టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఊహించని షాక్ తగిలింది. స్థలం విషయంలో ధోనీకి జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు తాజాగా నోటీసులు జారీ చేసింది. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన నివాస స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నోటీసులపై 15 రోజుల్లో స్పందించాలని ప్రభుత్వం గడువు ఇచ్చింది.
T20 WC-2026లో భాగంగా పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో కెప్టెన్ సల్మాన్ అలీ ఆషూపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సల్మాన్ మీర్జా స్పందించాడు. ఒక ఆటగాడు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే అనుకుంటాడని, ఏదో ఒక రోజు సరిగా ఆడకపోతే వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నాడు. ఇలాంటివి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశాడు.
TG: మార్చి 8 నుంచి 14 వరకు జరగనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచులకు గచ్చిబౌలి హాకీ స్టేడియం రెడీ అయ్యింది. ఈ టోర్నీలో ఇండియా, ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ సహా 8 దేశాలు తలపడనున్నాయి. మార్చి 8న ఉదయం 7:30కు CM రేవంత్ రెడ్డి పోటీలను ప్రారంభించనున్నారు. ఈ మ్యాచులలో గెలిచిన టాప్ జట్లు నేరుగా వరల్డ్ కప్కు అర్హత సాధిస్తాయి.
జమ్మూకశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీని సొంతం చేసుకోనుంది. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్లో J&K విజయం దాదాపు ఖరారైంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని సాధించిన J&K.. చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోనుంది. ఇవాళ 5వ రోజు ఆట కొనసాగనుంది. అయితే, ఆ సంబరాల్లో పాల్గొనేందుకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన బృందంతో కలిసి హుబ్లీకి బయలుదేరి వెళ్లారు.
పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ కంటే వెస్టిండీస్ రికార్డ్ కాస్త మెరుగ్గా ఉంది. భారత్, వెస్టిండీస్ ఇప్పటివరకు నాలుగు సార్లు పోటీపడ్డాయి. వీటిలో IND ఒక మ్యాచ్ గెలిస్తే.. WI మూడింట్లో విజయం సాధించింది. కరేబియన్ జట్టుపై టీమిండియా అత్యధిక స్కోర్ 192, అత్యల్ప స్కోర్ 130. IND జట్టుపై WI అత్యధిక స్కోర్ 196, అత్యల్ప స్కోర్ 129.
2016 టీ20 వరల్డ్కప్ సెమీపైనల్లో వాంఖడే స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో వెస్టిండీస్ విజయం సాధించడంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం సూపర్ 8 స్టేజీలో రేపు టీమిండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో 2016 ఓటమికి ఇప్పుడు బదులు తీర్చుకోవాలని భారత్ ఎదురు చూస్తోంది.
భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ముంబై క్రికెట్ అసోసియేషన్ అరుదైన గౌరవాన్ని కల్పించింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్కు రవిశాస్త్రి పేరు పెట్టాలని MCA అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. క్రికెట్కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకుంది.
T20 WC-2026లో భాగంగా రేపు టీమిండియా వెస్టిండీస్తో తలపడనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 30 T20 మ్యాచుల్లో తలపడ్డాయి. IND 19, WI 10 మ్యాచులు గెలిచాయి. ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం తేలలేదు. భారత్ స్వదేశంలో 8, వెస్టిండీస్ గడ్డపై 5, తటస్థ వేదికలపై 6 మ్యాచులు గెలిచింది. కరేబియన్ జట్టు స్వదేశంలో 5, భారత గడ్డపై 2, తటస్థ వేదికలపై 3 మ్యాచుల్లో విజయం సాధించింది.
IPL 2026 సీజన్ ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. T20 WC 2026 ముగింపు దశకు చేరుకోవడంతో MAR 8న ఫైనల్ అనంతరం క్రికెట్ అభిమానుల దృష్టి IPLపై నిలవనుంది. అయితే, ముందుగా ప్రకటించినట్లుగా MAR 26న కాకుండా, టోర్నీని మార్చి 28న ప్రారంభించాలని BCCI అకస్మాత్తుగా నిర్ణయించడం చర్చనీయాంశమైంది. కాగా, మే 31న ఫైనల్ తేదీ యథాతథంగా ఉండే అవకాశం ఉంది.
