు 314 ఇన్నింగ్స్ అవసరమైతే.. బాబర్ కేవలం 298 ఇన్నింగ్స్ల్లోనే ఈ మార్క్...
గబ్బా వేదికగా జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్టులో తొలి రోజు వర్షార్పణం అయింది. మొదటి సెషన్లో పలుమార్లు వర్షం కురవటంతో కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. ఆ తర్వాత వర్షం పెరగటంతో తర్వాతి రెండు సెషన్లు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. క్రీజులో ఖవాజా(19), మెక్స్వీనీ(4) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 28/0. అయితే రేపు కూడా వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తె...
ఈనెల 21 నుంచి జరిగే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తలపడే హైదరాబాద్ జట్టుకు టీమిండియా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. ఇటీవల మంచి ఫామ్లో ఉన్న అతడు కెప్టెన్గా కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కాగా ఇటీవల టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ సెంచరీలతో తిలక్ వర్మ రాణించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ హైదరాబాద్కు తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరించ...
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబుల్ హసన్కు ఈసీబీ షాక్ ఇచ్చింది. తమ మ్యాచ్లలో షకీబ్ బౌలింగ్ వేసేందుకు అనర్హుడు అంటూ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతడి బౌలింగ్ యాక్షన్పై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. సెప్టెంబర్లో సోమర్సెట్తో ఆడిన మ్యాచ్లో లెఫ్టార్మ్ స్పిన్నర్గా షకీబుల్ బౌలింగ్ యాక్షన్పై ...
VSP: ఏయూ అంతర్ కళాశాలల మహిళల ఖోఖో ఎంపిక పోటీలు శుక్రవారం విశాఖ ఉమెన్స్ కళాశాలలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 9 జట్లు పాల్గొన్నాయి. పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులను ఏయూ జట్టుగా విద్య డైరెక్టర్ విజయ మోహన్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు.
బ్రిస్బేన్లో గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం గురించి ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టెస్టులో ఆస్ట్రేలియానే గెలుస్తుందని జోస్యం చెప్పాడు. భారత్కు అవకాశాలు ఉన్నా తక్కువేనని అంచనా వేశాడు. కాగా గత 40 ఏళ్లలో గబ్బాలో ఆస్ట్రేలియా రెండు సార్లు మాత్రమే ఓడిందని పాంటింగ్ గుర్తుచేశాడు.
గబ్బాలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు వర్షం తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభం అయిన కాసేపటికి మొదలైన వర్షం.. తర్వాత తగ్గుముఖం పట్టడంతో అంపైర్లు తిరిగి ఆటను ప్రారంభించారు. మళ్లీ కాసేపటికే వర్షం పడుతుండడంతో మరోసారి ఆటను నిలిపివేశారు. దీంతో పిచ్ మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 28/0 వద్ద బ్యాటింగ్ చేస్తోంది.
గబ్బా వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్ ఆరంభంలో వరుణుడు అంతరాయం కలిగించడంతో అంఫైర్లు ఆటను నిలిపివేశారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఆటను తిరిగి ప్రారంభించారు. క్రీజులో ఖవాజా (17), మెక్స్వీనీ (2) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 24/0.
ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ ప్రారంభం అయిన కొద్దిసేపటికే చినుకులు పడటంతో అంపైర్లు మ్యాచ్ను ఆపేశారు. అంతరాయ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 19/0గా ఉంది. క్రీజ్లో ఉస్మాన్ ఖవాజా (13*), మెక్స్వీనీ (2*) ఉన్నారు.
ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ ప్రారంభం అయిన కొద్దిసేపటికే చినుకులు పడటంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ అంతరాయ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 19/0గా ఉంది. క్రీజ్లో ఉస్మాన్ ఖవాజా (13*), మెక్స్వీనీ (2*) ఉన్నారు.
బ్రిస్బేన్లో జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు టెస్టుల్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలవడంతో ఈ మూడో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా ఈ మ్యాచ్ను గెలవాలని చూస్తున్న భారత్.. అశ్విన్ స్థానంలో జడేజా, హర్షిత్ రాణా బదులు ఆకాశ్ దీప్ను బరిలోకి దింపుతుంది.
నేడు నెల్లూరులో జరగాల్సిన జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ వర్షం కారణంగా వాయిదా వేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షం కారణంగా పాడైనా ట్రాక్ & ఫీల్డ్ ఈవెంట్స్ కోర్ట్లు తిరిగి సిద్ధం చేస్తున్నామన్నారు. శనివారం జరగవలసిన ఈవెంట్స్ ఆదివారానికి వాయిదా వేసినట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా పోలీస్ సిబ్బంది, మీడియా గమనించాలన్నారు.
సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో మధ్యప్రదేశ్ ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కేవలం 15.4 ఓవర్లలోనే మధ్యప్రదేశ్ బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించారు. అంతకుముందు నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ.. 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
వరుసగా 11 వన్డేల్లో ఓటముల తర్వాత వెస్టిండీస్ ఓ సిరీస్ గెలిచింది. సెయింట్ కిట్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఆఖరి వన్డేలో WI 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 3 వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ విధించిన 321 పరుగుల లక్ష్యాన్ని కేవలం 45.5 ఓవర్లలోనే విండీస్ ఛేదించింది. అరంగేట్ర ప్లేయర్లు అమీర్ జాంగూ (104 నాటౌట్), కార్టీ (95) రాణించారు. కాగా సెయింట్ కిట్స్ వేదికల...
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. గబ్బా టెస్టు నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ మాట్లాడాడు. తాము తాజాగా సిరీస్ను ప్రారంభిస్తామని తెలిపాడు. ఇక నుంచి మూడు టెస్టుల సిరీస్గా భావించి ఆడతామని పేర్కొన్నాడు. గబ్బాలో తాము మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన చరిత్ర ఉందని వెల్లడించాడు.