తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ ఓపెనర్ల నుంచి గొప్ప ప్రదర్శనేమీ రాలేదని ఆసీస్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. వన్డౌన్, సెకండ్ డౌన్ బ్యాటర్లలో నిలకడ లేదని తెలిపాడు. ఇదే తమ జట్టును ఒత్తిడికి గురి చేస్తోందని పేర్కొన్నాడు. ట్రావిస్ హెడ్ మిడిలార్డర్లో దూకుడుగా ఆడి సెంచరీతో ఆదుకున్నాడని చెప్పాడు. అయితే, హెడ్కు ఇతర బ్యాటర్ల నుంచి మద్దతు అవసరమని.. కేవలం ఒక్క బ్యాటర్ మాత్రమే ఆడిత...
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. 14 గేమ్లలో 13 మ్యాచ్లు ముగిశాయి. నేడు జరిగిన 13వ గేమ్ డ్రాగా ముగిసింది. ఇద్దరు ఆటగాళ్లు 6.5-6.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. రేపు జరిగే చివరి మ్యాచ్లో గెలుపొందిన ఆటగాడు ఛాంపియన్గా నిలుస్తాడు.
అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో సిరాజ్- హెడ్ల మధ్య వాగ్వాదం హైలైట్గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ‘హెడ్ వికెట్ తీసినప్పుడు సిరాజ్ సంబరాలు చేసుకున్నాడు. అతడు ఇచ్చిన సెండాఫ్ను చూశా. అప్పుడు నాకు సిరాజ్ గురించి ఆందోళన మొదలైంది. బ్యాటర్లకు డ్రెస్సింగ్ రూమ్ను చూపిస్తూ సెండాఫ్లు ఇవ్వడం రిఫరీ, అంపైర్లకు నచ్చ...
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై సెమీస్కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో విదర్భపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై.. ఈ లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ముంబై ఓపెనర్లు పృథ్వీ షా (49), అజింక్య రహానె (84) దంచికొట్టారు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలోనూ భారత మహిళా జట్టు ఓటమిపాలైంది. 299 పరుగుల లక్ష్య ఛేదనలో 215 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. దీంతో స్మృతి మంధాన (105) శతకం వృథా అయింది.
పింక్ బాల్ టెస్టులో ఘోర పరాజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుమ్రా కెప్టెన్సీతో పోల్చుతూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్సీలో రోహిత్ శర్మ దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉందని ఆసీస్ మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా బౌలింగ్ విభాగం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నాడు. తొలి టెస్టు విజయానికి, రెండో టెస్టు ఓటమికి మధ్య తేడా బౌలింగ్ విభాగమ...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది. 103 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 100* పరుగులు చేసింది. దీంతో ODI కెరీర్లో స్మృతి మంధాన 9వ సెంచరీ సాధించింది. ప్రస్తుతం INDW 34 ఓవర్లుకు 181/3 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 118 పరుగుల దూరంలో ఉంది.
ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్పై ఆ జట్టు మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాక్స్వెల్కు టెస్ట్ టీంలో ఉండే అర్హత లేదన్నాడు. కాగా మ్యక్సీ టెస్ట్ ఫార్మాట్లో ఆడి దాదాపు ఏడేళ్లు అవుతోంది. తన చివరి టెస్ట్ 2017లో బంగ్లాదేశ్లో ఆడాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ముగింపుకు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్-1లో బరోడా-బెంగాల్ తలపడ్డాయి. బరోడా కెప్టెన్గా కృణాల్ పాండ్యా ఉండగా అతని సోదరుడు హార్థిక్ పాండ్యా కూడా అదే జట్టులో ఆడుతున్నాడు. అయితే బెంగాల్తో జరిగిన మ్యాచ్లో ఇరువురు విఫలమవడం అభిమానులను నిరాశ పరిచింది. 11 బంతులు ఆడిన హార్థిక్ 10 పరుగులు చేయగా, 11 బంతులు ఆడిన కృణాల్ కేవలం 7 పరుగులే చేసి వెనుదిరిగారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంచనాలకు తగ్గట్లు ఆడట్లేదు. దీని ప్రభావం వారి ఐసీసీ ర్యాంకులపై పడింది. తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో రోహిత్ ఆరు స్థానాలు దిగజారి 31వ స్థానానికి పరిమితమయ్యాడు. కోహ్లీ ఐదు స్థానాలు డౌన్ అయి 20వ ర్యాంకులో నిలిచాడు. ఇక.. జో రూట్ను వెనక్కి నెట్టి హ్యారీ బ్రూక్ అగ్రస్థానంల...
శనివారం నుంచి ఆస్ట్రేలియా- భారత్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గబ్బా పిచ్ పరిస్థితిపై క్యురేటర్ డేవిడ్ సందుర్స్కి స్పందించాడు. గతంలో మాదిరిగానే బౌన్సీ పిచ్ను తయారు చేసినట్లు తెలిపాడు. అలాగే, బ్యాటర్లకూ సహకరిస్తుందనే సంకేతాలు ఇచ్చాడు. కాగా, ఇప్పటికే తొలి రోజు టికెట్లన్నీ బుక్ అయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో మధ్యప్రదేశ్ సెమీస్కు చేరుకుంది. అయితే క్వార్టర్ ఫైనల్లో వెంకటేశ్ అయ్యర్ ఆల్రౌండ్ షోను ప్రదర్శించాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ బ్యాటింగ్, బౌలింగ్లో తన సత్తా చాటాడు. రెండు వికెట్లు తీసిన వెంకటేశ్, బ్యాటింగ్లోను తన ప్రతిభను కనబరిచాడు. 38 పరుగులు చేసి నాట్ఔట్గా నిలిచాడు.
పెర్త్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 298 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడినప్పటికీ.. చివరికి సదర్లాండ్ అద్భుత సెంచరీ(110)తో జట్టుకు భారీ స్కోర్ను అందించింది. గార్డ్నర్, మెక్గ్రాత్ ఆఫ్ సెంచరీలతో రాణించారు. భారత్ బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీయగా, దీప్తీ 1 వికెట్...
ATP: బత్తలపల్లిలోని RDT స్పోర్ట్స్ సెంటర్లో రేపు జిల్లా స్థాయి సబ్ జూనియర్ రగ్బీ పోటీలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, డైరెక్టర్ కె. రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2009 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో సిరాజ్-హెడ్ మధ్య చోటుచేసుకున్న వివాదంపై ఆ జట్టు మాజీ ఆటగాళ్లు సిరాజ్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ జట్టు మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ స్పందిస్తూ.. సిరాజ్ అనుచిత సంబురాలపై సీనియర్లు అతడికి నచ్చచెబితే బాగుంటదని సూచించాడు. సిరాజ్ ఎంపైర్ ప్రకటన రాకముందే సంబురాలు చేసుకుంటున్నాడు. అతడు మంచి బౌలర్ అయినప్పటికీ మితిమీరిన సంబురాలు ఆటకు అంత మంచిది కాదని అభి...