2016 టీ20 వరల్డ్కప్ సెమీపైనల్లో వాంఖడే స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో వెస్టిండీస్ విజయం సాధించడంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం సూపర్ 8 స్టేజీలో రేపు టీమిండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో 2016 ఓటమికి ఇప్పుడు బదులు తీర్చుకోవాలని భారత్ ఎదురు చూస్తోంది.