ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్.. టీమిండియాకు తలనొప్పిగా మారాడు. AUSతో జరిగిన కీలక మ్యాచుల్లో అతడు భారత్పై ప్రతిసారి పైచేయి సాధిస్తున్నాడు. WTC-2023 ఫైనల్లో 163 పరుగులు చేసి టీమిండియాకు టైటిల్ దూరం చేశాడు. అలాగే 2023లో జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్లో మెరుపు సెంచరీతో భారత్ను దెబ్బకొట్టాడు. ఇక ఇప్పుడు ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులోనూ.. శతకం బాది ఆసీ...
గంభీర్ కోచ్గా వచ్చినప్పటి నుంచి టీమిండియా ఒక గెలుపు, మూడు ఓటములు అన్న రీతిలో ప్రదర్శన చేస్తోంది. శ్రీలంకలో వన్డే సిరీస్ ఓటమి, సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓటమి గంభీర్ కోచింగ్లోనే నమోదయ్యాయి. తాజాగా ఆస్ట్రేలియాలో తొలి టెస్టు గెలిచిన భారత్.. రెండో టెస్టులో చేతులెత్తేసింది. దీంతో గంభీర్ కోచింగ్పై అనుమానాలు వస్తున్నాయి. అసలు అతడు ఏం చేస్తున్నాడంటూ క్రీడాభిమానులు ఆగ...
పింక్ బాల్ టెస్టుల్లో ఆస్ట్రేలియా జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆడిలైడ్ వేదికగా భారత్తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. మెక్స్వీనీ (10), ఖవాజా (9) కేవలం 3.2 ఓవర్లలోనే 19 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. భారత్ 180 & 175 చేయగా ఆసీస్ 337 & 20 పరుగులు చేసింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 1-1తో సమం అయింది. కాగా, పింక్ బాల్తో ఒక్క టెస్టు కూడా ఆసీ...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ ఆలౌట్ అయింది. 128 పరగుల వద్ద ఆట ప్రారంభించిన భారత్.. 175 పరుగులకే భారత ఆటగాళ్లు కుప్పకూలారు. భారత్ బ్యాటర్లూ పూర్తిగా చేతులెత్తేశారు. భారత్ ఇన్నింగ్స్లో నితీష్ (42) టాప్ స్కోరర్గా నిలిచాడు. కమ్మిన్స్ 5, స్టార్క్ 2, బోలాండ్ 3 వికెట్లు తీసుకున్నారు. ఆసీస్ లక్ష్యం కేవలం 19 పరుగులే. దీంతో ఆసీస్ గెలుపు లాంఛనమే.
TG: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బొమ్మ నెట్టింట వైరల్ అవుతోంది. యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపడానికి కోహ్లీ బొమ్మను సిద్ధం చేశారు. అక్కడ కోహ్లీ బొమ్మను కుర్చీలో కుర్చున్నట్లు తీర్చిదిద్దారు. అయితే జిల్లాస్థాయిలో క్రికెట్ జట్టు ఎంపికలు జరుగుతున్నప్పుడు ఆ బొమ్మను అక్కడ పెడతారట. అవసరం లేనప్పుడు లోపల ఉంచి భద్రపరచనున్నారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తడబడుతోంది. మూడో రోజు 128/5 వద్ద భారత్ ఆట ప్రారంభించింది. క్రీజులో పంత్ (28), నితీష్ (15) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక భారత్ గెలవాలంటే ఈ ఇద్దరు భారీ భాగస్వామ్యం నెలకొల్పాలి. కాగా మొదటి ఇన్నింగ్స్లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 337 పరుగులు చేయడంతో భారత్ ఇంకా 29 పరుగులు వెనకబడి ఉంది.
మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా – భారత్ మహిళల జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారీ స్కోరు సాధించింది. జార్జియా వోల్స్ (101), ఎలీసా పెర్రీ (105) సెంచరీలు బాదారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడిన భారత్.. ఈ మ్యాచ్నూ కోల్పోతే మాత్రం సిరీస్ చేజ...
దుబాయ్లో జరుగుతున్న ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో అంతిమ సమరానికి సమయం ఆసన్నమైంది. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాసేపట్లో ఫైనల్ జరగనుంది. గతేడాది సెమీస్లో బంగ్లా చేతిలో ఓడిన టీమిండియా.. ఇప్పుడు ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఏ జట్టు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఇప్పటివరకు ఈ టోర్నీ చరిత్రలో టీమిండియా 8సార్లు విజేతగా నిలి...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆసీస్ బౌలర్ల దాటికి బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోతున్నారు. మొదటి ఇన్నింగ్స్లో తేలిపోయిన బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లోనూ అదే పంతా కొనసాగిస్తున్నారు. కీలక భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలమవుతున్నారు. భారత్ గెలవాలంటే క్రీజులో ఉన్న పంత్(28), నితీష్(15) భారీ భాగస్వామ్యం నెలకొల్పాలి. ప్రస్తుతం భారత్ స్కోర్ 128/5.
టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఆరోగ్యం బాగుపడటం కోసం ఏదైనా చేస్తామని దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించారు. 1983 ప్రపంచకప్ విజేత జట్టు ఆటగాళ్లందరూ అతనికి తోడుంటానన్నారని చెప్పారు. అతను తిరిగి నిలబడేలా చేయాలనుకుంటున్నాం. అందుకు ఏదైనా చేస్తామని అన్నారు. కాగా, ఇటీవల ఓ కార్యక్రమంలో కాంబ్లీ కనీసం నిలబడలేకపోతున్న ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
KMR: ఇందిరా గాంధీ స్టేడియంలో ఆదివారం నుంచి మాస్టర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రంజిత్ మోహన్ తెలిపారు. 30 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు మహిళలు, పురుషులకు 100, 200, 400, 800 మీటర్ల పరుగు,5000,10, 000 మీటర్ల నడక, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలంకి ముహూర్తం ఖరారైంది. బెంగళూరులో డిసెంబరు 15న మినీ వేలం నిర్వహించనున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించారు. గత సీజన్ రూ.13.5 కోట్లు ఉండగా.. ఈసారి 1.5 కోట్లు పెరిగింది. మహిళల ప్రిమియర్ లీగ్ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. ఇందులో 91 మంది భారత ఆటగాళ్లు, 29 మంది విదేశీ క్రికెటర్లు ఉన్...
ఆసీస్ జరుగుతున్న టెస్ట్ సీరీస్లో చివరి రెండు మ్యాచ్లకు టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న షమి.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరుఫున ఆడుతూ.. ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. షమి త్వరలో ఆస్ట్రేలియా పయనం కానున్నాడని అందుకు సంబంధించి వీసా కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది.
సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్గా జేపీ డుమిని తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో బ్యాటింగ్ కోచ్ పదవి నుండి తప్పుకున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్కి తెలిపాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో బ్యాటింగ్ కోచ్గా ఏబీ డివిలియర్స్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మేరకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అతడితో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ రూట్ కొత్త రికార్డ్ నమోదు చేశాడు. కీవీస్తో జరుగుతున్న టెస్ట్లో రూట్ (73*) పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రూట్ 151 టెస్టుల్లో 65 హాఫ్ సెంచరీలు, 35 సెంచరీలతో 100 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ ద్రవిడ్(99) పేరుతో ఉండేది. తర్వాతి స్థానాల్లో చంద్రపాల్(96), సంగక్కర(90), బోర్డర్(90...