బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు భారీ షాక్ తలిగింది. 6 పరుగులకే భారత్.. రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (4), శుభ్మన్ గిల్ (1) తీవ్ర నిరాశపరిచారు. ఇక ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజ్లో కేఎల్ రాహుల్ (1*) , విరాట్ కోహ్లీ (1*) ఉన్నారు.
MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సెవెన్ హిల్స్ హైస్కూల్లో ఈనెల 20న సీఎం కప్ జిల్లాస్థాయి జూనియర్ బాల, బాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు డివైఎస్ఓ రాజ్ వీర్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కనప రమేష్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు సీఎం కప్ పోటీలకు ఆన్లైన్లో నమోదు చేసుకున్న ఫామ్తో పాటు ధ్రువ పత్రాలతో హాజరు కావాలన్నారు.
బ్రిస్బేన్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (152), స్మిత్ (101) సెంచరీలతో రాణించారు. ఇక టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా 6 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా జరుగుతోంది. కాగా మూడో రోజు ఆట మొదలైంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి కంగారుల స్కోరు 405/7 గా ఉంది. ట్రావిస్ హెడ్ 152, స్టీవ్ స్మిత్ 101 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఐదు వికెట్లు కైవసం చేసుకున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)ని ముంబై సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని సమష్ఠి ప్రదర్శనతో ఛేదించింది. సూర్య (48), రహానే (37), పృథ్వీ షా (10), శ్రేయస్ (16), సూర్యాంశ్ (36*),అథర్వా (16*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. త్రిపురేశ్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. శివం, వెంకటేశ్, కార్తికేయ తలో వికెట...
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఫైనల్ మ్యాచ్లో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (81*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో శార్దూల్, రాయ్స్టన్ చెరో 2 వికెట్లు తీయగా.. అథర్వ, శివం దుబే, సూర్యాంశ్ తలో వికెట్ తీశారు. ముంబై లక్ష్యం 175.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. మంగళగిరిలోని క్యాంపు ఆఫీస్లో డిప్యూటీ సీఎంను తండ్రి రమణతో కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈనెల 22న వెంకట దత్త సాయిని సింధు పెళ్లి చేసుకోబోతున్నారు. మరోవైపు వారు అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.
WPL: భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్ ఇప్పటివరకు అత్యధిక ధర దక్కించుకుంది. గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ.1.90 కోట్లకు దక్కించుకుంది. సిమ్రాన్ బేస్ ధర రూ.10 లక్షలు కాగా.. ఢిల్లీ, గుజరాత్ పోటీపడ్డాయి. అలాగే, ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ బేస్ ధర రూ.50 లక్షలు కాగా.. ఆమెను తీసుకోవడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.
WPL: భారత్కు చెందిన 16 ఏళ్ల జి కమలిని భారీ ధర పలికింది. తమిళనాడుకు చెందిన వికెట్కీపర్ కమలిని కనీస ధర రూ.10 లక్షలు కాగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆమె కోసం పోటీపడ్డాయి. చివరికి కమలినిని MI రూ.1.60 కోట్లకు దక్కించుకుంది. ఈమె అండర్-19 మహిళల T20 ట్రోఫీలో 8 మ్యాచ్ల్లో 311 పరుగులు చేసి సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచిన విషయం తెలిసిందే.
బెంగళూరు వేదికగా WPL ప్లేయర్ల మినీ వేలం మొదలైంది. వెస్టిండీస్ ఆల్రౌండర్ డియాండ్రా డాటిన్ను రూ.1.70 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఆమె కనీస ధర రూ.50 లక్షలు కాగా.. గుజరాత్, యూపీ వారియర్స్ పోటీపడ్డాయి. చివరకు గుజరాత్ దక్కించుకుంది. బేస్ ధర రూ.30 లక్షలతో వేలంలో బరిలో నిలిచిన భారత స్పిన్నర్ పూనమ్ యాదవ్ అన్సోల్డ్గా మిగిలింది.
మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేయర్ల వేలం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో ఐదు జట్లు క్రీడాకారులను కొనుగోలు చేయనున్నాయి.➢ గుజరాత్ జెయింట్స్: రూ.4.4 కోట్లు (4 స్లాట్లు)➢ ఆర్సీబీ: రూ.3.25 కోట్లు (4 స్లాట్లు)➢ యూపీ వారియర్స్: రూ.3.90 కోట్లు (3 స్లాట్లు)➢ ఢిల్లీ క్యాపిటల్స్: రూ.2.5 కోట్లు (4 స్లాట్లు ఖాళీ)➢ ముంబై ఇండియన్స్: రూ.2.65 కోట్లు (4 స్లాట్లు)
భారత్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 405/7 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ(45*), మిచెల్ స్టార్క్(7*) క్రీజులో ఉన్నారు. హెడ్ 152, స్టీవెన్ 101, ఖవాజా 21, మెక్ స్వీనీ 9, లబుషేన్ 12, మిచెల్ 5, కమిన్స్ 20 రన్స్ చేశారు. బుమ్రా 5 వికెట్లు.. నితీశ్, సిరాజ్ చెరో వికెట్...
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో విన్నర్గా 18ఏళ్ల కుర్రాడు గుకేష్ గెలిచి చరిత్ర సృష్టించాడు. తాజాగా తన తల్లి ఎప్పుడూ చెప్పే విషయం గురించి అతను గుర్తు చేసుకున్నాడు. ‘నువ్వు గొప్ప చేసే ప్లేయర్గా పేరు తెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడానికి మరింత ఆనందిస్తానని మా అమ్మ చెబుతుంది. ఇప్పటికీ అదే విషయాన్ని చెబుతూ ఉంటుంది. ఆ మాటలకు నేను ఎక్కువ వ...
KMM: భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామ ఆఫీసర్స్ క్లబ్లో జిల్లాస్థాయి టెన్నిస్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.