ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 185 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. దీంతో సిరీస్ను 3-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. 410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. స్నేహ్ రాణా 44, ప్రతీక 27, జెమీమా 42, హర్మన్ప్రీత్ 25 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అలనా కింగ్ 4 వికెట్లు, జార్జియా 2 వికెట్లు పడగొట్టారు.