T20 WC-2026లో భాగంగా పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరుకోవాలంటే శ్రీలంకను ఓడించాలి. రన్ రేట్ పరంగా కూడా న్యూజిలాండ్ను అధిగమించాలి. పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే శ్రీలంకను 64 పరుగుల తేడాతో ఓడించాలి. లక్ష్యాన్ని ఛేదించాలంటే, 13.1 ఓవర్లలో మ్యాచ్ను ముగించాలి. విఫలమైతే న్యూజిలాండ్ నేరుగా సెమీఫైనల్కు వెళ్తుంది. అంటే నెట్ రన్ రేట్ ఈ మ్యాచ్కు కీలకం కానుంది.
సెమీస్ కోసం ఇరుజట్లకు అత్యంత కీలకమైన మ్యాచులో రేపు విండీస్, భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూర్యసేనకు సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. సౌతాఫ్రికాపై మన బ్యాటింగ్ దెబ్బతిందని, తప్పుల నుంచి నేర్చుకోవాలన్నారు. విండీస్ బ్యాటర్లు అందరూ ఫామ్లో ఉన్నందున తొలి బంతి నుంచి భారీ షాట్లకు ప్రయత్నిస్తారని.. వారిని కట్టడి చేసేందుకు చూడలని సూచించారు.
సెమీస్ కోసం ఇరుజట్లకు అత్యంత కీలకమైన మ్యాచులో రేపు విండీస్, భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూర్యసేనకు సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. సౌతాఫ్రికాపై మన బ్యాటింగ్ దెబ్బతిందని, తప్పుల నుంచి నేర్చుకోవాలన్నారు. విండీస్ బ్యాటర్లు అందరూ ఫామ్లో ఉన్నందున తొలి బంతి నుంచి భారీ షాట్లకు ప్రయత్నిస్తారని.. వారిని కట్టడి చేసేందుకు చూడలని సూచించారు.
IPL 2026 షెడ్యూల్ ప్రకారం మార్చి 26న కాకుండా 28న ప్రారంభమవుతుంది. అయితే టైటిల్ పోరు మే 31నే జరుగుతుంది. ఈ విషయంతో పాటు పూర్తిస్థాయి షెడ్యూల్, వేదికల వివరాలపై వచ్చే వారంలో BCCI అధికారిక ప్రకటన చేయనుందని క్రికెడ్ వర్గాలు తెలిపాయి. కాగా అసోం, బెంగాల్, తమిళనాడు ఎన్నికల తేదీలపై స్పష్టత రాలేదు. ఎన్నికల, IPL షెడ్యూల్స్ క్లాష్ కాకూడదని ఈ నిర్ణయం తీసుుకున్నట్లు తెలుస్తోంది.
రింకూ సింగ్ తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రింకూ స్వగ్రామానికి వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే శనివారమే అతను జట్టుతో కలుస్తాడని BCCI వర్గాలు తెలిపాయి. ఖాన్చంద్ తీవ్ర అనారోగ్యంతో మొన్న నోయిడాలో చికిత్స పొందుతుండగా..రింకూ జింబాబ్వే మ్యాచ్ ముందు కూడా జట్టును వీడాడు. మ్యాచ్ వేళకు వచ్చినా తుదిజట్టులో ఛాన్స్ రాలేదు.
ఇంగ్లండ్తో ఉత్కంఠభరితంగా సాగిన కీలక ‘సూపర్ 8’ మ్యాచులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. 160 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కివీస్ బౌలర్లు చివరి ఓవర్లలో తడబడ్డారు. దీంతో ఇప్పటికే సెమీస్కు చేరిన ఇంగ్లండ్ అనూహ్య విజయం సొంతం చేసుకుంది. ఈ ఓటమితో కివీస్ ‘సెమీస్’ ఆశలు రేపటి SL vs PAK పోరుపై ఆధారపడి ఉన్నాయి. అందులో పాక్ ఓడితేనే కివీస్ సెమీస్కు చేరుతుంది.